Suicide Attack
-
కాబూల్లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మాహుతిదాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచు స్కూళ్లు, ఆస్పత్రులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని.. ఆత్మహత్య!
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యారి్థని జమీషా ఖురేషీ (17) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్, నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు.ఈ అమ్మాయికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో సీటు వచి్చంది. మొదటి సంవత్సరం పీయుసీ–1 లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం క్యాంపస్లోని క్యాంటిన్కు వెళ్లింది. అక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యారి్థని మొబైల్ ఫోన్ పోయింది. ఆ ఫోన్ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యారి్థని తల్లిదండ్రులకు తెలియజేశారు.దీంతో ఆమె మనస్థాపానికి గురై హాస్టల్ గదిలో ఉన్న వాటర్ పైప్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టడీ అవర్స్కు వెళ్లి పోవడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై తమ్ముడు ఏ పనిచేయడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపంతో అన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మస్కాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. పట్టణంలోని పద్మావతినగర్ కాలనీకి చెందిన లోనికి సత్తవ్వ, పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.పెద్ద కుమారుడు శివకుమార్(33) మలేషియా వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాగా, తమ్ముడు రాకేశ్ ఇంటి వద్దే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా మార్పురాలేదు. దీంతో శివకుమార్ మనస్తాపం చెంది శనివారం రాత్రి మస్కాపూర్ శివారులోని ఓ వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
బీచ్లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
మొగదీషు: సోమాలియాలో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు రాజధాని మొగదీషులోని లిడో బీచ్కు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. బీచ్ హోటల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడులో మొత్తం 32 మంది మృతిచెందగా మరో 63 మంది గాయపడ్డారు. మొగదీషులోని బీచ్లోని ఓ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో చాలా మంది చనిపోయారు. పేలుడు తీవ్రతకు బీచ్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉగ్రవాదుల దాడి సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. -
రైలు కిందపడి తండ్రి, కుమార్తెల విషాదం!
మహబూబ్నగర్: రైలు కిందపడి తండ్రి, కుమార్తె మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్కు చెందిన శివానంద్(50) కొన్నేళ్లుగా ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్, ఆయన కుమార్తె చందన అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తుండేవారు.వీరి కుటుంబం ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి కుటుంబ కలహాలతో శివానంద్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలపై వెళ్లాడు. అతడిని కాపాడేందుకు కుమార్తె చందన (20) కూడా వెళ్లింది. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
కనో: నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడు చోటుచేకున్నాయి. మూడుచోట్ల జరిగిన ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించింది. ఈ ఘటనలు శనివారం చోటు చేసుకున్నట్లు ఎమెర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు.ఈశాన్య నైజీరియాలోని గ్వోజా పట్టణంలో ఓ వివాహ వేడుకలో గుర్తు తెలియని మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అదే పట్టణంలో మరో మహిళ ఓ ఆస్పత్రిలో ఆత్మాహుతి దాడి చేసింది. వివాహ వేడుకలో మృతిచెందిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో మరో దాడి చోటుచేసుకుంది. ఈ మూడు ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా.. 42 మంది గాయపడినట్లు బోర్నో రాష్ట్ర ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. మృతి చెందిన 18 మందిలో చిన్నారులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు అధికారులు తెలపారు.2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలో ఉన్న గ్వోజా పట్టణాన్ని బోకో హరామ్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకుంది. కెనడీయన్ ఆర్మీ సాయంతో నైజీరియన్ సైన్యం.. ఆ పట్టణాన్ని తిరిగి 2015లో స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి నుంచి పట్టణానికి సమీపంలోని కొండల నుంచి హరామ్ మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నాయి. -
పరీక్షల్లో ఫెయిల్కావడంతో.. విద్యార్థిని తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: పరీక్షల్లో ఫెయిల్కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపిన వివరాలు.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
తండ్రితో తాగుడు మాన్పించలేక.. యువకుడి విషాదం!
పుట్టపర్తి అర్బన్: మద్యానికి బానిసైన తండ్రిని మార్చుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లికి చెందిన వడ్డే రాజేష్, రేవతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు విష్ణువర్దన్(19) ఉన్నారు. బేల్దారి పనులతో పాటు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రస్తుతం విష్ణువర్దన్ అనంతపురంలోని ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు.చాలా కాలంగా రాజేష్కు మద్యం సేవించడం అలవాటుగా ఉండేది. ఇటీవల అది శ్రుతిమించి మోతాదుకు మించి మద్యం తాగి మత్తులో ఎక్కడపడితే అక్కడే పడిపోయేవాడు. గమనించిన చుట్టుపక్కల వారు రాజేష్ ఆచూకీ తెలపడంతో కుటుంబసభ్యులు వెళ్లి ఇంటికి పిలుచుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తెలిసిన వారు పలుమార్లు రాజేష్తో మద్యం అలవాటు మాన్పించాలని కుటుంబసభ్యులకు చెబుతూ వచ్చారు. అయితే తమ మాట తండ్రి వినకపోవడం... తరచూ చుట్టుపక్కల వారు హితబోధనలు చేయడం వంటి చర్యలతో సమాజంలో తలెత్తుకుని తిరగలేని స్థితికి చేరుకున్నామని కుటుంబసభ్యులు లోలోన మదనపడేవారు.ఆదివారం సాయంత్రం అమగొండపాళ్యం రోడ్డు పక్కన మద్యం మత్తులో రాజేష్ పడి ఉన్నాడని తెలుసుకున్న విష్ణువర్దన్ అక్కడకు చేరుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి చేర్చాడు. ఆ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు తాగుడు ఎందుకు అంటూ కుమారుడు నిలదీశాడు. కుమారుడి వాదనలతో తండ్రి ఏకీభవించకుండా తనదైన శైలిలోనే సమాధానమిస్తూ వచ్చాడు. దీంతో ఇక తండ్రిలో మార్పు రాదని గ్రహించిన విష్ణువర్దన్... ఆదివారం రాత్రి ఇటీవల నిర్మించిన ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పాత ఇంటికి చేరుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విష్ణు అవ్వ పాలు పితకడానికి పాత ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఉరికి విగతజీవిగా వేలాడుతున్న మనవడిని చూసి గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, కుటుంబాన్ని నిలబెడతాడనుకున్న కుమారుడు చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. -
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
పుట్టింటికి ఎందుకొచ్చావని తల్లి మందలించిందని.. కూతురి విషాదం!
సంగారెడ్డి: తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం సామలపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. బేగంపేట ఎస్సై రవికాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం సామలపల్లికి చెందిన చిగుళ్ల నర్సింలు–జయమ్మ దంపతులు తమ కూతురు నవనీత(20)ను ఏడాదిన్నర కిందట మర్పడగ గ్రామానికి చెందిన బోడపట్ల యాదగిరితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం కూతురు తరచూ పుట్టింటికి వస్తుండడంతో తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. శనివారం మరోసారి కూతురు పుట్టింటికి రావడంతో వివాహం జరిగిన తర్వాత భర్త వద్ద ఉండాలని, ఎందుకొచ్చావని తల్లి జయమ్మ మందలించింది. తర్వాత జయమ్మ భర్త నర్సింలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లక్ష్మక్కపల్లిలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వారు వెళ్లిన అనంతరం నవనీత జీవితంపై విరక్తితో తల్లిగారి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. కోపంతో తండ్రి.. -
ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్
ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ నటి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని.. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యానంటూ సదరు నటి ఆ వీడియోలో పేర్కొంది. ఆ నటి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయలక్ష్మీ. 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి.. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పట్లో బిజియెస్ట్గా నటిగా మారింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. మోహన్లాల్తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్లో కూడా నటించింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి ఆకట్టుకుంది. సీమాన్పై తీవ్ర ఆరోపణలు ఆ మధ్య తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు విజయ లక్ష్మీ. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని... ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీమాన్ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్ స్పందించలేదు. దీంతో తాజాగా మరో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయలక్ష్మీ. ఇదే నా చివరి వీడియో ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు సీమాన్ నాతో మాట్లాడాలని, ఆయనతో కలిసి జీవించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఓ వీడియోని అతనికి పంపాను. ‘నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను’అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకొని.. జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ రోడ్డున పడేశాడు. ఇప్పుడు నాకు ఎవరూ సాయం చేయడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో బ్రతుకలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదే నా చివరి వీడియో.. నా చావుపై సీమాన్ వివరణ ఇవ్వాలి’అని ఆమె డిమాండ్ చేసింది. మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by The Whistle (@thewhistletv) -
జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్లి అనిత(50) ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ కథనం ప్రకారం..మృతురాలు నాలుగు నెలలుగా మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సూపర్ వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజాము నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందింది. మృతురాలి కుమారుడు పవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్తు ఏఎస్సై తెలిపారు. కాగా, పార్థివదేహం వద్ద డీఆర్డీవో విజయలక్ష్మి పుష్కగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అంతక్రియల్లో పాల్గొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఇవి చదవండి: వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి -
కొడుకుకు ఉద్యోగం లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: కుమారుడికి సరైన ఉద్యోగం లేదనే బెంగతో ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఏఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని తెర్లుమద్దికి చెందిన పల్లె రమణ(40) ఈనెల 10న ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న రమణను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. రమణ కుమారుడు నిఖిల్కు సరైన ఉద్యోగం లేదని తరచూ బాధపడుతుండేది. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడని మదనపడేది. ఈక్రమంలోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుమారుడు నిఖిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఇవి చదవండి: వేములవాడలో యువకుడి దారుణహత్య -
ఈ వయసులోనే పెళ్లి వద్దని మందలించడంతో.. విద్యార్థి విషాదం!
అనంతపురం: ప్రేమించిన బాలికతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థి (మైనర్) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన సోమనాథ్, రుక్మిణమ్మ దంపతుల పెద్ద కుమారుడు అభిషేక్ (17) కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపి పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. ఈ వయసులోనే పెళ్లి వద్దని బాగా చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత అదే అమ్మాయితో పెళ్లి చేస్తామని, అప్పటి వరకూ బుద్ధిగా చదువుకోవాలని తండ్రి సోమనాథ్ తెలిపాడు. ఇందుకు అభిషేక్ అంగీకరించలేదు. తనకిప్పుడే పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. దీంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు.... మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలను కుమారుడికి వివరించారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ గురువారం తెల్లవారుజామున తమ తోటలోకి వెళ్లి చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన తండ్రి సోమనాథ్... చెట్టు వేలాడుతున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇవి చదవండి: ‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు -
అప్పు చేసి ఇల్లు నిర్మించొద్దన్నందుకు..
కరీంనగర్: మొట్లపల్లి గ్రామానికి చెందిన సంఘని రాజయ్య(50)అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజయ్య గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు లేక ఇంటి పనులు నిలిచి పోయాయి. అప్పు తెచ్చి నిర్మాణం కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అప్పుతెచ్చి ఇల్లు కడితే అవి తీర్చలేక ఇబ్బందుల పాలవుతామని కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపానికి గురైన రాజయ్య ఈనెల 4వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యపై దారుణంగా ప్రవర్తించిన భర్త.. -
బర్త్డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం!
కరీంనగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మండలంలోని మల్లాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కోమటి శివసాయి(23) కరీంనగర్లో సెల్ఫోన్ రిపేర్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివసాయి ఈనెల ఒకటిన ఎల్ఎండీ కట్టపై పురుగుల మందు తాగాడు. తర్వాత బావ అడిచర్ల నరేశ్కు ఫోన్చేసి విషయం చెప్పాడు. వెంటనే నరేశ్ 108కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఆత్మహత్యపై అనుమానాలు.. ఇదిలా ఉండగా శివసాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్త్డేకు చిన్న గిఫ్ట్ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో లవ్ ఫెయిల్యూర్ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ.. ఇదిలా వుండగా కడుపునొప్పి భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు శివసాయి తండ్రి కోమటి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: గ్యాంగ్స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య -
విషయం తండ్రికి చెబుతామన్నందుకు విద్యార్థిని..
తూర్పుగోదావరి: రామచంద్రపురం మండలంలోని ఏరుపల్లి శివారు రామారావుపేటకు చెందిన 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక సింగం దీవెన గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. ద్రాక్షారామ ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలిక తమ ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుంది. ఇది చూసిన ఆమె తమ్ముడు, అక్కలు విషయం తండ్రికి చెబుతామని తెలపడంతో ఆమె భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు. ఇవి చదవండి: అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య -
వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి?
నిర్మల్: ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్గౌడ్ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్ కాలనీకి చెందిన గడ్ చందా రమేష్ (28) ఆర్మీ జవాన్. కోల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్ ముప్కల్ మండలంలో ఉండడంతో వచ్చాడు. వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి -
వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు..
కరీంనగర్: అదనపు కట్నం తేవాలనే అత్తామామల వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా మన్మంతునిపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధన(25) సోమవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన రెండేళ్లకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె తొమ్మిది నెలల కుమారుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎస్సై మల్లేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధనను రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం హన్మంతునిపేటకు చెందిన తీగల రాజ్కుమార్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.7లక్షల నగదు, పల్సర్బైక్ కట్నంగా ఇచ్చినట్లు మౌనిక తల్లి గోగుల సమ్మక్క తెలిపారు. ఆ తర్వాత కూడా అదనంగా కట్నం తేవాలంటూ తమ కూతురును భర్త రాజ్కుమార్, అత్త, మామ యశోద, పోచాలు వేధించేవారని కన్నీటి పర్యంతమైంది. తరచూ కొంత మొత్తాన్ని వారికి ఇచ్చామని పేర్కొన్నారు. మళ్లీ రూ.2లక్షలు తేవాలంటూ వేధించడంతో మౌనిక ఈనెల13న పుట్టింటికి వచ్చిందన్నారు. ఇటీవలే భర్తతో మాట్లాడించి మళ్లీ అత్తింటికి పంపించామని అన్నారు. ఈక్రమంలో సోమవారం వేకువజామున మౌనిక ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త రాజ్కుమార్, అత్త, మామలు యశోద, పోచాలుపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మహేశ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఫోన్ల వేటలో పోలీసులు భళా! కానీ 'బండి' విషయంలో..?? -
పెళ్లి కుదిరింది! ఫోన్ మాట్లాడొద్దని తల్లి బెదిరించడంతో.. యువతి
నిర్మల్: తల్లి మందలించిందని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన పానుగంటి గంగవ్వ–పోషన్నలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. తండ్రి గతంలో మృతిచెందడంతో తల్లి గంగవ్వనే కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల పెద్ద కూతురు సాత్విక(22) పెళ్లి కుదిరింది. గత కొద్ది రోజులగా తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి ఆదివారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు వెంటనే నిర్మల్లోని ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహన్ని ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర నిర్ణయం! కానీ భర్త?
నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ నెల 12న తేదీన జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్(35)ది వ్యవసాయ కుటుంబం. నవీన్కు 14 ఏళ్ల కిందట నిర్మలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత, దీక్షిత ఉన్నారు. నవీన్, నిర్మల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడడంతో గత రెండేళ్ల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టగా.. చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవద్దని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 12న భార్యభర్తలిద్దరు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో నిర్మల అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. దీంతో తాను కూడా తాగుతానని నవీన్ అక్కడే ఉన్న గడ్డి మందును తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిర్మల సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకుంటుంది. కాగా నవీన్ మృతదేహానికి గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి. అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివరికి యువతి? -
మనస్తాపంతో వివాహిత తీవ్ర నిర్ణయం!
కర్నూలు: నగరంలోని కొత్తపేటలోని రామాలయం దగ్గర నివాసముంటున్న బోయ మహాలక్ష్మి (19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తంగడంచె గ్రామానికి చెందిన ఈమె.. తల్లిదండ్రులు చనిపోవడంతో సాయిబాబా సంజీవ నగర్లో ఉంటున్న అవ్వ భవానమ్మ వద్ద పెరిగింది. కొత్తపేటకు చెందిన అబ్దుల్ గనిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి 8 నెలల కూతురు ఉంది. భర్త చికెన్ పకోడి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా వీరు నాలుగు నెలల క్రితం వేరు కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో మహాలక్ష్మి మనస్తాపం చెందింది. బుధవారం తెల్లవారుజామున పాపను తీసుకెళ్లి పాలు తీసుకురమ్మని పంపి తిరిగి వచ్చేలోగా ఇంట్లో కొక్కికి చీరతో ఉరి వేసుకుంది. భర్త వచ్చి గమనించి ఉరి నుంచి కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. అవ్వ భవానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం!
అనంతపురం: పొలానికి వెళ్లేందుకు దాయాదులు దారి విడువక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం రాంపురానికి చెందిన ఆదినారాయణ, సావిత్రమ్మ దంపతుల రెండోకుమారుడు కాయల రామచంద్ర (26)కు సమీప బంధువులతో పొలం రస్తా విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గుత్తి మండలం కొత్తపేట సమీపంలో తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను తొలగించి దిగుబడిని ఇంటికి తరలించేందుకు రామచంద్ర సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న దాయాదులు రస్తాకు అడ్డు వేయడంతో మూడు రోజులుగా ఎద్దులబండి అక్కడే ఆగిపోయింది. ఆదివారం మరోసారి దాయాదులతో రామచంద్ర మాట్లాడాడు. అయినా వారు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రామచంద్ర నేరుగా ఇంటికెళ్లి పురుగుల మందు డబ్బా తీసుకుని పొలం వద్దకు చేరుకుని తాగాడు. అటుగా వెళుతున్న వారు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామచంద్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఏడాదిలో 119 మంది ఖైదీల ఆత్మహత్య -
ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం!
మహబూబ్నగర్: మండలంలోని దారారం చెందిన ఆవుల శ్రీనివాసులు(43) ఆత్యహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆవుల శ్రీనివాసులు శుక్రవారం కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామానికి సమీపంలో ఉన్న పచ్చగట్టు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కొంతమంది కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి కొంతకాలంగా కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇవి కూడా చదవండి: వివాహేతర సంబంధమే కారణమా..? -
ఆ ట్రిపుల్ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి?
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాటి ప్రవీణ్కుమార్(19) వసతిగృహంలోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఔట్పాస్ తీసుకుని.. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్కుమార్ శనివారం ఔట్పాస్ తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. శనివారం ఔట్పాస్ తీసుకున్న విద్యార్థి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. అధికారులైతే ఆదివారం ఉదయం అల్పహారం చేశాడని చెబుతున్నారు. ఒక రోజు ఔట్పాస్ తీసుకున్న విద్యార్థి అక్కడే ఎందుకు ఉండిపోయాడనే విషయం అంతుపట్టని ప్రశ్న. ఔట్పాస్ తీసుకున్న విద్యార్థులు కళాశాలలో ఉన్నారో బయటికి వెళ్లిపోయారా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది చూసుకుంటున్నారో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాళీ గదిలో ఆత్మహత్య.. ప్రవీణ్కుమార్ బీహెచ్–1 వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని ఖాళీ గదుల్లోనే గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గృహాల్లో ఖాళీ గదులకు తాళాలు ఎందుకు వేయడం లేదనే అనుమానం తలెత్తుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మెడ భాగం కమిలిపోయి ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు. పోలీసు భద్రత.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మృతదేహాన్ని అంబులెన్సులో భైంసాకు తరలించారు. పోస్టుమార్టం గది వద్దకు ఎవరిని అనుమతించలేదు. మృతదేహాన్ని లోపల భద్రపరిచి తాళం వేశారు. ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం అంతుచిక్కడం లేదు. వ్యక్తిగత కారణాలతోనే.. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన రామాటి ప్రవీణ్కుమార్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఔట్పాస్ తీసుకున్నాడు. ఉదయం వేళ అల్పహారం చేసిన ఈ విద్యార్థి బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీగదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాం. – ప్రొఫెసర్ వెంకటరమణ, వీసీ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాతకంగా.. -
దుబాయ్లో భర్త.. మరో యువకుడి కారణంగా.. వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని పార్పెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్న బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మూడేళ్లుగా అతడి భార్య నాగమణి(35) ఇద్దరు కుమారులతో కలిసి తల్లిగారింటి వద్ద నిర్మల్లోని బెస్తవార్పేట్లో నివాసం ఉంటోంది. పార్పెల్లి గ్రామానికి చిలుక వంశీ అనే వ్యక్తి నాగమణిని కొద్ది రోజులుగా చరవాణిలో లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో నాగమణి రెండు రోజుల కిందట పార్పెల్లి గ్రామానికి చెందిన చిలుక వంశీ తనను ఫోనులో వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లితో చెప్పింది. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇంటికి వచ్చిన తల్లి కళావతికి కుమార్తె ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు నిర్మల్టౌన్లో కేసు నమోదు చేశారు. పార్పెల్లిలో ఆందోళన.. నాగమణి మృతదేహాన్ని పార్పెల్లికి అంత్యక్రియల కోసం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వంశీ అనే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేయడంతోనే నాగమణి ఆత్మహత్య చేసుకుందని అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్, సోన్ సీఐ నవీన్ కుమార్ చేరుకుని పార్పెల్లిలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య మృతితో ఇంటికి వచ్చిన భర్త.. నాగమణి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని విషయం తెలవడంతో భర్త చిన్న భోజన్న దుబాయ్ నుంచి గురువారం ఉదయం స్వగ్రామం చేరుకొన్నాడు. దీంతో తన ఇద్దరు కుమారులు శ్రీచరణ్(12), శ్రీవర్ధన్(10)తో కలిసి భార్య మృతదేహం వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'నా చావుకు ఎవరు కారణం కాదు.. ఈ కారణంగానే నేనిలా..' సూసైడ్నోట్ రాసి..
సాక్షి, కరీంనగర్: చేతిలో డబ్బు లేకపోవడం.. చెల్లికి పెళ్లి చేయలేకపోవడంతో మనస్థానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం ఎన్గల్లో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని ఎన్గల్కు చెందిన గసికంటి ప్రమోద్(25) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పని సరిగ్గా లేక రెండేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలోనే కూలీ పనిచేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలో పత్తి లోడు(హమాలీ) పనిచేసి ఇంటికొచ్చాడు. తల్లి సత్తవ్వతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున తల్లి లేచి చూసే సరికి ప్రమోద్ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని కనిపించాడు. తల్లి రోదనలతో చుట్టుపక్కల వారు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతిచెంది కనిపించాడు. తన చావుకు ఎవరు కారణం కాదని.. ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు సూసైడ్నోట్లో రాశాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. మృతునికి తల్లి సత్తవ్వ, తండ్రి శంకర్, చెల్లె శ్రావణి ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్లో ఘటన..! -
ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ.. చనిపోతున్నానని ఫోన్చేసి..
సాక్షి, వరంగల్: ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ సీఐ నరేష్ కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన కట్ట సుజాత తన భర్త మృతి చెందడంతో నగరంలో ఎండోమెంట్ శాఖలో ఉద్యోగం చేస్తూ కుమారుడు రాజ్కుమార్(23)తో కలిసి నగరంలోని గిర్మాజీపేటలో నివాసం ఉంటోంది. రాజ్కుమార్ ఒకేషనల్ చదువుతున్నాడు. తరుచూ తల్లిని ఖర్చులకు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే చనిపోతానని బెదిరిస్తూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శుక్రవారం మళ్లీ తల్లిని ఖర్చులకు డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో అదేరోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి రైలు కింద పడి చనిపోతున్నానని ఫోన్లో చెప్పాడు. అనంతరం నగరంలోని సంతోషిమాతా ఆలయం ఎదుట ఉన్న రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్ఎస్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కె భాస్కర్ కేసు నమోదు చేసుకుని మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి తల్లి సుజాతకు అప్పగించామని సీఐ నరేష్ శనివారం తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం!
సాక్షి, కరీంనగర్: మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య, సీఐ రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాముల మోహన్(33) తన నాయీబ్రాహ్మణ వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుండటంతో ఆస్పత్రిలో చూపించుకొని, మందులు వాడుతున్నాడు. అయినా నొప్పి తగ్గడం లేదు. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా అతని భార్య రజని ఖాజీపేటలోని తన తల్లిగారింటికి వెళ్ళింది. మోహన్ సోమవారం ఉదయం ఇంటి ఆవరణలో గల మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఇవి కూడా చదవండి: దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..! -
అకారణంగా తిడుతూ.. చెప్పుతో కొట్టారని.. చివరికి..
సాక్షి, పెద్దపల్లి: అకారణంగా తిడుతూ, చెప్పుతో కొట్టారని అవమాన భారంతో ధూళికట్ట గ్రామానికి చెందిన పెద్ది కనుకయ్య(65) బీరన్నగుడి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. పెద్ది కనుకయ్య 20ఏళ్లుగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈనెల10న ఐకేపీ సెంటర్ వద్ద అదే గ్రామానికి చెందిన పెద్ది వెంకటయ్యతో ధాన్యం కాంటా విషయంలో గొడవ జరిగింది. ఈవిషయాన్ని పెద్దమనుషులకు చెబుతూ కనుకయ్య రోడ్డు వెంట వెళ్తున్నాడు. అయవతే, కనుకయ్య తమనే తిడుతున్నాడంటూ గ్రామానికి చెందిన అమరగొండ చంద్రయ్య, అమరగొండ లక్ష్మి, అమరగొండ సంతోష్ భావించారు. అతడిని నానా బూతులు తిట్టి, చేతులతో నెట్టివేశారు. అంతటితో ఆగకుండా లక్ష్మి వృద్ధుడిని చెప్పుతో కొట్టింది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన కనుకయ్య.. ఆరోజు రాత్రంతా నిద్రపోలేదు. తనకు అవమానం జరిగిందని మానసికంగా కుంగిపోయాడు. శనివారం వేకువజామున 4గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తాను కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నలుగురి కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పెద్ది ఐలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు నలుగురిపై నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకు చెందిన గద్దల బాలయ్య, దేవవ్వ దంపతుల కుమారుడు నితిన్ ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ తల్లిదండ్రులకు ఒక్కాగానొక్క కుమారుడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా.. -
తీవ్ర మనస్తాపం చెంది.. యువకుడు విషాద నిర్ణయం..!
సాక్షి, కరీంనగర్: వేములవాడ మండలంలోని మల్లారం గ్రామం రాజానగర్కు చెందిన గొర్రె వెంకటేశ్ (35) కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మారుతి తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్ పదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె జగిత్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన వెంకటేశ్ బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: చింతకాయలు తెంపుతుండగా.. కట్టుకున్న లుంగీ మెడకు చుట్టుకుని.. ఆపై.. -
'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రమాకాంత్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం భోరజ్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించి 108కు ఫోన్ చేశారు. అప్పటికే అతడు మృతి చెందడంతో 108 తిరిగి వెళ్లిపోయింది. మృతదేహాన్ని ఆటోలో రిమ్స్కి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్లో దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు నర్సింగ్, చంద్రభాగ వేడుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా.. -
‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్లో స్టేటస్ పెట్టి.. యువకుడు..
సాక్షి, కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు మోయతుమ్మెద వాగు(ఎల్ఎండీ బ్యాక్ వాటర్)లో దూకిన ఘటన తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటకు చెందిన సందెబోయిన అభిలాష్ అలియాస్ టింకు బుధవారం రాత్రి రేణికుంట శివారులోని రాజీవ్ రహదారి బ్రిడ్జి పైనుంచి ఎల్ఎండీ బ్యాక్ వాటర్లో దూకాడు. అంతకుముందు తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబసభ్యులు వెంటనే ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రమోద్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు అభిలాష్ ఆచూకీ దొరకలేదని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం! -
'గొడవలు పెట్టుకోవద్దు.. పరువు పోతుందంటూ..' చివరికి బీటెక్ విద్యార్థి?
సాక్షి, కరీంనగర్: అత్తాకోడళ్ల గొడవతో మనస్తాపం చెందిన బీటెక్ విద్యార్థి పడాల అభిలాష్(20) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విజేందర్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి పడాల రమేశ్–రేణుక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్దకుమారుడు అభిలాష్ కరీంనగర్లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇతడి తల్లి, నానమ్మ ఇంట్లో తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవపడ్డారు. ఇంట్లో గొడవలు జరిగితే తమ పరువు పోతుందని ఇద్దరికీ చెప్పాడు. గొడవలు పెట్టుకోవద్దని సూచించాడు. అయినా, అత్తాకోడళ్లు ఇదేమీ పట్టించుకోలేదు. తీవ్రమనస్తాపం చెందిన అభిలాష్ తన ఇంటి సమీపంలో పత్తి చేనులోకి వెళ్లాడు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com Follow the Sakshi TV channel on WhatsApp: -
కుటుంబ కలహాలతో ఒకప్పుడు భార్య.. ఇప్పుడు భర్త.. తీవ్ర విషాదం!
మెదక్: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గజ్వేల్, కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడిగ నర్సింలు (40) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 13 ఏళ్ల కిందట కుటుంబ కలహాలతో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో 8 ఏళ్ళ కిందట రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల రెండో భార్యతో గొడవలు జరుగుతుండడం, వ్యవసాయం కోసం చేసిన అప్పుల కోసం మధనపడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక్కసారిగా.. Follow the Sakshi TV channel on WhatsApp: -
నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్!
సాక్షి, కుమురం భీం: చెరువులో దూకి అధ్యాపకురాలు బలవన్మరణం చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ వాసుదేవరావు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ మండలానికి చెందిన పసునూటి తిరుమలేశ్వరి (32) చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం విధుల్లో భాగంగా కళాశాలకు వెళ్లి రిజిష్టర్లో సంతకం చేసింది. అనంతరం బయటకు వెళ్తుండగా తొటి ఉపాధ్యాయురాలు ప్రశ్నించడంతో సెల్ఫోన్ మర్చిపోయాను.. ఇంటికి వెళ్లివస్తానని చెప్పింది. 10 గంటల ప్రాంతంలో పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త సంపత్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీయించి పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కీలకంగా మారిన వాయిస్ రికార్డు.. ఆత్మహత్యకు ముందు తిరుమలేశ్వరి తన మృతికి కళాశాల ప్రిన్సిపాల్, ఏటీసీ, పీఈటీతో పాటు మరో ఉపాధ్యాయురాలు కారణమని సెల్ఫోన్లో వాయిస్ రికార్డు చేసింది. ఇదే కేసులో కీలకంగా మారింది. వాయిస్ రికార్డు ఆధారంగా మృతురాలి భర్త సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. బంధువుల ఆందోళన! మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కుమారస్వామి, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి గురుకుల కళాశాల అధికారులు వచ్చే వరకు పోస్ట్మార్టం చేయవద్దని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఆర్సీవో స్వరూపారాణి వచ్చి మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలేశ్వరి ఉద్యోగాన్ని భర్త సంపత్కు ఇస్తామని, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ కుమార్తె పేరున అందజేస్తామని రాసివ్వడంతో ఆందోళన విరమించారు. ప్రిన్సిపాల్, ఏసీటీ, మరో ముగ్గురిపై కేసు నమోదు.. అధ్యాపకురాలి మృతి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి ఉద్యోగ రీత్యా చెన్నూర్లోని ఆదర్శనగర్లో నివాసం ఉంటోంది. నాలుగేళ్లుగా గురుకుల కళాశాల లెక్చరర్తో పాటు మెస్ కేర్టేకర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కొన్ని రోజులుగా ప్రిన్సిపాల్ రాజమణి, ఏసీటీ స్రవంతి, పీఈటీలు రేష్మ, శిరీష, మరో ఉపాధ్యాయురాలు పుష్పలత వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలి భర్త సంపత్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా!
సాక్షి, మెదక్: కుటుంబ కలహాలు, అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెందిన ఒక వ్యక్తి చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సర్ధన గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కట్ట వెంకటేశం(35) తన భార్య లక్ష్మి మృతి చెందగా మరో మహిళతో వివాహం చేయగా ఆమె ఇటీవల వెంకటేశంతో గొడవపడి వెళ్లిపోయిందని వెంకటేశం తల్లి నర్సమ్మ తెలిపింది. దానికి తోడు ఆయనకు ఫిట్స్ వ్యాధి ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14న ఇంట్లో నుంచి వెళ్లి పోయాడని, సోమవారం ఐలేరు చెరువులోపడి మృతి చెందినట్లు చెప్పింది. నర్సమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆనంద్గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘ప్రవళికది ప్రేమ విఫలం' కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే!
సాక్షి, ఆదిలాబాద్: హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌరాల సుభాష్, జగన్సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్లో సోమవారం వారు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం విద్యార్థులు, యువకుల బలిదా నాలతో స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. అయి తే సీఎం కేసీఆర్ నీళ్ల పేరు చెప్పి నిధులను తన ఇంటికి మళ్లించుకున్నారని, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్–1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు రద్దయిందన్నారు. ఉద్యోగ ప్రకటనలిస్తూ నియామకాల ప్రక్రియ సరిగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి కారణంగానే ప్రవళిక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్య ప్రేమ విఫలం వల్లే జరిగిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ యువత ఇప్పటికై నా ఆలోచించాలన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే విప్లవ పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇందులో నాయకులు అశోక్, దండేకర్ వామన్, నితిన్, సురేష్, కృపాకర్, శ్రవణ్ తదితరులున్నారు. -
ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని.. యువకుడు..
సాక్షి, జగిత్యాల: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని వెంగళాపూర్ గ్రామానికి చెందిన అంతెల్పుల రాకేశ్ (22) కొంతకాలంగా ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆమెను కోరగా ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సదరు యువతి పెళ్లికి ఒప్పుకోవడంలేదని ఇంట్లో చెబుతూ బాధపడుతుండేవాడు. సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్! -
మొదట ఒకే కాలేజీలో.. ఒకేరోజు ఇద్దరు ఇలా.. అసలు కారణాలేంటి?
ఖమ్మం: వేర్వేరు గ్రామాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఇద్దరు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లాడ మండలం మంగాపురానికి చెందిన కుంచం నాగేశ్వరి(18) ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలాగే, నారాయణపురం గ్రామానికి చెందిన సంగసాని విజయ్(18) సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరిలో నాగేశ్వరి రెడ్డిగూడెంలోని క్రీస్తుజ్యోతి డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరంలో చేరి అక్కడి నుంచి వైరాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు మారింది. ఇక విజయ్ క్రీస్తుజ్యోతి డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సమీప గ్రామాలకు చెందిన వీరిద్దరు తొలుత ఒకే కళాశాలలో చేరగా.. ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తుండగా, రెండు గ్రామాల్లో విషాదాన్ని నింపింది. కాగా, ఘటనలపై తమకు ఫిర్యాదు అందలేదని తల్లాడ ఎస్ఐ సురేష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్యా పిల్లల్ని ఇంటికి రమ్మని కోరగా.. నిరాకరించడంతో..
నల్గొండ: మద్యం మత్తులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మద్దిరాల మండలంలోని చిన్ననెమిలా గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్ననెమిలా గ్రామానికి చెందిన బొల్లికొండ సైదులు, రేణుక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు డిగ్రీ, చిన్న కుమారుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. సైదులు మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకోకపోవడంతో భార్య రేణుక తన పిల్లలతో కలిసి ఖమ్మం వెళ్లి అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం సైదులు ఖమ్మంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వారిని ఇంటి రమ్మని కోరాడు. మద్యం మానేస్తేనే వస్తానని భార్య చెప్పడంతో మంగళవారం ఇంటికి వచ్చిన సైదులు మనస్తాపం చెంది మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. -
తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మాహుతి దాడి
అంకారా: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే తుర్కియేలో ఉగ్రావాదులు పంజా విసిరారు. తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు తెలిపింది తుర్కియే అంతర్గత వ్యవహారాల శాఖ. ప్రభుత్వం ఇది తీవ్రవాదుల పనేనని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9.30 ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులు ఒక కమర్షియల్ వాహనంలో తుర్కీయే పార్లమెంట్ భవనం వద్దకు వచ్చారు. డైరెక్టరేట్ జనరల్ భద్రతా విభాగం ఎంట్రన్స్ గేట్ వద్దకు రాగానే వీరిద్దరూ బాంబులతో దాడి చేశారనన్నారు. వారిలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడగా మరొక తీవ్రవాది బాంబును నిర్వీర్యం చేశామని తెలిపింది అంతర్గత వ్యవహారాల శాఖ. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పొందుపరుస్తూ ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపింది. బాంబు శబ్దానికి చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. తీవ్రవాదులు దాడులు చేసిన జిల్లాలో పార్లమెంట్ సహా అనేక ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రసంగం తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయని అంతలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలిపింది స్థానిక మీడియా. దాడులు జరిగిన సమాచారం అందగానే అత్యవసర సేవల విభాగం వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. A terrorist attack occurred outside Turkey's interior ministry in Ankara. Two attackers, arriving in a commercial vehicle, executed the assault, injuring two officers. One attacker detonated himself in front of a ministry building, while the other was neutralized. The… pic.twitter.com/ovaiv3eVky — Pakistani Index (@PakistaniIndex) October 1, 2023 ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
పాక్లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు. గుర్తు తెలియని దుండగుడు డీఎస్పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు. వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
ఓ సైకో గొంతు కోసుకుని.. ఆపై వీరంగం..!
మహబూబాబాద్: కాజీపేట పట్టణంలో ఓ సైకో గొంతు కోసుకుని వీరంగం సృష్టించాడు. బిహార్కు చెందిన అమర్ చౌహాన్ ( 30) మిత్రులతో కలిసి బుధవారం రైలులో కాజీపేట జంక్షన్ చేరుకున్నాడు. అనంతరం సహచరులతో కలిసి గంజాయి సేవించి వారితోనే గొడవకు దిగాడు. జేబులో ఉన్న కత్తితో గొంతు కోసుకోవడంతో దుస్తులన్నీ రక్తసిక్తమయ్యాయి. హిందీలో బాటసారులను దూషిస్తూ దౌర్జన్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108లో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. పోలీస్స్టేషన్ ఆవరణలో యువతి ఒక్కసారిగా..
ఆదిలాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇచ్చోడ పోలీస్స్టేషన్ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ముసాయిపేట్కు చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్కాలనీకి చెందిన చందల హరీశ్కుమార్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్లో చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండడంతో 2022 మార్చిలో ప్రియుడు ఇంటి వద్ద సుజాత భైఠాయించింది. ఈ క్రమంలో హరీశ్ తల్లిదండ్రులు నిర్మల్కు మకాం మార్చారు. దాదాపు 18 నెలల నుంచి సుజాత తన సమీప బంధువులతో కలిసి ప్రియుడు హరీశ్కుమార్ ఇంట్లో ఉంటోంది. ఆదివారం ఇరువర్గాల కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించారు. ఈ వివరాలను ఇచ్చోడ పోలీస్స్టేషన్లో వెల్లడించానికి వెళ్లారు. పెళ్లికి హరీశ్కుమార్ నిరాకరించడంతో యువతి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. వెంటనే స్థానిక ఎస్సై నరేశ్ పోలీసు వాహనంలో పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ప్రసుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్సై వివరణ కోరగా ఇరువర్గాల కులపెద్దలు పోలీస్స్టేషన్ బయట మాట్లాడుకున్నారు. హరీశ్కుమార్ పెళ్లికి నిరాకరించడంతో పోలీస్స్టేషన్ గేటు బయట సుజాత పురుగుల మందు తాగినట్లు తెలిపారు. -
పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు
కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది?
కామారెడ్డి: పెళ్లి రోజే వరుడి మృతదేహం లభ్యమైన ఘటన సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మొసర్ల చిన్న నర్సింహులుకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన రాజేందర్రెడ్డి(29) వివాహం రాంపూర్కు చెందిన అమ్మాయితో గురువారం జరగాల్సి ఉంది. రాజేందర్రెడ్డి అన్న శ్యామ్రెడ్డి ఇద్దరు కలిసి పెళ్లి పత్రికలను ఇటీవల బంధువులకు పంచారు. ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన రాజేందర్రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. స్థానికుల సమాచారం మేరకు లింగంపేట మండలం ఎల్లారం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని రాజేందర్రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట ఏఎస్సై ప్రకాశ్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రాఖీ పండుగకి సొంతూరికి వచ్చి.. యువకుడు తీవ్ర నిర్ణయం..!
సంగారెడ్డి: మతిస్థిమితం కోల్పోయిన యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన ఉడుత శ్రీనివాస్ (24) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలో రాఖీ పండగ సందర్భంగా సొంతూరికి వచ్చాడు. కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేని శ్రీనివాస్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించగా పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పాక్లో ఆత్మాహుతి దాడి.. 9 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ బన్ను జిల్లాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు. నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన ఉగ్రవాది బైక్పై వచ్చి భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్ను ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించడంతో వ్యానులోని 9 మంది మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారని సైన్యం తెలిపింది. దాడికి తామే కారణమంటూ టీటీపీ ప్రకటించుకుంది. పలు ఉగ్ర సంస్థలు కలిసి 2017లో టీటీపీగా ఏర్పాటయ్యాయి. అల్ ఖాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న టీటీపీ ఇటీవల తరచూ దాడులకు తెగబడుతోంది. జనవరిలో పెషావర్లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా మరో 200 మంది గాయపడ్డారు. -
ప్రాణం మీదకొస్తున్న ‘ప్యాకేజీ’ చదువులు!
చదువు.. తెలివి ముందుగా ‘ప్యాకేజీ ’ చదువుల ఇంజనీర్ కథ .. ఓ వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఇంజనీర్ అయ్యాడు. బాగా సంపాదిస్తున్నాడు. కారు కొనుక్కున్నాడు. డ్రైవర్ను కూడా పెట్టుకున్నాడు. ఫంక్షన్ ఉండడంతో ఓ రోజు ఊరెళ్లాల్సి వచ్చింది. కానీ, డ్రైవర్ సెలవు పెట్టాడు. దానితో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఊరికి బయలు దేరాడు. దాదాపుగా ఊరిదాకా వెళ్లాడు. కానీ అంతలోనే కారు టైరు పంక్చరయ్యింది. మార్చడానికి ఎప్పటిలా డ్రైవర్ లేడు. చేసేదేంలేక తానే టైర్ మార్చే ప్రయత్నం చేయసాగాడు. కష్టపడి టైర్ విప్పాడు. దురదృష్టం మనవాడిని వెన్నాడుతూనే ఉంది. స్టెప్నీ టైర్ తీసిపెట్టి బిగించే టైమ్లో కాలు తాకి విప్పిపెట్టిన నట్లు పక్కనే ఉన్న మురికి కాల్వలో పడ్డాయి. ఉసూరుమన్నాడు. దిగి తీద్దామంటే బురద... అంటితే ఫంక్షన్కు అటెండ్ కావడం ఎలా? కర్రలు గట్రాలతో రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏదీ వర్కవుట్ కాలేదు... తలపట్టుకుని అలాగే కూర్చున్నాడు. అరగంట గడిచింది. ఆ దారిలో పశువులను తోలుకుంటూ ఓ ఆసామి వస్తున్నాడు అతన్ని పిలిచి తన బాధంతా చెప్పి ఎలాగైనా ఆ న ట్లు తీసివ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడు. కొంచెంసేపు ఆ ఇంజనీర్వైపు కారువైపు అలాగే చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘బాబూ!, డబ్బుల విషయం అలా ఉంచు. నేను దిగి తీసివ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ, అందులో దిగాకా నేను మళ్లీ ఇంటికి వెళ్లి బురద కడుక్కుని రావాలి. నువ్వు కూడా దానిలో దిగలేవు. అందుకని నేనో ఉపాయం చెబుతా.. మిగతా చక్రాలవి ఒక్కో నట్టు తీసి ఈ టైరుకు బిగిద్దాం. కారు నడవడానికి ఢోకా ఉండదు. నువ్వు హాయిగా వెళ్లొచ్చు. ఓ పది కిలోమీటర్ల దూరంలో మెకానిక్ షాపు ఉంది. అక్కడకి వెళ్లి నట్లు వేయించుకుని వెళ్లు. నీకు డబ్బు ఖర్చు, నాకు బురదా తప్పుతాయి. ఆ ఐడియాకు ఆ మెకానికల్ ఇంజనీర్ అవాక్కయ్యాడు. ఈ మాత్రం ఆలోచన రాక అరగంట నుంచి ఇబ్బంది పడ్డానే అనుకున్నాడు.. చదువు మెకానికల్ అయిపోయి, ఉద్యోగానికి మాత్రమే, అందునా ప్యాకేజీలకు మాత్రమే పనికి వచ్చే చదువుతో తయారైన బుర్ర నుంచి ఇలాంటి పదునైన ఆలోచన రావడం కష్టమే..చావుల చదువు.. ఓ సీలింగ్ ఫ్యాన్.. మేధో బుర్రలకు తట్టిన గొప్ప ఐడియా. సీలింగ్ ఫ్యాన్కు దానికి ఆధారంగా ఉండే రాడ్కు మధ్య ఓ స్ప్రింగ్ను బిగిస్తారు. ఈ ఫ్యాన్లకు 20 కిలోల కన్నా ఎక్కువ బరువు వేలాడితే వెంటనే స్ప్రింగ్ సాగుతుంది. దానితో ఫ్యాను సీలింగ్ నుంచి కిందకు దిగుతుంది. స్ప్రింగ్ సాగగానే సైరన్కూడా మోగుతుంది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఇవి ఇప్పుడు రాజస్థాన్లోని కోటా పట్టణంలోని హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కోటాలోని ఐఐటీ కోచింగ్ సెంటర్లలో చదివే విద్యార్థులు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని.. వాటిని ఆపాలని ప్రయత్నం. వీటితో పాటు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోకుండా భవనాల వెలుపలా, బాల్కనీల్లో సూసైడ్ ప్రూఫ్ వలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 150 కిలోల బరువు మోయగలవు. ఎవరైనా విద్యార్థులు భవనంపై నుంచి దూకినా గాయాలు కావు. పరిష్కారం ఇదేనా.. అన్న చర్చ పక్కన పెడితే.. విద్యావ్యవస్థ సిగ్గు పడాల్సిన సందర్భం ఇది. చదువు ఏమి ఇస్తది.. జ్ఞానం ఇస్తది.. బతుకుకు భరోసా ఇస్తది. చావు నిస్తదా.. చదువు ఎంత గొప్పదయితే అంత చావునిస్తదా. చదువు ఎందుకంత గొప్పదయ్యింది. మంచి జ్ఞానాన్ని, జీవితంపై భరోసాను కాదు మంచి జీతాన్ని ఇస్తదని, మంచి ప్యాకేజీలను ఇస్తదని ఆశ.. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి. పదిహేను లక్షలమందితో పోటీపడి 12 వేల మంది గెలుచుకునే క్రీడ. ఇందులో బలయ్యేది.. ఎక్కువగా తక్కువ స్థోమత ఉన్న కుటుంబంలోంచి వచ్చిన పిల్లలేనట. ఉన్న ఎకరమో, అరెకరమో అమ్మి, లేదా ఆర్థిక స్థోమత లేక అప్పోసప్పో చేసి తల్లిదండ్రులు పిల్లల బాగుకోసం చదువులకు పంపితే..అది ఇంకా పిల్లలపై ఒత్తిడి పెంచుతోంది. అసలే తీవ్రమైన పోటీ.. ఎడ తెరిపిలేకుండా శిక్షణ, ఆ చదువులు అబ్బుతాయా లేదా అన్న విచక్షణ లేకుండా.. మంచి ప్యాకేజీలో స్థిరపడాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష,, వెరసి చదువులు స్ప్రింగ్ ఫ్యాన్లు, సూసైడ్ ప్రూఫ్ నెట్ దాకా వచ్చాయి. .... ఇంతా కష్టపడి చదివిన ఐఐటీ డిగ్రీలు అవి నేర్పిన వృత్తిలోనే స్థిర పడుతున్నారా... ఏది దొరికితే ఆ ఉద్యోగం చేస్తున్నారు.. మనం పైన సరదాగా చెప్పుకున్న మెకానికల్, ప్యాకేజీ చదువులయిపోయాయి. మనసుకు పట్టినా పట్టకపోయినా.. మెకానికల్గా చదువుకుని బయటపడ్డవాళ్లు బతికిపోతున్నారు.. లేని వాళ్లు చితికి పోతున్నారు. చదవేస్తే... తెల్లారితే చాలు.. ఎక్కడో ఓ చోట.. ఎవరో ఓ విద్యార్థి ఆత్మహత్య వార్త వింటున్నాం. చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో పాస్ కాకపోతే ఎలాగనే ఆవేదన.. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు పరువుపోతుందనే ఆందోళన.. విద్యా సంస్థల్లో అధ్యాపకులు, సిబ్బంది వేధింపులు.. ఇలాంటివన్నీ కలసి విద్యార్థుల ఆత్మ‘హత్య’లకు కారణమవుతున్నాయి. కుటుంబ, వ్యక్తిగత కారణాలూ వీటికి తోడవుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ సమస్య మరింతగా పెరుగుతూ వస్తోంది. జూనియర్ కాలేజీల నుంచి మొదలుకుని మెడికల్ కాలేజీలు, ప్రఖ్యాత ఐఐటీల వరకు అన్నిచోట్లా విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయి. దేశంలో 2017– 2021 మధ్య ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. అదే ఒక్క విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటే 32 శాతం పెరిగాయి. 2017లో 9,905 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. 2021లో ఈ సంఖ్య 13 వేలకుపైనే. దేశంలో సగటున రోజుకు 35 మంది.. అంటే ప్రతి రెండు గంటల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులోనూ పురుష విద్యార్థుల బలవన్మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020లో విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒక్కసారిగా 21శాతం పెరుగుదల నమోదైనట్టు గుర్తించారు. దేశంలోనే టాప్ విద్యాసంస్థలు అయిన ఐఐటీలు, ఐఐఎంలు, నిట్లు, సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. 2018 నుంచి 2023 ఏప్రిల్ మధ్య వీటిలో 103 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే.. ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూ వస్తున్నాయి. వయసుపరంగా చూస్తే.. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వారి ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ ఏజ్వారు 2017 కల్లా 45,217 మంది బలవన్మరణానికి పాల్పడగా.. 2021 నాటికి ఈ సంఖ్య 56,543కు చేరుకుంది. అయితే విద్యార్థులు స్కూల్ చదువు పూర్తిచేసి కాలేజీల్లో చేరినప్పుడు.. ఒక్కసారిగా మారిపోతున్న విద్యా వాతావరణం, కాలేజీ చదువుకు అయ్యే ఖర్చు, విద్యార్థుల సామాజిక–సాంస్కృతిక–ఆర్థిక స్థాయిల్లో భేదాలతో ఒత్తిడి వంటివి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి వారి కుటుంబాల్లో సమస్యలకు కారణమై.. ‘కుటుంబ సమస్యల’తో బలవన్మరణాలు జరుగుతున్నాయని అంటున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన ‘భారత్లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యల నివేదిక (ఏడీఎస్ఐ)’లోని అధికారిక లెక్కలే ఇవి. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు మరెన్నో. సరికొత్త చలపతి, రచయిత -
ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి..
మహబూబ్నగర్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని విఠలాపురంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఊస్సేన్సాబ్, ఖాజాబీకి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె షెహనాబీ (19) హైదరాబాద్లో డిగ్రీ రెండో సంవత్సరం చదివేది. ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామానికి చెందిన ఖాజా సమీప బంధువు కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లికి యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాలకు అటు నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తండ్రి ఊస్సేన్సాబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వివరించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ విఫలమైందని.. యువకుడు తీవ్ర నిర్ణయం!
మెదక్: ప్రేమ విఫలమై ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన అల్లాదుర్గం వడ్డేర కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డేర రాజు(22), పాపన్నపేటకు చెందిన యువతి ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల సంగారెడ్డిలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఎందుకో రాజుతో ప్రేమ వద్దనుకుని ఆమె వెళ్లిపోయింది. ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురై అతడు ఆదివారం రాత్రి అల్లాదుర్గంలో ఉన్న ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. -
ఉద్యోగం వస్తదో.. రాదోనని.. నానమ్మతో బాధపడి.. చివరికి ఇలా..
సంగారెడ్డి: ఉద్యోగం రాదేమోనన్న బెంగతో యువకుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని చిలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన తీపిరిశెట్టి వినయ్(20) తండ్రి శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లాడు. తల్లి మానసిక స్థితి సరిగా లేక అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది. వినయ్ నానమ్మతో కలిసి చిలాపూర్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. గత ప్రయత్నంలో ఉద్యోగానికి సెలక్ట్ కాకపోవడంతో కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి ఈసారి కూడా ఉద్యోగం వస్తదో రాదోనని నానమ్మ కనుకమ్మతో చెప్పి బాధపడ్డాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గమనించిన బంధువులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వినయ్ మృతి చెందాడు. మృతుని తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడం, తండ్రి శ్రీనివాస్ దుబాయ్లో ఉండటంతో బాబాయి రవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య తెలిపారు. -
చదువు ఇష్టంలేక.. విద్యార్థిని తీవ్ర నిర్ణయం..
మంచిర్యాల: చదువుకోవడం ఇష్టంలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నెల్కివెంకటాపూర్కు చెందిన బూసారపు శ్రీనివాస్ కుమార్తె శ్రావ్య (17) లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆమెకు చదువుపట్ల శ్రద్ధ లేకపోవడంతో కొద్దిరోజులుగా కళాశాలకు సరిగా వెళ్లడంలేదు. తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపించినా మళ్లీ మూడురోజులుగా ఇంటివద్దే ఉంటోంది. తండ్రి శ్రీనివాస్ మందలించడంతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లి దండ్రులు ముందుగా లక్సెట్టిపేటకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ హెల్త్ అప్డేట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. మాదాపూర్లో శేజల్ నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పేస్ ఆసుపత్రిలో శేజల్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆమెకు ఎమర్జెన్సీ బ్లాక్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శేజల్ ఆయుర్వేదిక్కు సంబంధించిన నిద్రమాత్రలు వేసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆమెకు మద్దతుగా పలువురు నేతలు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. సూసైడ్ లెటర్ స్వాధీనం శేజల్ బ్యాగ్లో నిద్రమాత్రలు, సూసైడ్ లెటర్ను గుర్తించారు. ఇందులో బాధితురాలు పలు విషయాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన శేజల్.. తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ లెటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఎమ్మెల్యేపై న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శేజల్ను పెద్దమ్మ టెంపుల్ దగ్గర వదిలి వెళ్లగా.. టెంపుల్ నుంచి కనిపించకుండా పోయారు. ఆ తరువాత మాదాపూర్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజు క్రితం కూడా శేజల్ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: హైదరాబాద్లో మరో భారీ ఐటీ కుంభకోణం -
అవసరమైతే ఆత్మాహుతి దాడులకూ ప్లాన్!..
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల హైదరాబాద్–భోపాల్లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడానికి ఈ మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని, వీటికి విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నాయని ప్రాథమిక ఆధారాలు లభించాయి. మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్ సహా ముగ్గురి నుంచి రికవరీ చేసిన ఫోన్లను ఏటీఎస్ అధికారులు విశ్లేషించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధం కావాలంటూ ఓ వ్యక్తి నుంచి వీరికి ఆదేశాలు అందినట్టు గుర్తించారు. ఫోన్ల నుంచి ఆడియోలు రికవరీ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన 16 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు సమాచార మారి్పడికి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారని.. ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేయడం వల్ల కీలకమైన సమాచారమేదీ లభించలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా 50 ఆడియో ఫైళ్లను రికవరీ చేసినట్టు సమాచారం. ఈ ఆడియోల్లో ప్రసంగించిన వ్యక్తి.. ఒకేసారి అనేక మందిని చంపడం (మాస్ కిల్లింగ్), సాబోటేజ్ (విధ్వంసాలు సృష్టించడం), ఎంపిక చేసుకున్న వ్యక్తులను హతమార్చడం (టార్గెట్ కిల్లింగ్)తోపాటు ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తేల్చారు. ఈ ఆడియోలతోపాటు వీరికి అందిన ఆదేశాలు, సూచనల సందేశాలూ రికవరీ అయ్యాయి. ఇక ఈ ఫోన్లకు పాకిస్తాన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, కాంటాక్ట్స్ లిస్టులోనూ ఆ దేశ నంబర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఫోన్ నంబర్లు ఎవరివి, ఆడియోల్లోని వ్యక్తి ఎవరు అనేది గుర్తించేందుకు కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కొన్ని ఆడియోల్లో కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన ఆడియోల్లో లండన్లోని గ్లాస్గో విమానాశ్రయంపై 2007లో మానవ బాంబు దాడికి ప్రయత్నించిన బెంగళూరు వాసి, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇతను హిజ్బ్ ఉత్ తెహరీర్ (హెచ్యూటీ) సంస్థ తరఫునే మానవబాంబుగా మారాడు. హైదరాబాద్–¿ోపాల్ మాడ్యూల్ ఉగ్రవాదులూ తొలినాళ్లలో ఇదే ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేశారు. ఈ క్రమంలో ఫోన్లలోని ఆడియోలు హెచ్యూటీ హ్యాండ్లర్విగా భావిస్తున్నారు. ఇక ఏటీఎస్ విచారిస్తున్న 16 మంది పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరో ఐదు రోజులు కస్టడీ కోరాలని ఏటీఎస్ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురు హైదరాబాద్ వాసులను సాక్షులుగా చేరుస్తున్నారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 17 రైళ్లు రద్దు -
తెగించేసిన పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘోర అకృత్యానికి సిద్ధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధంలో పలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఓ పక్క ఆయుధాల కొరత, మరో వైపు నైపుణ్యవంతులైన బలగాల కొరతతో పోరాడలేక తీవ్రంగా సతమతమవుతోంది. దీంతో ఉక్రెయిన్పై గెలుపు కోసం సాముహిక ఆత్మాహుతి దాడులకు రష్యా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా పుతిన్ దీన్ని అదేశించే అవకాశం ఉందని కూడా నివేదిక వెల్లడించింది. ఈ ఉత్తర్వు రాబోయే మూడు నెలల్లోనే అమలయ్యే అవకాశం లేకపోలేదని నివేదిక స్పష్టం చేసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదంటున్నారు. అవి.. రష్యా చర్యల కారణంగా పొరుగున ఉన్న దేశాలు దాడికి దిగే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల ఆయుధాల సాయంతో యుద్ధంలో పురోగతి సాధించడం. పుతిన్ యుద్ధంపై విశ్వాసం కోల్పోయి.. మిలటరీ స్దబత ఏర్పడి రష్యా యుద్ధం వీగిపోవచ్చు అని చెబుతున్నారు. అదీగాక ఈ యుద్ధం ప్రారంభమైన ఒక ఏడాది తరువాత నుంచి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను, యుద్ధ విమానాలను కోల్పోయి పలు నష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటి వరకు రష్యా దళాలు సంయుక్త దాడిని సమర్థవంతంగా సమన్వయం చేయలేకపోయాయి. గత కొన్ని వారాలుగా ప్రభావంతంగా రష్యన్లు సాముహిక దాడి కొన సాగించలేకపోయారు. పైగా భారీ ఫిరంగి దళాలకు తగిన శిక్షణ లేకపోవండంతో వారికి మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సాముహిక ఆత్మాహుతి పదాతి దళ వ్యూహం. ఇది నిస్సందేహంగా వాయు రక్షణ క్షిపణుల కంటే ప్రాణాంతంకం. (చదవండి: మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..) -
మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వల్లే ప్రీతి ప్రాణాలు తీసుకోవలనుకున్నట్టు పాల్పడినట్లు తెలుస్తోంది. తనను వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అఘాయిత్యాల గురించి ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. గత కాలంగా సైఫ్ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రీతి తన తండ్రికి చెప్పింది. తండ్రి స్వయంగా ఆర్ ఎస్సై కావడంతో పోలీస్ భద్రతా లభిస్తుందని విద్యార్థిని ఎదురుచూసింది. అయితే తన తండ్రి ఏసీపీ బోనాల కిషన్కు ఫోన్ చేసి వివరాలు చెప్పినా స్పందించలేదు. మరోసారి ఏసీపీకి మెసేజ్ చేసినా అటునుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఈ విషయాన్ని కూతురికి చెప్పాడు. దీంతో పోలీసుల సహకారం కూడా రాకపోవడం, ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు హోంమంత్రి మహమూద్ అలీ అండదండలు ఉన్నాయని కొంతకాలంగా సైఫ్ వేధిస్తున్నట్లు ప్రీతి తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సైఫ్ వేధింపుల గురించి తన తండ్రికి ప్రీతి పెట్టిన మెసేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని బులెటెన్లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. -
పాఠశాలలో భారీ పేలుడు.. 16 మంది మృతి
కాబుల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గానిస్థాన్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు పెరిగిపోయాయి. తాజాగా అయ్బక్ నగరంలోని ఓ మదర్సాలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. దేశ రాజధాని కాబుల్కు 200 కిలోమీటర్ల దూరంలోని అయ్బక్ నగరంలో పేలుడు జరిగినట్లు తెలిపారు డాక్టర్. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మృతుల్లో మొత్తం చిన్నారులు, సామాన్య ప్రజలే.’ అని ఏఎఫ్పీ న్యూస్తో వెల్లడించారు. మరోవైపు.. పేలుడు జరిగినట్లు అధికారులు ధ్రువీకరించినప్పటికీ మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని..
శ్రీనివాసపురం: ఆడపిల్లయినా, మగపిల్లాడైనా ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అన్నారు. అధిక సంతానం వల్ల దేశానికే కాదు కుటుంబ పోషణకూ భారమే. ఇది గుర్తెరగకుండా పట్టుదలకు పోతే విషాదమే. వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాలోని శెట్టిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. శెట్టిహళ్లి గ్రామానికి చెందిన లోకేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గరు ఆడపిల్లలు జన్మించారు. మగబిడ్డ పుట్టలేదని లోకేష్ స్నేహితులతో చెప్పుకుని బాధపడేవాడు. శిరీష గర్భం దాల్చి ఈ నెల 4వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో లోకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇంట్లో నుంచి తల్లి, తమ్మున్ని మరో ఇంటికి పంపించి ఒక్కడే పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం విషయం తెలిసి లోకేష్ తల్లిదండ్రులు, భార్య తీవ్రంగా విలపించారు. పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. (చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా) -
'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అభం శుభం తెలియని విద్యార్థులు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ద్రువీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్లో ప్రకటించింది. కాగా కాబుల్ ఆత్మాహుతి ఘటనపై అఫ్గనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, రహమత్ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు. ఇక కాబుల్లోని ఆసుపత్రిలోని ఐసియు వెలుపల తన సోదరి స్కూల్ బ్యాగ్తో బాధతో కూర్చున్న టీనేజర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''ది మోస్ట్ హార్ట్బ్రేకింగ్ ఫోటో'' అంటూ కామెంట్ చేశారు. Kabul Suicide Attack: కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc — Rashid Khan (@rashidkhan_19) September 30, 2022 💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv — Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022 -
చైర్మన్ తిట్టాడని ఇన్చార్జి సీఈఓ ఆత్మహత్యాయత్నం
శాయంపేట: పీఏసీఎస్ చైర్మన్ కులంపేరుతో దూషించాడన్న మనస్తాపంతో ఓ ఇన్చార్జి సీఈఓ.. సహకార సంఘం కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓగా నాగెల్లి లింగమూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. సొసైటీ మహాసభ కోసం శుక్రవారం పాలకవర్గ సమావేశం ఏర్పాటుచేసి అక్టోబర్ 10న నిర్వహించడానికి తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని జిల్లా సహకార అధికారి (డీసీఓ) కార్యాలయంలో అందజేయడానికి లింగమూర్తి శనివారం బస్సులో హనుమకొండకు వెళ్తుండగా మధ్యలో చైర్మన్ కుసుమ శరత్ బస్సు ఆపి లింగమూర్తిని కిందకు దించాడు. తర్వాత ‘మినిట్స్ బుక్ ఎక్కడ ఉంది? తీర్మానం కాపీ నాకు చూపించకుండా డీసీఓ కార్యాలయంలో ఎలా ఇస్తావు?’అని ప్రశ్నించాడు. అనంతరం శాయంపేట కార్యాలయానికి వెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయాన్ని సీఈఓ, డైరెక్టర్లకు తెలియజేయడంతో వారు కార్యాలయానికి చేరుకున్నారు. తాను ఏ తప్పూ చేయకపోయినా గతంలో కూడా చైర్మన్ దుర్భాషలాడాడని అంటూ లింగమూర్తి.. పురుగు మందు తాగబోయారు. అక్కడే ఉన్న అతని కుమారుడు ప్రశాంత్, డైరెక్టర్లు అడ్డుకుని నచ్చజెప్పారు. అనంతరం లింగమూర్తి డైరెక్టర్లతోకలసి చైర్మన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: దీక్ష వేదికపైనే బ్లేడ్తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం -
బ్లేడ్తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
నెక్కొండ: రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలేదని ఓ వీఆర్ఏ మనస్తాపానికి గురై గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గుండ్రపల్లి వీఆర్ఏ మహ్మద్ ఖాసీం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా 69 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఖాసీం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం నెక్కొండలో జరిగిన నిరాహార దీక్షలో పాల్గొన్న ఖాసీం బ్లేడ్తో గొంతు కోసుకున్నారు. దీంతో తోటి వీఆర్ఏలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సీ మాఫర్హీన్ ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇదీ చదవండి: అన్ని అనుకూలతలు ఉన్నా వెనుకబడే దుస్థితి ఎందుకు?: సీఎం కేసీఆర్ -
కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 100 మంది విద్యార్థులు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు. వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఇటీవలే భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు మరో ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. అఫ్గానిస్తాన్ల ోతాలిబన్లు అధికారంలోకి వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. ఆ తర్వాత నుంచి వరుసుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగానే ఉగ్రసంస్థలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Each number on those chairs represented one human being. Each number, and their families, had dreams to come here and take the university preparation entrance examination. Those dreams are dashed with fatal consequences for them, the families, communities , and the country. pic.twitter.com/CnphF6tgd9 — BILAL SARWARY (@bsarwary) September 30, 2022 చదవండి: టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క -
పాఠశాలలో కాల్పులు.. విద్యార్థులు సహా 15 మంది మృతి
మాస్కో: రష్యాలోని ఓ పాఠశాలలో పూర్వ విద్యార్థి సోమవారం దారుణానికి పాల్పడ్డాడు. రెండు పిస్టళ్లతో విచక్షణారహితంగా కాల్పులకు దిగి 11 మంది చిన్నారులు సహా 15 మందిని పొట్టన పెట్టుకున్నాడు. తర్వాత కాల్చుకుని చనిపోయాడు. ఈ కాల్పుల్లో మరో 22 మంది చిన్నారులు గాయపడ్డారు. ఉదుముర్షియా రీజియన్లోని ఉరాల్ పర్వతాల పశ్చిమాన ఉన్న ఇజెవిస్క్ సిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ‘‘హంతకుని పేరు ఆర్టెమ్ కజన్స్తేవ్ (34). స్వస్తిక్, నాజీ గుర్తులున్న నల్లు టీ షర్ట్ వేసుకున్నాడు. అతని నేర చరిత్ర ఇంకా తెలియదు. ఎందుకు కాల్పులు జరిపాడు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఉదుముర్షియా గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ చెప్పారు. ఈ స్కూళ్లో ఒకటి నుంచి 11వ తరగతి వరకు విద్య బోధిస్తారు. అర్టెమ్ గతంలో ఇక్కడి మానసిక చికిత్సాలయంలో పేరు రిజిస్టర్ చేసుకున్నాడని నిఘా దర్యాప్తులో తేలింది. కాల్పుల ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇదీ చదవండి: హిజాబ్ నిరసనల్లో సోదరుడు మృతి.. అంత్యక్రియల్లో ఏడుస్తూ జుట్టుకత్తిరించుకున్న యువతి.. -
కారు బాంబు పేలి.. ఏడుగురి దుర్మరణం
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోయారు. చిన్నారులు సహా 41 మంది గాయపడ్డారు. మసీదుకు సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన కారు బాంబు పేలిందని తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తర్వాత కాల్పులు వినిపించాయన్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ అఫ్గాన్లో తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
భారత్లోని కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి ప్లాన్!
మాస్కో: భారత్లో దాడులు చేపట్టేందుకు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక ఉగ్రవాదిని రష్యా బలగాలు పట్టుకున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడే ఉద్దేశంతో భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టును పట్టుకున్నట్లు ప్రకటించింది రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). భారత ప్రభుత్వంలోని కీలక నేతపై దాడి చేసేందుకు ఉగ్రవాది పతకం రచించినట్లు పేర్కొంది. ‘ రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టును రష్యన్ ఫెడరేషన్కు చెందిన ఎఫ్ఎస్బీ గుర్తించి అదుపులోకి తీసుకుంది. సెంట్రల్ ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఆ ఉగ్రవాది భారత్లోని ప్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసే ప్రణాళికతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.’ అని పేర్కొన్నారు రష్యా అధికారులు. ఇస్లామిక్ స్టేట్ ఆమిర్కు విధేయతతో ఉంటానని ఆ ఉగ్రవాది ప్రమాణం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాతే హైప్రొఫైల్ ఉగ్రదాడికి పాల్పడేందుకు భారత్ వెళ్లేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు చేపట్టినట్లు తెలిసిందన్నారు. సూసైడ్ బాంబర్ను ఐఎస్ఐఎస్ టర్కీలో తమ సంస్థలో చేర్చుకున్నట్లు పేర్కొంది ఎఫ్ఎస్బీ. ఇదీ చదవండి: అరెస్టు చేసే క్రమంలో నిందితుడి పై దాడి: వీడియో వైరల్ -
జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన
వాషింగ్టన్: అల్ఖైదా చీఫ్ అల్ జవహరీ హత్య తర్వాత అమెరికన్లపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అల్ఖైదా అనుబంధ ఉగ్రసంస్థలు, సానుభూతిపరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని చెప్పింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమెరికన్లు, మున్ముందు విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉగ్రసంస్థలు వివిధ దేశాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని విదేశాంగ శాఖ చెప్పింది. ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్లు, బాంబుపేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని అమెరికన్లంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అల్ జవహరీని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చింది. కాబూల్ ఓ ఇంట్లో తలదాచుకున్న అతడిపై డ్రోన్లతో క్షిపణి దాడులు చేసి అంతం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. జవహరీ మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ దాడిని తాలిబన్లు ఖండించారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని, 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందాలను విస్మరించిందని ఆరోపించారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు.. అల్కాయిదా స్ట్రాంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఉదంతపు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం దేశాల జాబితాలోకి తాజాగా ఉగ్ర సంస్థ ఆల్కాయిదా కూడా చేరింది. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని.. అందుకు దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడనున్నట్లు ఆల్కాయిదా హెచ్చరికలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ల్లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘ మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది. మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ కూడా ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ నూపుర్ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్లో ఒక ప్రకటన విడుదల చేసింది. చదవండి: పరువు హత్య: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. పోలంలో.. -
'డబ్బే ముఖ్యమని హింసించారు.. నన్ను అర్థం చేసుకోలేదు'
సాక్షి, చిత్తూరు: తల్లిదండ్రుల డబ్బు ఆశకు తరుణ్ కుమార్ అనే యువకుడు బలయ్యాడు. ఈ ఘటన పుంగనూరులో చోటుచేసుకుంది. బీటెక్ చదివిన తరుణ్కు కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే కొద్ది రోజులకే ఆ వివాహ నిశ్చయం రద్దయింది. ఈ క్రమంలోనే తల్లి దండ్రులు డబ్బే ముఖ్యమంటూ హింసించారని వాట్సప్ స్టేటస్ పెట్టి తరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది నుంచి ఇంట్లో రకరకాలుగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు కావాలనే పెళ్లి రద్దు చేసి ఇబ్బంది పెట్టారని వాట్సప్ స్టేటస్లో తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి) -
పరిక్షల్లో ఫెయిల్.. ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఎఎంసీ)కి చెందిన 19 ఏళ్ల వైద్య విద్యార్థి గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీలోని ఉమెన్స్ హాస్టల్లో యువతి తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దివ్య యాదవ్గా గుర్తించారు. డిసెంబర్ 29 సాయంత్రం విడుదలైన మెడికల్ విద్య పరీక్ష ఫలితాల్లో రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్తో ఉన్నట్లు దివ్య రూమ్మేట్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం 64వ నంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె గదిలో మొబైల్ ఫోన్, సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె తండ్రికి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: (అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి) -
ప్రేమించిపెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకున్న యువకుని సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. తన తల్లిదండ్రులు వద్దని హెచ్చరించడంతో మనోవేదనకు గురై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుణిగల్ పట్టణంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కుణిగల్ తాలూకాలోని బొమ్మడిగెరెవాసి బీఎం హనుమంత (21) ఏడాది నుంచి మరో కులానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఇద్దరూ గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసి హనుమంత తల్లిదండ్రులు ఆ పెళ్లిని మరిచిపోవాలని మందలించారు. తల్లిదండ్రులను ఎదిరించలేక, ప్రేయసిని వదులుకోలేక జీవితంపై విరక్తి చెందాడు. ఈ నెల 17న కుణిగల్లోని జీకే బీఎంఎస్ కాలేజీ మైదానంలో డీజిల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. చుట్టు పక్కలున్నవారు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తరువాత బెంగళూరు విక్టోరియా ఆస్పత్రకి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భోజనం చేయడానికి బైక్పై వెళ్తుండగా కంటైనర్..) -
చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి.. మేనత్త కుమారుడితో వివాహం చేస్తే..
కర్నూలు: స్థానిక బాపూజీ నగర్లో నివాసముంటున్న గోపీకృష్ణ భార్య భారతి(28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు పట్టణానికి చెందిన భారతి చిన్నప్పుడే తల్లిదండ్రులు వెంగయ్య, రజితమ్మ మృతిచెందడంతో సోదరి సుశీల వద్ద పెరిగింది. 2013 నవంబర్లో మేనత్త కుమారుడు కర్నూలుకు చెందిన గోపీకృష్ణకు ఇచ్చి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. గోపీకృష్ణ గాంధీనగర్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా, భారతి సి.బెళగల్ మండలం ఇనగండ్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీ టీచర్గా విధులు నిర్వహిస్తోంది. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని) వివాహమై ఎనిమిదేళ్లైనా సంతానం కలగకపోవడంతో భర్త తరచూ గొడవ పడి శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం సోదరికి చెప్పుకుని విలపించింది. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. గమనించిన భర్త ఇతరుల సాయంతో కిందికి దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త వేధింపుల కారణంగానే భారతి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ పట్టణ సీఐ కళావెంకటరమణ తెలిపారు. చదవండి: (Hyderabad: మసాజ్ సెంటర్ పేరుతో చీకటి బాగోతాలు) -
‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా'
సాక్షి, పుట్టపర్తి అర్బన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పుట్టపర్తి మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు కనుముక్కల ఆదాం (49) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పుట్టపర్తికి చెందిన కనుముక్కల ఆదాం.. టైలరింగ్తో పాటు ఓ చిన్న గదిలో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య మహబూబ్బీ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రితమే కుమార్తెకు వివాహం చేశారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబం.. కరోనా లాక్డౌన్ సమయంలో వ్యాపారం బోసిపోయి కుదేలైంది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. బుధవారం తెల్లవారుజామున వాకింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆదాం.. తర్వాత ద్విచక్ర వాహనంలో పుట్టపర్తి మండలం ప్రశాంతి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ ఎదుట ద్విచక్ర వాహనాన్ని నిలిపి కొత్త చెరువు వైపుగా పట్టాలపై నడుచుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సుమారు ఓ కిలోమీటరు వెళ్లిన తర్వాత సెల్ఫీ వీడియో ముగించి ఎదురుగా వస్తున్న గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై హిందూపురం రైల్వే ఎస్ఐ బాలాజీ నాయక్ కేసు నమోదు చేశారు. సల్మా.. నన్ను క్షమించు! ఆత్మహత్యకు ముందు తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఆదాం సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘సల్మా! (కుమార్తె) నన్ను క్షమించు. మీకు ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా చావు తర్వాత కుటుంబసభ్యులను, మిత్రులను ఎవరినీ పోలీసులు ఇబ్బందులు పెట్టొద్దు. నా చావుకు పూర్తి బాధ్యత నాదే. అందరికీ సలాం!’ అంటూ సందేశమిచ్చారు. అనంతరం ఈ వీడియోను పుట్టపర్తిలోని వాల్మీకి గ్రూపులోకి షేర్ చేశారు. పార్టీలోకి చేరగానే సముచిత స్థానం.. టీడీపీలో క్రియాశీలక నేతగా ఉన్న ఆదాం.. ఆ పార్టీలో ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆ సమయంలో ఆయనను అన్ని విధాలుగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ప్రోత్సహిస్తూ వచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆదాంకు కో–ఆప్షన్ సభ్యుడిగా సముచిత స్థానం దక్కేలా చేశారు. ఆదాం మృతి చెందిన విషయం తెలుసుకోగానే ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకులు కొండారెడ్డి, లోచర్ల విజయభాస్కరరెడ్డి, నెడ్క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, మండల కన్వీనర్ గంగాద్రి, వైస్ చైర్మన్ తిప్పన్న, కౌన్సిలర్లు చెరువు భాస్కరరెడ్డి, సూర్యగౌడ్, మాజీ కౌన్సిలర్లు నారాయణరెడ్డి, నాగిరెడ్డి, రంగారెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఆదాం కుటుంబసభ్యులను పరామర్శించారు. -
అమెరికా సాయం అక్కర్లేదు!
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో పెట్రేగుతున్న ఐసిస్ సహా ఇతర ఉగ్ర గ్రూపుల అణచివేతకు అమెరికా సాయం కోరేదిలేదని తాలిబన్లు శనివారం స్పష్టం చేశారు. ఆగస్టులో అమెరికా అఫ్గాన్ నుంచి వైదొలిగిన అనంతరం తొలిసారి తాలిబన్లతో యూఎస్ శని, ఆదివారాల్లో దోహాలో చర్చలు జరపనుంది. ఈ సమయంలో తాలిబన్లు కీలక అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అఫ్గాన్లో తిష్టవేసుకున్న ఉగ్రతండాలను కట్టడి చేయడం, ఆదేశంలో ఉండిపోయిన విదేశీయులను వారివారి దేశాలకు పంపడంపై చర్చలు ఉంటాయని ఇరువర్గాలు తెలిపాయి. వీటిలో విదేశీయుల తరలింపుపై తాలిబన్లు సానుకూలంగా ఉన్నారు. కానీ ఐసిస్ కట్టడికి అమెరికా సాయం కోరమని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు. తాజాగా అఫ్గాన్ మసీదులో ఐసిస్ జరిపిన ఆత్మాహుతిదాడిలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే! అయితే వీరిని తాము స్వతంత్య్రంగా ఎదుర్కోగలమని సుహైల్ చెప్పారు. యూఎస్ సేనలు అమెరికాలో ఉన్నప్పడు కూడా అఫ్గాన్ షియా మైనారీ్టలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు జరిపింది. తాలిబన్లు, అమెరికన్లకు ఐసిస్ వల్ల ప్రమాదం ఉన్నందున కలసికట్టుగా దీనిపై పోరాటం చేస్తారని విశ్లేషకులు భావించారు. గుర్తింపు కోసం కాదు తాలిబన్లతో జరిపే చర్చలు, వారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందస్తు సన్నాహాలు కాదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈచర్చలకు ముందు పాక్ మిలటరీ అధికారులతో అమెరికా డిప్యుటీ స్టేట్ సెక్రటరీ వెండీ షెర్మన్ ఇస్లామాబాద్లో సమావేశమయ్యారు. ఇందులో కూడా అఫ్గాన్ పరిణామాలనే చర్చించినట్లు తెలిసింది. అఫ్గాన్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలని, అమెరికాలో నిలిపివేసిన అఫ్గాన్ నిధులను విడుదల చేయాలని పాక్ యూఎస్ను అరి్ధంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తాలిబన్లు తమ ప్రభుత్వంలో మరిన్ని వర్గాలకు చోటివ్వాలని, మానవహక్కులు, మైనార్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పాక్ కోరింది. దేశంలో తమకు రక్షణ కరువైందని అఫ్గాన్ షియా పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి అఫ్గాన్కు... తాలిబన్ల దాడికి వెరిచి భారత్కు పారిపోయివచి్చన అఫ్గాన్ పౌరుల్లో వందమందికి పైగా స్వదేశానికి పయనమయ్యారని అఫ్గాన్ ఎంబసీ వర్గాలు తెలిపాయి. కాబూల్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది అఫ్గాన్లు విదేశాలకు పారిపోయారు. ఇలా ఇండియా వచి్చనవారిలో పలువురు ప్రస్తుతం అఫ్గాన్ వెళ్లేందుకు ఇండియా నుంచి టెహ్రాన్ చేరుకున్నారని అధికారులు చెప్పారు. త్వరలో మరింతమంది అఫ్గాన్లు స్వదేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్గాన్ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది. -
దాడులతో దద్దరిల్లిన కాబూల్
కాబూల్, వాషింగ్టన్: కాబూల్లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలు ఆదివారం వేర్వేరు దాడులతో దద్దరిల్లాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో 24–36 గంటల మధ్య దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. విమానాశ్రయానికి సమీపంలోని ఖజే భాగ్రా ప్రాంతంలో ఒక నివాస ప్రాంతంపై ఐసిస్–కెకి చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు జరిపిన రాకెట్ దాడిలో ఒక చిన్నారి సహా ఆరుగురు మరణించినట్టుగా అఫ్గానిస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించి బయటకి వచ్చిన వీడియోలో నివాస ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్న దృశ్యాలే కనిపించాయి. విమానాశ్రయానికి ఒక కిలోమీటర్ దూరం వరకు ఈ పొగలు వ్యాపించాయి. ఇప్పటివరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అమెరికా మిలటరీ మరో డ్రోన్ దాడి అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్–కె ఉగ్రవాదులు తలపెట్టిన ఆత్మాహుతి దాడిని అమెరికా భగ్నం చేసింది. విమానాశ్రయం వైపు ఆత్మాహుతి బాంబర్లతో దూసుకొస్తున్న ఒక వాహనంపై అమెరికా డ్రోన్తో దాడి జరిపింది. ఆ వాహనంపై అమెరికాయే దాడి చేసిందని ఆ దేశ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి బిల్ అర్బన్ ధ్రువీకరించారు. ముప్పు తప్పించామని ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని తమకు సమాచారం ఉందని, ఆత్మ రక్షణ కోసమే తాము ఈ దాడి చేశామని వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించామన్న నమ్మకం తమకు ఉందన్నారు. తరలింపు ప్రక్రియ పూర్తయ్యేలోగా ఎదురయ్యే ప్రమాదాలపై జాగ్రత్తగా ఉంటామని బిల్ చెప్పారు. అయితే ఈ దాడిలో సాధారణ పౌరులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న విషయాలపై ఇంకా సమాచారం లేదు. అంతకు ముందు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కూడా ఆత్మాహుతి బాంబర్ ప్రయాణిస్తున్న వాహనంపై అమెరికా దాడి చేసిందని చెప్పారు. కాబూల్ విమానాశ్రయంపై జంట పేలుళ్లు జరిపి 13 మంది అమెరికా సైనికులు సహా దాదాపుగా 180 మంది ప్రాణాలను తీసిన ఐసిస్–కె ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేసిన అధ్యక్షుడు బైడెన్ ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు. శనివారం నాన్గర్హర్ ప్రావిన్స్లో డ్రోన్ దాడి చేసి విమానాశ్రయం పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్ని మట్టుబెట్టారు. ఇప్పుడు జరిపిన రెండో దాడిలో ఎంతమంది హతమయ్యారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రిటన్ బలగాల తరలింపు పూర్తి అఫ్గానిస్తాన్లో అయిదేళ్లుగా ఉన్న బ్రిటన్ బలగాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. కాబూల్ నుంచి 2 వేల మందిని తీసుకొని ఏ400ఎం విమానం శనివారమే బ్రిటన్కు బయల్దేరి వెళ్లింది. దీంతో బ్రిటన్ తరలింపు ప్రక్రియ పూర్తయినట్టుగా బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. తాలిబన్ల నుంచే బ్రిటన్ బలగాలకు ముప్పు పొంచి ఉండడంతో ఆగమేఘాల మీద తరలింపు ప్రక్రియ పూర్తి చేశామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. తుది దశలో అమెరికా బలగాల తరలింపు అమెరికా బలగాల ఉపసంహరణ తుది దశకు చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గడువులోగా ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో తాలిబన్లు కాబూల్ విమానాశ్రయం చుట్టూ మోహరించారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోగానే విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. -
Kabul Airport Attack: వెంటాడి వేటాడి మట్టుపెడతాం: బైడెన్
Kabul Airport Blast: కాబూల్ ఎయిర్పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అఫ్గనిస్తాన్లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 60 మంది చనిపోగా(70 నుంచి 90 మధ్య అంచనా).. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే’’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు(ఆగస్టు 31) తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటను కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు(ది ఇస్లామిక్ ఎమిరేట్స్).. పౌరులను లక్క్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం పహారా కాస్తున్న ప్రాంతంలోనే దాడి జరిగిందంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. చదవండి: కాబూల్ విమానాశ్రయం: మారణహోమం ఇలా.. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్ హమీద్ కర్జాయ్ ఎయిర్పోర్ట్ అబ్బే గేట్ వద్ద ఓ బాంబు పేలుడు, బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరగడం విశేషం. అమెరికన్లను లక్క్ష్యంగా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె)ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సూసైడ్ బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. క్లిక్ చేయండి: టార్గెట్లో ఉన్నారు.. జాగ్రత్త: బైడెన్ President Joe Biden pauses as he listens to a question as he speaks about the attack at Kabul airport that killed at least 12 U.S. service members pic.twitter.com/iKDAdcXwQy — Evan Vucci (@evanvucci) August 26, 2021 చిన్నపిల్లలు, అఫ్గన్ పౌరులు, తాలిబన్ గార్డులు ఘటనల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్ సైనికులు చనిపోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించిన బైడెన్.. తరలింపు ప్రక్రియ కొనసాగునుందని ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పైగా అఫ్గన్లను(వాళ్లలో ఐదువేల మంది అమెరికన్లు), మరో వెయ్యి మందిని తరలిస్తే ఆపరేషన్ పూర్తైనట్లేనని అమెరికా రక్షణ దళ జనరల్ మెక్కెంజీ ప్రకటించారు. -
కాబుల్ ఎయిర్ పోర్టులో బాంబుల మోత