
సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 243.95 పాయింట్ల నష్టంతో 79,761.09 వద్ద, సెన్సెక్స్ 56.85 పాయింట్ల నష్టంతో 24,282.45 పాయింట్ల వద్ద సాగుతున్నాయి.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment