![Boy Committed Suicide By Not Allow Watch TV Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/5/tv.jpg.webp?itok=CSGdbydY)
సాక్షి, ముంబై: టీవీ చూడనివ్వడం లేదనే కోపంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పింప్రి–చించ్వడ్లోని చిఖలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, రంజాన్ అబ్దుల్ శస్త్రక్ (13) తరుచూ ఎక్కువగా టీవీ చూస్తుండటంతో వాళ్ల అమ్మ తిడుతూ ఉండేది. దీంతో మనస్థాపానికి గురైన అబ్దుల్ మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రంజాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో రంజాన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment