పుత్రశోకం | - | Sakshi
Sakshi News home page

పుత్రశోకం

Published Thu, Mar 6 2025 1:56 AM | Last Updated on Thu, Mar 6 2025 1:52 AM

పుత్ర

పుత్రశోకం

ప్రతి రోజు కళ్లముందు తిరుగుతున్న ఇద్దరు కుమారుల్లో ఒకరు కానరాని లోకాలకు వెళ్లిపోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఆ తల్లిదండ్రులకు కలిగిన శోకం వర్ణనాతీతం.

నగరి/విజయపురం: పుత్తూరు– చైన్నె జాతీయ రహదారి పిళ్లారిపట్టు వందనవైన్స్‌ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రవిశేఖర్‌ (19) అనే విద్యార్థి మృతి చెందగా మునికుమార్‌ (20) అనే మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. అన్నదమ్ములైన ఈ విద్యార్థులు కళాశాలకు వెళుతుండగా జాతీయ రహదారిపై రాంగ్‌ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌, ద్విచక్రవాహాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పుత్తూరు మండలం గట్టు గ్రామానికి చెందిన మంజునాథ, లక్ష్మి దంపతులు వీధుల్లో కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్నారు. వీరికి రవిశేఖర్‌, మునికుమార్‌ ఇద్దరు సంతానం. పెద్దవాడు మునికుమార్‌ పుత్తూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం, రెండో కుమారుడు రవిశేఖర్‌ బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటి నుంచి కళాశాల దూరంగా ఉండడంతో వీరు రోజు ద్విచక్రవాహనంలో కళాశాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం యథావిధిగా అన్నదమ్ములిద్దరూ ద్విచక్రవాహనంలో కళాశాలకు బయలుదేరారు. మార్గం మధ్యలోని పిళ్లారిపట్టు వందనవైన్స్‌ సమీపంలో ఓ ట్రాక్టర్‌ రాంగ్‌రూట్‌లో వచ్చి వారి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవిశేఖర్‌ (19) అక్కడికక్కడే మరణించగా, మునికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లముందు ఆడుతూ పాడుతూ తిరిగే కొడుకుల్లో ఒకరు మరణించగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్న ఆ ఘటన చూసి, ఆ తల్లిదండ్రులు పడుతున్న తపన, ఆవేదన అందరినీ కలిచివేసింది. గట్టు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్రాక్టర్‌ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో ఒక కుమారుడి మృతి, మరో కుమారుడి పరిస్థితి విషమం

No comments yet. Be the first to comment!
Add a comment
పుత్రశోకం1
1/1

పుత్రశోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement