దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ

Published Mon, Feb 17 2025 12:37 AM | Last Updated on Mon, Feb 17 2025 12:34 AM

దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ

దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ

– పట్టించుకోని రెవెన్యూ అధికారులు

పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ తమిళనాడు సరిహద్దులో ఆదివారం ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు వెనుకుండి తమిళనాడు వాసులతో చదును చేయించారు. తమిళనాడు సరిహద్దులో భూముల ధరలు రూ.లక్షల్లో పలుకుతున్నాయి. ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన కూటమి నేతలు కుట్రకు తెర తీశారు. ప్రభుత్వ భూములను చదును చేయించి తమిళనాడు వాసులకు పట్టాలు ఇప్పించి ముందే వారితో డబ్బులకు మాట్లాడుకొని ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఎలాగూ ఇళ్లు నిర్మించుకున్నారని అధికారులకు చెప్పి వారికే పట్టాలు కట్టబెడితే చేతికి మట్టి అంటకుండా పోతుందని భవిష్యత్తు అక్రమాలకు ముందు చూపుతో వ్యవహరించడం కొసమెరుపు. వనదుర్గాపురం గ్రామానికి చెందిన టీడీపీ బడా నాయకుడు అండదండలతోనే ఈ భూ ఆక్రమణ జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్న కూటమి నేతల పన్నాగాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement