
ధ్వంసమైన కారు
రక్తసిక్తమైన పాక్ సార్వత్రిక ఎన్నికలు.. పోలీసుల వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు
బలొచిస్తాన్ : పాకిస్తాన్లో 11వ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బలొచిస్తాన్, క్వెట్టాలో ఉగ్రవాదులు బుధవారం ఉదయం ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఆస్ట్రన్ బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు కొనసాగించారు. అక్కడికి చేరుకున్న భద్రతాబలగాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నాయి.
ఇక ఈ ఉదయం 8 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కేవలం 24 గంటల సమయంలోనే రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. దాదాపు పదికోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.