balochistan
-
నెత్తురోడుతున్న బలూచిస్తాన్
ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఉక్కుపాదంతో అణచాలని చూస్తే... దాని అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అక్కడి వనరులను పీల్చిపిప్పి చేస్తే... ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడతాయి. విభజనానంతరం పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు అందులో విలీనం కాకుండా తాము స్వతంత్రంగా ఉంటామని కరాత్ సంస్థానం ప్రకటించినప్పుడు నూతన పాలకులు ససేమిరా అంగీకరించలేదు. అక్కడి వనరులపై కన్నేసిన పాలకులు ఆ సంస్థానాన్ని నమ్మించి, స్నేహ ఒడంబడిక కుదుర్చుకుని చివరకు దాన్ని బుట్టదాఖలా చేశారు. ఈ ద్రోహం వెనక పాక్ జాతిపిత మహమ్మదాలీ జిన్నాతోసహా పలువురున్నారు. దాని పర్యవసానాలు ఈ ఏడున్నర దశాబ్దాలుగా ఆ దేశం అనుభవిస్తూనే ఉంది. క్వెట్టానుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసి వందలమందిని అపహ రించుకు పోవటం, కొందరిని హతమార్చటం ఆ వరసలో మరో చర్య. బుధవారం భద్రతా దళాలను రంగంలోకి దింపి దాదాపు 200 మంది ప్రయాణికులను విడిపించినట్టు చెబుతున్నారు.ఇందుకు ప్రతిగా 50 మంది బందీలను మిలిటెంట్లు హతమార్చగా, ఆ తర్వాత మిలిటెంట్లందరినీ పాక్ సైన్యం మట్టుబెట్టిందంటున్నారు. ఇలా నిత్యం నెత్తురోడుతున్న బలూచిస్తాన్ భౌగోళికంగా పాకిస్తాన్లోనే ఉన్నా, అక్కడివారు తమను తాము పాకిస్తానీలుగా పరిగణించుకోరు. ఒకనాడు సాధారణ సమస్యల కోసం ఉద్యమించినవారు ఇప్పుడు స్వాతంత్య్రాన్ని కోరుకునేదాకా వచ్చారు. పాక్ పాలకుల నిర్వాకమే ఇందుకు కారణం.బలూచిస్తాన్ సాధారణ ప్రాంతం కాదు. ఇక్కడి భూమిలో బంగారం, వజ్రాలు, వెండి, రాగి వనరులు నిక్షిప్తమైవున్నాయి. దేశ వర్తక, వాణిజ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకుపోగల డీప్ సీ పోర్టు ఉన్న గ్వాదర్ కూడా ఇక్కడిదే. 2002లో ఈ ఓడరేవు తొలి దశలో కొంత భాగాన్ని పూర్తిచేసి ఆదరాబాదరాగా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పనులు పడకేశాయి. దీన్ని నిర్మిస్తున్న చైనా... స్థానికులకు నామమాత్రం అవకాశాలిచ్చింది. ఇది బలూచి వాసుల అసంతృప్తిని మరిన్ని రెట్లు పెంచింది. భౌగోళికంగా వైశాల్యంలో ఫ్రాన్స్ను పోలివుండే ఈ ప్రాంత జనాభా కేవలం 90 లక్షలు. ఇంత తక్కువ జనాభాతో, అపరిమితమైన వనరులతో ఉండే ఈ బలూచిస్తాన్ గత 77 ఏళ్లలో వాస్తవానికి అద్భుతమైన ప్రగతి సాధించివుండాలి. కానీ విషాదమేమంటే ఇక్కడున్న 70 శాతం మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుంటారు. వారికి ఉపాధి అవకాశాలుండవు. వేరేచోటకు వెళ్లి స్థిరపడేంత చదువుసంధ్యలుండవు. సైనిక దళాల్లో సైతం బలూచిస్తాన్ వాసులకు మొండిచేయి చూపారు. వారిపై పాక్ సైన్యాధికారుల్లో వున్న అపనమ్మకమూ, భయాందోళనలే అందుకు కారణం. తెలివైన పాలకులైతే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తినిచ్చి, దాని అభివృద్ధికి బాటలు పరిచే వారు. కానీ పాకిస్తాన్ పాలకులు అణచివేతే పరిష్కారం అనుకున్నారు. సైనిక పదఘట్టనలతో అది పాదాక్రాంతం అవుతుందనుకున్నారు. బలూచిస్తాన్లో తరచు మిలిటెంట్ దాడులకు పాల్పడే బీఎల్ఏ 2000 సంవత్సరంలో ఏర్పడినా అంతకు చాలాముందునుంచే ఉద్యమకారులను అపహరించి మాయం చేయటం, బూటకపు ఎన్ కౌంటర్లలో వారిని హతమార్చటం పాక్ సైన్యం ఒక పద్ధతిగా కొనసాగించింది. 2011 నుంచి లెక్కేసినా దాదాపు 10,000 మంది అదృశ్యమయ్యారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటున్నది. బీఎల్ఏ సైతం అదే మార్గం ఎంచుకుంది. మొదట్లో చెదురు మదురు ఘటనలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవలి కాలంలో భారీ దాడులకు పాల్పడుతోంది. బీఎల్ఏ కారణంగా చైనా–పాకిస్తాన్ కారిడార్ (సీపీఈసీ) అటకెక్కేలావుంది. చైనా ఖండాంతర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)లో సీపీఈసీ కీలకమైనది. కారిడార్లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులనూ, ఇతర మౌలిక సదుపాయాలనూ బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయటం ఇందుకే. 6,500 కోట్ల డాలర్ల విలువైన సీపీఈసీలో ఇంధనం, రవాణా, పారిశ్రా మిక కారిడార్లూ, గ్వాదర్ పోర్టు వగైరాలున్నాయి. స్థానికులకు అవకాశాలీయకుండా ఇంత పెద్ద నిర్మాణాన్ని తలకెత్తుకుంటే అసంతృప్తి రాజుకుంటుందన్న ఇంగితజ్ఞానం పాలకులకు కొరవడింది. బలూచిస్తాన్ వాసుల డిమాండ్లు ధర్మమైనవి. కానీ అందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచు కోవటంవల్ల న్యాయమైన సమస్య మరుగున పడుతుంది. బలూచిస్తాన్లో జాతి, మత, తెగ, రాజకీయ విశ్వాసాలతో నిమిత్తం లేకుండా మానవ హక్కుల కోసం పోరాడే బలూచ్ యక్జహితీ కమిటీ (బీవైసీ) 2019 నుంచీ పనిచేస్తోంది. ఆ సంస్థ నాయకురాలు డాక్టర్ మెహ్రాంగ్ బలూచ్కు అన్ని వర్గాల నుంచీ అపారమైన ఆదరణ వుంది. పాక్ సైన్యం ఆగడాల కారణంగా తండ్రి అదృశ్యం కావటం, చాన్నాళ్ల తర్వాత ఛిద్రమైన ఆయన మృతదేహం లభ్యం కావటం ఆమె పట్టుదలను మరింత పెంచాయి. నిరుడు ఆగస్టులో డాక్టర్ మెహ్రాంగ్ గ్వాదర్లో తలపెట్టిన ర్యాలీయే దీనికి రుజువు. సైన్యం ఎన్ని అడ్డంకులు కల్పించినా అది విజయవంతమైంది. శాంతియుతంగా జరిగిన ఆ ర్యాలీలో పాల్గొన్నారన్న కక్షతో డజన్లకొద్దీమందిని అరెస్టు చేస్తే దానికి నిరసనగా 12 రోజుల పాటు ధర్నా సాగించి వారిని విడిపించుకున్న చరిత్ర బీవైసీది. అణచివేత ధిక్కారానికి దారి తీస్తుంది. దాన్ని ఉపేక్షిస్తే తిరుగుబాటుకు బాటలు పరుస్తుంది. ప్రజల మౌలిక ఆకాంక్షలను బేఖాతరు చేస్తే ఎంత శక్తిమంతమైన రాజ్యానికైనా భంగపాటు తప్పదు. బలూచిస్తాన్ ప్రజలు దాన్నే చాటుతున్నారు. -
పాక్ లో ట్రైన్ ను హైజాక్ చేసిన బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు
-
పాక్ రైలు హైజాక్.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్ ఎక్స్ప్రెస్(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. అయితే రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు.. కౌంటర్ ఆపరేషన్లో మిలిటెంట్లను మట్టు పెట్టాయి. తాజా సమాచారం ప్రకారం.. సైన్యం జరిపిన కాల్పుల్లో 16 మంది రెబల్స్ మరణించారు. ప్రయాణికుల్లో 104 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులతో పాక్ సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.🚨 TRAIN HIJACK IN PAKISTAN.Jaffar Express from Quetta to Peshawar HIJACKED after IED blast by Baloch rebels pic.twitter.com/d9HWcmP2PO— akhilesh kumar (@akumar92) March 12, 2025ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.బలూచిస్తాన్తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.#TrainHijack Jaffer Express hijack in Pakistan 🇵🇰 The Train 🚂 was on its way from Quetta to Peshawar when it was attached by the Beloch rebels about 150 passengers & 6 military 🎖️ personnel were made hostages #TrainHijack #TRAIN #Balochistan #PakistanTrainHijack #TrainHijack pic.twitter.com/h4rbGREMQT— X highlight*️⃣ (@Abu_officl) March 12, 2025గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటే లక్ష్యంపాకిస్థాన్లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్ నేషనల్ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్తోపాటు అమెరికా, బ్రిటన్ బీఎల్ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఇలా జరిగింది..దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది. -
పాక్లో ట్రైన్ హైజాక్.. బందీలుగా 182 మంది..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ట్రైన్ హైజాక్ కలకలం రేపుతోంది. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 182 మంది ప్రయాణికుల్ని బంధించారు. అదే సమయంలో 20 మంది పాక్ సైనికుల్నిచంపేశారు. తొలుత ఆరుగుర్ని పొ ట్టనపెట్టుకున్న వేర్పాటు వాదులు.. ఆపై మరో 14 మంది సైనికుల్ని చంపేశారు.పాకిస్థాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి పెషావర్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు తొమ్మిది బోగీలలో 450 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. అనంతరం హైజాక్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ట్రైన్ హైజాక్పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణికుల్ని హైజాక్ చేశాం. వారిలో పాక్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ఏటీఎఫ్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే బందీలందరిని ఉరితీస్తామని హెచ్చరించింది. -
బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ , ఖైబర్ పక్తున్ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్సింధ్, ఆక్రమిత కశ్మీర్ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్ఏ కోరుతున్నది. ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది. 1947 నుంచే వేర్పాటు బీజంనిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తు న్నాయి. బెలూచిస్తాన్లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగు తాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.బుగ్తీని చంపిన తప్పిదంబెలూచిస్తాన్ లిబరేషన్ఆర్మీ మొన్నటి ఆగస్ట్లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్కు గవర్నర్గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం. డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa— Eye On News (@EyeOnNews24) March 9, 2025 -
కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతం
ఇస్లామాబాద్: ఇరాన్లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు.తుర్బాట్లోని స్థానిక మసీదులో ముఫ్తీ మిర్ రాత్రి ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. బైక్పై వచ్చిన ముష్కరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఫ్తీ షా మిర్పై అనేకసార్లు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. శుక్రవారం మరణించినట్లు పేర్కొన్నారు.మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడైన ముఫ్తీ షా మీర్.. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అయ్యేవాడని.. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పాకిస్థాన్లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసే వాడని తెలిపాయి.కుల్భూషణ్ జాదవ్ కేసు.. అసలేం జరిగిందంటే..నావికాదళంలో బాధ్యతలు నిర్వర్తించి.. పదవీ విరమణ చేసిన కుల్భూషణ్ జాదవ్ ఇరాన్లోని చాబహార్ ప్రాంతంలో బిజినెస్ చేసేవారు. 2016లో ఆయన్ను ఇరాన్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బలూచిస్థాన్లోకి ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు చూపారు. 2017 గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష కూడా విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుంచి ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. -
ఇందూరులో హింగుళాదేవి ఆలయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 52 శక్తి స్వరూపాల్లో ఒకటైన హింగుళాదేవి(Hinglaj Mata Mandir) ప్రధాన ఆలయం పాకిస్తాన్లోని బెలూచిస్తాన్(balochistan) ప్రాంతంలో ఉంది. కరాచీకి 90 కిలోమీటర్ల దూరంలో హింగుళ పర్వతంపై హింగోసీ నదీతీరం ఈ శక్తిపీఠానికి మూలస్థానం. హింగుళా మాత అసలు పేరు కోటరి. హింగుళ పర్వతంపై ఉండటంతో హింగుళాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఈ పర్వతంపై గుహలో హింగుళామాత నిత్యం జ్వలిస్తూ దర్శనమిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో హింగుళాదేవి ప్రస్తావన ఉంది. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ శక్తిస్వరూపిణి ఆలయాన్ని నిజామాబాద్ జిల్లా ఇందూరులో 1982లో నిర్మించారు. రెండు నెలల కిందట ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. రంగరి (వస్త్రాలకు రంగులు వేసే) కులానికి చెందిన ‘భావసార్ క్షత్రియ సమాజ్’వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశవిభజన సమయంలో వచ్చిన భవసార్ క్షత్రియ సమాజ్.. దేశవిభజన సమయంలో రంగరి (భవసార్ క్షత్రియ సమాజ్) కులస్తులు బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి రాజస్తాన్కు వలస వచ్చారు. తర్వాత కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వీరు వెయ్యి కుటుంబాలకు పైగా ఉన్నారు. ప్రాచీన చరిత్ర ప్రకారం క్షత్రియులుగా ఉన్న వీరిని అంతమొందించేందుకు పరశురాముడు వెంటాడితే వీరి వంశీయులు దేవీమాత శరణు కోరారు. హింగుళాదేవి వీరిని కాపాడింది. అలాగే వీరికి వ్రస్తాలకు రంగులు అద్దే కళను కటాక్షించింది. అప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తున్నట్లు ఈ సమాజ్ పెద్దలు తెలిపారు. వీరు కొలిచే హింగుళా దేవి ఆలయాలు రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ సమాజ్ వారుండే ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఇందూరులోని హింగుళా మాత ఆలయంలో ప్రతిరోజూ అభిõÙకం నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం భజనలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి యజ్ఞం, సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదానం చేస్తారు. దసరా నవరాత్రులు నిర్వహిస్తారు. ఇందూరులో ఊరపండుగ అయ్యాక వారం రోజుల తర్వాత పసుపు, కుంకుమ, కాగడాలతో పాటలు పాడుతూ గోందాల్ ఉత్సవాలు నిర్వహిస్తారు. -
బొగ్గుగనిలో కాల్పులు..20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి -
పాక్లో బీఎల్ఏ స్వైరవిహారం
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) రెచ్చిపోయింది. ఆది, సోమ వారాల్లో బీఎల్ఏ సాయుధులు పోలీస్ స్టేషన్లు, రైలు మార్గాలు, వాహనాలపై దాడులు జరిపి 50 మందిని చంపేశారు. అనంతరం సైన్యం చేపట్టిన ఏరివేతలో 12 మంది మిలిటెంట్లు హతమయ్యారు. బీఎల్ఏ సభ్యులు ఆదివారం రాత్రి బలోచిస్తాన్లోని ముసాఖెల్ జిల్లాలోని హైవేను దిగ్బంధించారు. అటుగా వచ్చిన బస్సులు, ట్రక్కులను అడ్డగించి, ప్రయాణికులతోపాటు డ్రైవర్లను కిందికి దించివేశారు. ‘గుర్తింపు కార్డులు పరిశీలించాక పంజాబ్, ఖైబర్ పంఖ్తున్వా ప్రావిన్స్లకు చెందిన 23 మందిని తుపాకులతో కాల్చి చంపారు. అనంతరం సమీపంలోని కొండ ప్రాంతంలోకి వారంతా పరారయ్యారు. ఉగ్రవాదులు ప్రయాణికుల వాహనాలతో పాటు బొగ్గుతో వెళ్లే ట్రక్కులను కూడా అడ్డగించి డ్రైవర్లను చంపేశారు. పది ట్రక్కులకు నిప్పుపెట్టారు’అని అధికారులు తెలిపారు. ఇదే ప్రావిన్స్లోని మరికొన్ని చోట్ల ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లు, భద్రతా బలగాల పోస్టులే లక్ష్యంగా దాడులకు దిగారు. ఈ ఘటనల్లో మరో 10 మంది చనిపోయారు. బలోచిస్తాన్లోని ఖలాట్ జిల్లాలో మరో ఘటనలో..ఆరుగురు పోలీసులు సహా మొత్తం 11 మందిని బీఎల్ఏ తీవ్రవాదులు చంపారు. మరో ఘటనలో బొలాన్ జిల్లా డొజాన్ ప్రాంతంలోని పాక్– ఇరాన్లను కలిపే రైల్వే మార్గంపై వంతెనను పేల్చివేసిన ఉగ్రవాదులు, ఆరుగురిని కాల్చి చంపారు. ఈ ఘటనలకు తమదే బాధ్యతంటూ అనంతరం బీఎల్ఏ మీడియాకు పంపిన ఈ మెయిల్లో ప్రకటించుకుంది. పారామిలటరీ బలగాల బేస్పైనా దాడి చేసినట్లు అందులో చెప్పుకుంది. అయితే, ప్రభుత్వం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. సహజవనరులు పుష్కలంగా ఉన్న బలూచిస్తాన్ పాక్లోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. -
Pakistan: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి
పాకిస్తాన్లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్, బాంబ్ స్క్వాడ్ విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.తాజా ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది దుర్మరణం చెందారు.బలూచిస్థాన్ ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు... 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 మంది వరకు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
బలూచిస్తాన్ బొగ్గు గనిలో భారీ పేలుడు.. 12 మంది మృతి!
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ పరిధిలో గల జర్దాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హర్నై జిల్లాలో జరిగింది. గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ విపత్తు సంభవించింది. ఆ సమయంలో 18 మంది మైనర్లు గనిలో చిక్కుకుపోయారు. వెంటనే మైనర్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గనిలో రాత్రిపూట మీథేన్ వాయువు వెలువడింది. ఇదే పేలుడుకు కారణం కావచ్చని బలూచిస్తాన్ చీఫ్ మైన్స్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ తెలిపారు. ప్రభుత్వ గనుల శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయని తెలిపారు. మృతదేహాలను గుర్తించి, ఆసుపత్రికి తరలించామన్నారు. -
పాక్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఆక్రమిత కశ్మీర్తోపాటు బలోచిస్తాన్, ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా, బలోచిస్తాన్, పీవోకేలో అయిదుగురు చొప్పున చనిపోయారు. గ్వాదర్ రేవు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చైనా–పాకిస్తాన్లను కలిపే కారకోరం హైవే మూతబడింది. -
ఆత్మ రక్షణ కోసమే ఆ దాడులు: భారత్ భిన్న స్వరం
ఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులపై భారత్ స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమని చెబుతూనే.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ఆ రెండు దేశాల చర్యలు స్వీయరక్షణలో భాగమై ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఇరాన్, పాక్కు సంబంధించిన అంశం. భారతదేశానికి సంబంధించినంతవరకు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. అయితే.. ఆ రెండు దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు తెలిపారు. ఇరాక్, సిరియా సరిహద్దుల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్.. ఆ మరుసటి రోజే పాక్ భూభాగంపై దాడులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ క్షిపణి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్ను తప్పుబడుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇలా భిన్న స్వరం వినిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జైష్ అల్ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకునే బెలూచిస్థాన్లోని ఆ సంస్థ స్థావరాలపై డ్రోన్స్, మిస్సైల్స్ను ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతోంది. కిందటి నెలలో15వ తేదీన ఇరాన్ సిస్తాన్-బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఓ పోలీస్ స్టేషన్పై జైష్ అల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించారు. ప్రతీకారంగానే ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ‘‘పొరుగు దేశం పాక్ మాకు ఎప్పటికీ మిత్రదేశమే. ఆ దేశ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అలాగని.. మా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోం. కేవలం పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్నే మేం లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం అని ఇరాన్ రక్షణ విభాగం ప్రకటించింది. మరోవైపు పాక్ మాత్రం ఆ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని ప్రకటించి.. ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరాన్ దౌత్యవేత్తను బహిష్కరించిన పాక్.. తెహ్రాన్(ఇరాన్ రాజధాని)లోని తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. -
కెనడా ప్రధాని ద్వంద్వ నీతి.. ఆమె సంగతేంటి?
ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారత్పై నేరారోపణ చేయడనికి కూడా వెనకాడని కెనడా ప్రధాని అనుమానాస్పద రీతిలో మరణించిన న్యాయవాది, బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించింది బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాదికి అండగా? ఈ ఏడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని గురుద్వారా గుమ్మం వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఈ హత్య జరిగిన మూడు నెలల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమ్నెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రకటించి వివాదానికి తెరలేపారు. మొదటిగా కెనడాలోని భారతీయ దౌత్యాధికారిని కూడా విధుల నుంచి తొలగించగా భారత్ కూడా అందుకు దీటుగా స్పందించి భారత్లోని కెనడా దౌత్యాధికారిని తొలగించి ఐదురోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ప్రధానికి లేఖ.. ఒక ఉగ్రవాది హత్య జరిగితే ఇంతగా స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మూడేళ్ళ క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ మరణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది కెనడాలోని బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాది హత్యపై ప్రధాని అత్యుత్సాహంతో చేసిన ఆరోపణలకు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ చేస్తుండడంపైనా కరీమా బలూచ్ మృతిపై కనీసం ఆయన స్పందించకపోవడంపై సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తూ సంఘం ప్రధానికి ఒక లేఖను రాసింది. సమన్యాయం చేయండి.. బలూచ్ మానవహక్కుల సంఘం లేఖలో ఏమని రాసిందంటే.."కెనడాలో బలూచ్ వర్గం చాలా చిన్నది. పైగా పార్లమెంట్ ప్రతినిధుల ఎంపికలో కూడా మేము పెద్దగా ప్రభావం కూడా చూపలేము. బహుశా అందుకే కెనడా ప్రభుత్వం కరీమా విషయంలో ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని రాసింది. ఈ సందర్బంగా కెనడా సమాజంలోని ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడటంలో బలూచ్ వర్గం ఎంతగా సహకరించింది గుర్తుచేశారు. కరీమా కేసులో కూడా కెనడా లిబరల్ ప్రభుత్వం పారదర్శకతతో విచారణ జరిపించాలని కోరారు. రెండేళ్లుగా మా గోడును పట్టించుకోని ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని.. ఇప్పటికైనా బలూచ్ సంక్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కరీమాకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. ఎవరీ కరీమా బలూచ్? కెనడాలో మూడేళ్ళ క్రితం డిసెంబర్, 20న బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత టొరంటోలోని ఒంటారియో సరస్సులో విగతజీవిగా కనిపించింది. ఈమె వృత్తి పరంగా న్యాయవాది కాగా బలూచ్ మానవహక్కుల కోసం బలంగా పోరాడారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆగడాలపై చేసిన పోరాటానికి 2016లో బీబీసీ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె చోటును దక్కించుకున్నారు. Karima Baloch had been exposing the reality of Pak throughout her life and #PakArmy got so scared of her that it murdered her. But it didn’t stop other Baloch from speaking the truth. She continues to inspire all of us. #FreeBalochistan@Hani_Baloch7@yalsarmachar@FawazBaloch7 pic.twitter.com/lSmaI0cIYi — Sohrab Haider (@SohrabHaider7) September 23, 2023 ఇది కూడా చదవండి: భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం' -
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ కాకర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తైంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నేత రజా రియాక్ జరిపిన చర్చలు సఫలం అయ్యారు. ఈ ఇద్దరూ బెలూచిస్తాన్కు చెందిన సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో.. పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 9వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. దీంతో ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ ఎంపికలో ప్రతిపక్ష నేత రజా రియాజ్దే ముఖ్యభూమిక అయ్యింది. ఆపద్ధర్మ ప్రధానిగా చిన్న ప్రావిన్స్కు చెందిన వ్యక్తి ఉండాలనే నిర్ణయంతో కాకర్ పేరును ప్రతిపాదించగా.. అందుకు షెహబాజ్ సైతం అంగీకరించారు. దీంతో ఈ పేరును పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వికి పంపించగా.. ఆయన ఆమోద ముద్ర వేశారు. చిన్న ప్రావిన్స్ అయినా.. బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ గురించి పాక్ ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే.. ఆ ప్రాంతమంతా తిరుగుబాట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది కాబట్టి. కాకర్ తొలినాళ్లలో విదేశాల్లో ఉంటున్న పాక్ ప్రజల సంరక్షణ, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్పై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్కమిటీకి చైర్మన్గా పని చేశారు. ఆ తర్వాత బెలూచిస్తాన్ అధిరాకప్రతినిధిగా పని చేశారు. 2018లో బెలూచిస్తాన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై.. అటుపై బెలూచిస్తాన్ ఆవామీ పార్టీలో చేరారు. ప్రస్తుతం సెనేట్లో పార్లమెంటరీ లీడర్గా ఉన్నారాయన. ఎన్నికలు మరింత ఆలస్యం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు అయిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, జనాభా పెరుగుదల కారణంగా.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాకే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. దీంతో పాకిస్తాన్ ఎన్నికలకు నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Imran Khan: విద్వేష ప్రసంగం కేసు.. తాత్కాలిక ఊరట
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా విద్వేషపూరిత ప్రసంగం కేసులో క్వెట్టా స్థానిక కోర్టు ఒకటి ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. దానిని రెండు వారాల పాటు నిలిపివేయాలంటూ బెలూచిస్తాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. విద్వేషపూరిత ప్రసంగం కేసుకు గానూ సదరు స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో.. క్వెట్టా పోలీసుల బృందం ఒకటి ఖాన్ను అరెస్ట్ చేసేందుకు లాహోర్కు కూడా చేరుకుంది. అయితే ఈలోపే బెలూచిస్తాన్ హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే.. గత ఆదివారం లాహోర్లోని ఆయన నివాసం జమాన్ పార్క్ వద్ద భారీ హైడ్రామా నడిచింది. తోషాఖానా కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో.. పోలీసులు అక్కడి చేరుకున్నారు. అయితే పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలోనే పీటీఐ కార్యకర్తలను, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖాన్.. పాక్ సర్కార్ను, దర్యాప్తు సంస్థలను, పోలీసులను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేసినందుకుగానూ బిజిల్ ఘర్ పోలీస్ స్టేషన్లో ఖాన్పై ఓ కేసు నమోదు అయ్యింది. దీంతో క్వెట్టా స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ వెంటనే ఖాన్ బెలూచిస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ ప్రసంగించిన చోటుకి.. బిజిల్ఘర్ స్టేషన్ పరిధికి సంబంధం లేదంటూ ఖాన్ తరపు న్యాయవాది వాదించగా.. కోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లోకల్ కోర్టు జారీ చేసిన వారెంట్ను రెండు వారాలపాటు సస్పెండ్ చేస్తూ(విచారణ రెండు వారాలు వాయిదా వేసింది).. బెలూచిస్తాన్ ఎస్పీకి, బిజిల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 37 కేసులు నమోదు అయ్యియి. వీటిల్లో నేరుగా ఆయన పేరును నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. -
Sucide Bomb Attack In Pakistan: తొమ్మిది మంది పోలీసులు మృతి
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరగడంతో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్ మోటర్ సైకిల్తో పోలీసు ట్రక్కును బలంగా ఢీ కొట్టినట్టు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఐతే బలూచిస్తాన్ పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందంటూ బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం. (చదవండి: 30 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసు మిస్టరీ..క్లోజ్ చేస్తుండగా ఊహించని ట్విస్ట్!) -
ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదుల దాడిలో పాక్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి చెందారు. ఈ ఘటన బలూచిస్తాన్లో ఖరన్ ప్రాంతంలోని మసీదు వెలుపల చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కొంతమంది దుండగులు మసీదు వెలుపల ఉన్న మహ్మద్ నూర్ మొస్కాంజాయ్పై బహిరంగంగా కాల్పులు జరిపినట్లు ఖరన్ పోలీస్ సూపరింటెండెంట్ హలీమ్ తెలిపారు. తాము హుటాహుటినా మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాంటి ధైర్య సాహసాల గల న్యాయమూర్తి సేవలను మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులతో దేశాన్ని భయపెట్టలేరని, ఇవి పిరికిపందలు చేసే దుశ్చలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్వెట్టా బార్ అసోసీయేషన్(క్యూబీఏ) ప్రెసిడెంట్ అజ్మల్ ఖాన్ కాకర్ కూడా న్యాయమూర్తి మొస్కాంజాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి పాకిస్తానీ పౌరుడు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశంలో అధ్వాన్నంగా ఉన్న భద్రతా పరిస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. అదీగాక గత కొద్ది నెలలుగా పాక్లో ఉగ్ర దాడులు ఎక్కువవుతున్నాయని పాక్ న్యాయశాఖ మంత్రి షాహదత్ హుస్సేన్ అన్నారు. అంతేగాదు ఈ ఏడాదిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే అత్యధికంగా ఉగ్రదాడుల జరిగాయని ఇస్లామాబాద్కి చెందిన థింక్ ట్యాంక్ పేర్కొంది. పైగా ఈ హింసాత్మక దాడులు ఫటా, ఖైబర్ పఖ్తుంఖ్వాలలోనే దాదాపు 106 శాతం పెరిగిందని వెల్లడించింది. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి👇 జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా? -
పాకిస్తాన్లో మహిళా సూసైడ్ బాంబర్.. షాకింగ్ విషయాలు వెల్లడి
పాకిస్థాన్లోని కరాచీ విశ్వవిద్యాలయంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతోపాటు నలుగురు మృత్యువాతపడ్డారు. దీనికి తామే బాధ్యులమని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఓ మహిళా సుసైడ్ బాంబర్ ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది. తాజాగా హ్యుమన్ బాంబర్గా మారిన మహిళ గురించి షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. BREAKING 🇵🇰 Pakistan🇵🇰 : Warning Graphic Content ‼️ ♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university ♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh — Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022 బలూచిస్తాన్లోని నియాజర్ అబాద్కు చెందిన 30ఏళ్ల షరి బలోచ్ ఈ దాడికి పాల్పడింది. ఆమె ఎంఎస్సీ జువాలజీ పూర్తిచేసి.. సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తోంది. ఓ వైద్యుడిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు పేరు మహర్రోష్.. మరొకరికి నాలుగేళ్లు పేరు మీర్ హాసన్. రెండేళ్ల క్రితమే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలోని మజీద్ బ్రిగేడ్కు చెందిన స్పెషల్ సెల్ఫ్ శాక్రిఫైజ్ (ఆత్మ బలిదానం) బృందంలో చేరింది. చదవండి👉 Viral Video: పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. క్షణం ఆలస్యమైనా.. Shari Jan,your selfless act has left me speechless but I am also beaming with pride today. Mahroch and Meer Hassan will grow into very proud humans thinking what a great woman their mother https://t.co/xOmoIiBPEf will continue to remain an important part of our lives. pic.twitter.com/Gdh2vYXw7J — Habitan Bashir Baloch (@HabitanB) April 26, 2022 తొలి మహిళా బాంబర్ అయితే తనకు ఇద్దరు పిల్లలు ఉండడంతో దీని నుంచి తప్పుకోవడానికి అవకాశం కల్పించినా ఆమె ఒప్పుకోలేదు. షరి మిలిటెంట్ గ్రూప్లో తొలి మహిళా బాంబర్. ఆరు నెలల క్రితమే తాను ఆత్మబలిదాన దాడికి కట్టుబడి ఉన్నానని ఆమె ధ్రువీకరించింది. ఆత్మాహుతి దాడికి బాధ్యత ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. #Karachi suicide bomber was highly educated mother of two. M.Phil, MSc wife of a doctor: Shari #Baloch, fighting for liberation of #Balochistan from #Pakistan army atrocities. Part of the #MajeedBrigade of Baloch Liberation Army #BLA. Spl wing created in BLA to target #China Pak pic.twitter.com/nkmM1SzHxg — GAURAV C SAWANT (@gauravcsawant) April 26, 2022 చైనా స్పందన మరోవైపు చైనీయులే లక్ష్యంగా జరిగిన కరాచీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడిని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఘటనపై లోతుగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అదే విధంగా పాకిస్థాన్లో నివసిస్తున్న చైనీయులకు మరింత భద్రతను అందిచాలని కోరింది. ఈ ఘటన వెనక బాధ్యులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ వాఖ హెచ్చరించింది. -
పాక్లో 13 మంది ఉగ్రవాదులు హతం
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి. సైనికులపై కాల్పులు జరిపింది తామేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్గుర్లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్ అభినందించారు. -
మారణహోమం: పాక్లో ప్రతీకార దాడులు
పాకిస్థాన్లో చైనీయులపై ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ తీర నగరం గ్వాడర్లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఘటన సమాచారం అందుకోగానే క్షతగాతత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ది బెలూచిస్థాన్ పోస్ట్ మాత్రం మరోలా కథనం ప్రచురించింది. పేలుడులో తొమ్మిది మంది చైనా ప్రజలు మృత్యువాతపడ్డట్లు కథనం వెలువరించింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్(CPEC) రోడ్డు నిర్మాణ ప్రాంతం వద్ద వెళ్తున్న చైనా సైట్ ఇంజినీర్లపై దాడి జరిగిందని, తొమ్మిది మంది మృతి చెందారని కథనంలో పేర్కొంది. ఈ కథనంపై స్పష్టత రావాల్సి ఉంది. Strongly condemn suicide attack on Chinese nationals Vehicle in #Gwadar. 2 children died who were playing nearby & one Chinese sustained minor injuries. 3 persons injured including driver Police & CTD teams are on the crime scene. Investiga launched. Innocent Children,Afsos — Liaquat Shahwani (@LiaquatShahwani) August 20, 2021 బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో ఖైబర్-ఫంక్తువా ప్రోవిన్స్ వద్ద చైనా వర్కర్లతో వెళ్తున్న ఓ బస్సుపై ఆత్మాహుతి దాడి జరగ్గా.. 9మంది చైనీయులు, మరో నలుగురు పాక్ పౌరులు మృత్యువాత పడ్డారు. అయితే బస్సు గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పాక్ ప్రకటించగా.. చైనా మాత్రం అది ఆత్మాహుతి దాడేనని వాదించింది. ఈ తరుణంలో పాక్ ప్రభుత్వం ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది కూడా. చదవండి: ముగ్గురు పిల్లలు ముద్దు!!-చైనా -
14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50 ఏళ్ల ఎంపీ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్కు చెందిన ఎంపీ 14 ఏళ్ల మైనర్బాలకను పెళ్లి చేసుకున్న ఘటన ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వివరాల ప్రకారం..జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నేత, పాక్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 ఏళ్ల ఎంపీ.. 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006 అక్టోబరు 28వ తేదీన జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది. దీని ప్రకారం మైనర్ బాలికను ఎంపీ వివాహం చేసుకున్నట్లు స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని,తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి వివాహం చేసుకుంటే అది చెల్లదు. అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తారు. చదవండి : (భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే?) (గాఢమైన ముద్దు.. నాలుక కట్, ట్విస్టు ఏంటంటే!) -
పాకిస్తాన్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్
టెహ్రాన్: పాకిస్తాన్ భూభాగంలో మంగళవారం రాత్రి తాము సర్జికైల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జైష్ ఉల్–అదల్ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. వారిని సురక్షితంగా ఇరాన్కు చేర్చామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్ అయిన జైష్ ఉల్–అదల్ 2018 అక్టోబర్ 16న 12 మంది ఐఆర్జీసీ గార్డులను అపహరించింది. పాక్–ఇరాన్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్తో ఇరాన్ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్–అదల్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్లోని బలూచ్ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది. -
చైనా- పాక్ దుందుడుకుతనం.. 30 కి.మీ. మేర గోడ!
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాక్లోని బలూచిస్తాన్ తీరంలో గల గ్వడార్ పోర్టు వద్ద ఇప్పటికే పలు నిర్మాణాలు చేపట్టిన చైనా- పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్) అథారిటీ మరో కీలక నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. గ్వడార్ పట్టణం చుట్టూ కంచెను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సుమారు 10 అడుగుల ఎత్తు, 30 కిలోమీటర్ల పరిధి మేర ఓ గోడను నిర్మించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెలువరించింది. ఈ విషయం గురించి మానవహక్కుల కార్యకర్తలు మాట్లాడుతూ.. రహస్యంగా గోడను నిర్మించడం వంటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా స్థానికులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపిస్తున్నారు. అదే విధంగా పోర్టు సిటీలో పాక్ ఆర్మీ దురాగతాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు బయటపెట్టకుండా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, మీడియాను నిషేధించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా.. గడ్వార్ను పూర్తిస్థాయిలో తమ నిఘా, నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా సుమారు 500 హెచ్డీ కెమెరాలు బిగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులు, సామాజిక కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరి కదలికలను కనిపెడుతూ నిరసన గళాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. (చదవండి: నాలుగు యుద్ధాల్లో మట్టికరిచినా బుద్ధి రాలేదు) కాగా గ్వడార్లో ఇప్పటికే సుమారు 15 వేల మంది (పాకిస్తాన్ 9 వేలు, డ్రాగన్ ఆర్మీ 6 వేలు) సైనికులను అక్కడ మోహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా నిపుణులు మాట్లాడుతూ.. ఆర్థిక కారిడార్ అని పైకి చెబుతున్నా మిలిటరీ బేస్ కోసమే గ్వడార్లో చైనా ఆర్మీ పలు నిర్మాణాలు చేపడుతోందని పేర్కొంటున్నారు. పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లను ప్రయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. బెలూచిస్తాన్ నుంచి బెలూచీలను ఖాళీ చేయించి పంజాబీలు, ఫంక్తూన్లతో తమ ప్రాంతాన్ని నింపేందుకు చేస్తున్న కుట్రలో ఇదొక భాగమని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు బదులుగా.. 2018లో కరాచిలోని చైనీస్ కాన్సులేట్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే. సీపెక్.. భారత్ అభ్యంతరాలను పక్కనపెట్టిన డ్రాగన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనా చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్ నిర్మాణాన్ని తలపెట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది. -
బలూచ్ కార్యకర్త మృతి.. పాక్పై అనుమానం
టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్షేర్ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్ సైన్యం, బలుచిస్తాన్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ ) పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్ నేషనల్ మూవ్మెంట్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్ఓ) మాజీ చైర్పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!) ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీకి రక్షాబంధన్ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. -
పాక్.. విషం చిమ్మడం మానేసి..
న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల గురించి పదే పదే మాట్లాడే పాకిస్తాన్.. ‘ఉగ్రవాదుల స్వర్గధామం’గా ఎందుకు పేరుపొందిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్ హితవు పలికింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే దాయాది దేశం మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను వెళ్లగొట్టేలా అంతర్జాతీయ సమాజం పాక్కు పిలునివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వర్చువల్ ‘కౌంటర్- టెర్రరిజం’ వీక్లో భాగంగా.. ‘‘ప్రపంచానికి శాపంగా పరిణమించిన ఉగ్రవాదం: మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు, పెచ్చు మీరుతున్న తీవ్రవాదం మరియు విద్వేష ప్రసంగాలు, ట్రెండ్స్’’ అనే టాపిక్పై వెబినార్ నిర్వహించింది. ఇందులో భాగంగా భారత ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించిన మహవీర్ సింఘ్వీ భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్కు ఈ మేరకు గట్టి కౌంటర్ ఇచ్చారు.(పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం..) ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం వంటిదని ప్రపంచ దేశాలు అంటున్నాయి. అందుకు తగినట్లుగా వారి భూభాగం నుంచి ఉగ్రవాదుల్ని ఏరివేసేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచాలి. ప్రస్తుతం ప్రపంచమంతా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. దురదృష్టవశాత్తూ పాక్ మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని, టెర్రరిస్టులను పెంచి పోషించే పనిలో ఉంది. ఇందుకు తన సైన్యాన్ని ఉపయోగించుకుంటోంది. ఆర్థికంగా వారికి సహకరిస్తోంది. అంతేగాకుండా భారత్పై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది’’ అని ఆయన మండిపడ్డారు. (పాక్ ఇప్పటికి ఉగ్రవాదులకు స్వర్గధామమే) విషం చిమ్మడం మానేసి.. అదే విధంగా.. భారత్లోని జమ్మూ కశ్మీర్ గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్.. బలూచిస్థాన్, ఖైబర్ ఫంక్తువా సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. వివిధ మతాలు, సంస్కృతులు, ఆచారాలు పాటిస్తున్న మైనార్టీలపై ఎందుకు వివక్ష చూపుతోందని మహవీర్ ధ్వజమెత్తారు. భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. అన్నిమతాల వారికి భారత్లో సముచిత స్థానం లభిస్తుందని.. దేశ రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత పదవుల్లో వారు పనిచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాబట్టి భారత్ వైపు వేళ్లు చూపుతూ... ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విషం చిమ్మడం మానేసి తమ దేశంలో ఏం జరుగుతుందో చూసుకుంటే బాగుంటుందని ఘాటుగా విమర్శించారు. (తీరు మారని పాక్.. అమెరికా ఫైర్!) ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ -
‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’
లండన్: పాకిస్తాన్ ఆర్మీ ‘డెత్స్క్వాడ్’ నుంచి బలూచిస్తాన్ ప్రజలను రక్షించాలని ది బలూచ్ నేషనల్ మూమెంట్(బీఎన్ఎం) అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. పాక్ సైన్యం ఆగడాల నుంచి తమను కాపాడాలని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియర్ సహా భారత్, అమెరికాలకు మొరపెట్టుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని మక్రాన్ ప్రాంతంలో ఇటీవల కొంతమంది దుండగులు మాలిక్ నాజ్ అనే మహిళను కాల్చి చంపారు. అదే విధంగా ఆమె నాలుగేళ్ల కొడుకు బ్రంశ్ను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బలూచిస్తాన్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. డెత్స్క్వాడ్ చీఫ్ సమీర్ సబ్జల్ను వెంటనే అరెస్టు చేయాలంటూ వందలాది మంది పురుషులు, మహిళలు ఒక్కచోట చేరి నినదించారు.(పాక్లో హిందూ యువతులపై అకృత్యాలు) కిడ్నాప్.. లైంగిక దాడి ఈ నేపథ్యంలో బీఎన్ఎం(యూకే) అధ్యక్షుడు హకీం బలూచ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘‘పాకిస్తాన్, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మనస్తత్వం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఓ గాయం చల్లారిన తర్వాత ప్రజలు తమ పనుల్లో పడిన వెంటనే మళ్లీ ఇంకో ఘటనకు పాల్పడతారు. పాక్ డెత్ స్క్వాడ్ ఆగడాలకు అంతులేకుండా పోయింది. బలూచిస్తాన్లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. రెండు వారాల క్రితం అవరన్లో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి అతడిపై దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే తాజా ఘటనలో కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బతికేందుకు ఉద్యమిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు.(పాకిస్తాన్కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్) మీ మద్దతు కావాలి ఇక ఈ పోరాటం ముందుకు సాగాలన్నా.. తమ ఉద్యమం నీరుగారిపోకుండా ఉండాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తమకు అంతర్జాతీయ సమాజం మద్దతు తప్పనిసరి అని హకీం వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచాన్ని.. ముఖ్యంగా ఐరాస, అగ్రరాజ్యం అమెరికా, యూకే, ఈయూ.. వాటితో పాటు పొరుగు దేశాలైన భారత్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల మద్దతు కోరుతున్నాం’’అంటూ పాకిస్తాన్ ఆర్మీ ఆగాడాలు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పాకిస్తాన్కు స్థానిక నాయకులే మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం ఇచ్చే లంచాలకు అలవాటు పడి సొంత ప్రజలకే అన్యాయం చేస్తున్నారంటూ హకీం మండిపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారం ప్రదర్శిస్తూ.. బలూచ్ ప్రజలను అణచివేస్తూ అకృత్యాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కాగా పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఎన్ఎంను స్థాపించి ప్రజా గళాన్ని వినిపించిన గులాం మహ్మద్ బలూచ్ 2009లో దారుణ హత్యకు గురయ్యారు. -
స్వీడన్లో పాక్ జర్నలిస్ట్ మృతి
స్టాక్ హోం: స్వీడన్లో నివసిస్తున్న పాకిస్తాన్కు చెందిన జర్నలిస్ట్ సాజిద్ హుస్సేన్(39) మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మార్చి 2న తప్పిపోయిన సాజిద్ ఏప్రీల్ 23న ఫైరిస్ నదిలో మృతదేహంగా తేలాడని పోలీసు అధికారి జోనాస్ ఎరోనెన్ తెలిపారు. మృతదేహనికి పోస్ట్మార్టం చేయగా సాజిద్ ఏదో నేరం చేసిన నిందితునిగా అనుమానం వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక సాజిద్ మృతి హత్య లేదా ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందన్నారు. (ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి: ట్రంప్) సాజిద్ పాకిస్తాన్లోని బెలుచిస్తాన్ ప్రాంతానికి చెందినవాడు. అతను బెలుచిస్తాన్ టైమ్స్ అనే వెబ్సైట్కి చీఫ్ ఎడిటర్ పని చేసేవారు. పాకిస్తాన్లో చోటు చేసుకొనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నేరాలు, పాక్ ఆర్మీ తిరుగుబాటుపై పలు కథనాలు రాశారు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన సాజిద్ 2012లో స్వీడన్కు వలస వెళ్లారు. 2017లో స్వీడన్లోని ఉప్ప్సలాలో పార్ట్టైమ్ ప్రొఫెసర్గా పనిచేశారు. అతను చివరిసారిగా స్టాక్ హోంలోని ఉప్ప్సలాలో రైలు ఎక్కినట్లు పోలీలు తెలిపారు. -
పాక్ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం వాషింగ్టన్లోని క్యాపిటల్ వన్ ఏరెనాలో ఏర్పాటుచేసిన ప్రవాస పాకిస్థానీల సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో బలూచిస్థాన్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ.. గట్టిగా నినాదాలు చేశారు. బలూచిస్థాన్కు విముక్తి ప్రసాదించాలని, వుయ్ వాంట్ బలూచిస్థాన్ అంటూ ఈ సమావేశంలో ఓ మూలన ఉన్న ముగ్గురు కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారిని అడ్డుకొని దాడి చేసేందుకు అక్కడ ఉన్న కొందరు ప్రయత్నించడంతో సమావేశంలో కొంత రభస చోటుచేసుకుంది. ముత్తహిద కస్మి మూవ్మెంట్ (ఎంక్యూఎం) కార్యకర్తలు, ఇతర మైనారిటీ గ్రూపులు కూడా ఇమ్రాన్ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, పాక్ మీడియా ఈ నిరసన ప్రదర్శనల గురించి కవరేజ్ ఇవ్వకపోవడం గమనార్హం. తన పాలనలో ‘నయా పాకిస్థాన్’ను తీసుకొస్తానంటూ ఇమ్రాన్ చేసిన ప్రసంగానికి పాక్ మీడియా పెద్ద ఎత్తున ప్రచురించింది. -
బాంబు పేలి 16 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా పట్టణంలో బాంబు పేలిన ఘటనలో 16 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కూరగాయల మార్కెట్లో ఘటన జరిగినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బాంబు దాటికి కొన్ని భవనాలు కూలిపోయానని.. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా బెలూచిస్తాన్లోని క్వెట్టాలో నివసించే మైనార్టీ వర్గం హజారా(షియా ముస్లింలు)లే లక్ష్యంగా ముష్కరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పక్కాగా రిక్కీ నిర్వహించి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోట ఐఈడీ పేలేలా ప్రణాళిక రచించారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇంతవరకు ఏ గ్రూప్ కూడా దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇందుకు కారణమైన వారిని గుర్తించి త్వరితగతిన నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
పాక్పై యుద్ధం ప్రకటించండి
వాషింగ్టన్: పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు పాక్ నుంచి బలోచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బలోచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్(బీఎన్సీ) తెలిపింది. ఈ ఘటనకు కారకులైన దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని సూచించింది. భారత్ వెంటనే పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకోవాలని కోరింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్పై వెంటనే యుద్ధాన్ని ప్రకటించాలని బీఎన్సీ అధ్యక్షుడు వహీద్ బలోచ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమాయకులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. భారత్లో బలోచ్ నేత ఖాన్ కలాత్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలనీ, బలోచిస్తాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాక్పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో పోరాడేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి
ఢిల్లీ: బలూచిస్తాన్లోని తుర్బట్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తామే ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనే సంస్థ, బలోచ్ రిపబ్లికన్ గార్డ్ ప్రకటించుకున్నాయి. సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్, పాకిస్తాన్లలో జరిగిన ఈ ఘటనలతో ఉపఖండంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బలూచిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
-
బస్సును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. 26మంది సజీవదహనం
బలూచిస్థాన్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో.. 26మంది సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. లస్బెలా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి పంజ్గుర్ వెళ్తున్న ఓ బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు బస్సు కిటికీల నుంచి దూకేందుకు యత్నించారు. అయితే అప్పటికే రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. దీంతో వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదంలో 26 మంది సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో గుర్తుపట్టని రీతిలో శరీరాలు కాలిపోయాయని తెలిపారు. -
రక్తసిక్తమైన పాక్ సార్వత్రిక ఎన్నికలు
బలొచిస్తాన్ : పాకిస్తాన్లో 11వ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బలొచిస్తాన్, క్వెట్టాలో ఉగ్రవాదులు బుధవారం ఉదయం ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఆస్ట్రన్ బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు కొనసాగించారు. అక్కడికి చేరుకున్న భద్రతాబలగాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నాయి. ఇక ఈ ఉదయం 8 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కేవలం 24 గంటల సమయంలోనే రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. దాదాపు పదికోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చదవండి :ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే పక్కలో తుపాకే! -
బలూచిస్తాన్ నాయకులతో చైనా మంతనాలు
ఇస్లామాబాద్: వాణిజ్యాభివృద్ధి కోసం చైనా.. పాకిస్థాన్లో నిర్మిస్తున్న చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టులకు ఇబ్బందులను నివారించడానికి డ్రాగన్... బలూచిస్థాన్ తిరుగుబాటుదారులతో సయోధ్య కోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పలువురు వేర్పాటువాద నాయకులతో బీజింగ్ నేరుగా చర్చిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం వెల్లడించింది. సీపెక్ కోసం 60 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను పాక్ చేపట్టింది. బలూచిస్థాన్ నాయకులతో సయోధ్య కుదుర్చుకోవడంలో చైనా చాలా వరకు సఫలమైందని పాక్ అధికారి ఒకరు అన్నారు. తిరుగుబాటుదారులు చిన్నాచితకా దాడులు చేస్తున్నా, భారీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. సీపెక్లో భాగంగా చైనాలోని కష్గర్ నుంచి పాక్లోని గ్వాదర్ వరకు చైనా రోడ్డు, రైలు మార్గాలు నిర్మిస్తోంది. గ్వాదర్ బలూచిస్థాన్లోనే ఉంది. -
ఆ దేశం.. ఉగ్రవాదుల కార్ఖానా!
న్యూఢిల్లీ : పాకిస్తాన్.. ఉగ్రవాదుల కార్ఖానా అని ఫ్రీడమ్ ఆఫ్ బలూచిస్తాన్ వైస్ ఛైర్మన్ మామా ఖదీర్ స్పష్టం చేశారు. బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటాన్ని ఉగ్రవాదుల సహకారంతో అణిచేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పాకిస్తాన్లో అడుగడుగునా ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయని ఆయన చెప్పారు. పాక్ ఆక్రమణ నాటినుంచి బలూచ్లో మానవహక్కుల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతోందని అన్నారు. భారత్కు చెందిన కులభూషణ్ జాదవ్ను ఇరాన్నుంచి పాకిస్తాన్ నిఘాసంస్థ ఐఎస్ఐ కిడ్నాప్ చేయించిందని ఖదీర్ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కోసం కోట్లరూపాయలను పాకిస్తాన్ ఖర్చు చేసిందని అన్నారు. హఫీజ్ సయీద్, ముల్లా ఒమర్ వంటి రక్తపిపాసులైన ఉగ్రవాదులను తయారు చేసిందని మండిపడ్డారు. వారే నేడు పాక్లో ఉగ్రవాదులను తయారు చేసే కార్ఖానాలను ఏర్పాటు చేశారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులభూషణ్ జాదవ్ను అడ్డం పెట్టుకుని బలూచ్ విషయంలో భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్తాన్లో 2004 నుంచి 45 వేల మంది ప్రజలు కనిపించకుండా పోయారని.. ఇందుకు ఐఎస్ఐ, ఎంఐ, ఎఫ్సీ కారణమని ఆయన చెప్పారు. స్వతంత్ర పోరాటం ఉధృతం అయ్యే సమయంలో.. ఐఎస్ఐ ఇతర సంస్థలు.. కీలక వ్యక్తులను మాయం చేస్తున్నాయని ఆరోపించారు. -
పాక్కు దిమ్మతిరిగే షాక్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘బలూచిస్థాన్కు విముక్తి కల్పించండి’ అంటూ లండన్ ప్రజారవాణా బస్సులపై భారీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దాదాపు వంద బస్సులపై ఈ భారీ పోస్టర్లు అంటించి వరల్డ్ బలూచ్ ఆర్గనైజేషన్ తన ప్రచారాన్ని ముమ్మరం చేయడం పాకిస్థాన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బలూచ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూబీవో) కార్యకలాపాలను నిషేధించేందుకు పాక్ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా లండన్లోని ప్రజారవాణా బస్సులపై ఈ భారీ పోస్టర్లు దర్శనమివ్వడంతో పాక్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డబ్ల్యూబీవో ఈ ప్రచారాన్ని ఆపే ప్రసక్తి లేదని తెగేసి చెప్తోంది. ’బలూచిస్థాన్లో పాక్ సర్కారు సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనను బహిర్గతం చేసేందుకు, బలూచ్ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటేందుకు లండన్లో మూడో దఫా ప్రచారాన్ని చేపట్టాం. ఇంతకుముందు లండన్లో మేం టాక్సీలపై ప్రకటనలు ఇచ్చాం. అనంతరం రోడ్డుపక్కన ఉండే బిల్బోర్ట్స్పై మా నినాదాన్ని చాటాం. ఇప్పుడు లండన్ బస్సులపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాం’ అని డబ్ల్యూబీవో అధికార ప్రతినిధి భవల్ మెంగల్ తెలిపారు. గతంలో డబ్ల్యూబీవో ఇదేవిధంగా ట్యాక్సీలపై నిర్వహించిన ప్రచారంపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ప్రచారంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి. In the face of Injustice, the truth always prevails The people of Balochistan have endured 70 years of brutal suppression by Pakistan but their resolve remains undeterred. We are proud to announce the launch of the 3rd phase of our awareness campaign in London#FreeBalochistan pic.twitter.com/poHX2XfIbL — WBO (@WorldBalochOrg) November 13, 2017 -
పాక్లో బాంబు దాడి.. ప్రతిపక్ష నేత మృతి
కరాచీ(పాకిస్తాన్): బలూచిస్తాన్లో జరిగిన బాంబు పేలుడులో కీలక ప్రతిపక్షనేతతోపాటు అతని సోదరుడు మృత్యువాతపడ్డారు. అవామీ నేషనల్ పార్టీ(ఏఎన్పీ) నేత అబ్దుల్ రజాక్, అతని సోదరుడు అబ్దుల్ ఖలిక్ శనివారం ఉదయం పిషిన్ పట్టణంలో జరగనున్న పార్టీ ర్యాలీలో పాల్గొనేందుకు తమ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో నసీరాబాద్ జిల్లా ఛత్తర్ ప్రాంతంలోని హర్నాయి షహ్రాగ్ మార్గంలో మందుపాతర పేలి వారి వాహనం తునాతునకలయింది. ఈ ఘటనలో అబ్దుల్ రజాక్, అబ్దుల్ ఖలిక్ అక్కడికక్కడే చనిపోయారు. పార్లమెంట్లో ఏఎన్పీకి 8మంది సభ్యులున్నారు. అయితే, ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. ఇదే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారు. మరో ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై అమర్చిన బాంబు పేలటంతో లాహోర్ వైపు వెళ్తున్న అక్బర్ బుగ్తి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్ బలూచిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం ముస్తాంగ్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ డ్రైవర్ అదుపు కోల్పోయి ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వెంటనే క్వెట్టాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో 14 మంది చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంకా 30 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
పాక్లో సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడి
కరాచీ: పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్సులోని ఫతేపూర్లో పీర్ రఖేల్ షా సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఏఎస్సై, కానిస్టేబుల్ సహా 18 మంది దుర్మరణం చెందగా, 25 మంది గాయపడ్డారు. దర్గా ప్రధాన ప్రవేశద్వారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దర్గాలను పూజించడం ఇస్లామ్కు వ్యతిరేకమంటున్న తాలిబాన్లు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. -
రాకెట్ దాడి నుంచి తప్పించుకున్న మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ఆరోగ్యశాఖ మంత్రిపై రాకెట్ దాడి జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆరోగ్య శాఖమంత్రి రెహ్మత్ సలేహ్ బలోచ్ గురువారం ఉదయం ప్రోమ్ నుంచి పంజ్గుర్ పట్టణానికి తన కాన్వాయ్లో బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరపటంతో పాటు రాకెట్లను ప్రయోగించారు. రాకెట్లు గురితప్పగా మంత్రి వెంట ఉన్న భద్రతాబలగాలు ఎదురు కాల్పులు జరపటంతో దుండగులు పలాయనం చిత్తగించారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులెవరనేదీ తెలియరాలేదు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు చేపట్టాయి. బలూచిస్తాన్కు స్వాతంత్ర్యం కావాలని స్థానికులు కొంతకాలంగా సాయుధ పోరు సాగిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ అల్ఖైదా కూడా బలంగా ఉంది. ఈ రాష్ట్రం అఫ్ఘానిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంది. -
బలూచిస్తాన్లో కూలీలపై కాల్పులు
-
కారు బాంబు పేలి.. 25 మంది మృతి!
ఇస్లామాబాద్(పాకిస్తాన్): పాకిస్తాన్లోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం బలూచిస్థాన్ ప్రావిన్సులో శక్తిమంతమైన బాంబు పేలుడుతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్తుంగ్ పట్టణంలోని మసీదులో జరిగిన ఓ కార్యక్రమానికి సెనేట్ డిప్యూటీ ఛైర్మన్ మౌలానా అబ్దుల్ గఫూర్ హైద్రి హాజరయ్యారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. దీంతో అక్కడికక్కడే 25 మంది చనిపోగా మరో 35 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో హైద్రికి కూడా గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రులందరినీ ముస్తుంగ్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకులెవరనేది తెలియరాలేదు. -
‘ఉరితీస్తే మాత్రం భారత్ ఇలా చేయాలి’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తీరుపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ను పాకిస్థాన్ ఉరితీస్తే మాత్రం ఇండియా బలోచిస్థాన్ను స్వతంత్ర్య దేశంగా తప్పకుండా గుర్తించాల్సిందేనని అన్నారు. సింధ్ ప్రావిన్స్ను పాకిస్థాన్ విడిచి వెళ్లాల్సిందేనని డిమాండ్ చేశారు. గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ భారత్కు చెందిన నేవీ మాజీ అధికారి కులభూషణ్కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మంగళవారం చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి తాజా వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉరిశిక్ష ప్రకటించిన వెంటనే సోమవారం స్పందించిన స్వామి పాకిస్థాన్కు భారత్ గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనని కోరిన విషయం తెలిసిందే. జాదవ్ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ దేశానికి మంచిదికాదని నేరుగా హెచ్చరించాలని కేంద్రాన్ని కోరారు. -
పాక్లో రైలుపై బాంబు దాడి
కరాచి: పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ఫ్రావిన్స్లో శుక్రవారం ఒక రైలుపై జరిపిన బాంబు దాడిలో ఆరుగురు దుర్మరణం చెందగా, 14 మంది గాయాలపాలయ్యారు. రావల్పిండి-క్వెట్టా మధ్య ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్లే పట్టాలపై బాంబులు అమర్చి రిమోట్ కంట్రోల్తో పేల్చారు. ఈ దాడులను బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాజ్ సనావుల్లా జెహ్రీ ఖండించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడులకు పాల్పడినట్లు ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు. -
'పాక్ ఇప్పుడు గజగజా వణికిపోతోంది'
న్యూఢిల్లీ: బెలూచిస్తాన్లో ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి భారత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడినప్పటి నుంచి పాకిస్థాన్ గజగజ వణికిపోతోందని ఐక్యరాజ్య సమితిలో బెలూచిస్తాన్ పౌరుల హక్కుల ప్రతినిధి మెహ్రాన్ మర్రి అన్నారు. ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటి నుంచి భయపడిన పాక్ ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రాంతంలో పలు మిలటరీ ఆపరేషన్లను పెంచిందని చెప్పారు. పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు పాక్ లోని ఓ ప్రావిన్స్ అయిన బెలూచిస్తాన్ లో అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాక్ సైన్యం చేస్తున్న ధురాగతాలను, బెలూచ్ ప్రజలపై ప్రదర్శిస్తున్న అణిచివేత ధోరణిని మోదీ చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. 'భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున, అనంతరం రెండు రోజుల కిందట ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ముందు బెలూచిస్తాన్ పరిస్థితిని లేవనెత్తిని భారత్ కు స్వయంగా నేను.. మా బెలూచ్ ప్రజలం భారత్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. మోదీ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత మాలో కొత్త ఆశలు రేకెత్తాయి' అని ఆయన చెప్పారు. అదే సమయంలో అమెరికాను ఆయన విమర్శించారు. పాకిస్థాన్ చేస్తున్న చర్యలు మొత్తం అమెరికా ముందే తెలుసని, అందుకే ఆ దేశం పట్ల భారత్ లాంటి వైఖరినే కనసాగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయన ఆ దేశం తీరు మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్కు చైనా వార్నింగ్!
బీజింగ్: కల్లోలిత బలూచిస్థాన్లో తలపెట్టిన పాకిస్థాన్-చైనా ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ)ని అడ్డుకునేందుకు భారత్ కుట్రపన్నితే.. అప్పుడు చైనా రంగంలోకి దిగి తీరుతుందని ఆ దేశానికి చెందిన ఓ మేధోసంస్థ హెచ్చరించింది. బలూచిస్థాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ వ్యాఖ్యలు చైనాకు ఆందోళన కలిగిస్తున్నాయని హు షిషెంగ్ అన్నారు. చైనాకు చెందిన సమకాలీన అంతర్జాతీయ వ్యవహారాల కేంద్రం (సీఐసీఐఆర్)లోని దక్షిణ, దక్షిణాసియా, సముద్ర దేశాల అధ్యయన కేంద్రం డైరెక్టర్గా ఉన్న ఆయన ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనాకు చెందిన అత్యంత శక్తిమంతమైన మేధో కేంద్రంగా పేరొందిన సీఐసీఐఆర్లో పరిశోధకుడిగా పనిచేస్తున్న హు షిషెంగ్ మాట్లాడుతూ.. ’ఎర్రకోట నుంచి మాట్లాడిన ప్రధాని మోదీ కశ్మీర్ (పాక్ ఆక్రమిత కశ్మీర్), బలూచిస్థాన్ అంశాలపై ప్రస్తావించడం తాజాగా చైనాను ఆందోళనకు గురిచేస్తున్నది. పాకిస్థాన్ విషయంలో భారత విధానంలో ఇది కీలక మలుపు అయి ఉండొచ్చు. కానీ తొలిసారి ఈ అంశాన్ని భారత్ ప్రస్తావించడం చైనా మేధావుల్లో ఆందోళన కలిగిస్తున్నది’ అని హు తెలిపారు. కల్లోలిత బలూచిస్థాన్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను భారత్ వినియోగించుకుంటే అది సీపీఈసీని నష్టం కలిగించవచ్చునని, అప్పుడు చైనా రంగంలోకి దిగక తప్పదని ఆయన చెప్పారు. చైనాలోని జింగ్జియాంగ్ ప్రావిన్స్ నుంచి బలూచిస్థాన్లోని గ్వాదర్ ఓడరేవుకు అనుసంధానం చేసేందుకు చైనా ప్రతిష్టాత్మకంగా వన్ రోడ్డు వన్ బెల్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 46 బిలియన్ డాలర్ల (రూ. 3 లక్షల కోట్ల) వ్యయంతో ప్రతిపాదించిన సీఈసీకి ఆటంకాలు కలిగితే చైనా చూస్తూ ఊరుకోదని హు వ్యాఖ్యలు చేశారు. -
పాక్, బలూచిస్థాన్ లలో హక్కుల ఉల్లంఘన: అమెరికా
వాష్గింటన్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్థాన్ ప్రావిన్స్ లలో మానవహక్కుల ఉల్లంఘనలపై అమెరికా చాలా ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆదేశ అధికార ప్రతినిధి మార్క్ సీ టోనర్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆర్మీ ఆణచివేతపై వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్రాంతంలో నెలకొన్న అశాంతి పరిస్థితుల గురించి తమ మానవ హక్కుల నివేదికలో సైతం ఈవిషయాన్ని వెల్లడించామని ఆయన తెలిపారు. రాజకీయ పరిష్కారం ద్వారానే పాక్, బలూచిస్థాన్ లో శాంతియుత పరిస్థితులను సాధించగలమని తాము పాకిస్థాన్ కు, ఆదేశంలోని రాజకీయ పార్టీలకు చాలా సార్లు విజ్ఞప్తి చేశామని టోనర్ తెలిపారు. కశ్మీర్ పై అమెరికా విధానం గురించి పాకిస్ధాన్ కు బాగా తెలుసునని ఆయన వెల్లడించారు. -
'ప్రపంచదేశాలు మోదీ వ్యాఖ్యలను అనుసరించాలి'
న్యూఢిల్లీ: బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం మానవహక్కులను కలరాస్తున్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై.. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాయకుడు మజ్దాక్ దిల్షాద్ బలూచ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాలు బలూచిస్తాన్ విషయంలో మోదీ వ్యాఖ్యలను అనుసరించాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే.. కశ్మీర్ అనేది భారత అంతర్భాగానికి సంబంధించిన విషయం అని, బలుచిస్తాన్ వ్యవహారం అలా కాదన్నారు. అది అంతర్జాతీయ వ్యవహారం అని ఆయన తెలిపారు. భౌగోళికంగా, చారిత్రాత్మకంగా కశ్మీర్ అనేది వందల సంవత్సరాలుగా భారత్లో భాగమని అన్నారు. బలుచిస్తాన్ మాత్రం 700 సంవత్సరాలుగా స్వతంత్ర్య రాజ్యంగా ఉందని, దానికి సొంత పార్లమెంట్.. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ ఉన్నాయని దిల్షాద్ బలూచ్ గుర్తుచేశారు. అరబ్ ప్రపంచం, యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా లాంటి బలమైన దేశాలు, కూటములు బలూచిస్తాన్ విషయంలో పాక్పై ఆంక్షలను విధించాలని ఆయన కోరారు. -
మోదీ రెడ్లైన్ దాటారు: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్లో చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతిస్తామన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనలపై పాక్ నాయకత్వం మండిపడుతోంది. తమ దేశానికి సంబంధించిన బలూచిస్తాన్పై మాట్లాడి నరేంద్రమోదీ 'రెడ్లైన్' దాటారని పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం మండిపడ్డారు. బలూచిస్తాన్ గురించి మాట్లాడటం ద్వారా ఐక్యరాజ్యసమితి(యూఎన్) నియమావళిని మోదీ ఉల్లంఘించారన్నారు. ఈ నేపథ్యంలో రానున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తామని జకారియా స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం, మానవహక్కుల సంస్థలు కశ్మీర్ విషయంలో స్పందించి, భారత బలగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సైతం పీఓకే, బలూచ్ ప్రజలకు మద్దతిస్తామని ప్రకటించి పాక్ విషయంలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే. -
నిత్య గాయాల బలూచ్!
పాక్ పాలనలో నలుగుతున్న విలీన ప్రాంతం స్వేచ్ఛ కోసం ఏడు దశాబ్దాలుగా పోరాటం న్యూఢిల్లీ: బలూచిస్తాన్..! భారత్, పాకిస్తాన్ల తాజా మాటల యుద్ధంలో నలుగుతున్న పేరు. కశ్మీర్పై పాక్ దుష్టపన్నాగాలను దునుమాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పంద్రాగస్టు ప్రసంగంలో బలూచ్, పాక్ ఆక్రమిత కశ్మీర్లలో హక్కుల ఉల్లంఘనను ప్రస్తావించడంతో బలూచ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బలూచ్ వివాదం పూర్వాపరాల గురించి.. తెలిసింది తక్కువ.. భారత్కు కశ్మీర్లా బలూచ్ పాక్కు సమస్యాత్మక ప్రాంతం. అయితే ఇది కశ్మీర్లా అంతర్జాతీయ దష్టిని ఆకర్షించలేదు. పాక్ సమయం దొరికినప్పుడల్లా కశ్మీర్లో హక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుండడం తెలిసిందే. చీకటి బిలంగా(బ్లాక్ హోల్), జర్నలిస్టులకు నిషిద్ధ ప్రాంతంగా పేరొందిన బలూచ్లోని ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం సాగిస్తున్న పోరాటం గురించి, వారిపై పాక్ బలగాల, పంజాబీ వర్గీయుల దమనకాండ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. వనరుల నెలవు.. బంగారం, రాగి వంటి ఖనిజాలు, చమురు వనరులకు నెలవైన బలూచ్ వాస్తవానికి భారత ఉపఖండంలో భాగం కానే కాదు. భారత్, పాక్లకంటే అఫ్గానిస్తాన్, ఇరాన్లతోనే ఆ ప్రాంతానికి సారూప్యాలు ఎక్కువ. విస్తీర్ణంలో పాక్లో 40 శాతంగా ఉన్నా ఆ దేశ జనాభాలో 4 శాతమే(1.3 కోట్ల మంది) అక్కడ ఉంది. పాక్లో అతి పెద్ద రాష్ట్రం కూడా బలూచిస్తానే. పాక్ ఆదాయంలో అధిక భాగం అక్కడి వనరుల నుంచే వస్తోంది. పాక్లో విలీనం ఇలా.. 1947లో భారత విభజనతో ఏర్పడిన పాక్.. బలూచ్ను తనలో కలుపుకోవడానికి నానా యత్నాలూ చేసింది. బలూచ్లోని లాస్బెలా, ఖరాన్, మక్రాన్ సంస్థానాలు పాక్లో విలీనం కాగా, కలాత్ మాత్రం విడిగా ఉండిపోయింది. పాక్లో కలవాలని చివరి బలూచ్ స్వతంత్ర పాలకుడైన కలాత్ రాజు మీర్ అహ్మద్ యార్ ఖాన్తో పాక్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా బలవంతంగా ఒప్పందం చేయించుకున్నాడని అంటారు. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు వంటి వాటిపై పాక్కు, బలూచ్కు మధ్య తాత్కాలిక ఒప్పందమొకటి ఆనాడు కుదిరింది. అయితే 1948, మార్చి 26న యార్ ఖాన్ బలూచ్ను పాక్లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు పాక్ సర్కారు ప్రకటించింది. తర్వాత సైనిక ఆపరేషన్తో బలూచ్ను విలీనం చేసుకుంది. అప్పట్నుంచి స్థానికులపై దారుణమైన అణచివేత కొనసాగుతూనే ఉంది. హింస, రక్తపాతం, హక్కుల నిరాకరణ నిత్యకత్యాలైపోయాయి. స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తిన గొంతుకలను బలగాలు నొక్కేస్తున్నాయి. అక్కడి విలువైన ఖనిజ వనరులను పాక్ సంపన్న వర్గాలు, ప్రభుత్వం దోచుకుంటున్నాయి. దీనికి నిరసనగా బలూచీలు 1948 నుంచి ఐదుసార్లు(1948, 1958, 1962–63, 1977–78, 2003) చిన్నపాటి సాయుధ తిరుగుబాట్లు చేశారు. అయితే పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో వాటిని అణచేసింది. గత పదేళ్లలో 2 లక్షల మంది బలూచీలు హత్యకు గురయ్యారని, 25 వేల మంది ఆచూకీ లేకుండా పోయారని బలూచ్ ఉద్యమ నేత నయేలా ఖాద్రీ చెప్పారు. -
'పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయొద్దు'
న్యూఢిల్లీ: బలూచిస్తాన్, గిల్జిత్ అంశాలపై ఒకే విధమైన వైఖరి ప్రకటించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు కోరారు. దేశ ప్రయోజనాలు దెబ్బతినేలా ప్రకటనలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ.. బలూచిస్తాన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ విడుదల చేసిన ప్రకటనపై వెంకయ్య స్పందించారు. అంతర్జాతీయ అంశాలపై దేశం యావత్తు ఒకే గళం వినిపించాల్సిన అవసరముందన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ భిన్నమైన వైఖరి కనబరుస్తోందని ఆయన విమర్శించారు. బలూచిస్తాన్ అంశంపై కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, కపిల్ సిబల్, రణదీప్ సుర్జీవాలా చేసిన ప్రకటనలు పరస్పర విరుద్దంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి అంశాలపై మాట్లాడేటప్పుడు ముందువెనుక ఆలోచించాలని హితవు పలికారు. పొరుగుదేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో మనదేశంలోని అన్ని పార్టీలు ఒకే గొంతు వినిపించాల్సిన అవసరముందన్నారు. ఇండియాలో కశ్మీర్ అంతర్భాగమని పునరుద్ఘాటించారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ కు ప్రధాని మోదీ గట్టి సందేశం పంపారని వెంకయ్య నాయుడు అన్నారు. -
మోదీ సాహసం ఫలిస్తుందా!
(సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం) 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. అదే వయసున్న కశ్మీర్ సమస్యపై ఏ ప్రభుత్వమూ, ఏ ప్రధానీ చేయలేని సాహసోపేత ప్రకటనను నరేంద్ర మోదీ చేశారు. '56 అంగుళాల ఛాతీ' ఉండాలని పదేపదే చెప్పుకొనే మోదీ.. అధికారం చేపట్టిన ఇన్నాళ్లకు ఆ మాటను నిరూపించారు. మొట్టమొదటిసారి వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)కి అవతలి భూభాగం గురించి మాట్లాడారాయన. ఆయన మంత్రివర్గ సభ్యులు పలు సందర్భాల్లో పాకిస్థాన్ దమనకాండను, దుష్టరాజకీయాలను విమర్శించినా, దాయాది పాలకులతో స్నేహాన్ని మాత్రమే ప్రదర్శించిన మోదీ.. తొలిసారి హెచ్చుస్వరం వినిపించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశానిదేనని కుండ బద్దలుకొట్టి చెప్పడం.. అదీ ఒక ప్రధాని స్థాయిలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని చెప్పక తప్పదు. అందుకే.. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్థాన్ లపై ఆయన ప్రకటించిన నూతన(అగ్రెసివ్) విధానాన్ని అన్ని పార్టీలూ సమర్థిస్తున్నట్లు చెప్పలేదు. అలాగని విమర్శలూ చేయకపోవడం గమనార్హం. కశ్మీర్ లో నెలకొన్న క్లిష్టపరిస్థితులను తొలిగించే క్రమంలో ఆయా పార్టీలు మోదీని మౌనంగా సమర్థిస్తున్నట్లు మనం భావించాలి. నిజానికి ఇది అవసరం కూడా. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 60 మంది పౌరులు చనిపోయారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా లోయలోని 10 జిల్లాల్లో 35 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. తాజాగా అల్లర్లు జమ్ముకు కూడా వ్యాపించాయి. బుర్హాన్ స్థానిక (త్రాల్ పట్టణాకి చెందిన) యువకుడే కావచ్చు. కానీ అతని కమాండర్ ఇన్ చీఫ్ సయీద్ సలాహుద్దీన్ ఇప్పుడు పాకిస్థానీ. (గతంలో కశ్మీర్ లో అక్రమంగా ఎమ్మెల్యే అయి, తర్వాత దేశం విడిచి పారిపోయిన సలాహుద్దీన్ పాక్ పావుగా మారాడు.) చాలాకాలం తర్వాత ఓ స్థానికుడైన ఉగ్రవాది హతం కావడంతో అతని బంధువులు కొంత ఆగ్రహానికి గురైనమాట వాస్తవం అయి ఉండొచ్చు. కానీ వారంతా మూకుమ్మడిగా హురియత్ కు మద్దతు పలికినట్లు కానేకాదు. సరిగ్గా ఇదే సమయంలో పాక్ ప్రభుత్వ ప్రేరిత ఉగ్రసంస్థలు కీలకంగా వ్యవహరించాయి. హఫీజ్ కు చెందిన జమాత్ ఉల్ దవా, సలాహుద్దీన్ కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కశ్మీర్ లోయలోకి చొరబడి, భారత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. అలాంటి విదేశీ శక్తులను స్వయంగా కశ్మీరీలే పోలీసులకు పట్టించారు. వేళ్లపై లెక్కించగలిగినవారే తప్ప కశ్మీరీలంతా సొంతగడ్డపై ఉండేందుకే కంకణం కట్టుకున్నారన్న సంగతి చాలాసార్లు నిరూపితమైంది. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలను కూడా సైన్యం అణిచివేతకు వ్యతిరేకంగానే తప్ప.. దేశానికి వ్యతిరేకంగా కాదన్న సంగతి గుర్తించాలి. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ భరోసా కశ్మీరీలను తప్పక ఆకట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన కశ్మీరీలకు.. కంచెకు అవతల (పీఓకేలో) ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసు. పేరుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినప్పటికీ పీఓకే (దీనేనే పాక్ 'ఆజాద్ కశ్మీర్' గా వ్యవహరిస్తుంది)లో పాకిస్థాన్ ప్రభుత్వ ఆగడాలకు అంతే లేదు. అందుకు చిన్న ఉదాహరణ గత నెలలో 'ఆజాద్ జమ్ము కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ' ఫలితాలు. భారత్ కు వ్యతిరేకంగా పీఓకేలో తన పార్టీ బలాన్ని పెంచుకునేందుకు నవాజ్ షరీఫ్.. ఏ దేశాధినేతా చేయ(కూడ)ని నిస్సిగ్గు ప్రకటనలు చేశారు. ఉగ్రవాది బుర్హాన్ వనిని అమరవీరుడంటూ కీర్తించారు. తద్వారా పీఓకేలోని 41 స్థానాలుకుగానూ నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్)కి 32 సీట్లు దక్కించుకుని 'చూశారా.. ?' అన్న వెకిలి సవాల్ విసిరింది. కానీ పీఓకే ప్రజానీకం ఆ ఫలితాలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని షరీఫ్ భారీస్థాయిలో రిగ్గింగ్ కు పాల్పడ్డారని రోడ్లమీదికొచ్చి నిరసనలు తెలిపారు. ఓటర్లు బూత్ కు వెళ్లకుండానే వాళ్ల ఓట్లు పోలయ్యాయక్కడ! పాక్ ప్రభుత్వం ఎప్పటిలాగే, రోజుల వ్యవధిలోనే పీఓకే ఆందోళనకారులన్ని ఉక్కుపాదంతో అణిచేసింది. ఇక బలూచిస్థానీలైతే పాక్ బారినపడి నరకం చూస్తున్నారు. బెలూచిస్థాన్.. నేటి నాజీ క్యాంప్! పాకిస్థాన్ లోని నాలుగు ఫ్రావిన్స్ లలో బెలూచిస్థాన్ ఒకటి. క్వెట్టా ప్రధాన నగరంగా ఉన్న ఈ ప్రాంతం 1947కు ముందు స్వతంత్ర రాజ్యం. ఇండియా నుంచి విడిపోయిన తర్వాత పాక్ సైన్యాలు బెలూచిస్థాన్ ను ఆక్రమించుకున్నాయి (1948 ఏప్రిల్ లో). అయితే పాక్ పాలనలో జీవించబోమంటూ బెలూచిస్థాన్ ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనలకు దిగారు. సైనిక బలంతో పాక్ బలూచ్ ప్రజలను అణగదొక్కింది. అంతటితో ఊరుకోక ఆ ప్రాంతాన్నొక 'నాజీ క్యాంప్' గా మార్చేసింది. ఎవరైనా పాక్ కు వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిని, వారి కుటుంబీకులను గుట్టు చప్పుడు కాకుండా పాక్ సైన్యం అత్యంత దారుణంగా హతమారుస్తోంది. ఈ క్రమంలోనే వందమంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చిచంపింది. ఈ దారుణాలపై బెలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్రంగా ఉన్నాయి. అయితే భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో బెలూచ్ కు ప్రత్యక్ష మద్దతు కరువైంది. కానీ అంతర్జాతీయ వేదికలపై మాత్రం బలూచ్ తన గళం వినిపిస్తూనేఉంది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల వేదికపై బెలూచిస్థాన్ ప్రతినిధి మెహ్రాన్ పలుమార్లు పాక్ అకృత్యాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. మోదీ కోసం ముందే సిద్ధమైన వేదికలు పీఓకే, బలూచిస్థాన్ లపై పాక్ దమనకాండకు వ్యతిరేకంగా దౌత్యపరమైన ఎదురుదాడి చేయాలంటూ మోదీ పిలుపునిచ్చారు. కంచెకి ఇవతలి కశ్మీరీల సమస్యలు పరిష్కరిస్తూనే, అవతలి కశ్మీరీలకూ దన్నుగా నిలుద్దామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక మద్దతును ఆశిస్తున్నానన్నారు. కాగా, బలూచిస్థానీలతోపాటు పీఓకేలో పార్టీలు, ప్రజలు ఇప్పటికే పాక్ పీడ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. నిరంతరాయంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఆ రకంగా మోదీ కోసం ముందే వేదికలు సిద్ధమై ఉన్నాయి. భారత ప్రధాని సాహసోపేత నిర్ణయానికి ఎల్లడలా మద్దతు లభిస్తోంది. అయితే బీజేపీ.. ఈ ఎత్తుగడను కూడా 'హిందూ- ముస్లిం' చట్రంలోకి తేకుండా ఉండగలిగితే మేలు. కానీ అలా జరగకుండా ఉండే అవకాశాలు తక్కువ. శుక్రవారం నాటి భేటీలో.. లోయలో పెల్లెట్ల వినియోగాన్ని నిలిపివేయాలని, ఆర్డ్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్(ఎఎఫ్ఎస్పీఏ)ను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందులో పెల్లెట్ల వినియోగాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ప్రత్యేక అధికారాల రద్దు క్లిష్టమే అయినా కశ్మీరీల మనసులు గెలుచుకునే క్రమంలో సాహసాలు తప్పవు. అన్నింటికన్నా ప్రధానమైన సమస్య! సరే, పాకిస్థాన్ ఆగడాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో మోదీ సఫలమయ్యారనుకుందాం. అప్పుడు పాకిస్థాన్ ను శిక్షించడమనేది అన్నింటికన్నా ప్రధాన సమస్య. పాక్ ను ఎవరు శిక్షించాలి? ఐరాసానా? ప్రపంచ పెద్దన్న అమెరికానా? లేక చైనానా.. ఐరోపానా..? ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు పాకులాడుతున్న నేటి ప్రపంచంలో పాక్ కు వ్యతిరేకంగా భారత్ వినిపించే గళం అరణ్యరోదనగా మిగిలే అవకాశాలే ఎక్కువ. అయితే తాజా దౌత్య ఎత్తుగడవల్ల మనకు ప్రపంచం మద్దతు లభించకపోయినా.. మన కశ్మీరీలు మనవాళ్లవుతారు. అంతకంటే ఏ భారతీయుడికైనా కావాల్సింది ఏముంటుంది? -
'లాడెన్ భుజం మీదుగా మాపై తూటాలు'
జెనీవా: 'ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటూ అమెరికా, ఈయూలు పాకిస్థాన్ కు ఆయుధాలిస్తున్నాయి. వాస్తవం ఏమంటే పాకిస్థానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అల్ కాయిదా లీడర్ బిన్ లాడెన్ ఉదంతంలోనూ ఇది నిజమని తేలింది. ఒకవైపు లాడెన్ ను వేటాడేందుకు అమెరికా పాక్ కు భారీ ఎత్తున ఆయుధాలిచ్చింది. తీరా చూస్తే లాడెన్ పాకిస్థాన్ లోనే ఆశ్రయం పొందడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. లాడెన్ భుజం మీదుగా పాకిస్థాన్ పేల్చిన తుపాకి తూటాలకు బలైంది మా(బెలూచిస్థాన్) ప్రజలే' అంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల వేదికపై ఉద్వేగంగా ప్రసంగించారు బెలూచిస్థాన్ ప్రతినిధి మెహ్రాన్. పాకిస్థాన్కు అణుసామర్థ్యం గల ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని అమ్మాలన్న అమెరికా నిర్ణయాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తోన్న మెహ్రాన్.. శనివారం జనీవాలో జరిగిన ఐక్యర్యాజ్యసమితి మానవహక్కుల కమిషన్ వార్షిక సమావేశంలోనూ తన వాణిని వినిపించారు. అమెరికా, యురోపియన్ యూనియన్లు అందిస్తోన్న ఆయుధాలను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తున్నదని, బెలూచిస్థాన్ ప్రజలను అంతం చేసేందుకు వాటిని వినియోగిస్తున్నదని మెహ్రాన్ ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రపంచదేశాలు పాకిస్థాన్ కు ఆయుధాలివ్వటం మానేయాలని, ఆమేరకు ఐక్యరాజ్యసమితి కృషిచేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. బెలూచిస్థాన్ బాధేంటి? పాకిస్థాన్ లోని నాలుగు ఫ్రావిన్స్ లలో బెలూచిస్థాన్ ఒకటి. క్వెట్టా ప్రధాన నగరంగా ఉన్న ఈ ప్రాంతం 1947కు ముందు స్వతంత్ర్య రాజ్యం. ఇండియా నుంచి విడిపోయిన తర్వాత పాక్ సైన్యాలు బెలూచిస్థాన్ ను ఆక్రమించుకున్నాయి(1948 ఏప్రిల్ లో). పాక్ పాలనలో జీవించబోమంటూ బెలూచిస్థాన్ ప్రజలు అనేక ఆందోళనలు చేశారు. అయితే, ఈ ఆందోళనలను పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచి వేస్తూనే ఉంది. పాక్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే... వారిని, వారి కుటుంబీకులను గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలికుండా పాక్ సైన్యం అత్యంత దారుణంగా హతమారుస్తోంది. ఈ క్రమంలోనే వంద మంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చి చంపింది. ఈ దారుణం వెలుగు చూడటంతో, బెలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్ర రూపం దాల్చాయి. మీ రాక్షస పాలన మాకు వద్దంటూ, బెలూచ్ ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు. బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యాలు సాగిస్తోన్న అకృత్యాలివి(పాత ఫొటోలు) -
నలుగురు పోలీసులను కాల్చి చంపారు
కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాదుల పెట్రేగిపోయారు. నలుగురు పోలీసులను దారుణంగా కాల్చిచంపారు. బాలోచిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాలిబన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బైక్లపై వచ్చి అనూహ్యంగా ఓ పోలీసు మొబైల్ వ్యాన్పై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యత వహిస్తూ తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ మీడియాకు ఈమెయిల్ విడుదల చేసింది. బాలోచిస్తాన్ ప్రావిన్స్లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇదే నెలలో ఇదే చోట ఆత్మాహుతి దాడి జరపగా ముగ్గురు సామాన్యులతోపాటు 12మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు -
పట్టాలు తప్పిన రైలు: 12 మంది దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాద ప్రభావిత బెలూచిస్థాన్ ప్రావిన్స్లో మంగళవారం ఉదయం ఘోర దుర్ఘటన జరిగింది. బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టా నుంచి రావల్పిండికి ప్రాయాణిస్తున్న 'జాఫర్ ఎక్స్ ప్రెస్' అబీగుమ్ ప్రాంతంలో పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు చెల్లాచెదురు కావడంతో 12 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 100 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్లు కూడా చనిపోయారని... సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నాయని పాకిస్థాన్ రైల్వే మంత్రి సయ్యద్ రఫీక్ చెప్పారు. సహాయ బృందాలకు తోడు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపుతున్నట్లు బెలూచిస్థాన్ ప్రావిన్స్ హోం మంత్రి సర్ఫరాజ్ తెలిపారు. కాగా, నవంబర్ 1న ఇదే రైలుపై ఉగ్రవాదులు దాడి జరిపారు. శక్తిమంతమైన బాంబులతో రైలును పేల్చేందుకు ప్రయత్నించారు. నాటి సంఘటనలో నలుగురు చనిపోగా, ఆరుగురికి గాయలయ్యాయి. ఆ తరువాత జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఈ సంఘటన వెనుక కూడా ఉగ్రవాదుల హస్తమేమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
'నువ్వు లాడెన్ మిత్రుడివి'
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్థాన్లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతానికి విముక్తి ప్రసాదించాలని కోరుతూ ఓ నిరసనకారుడు ఆయనను ఘెరావ్ చేశారు. వాషింగ్టన్లో ప్రముఖ మేధోసంస్థ అయిన యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్లో ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన ప్రసంగానికి అడ్డుపడిన నిరసనకారుడు 'బలూచిస్థాన్కు విముక్తినివ్వండి' అంటూ నినాదాలు చేశాడు. 'నువ్వు లాడెన్ స్నేహితుడివి' అంటూ షరీఫ్ను విమర్శించాడు. 'ఫ్రి బలూచిస్థాన్' అంటూ పోస్టర్ ప్రదర్శించాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటనతో కాసేపు తన మౌనంగా ఉండిపోయిన షరీఫ్ ఆ తర్వాత యథాతథంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 65 ఏళ్ల షరీఫ్ పాక్ ప్రధాని రెండోసారి అమెరికా పర్యటనకు వచ్చారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. బలూచిస్థాన్లో వేర్పాటువాదులు గత కొన్నాళ్లుగా పాక్ ఆర్మీతో కొట్లాడుతున్నారు. తాజాగా తలెత్తిన వేర్పాటువాదుల తిరుగుబాటుతో ఈ ప్రాంతం మళ్లీ కల్లోలితంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ సైన్యమే కిడ్నాప్లకు పాల్పడి.. ఆందోళనకారులను హింసించి చంపుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆఫ్ఘాన్ లో 141 మంది తాలిబన్లు హతం
కాబూల్: తాలిబన్ల ఏరివేత చర్యలు అటు పాకిస్థాన్ లోనూ, ఇటు ఆఫ్ఘనిస్థాన్ లోనూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆఫ్ఘానిస్థాన్ లో 141 మంది తాలిబన్ ఉగ్రవాదులను అంతమొందించారు. గత నలభై గంటల నుంచి శనివారం ఉదయం వరకూ కొనసాగించిన ఆపరేషన్ లో భారీ స్థాయిలో తాలిబన్లు మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ సృష్టం చేసింది. కునార్, నాన్ గార్హర్, ఘంజీ, హెల్మాండ్, ఉరుంగజ్, బాల్క్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ లో 141 తాలిబన్లు మృతిచెందినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ లో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. తాలిబన్ల నుంచి భారీ ఆయుధాలతో పాటు, బాంబులతో దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గత రెండు రోజుల నుంచి రోడ్డు ప్రక్కన తాలిబన్లు పాతిపెట్టిన 115 బాంబులతో పాటు మందుపాతరలను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
పాక్ లో మరో ఇద్దరు తాలిబన్ల హతం
ఇస్లామాబాద్: పెషావర్లో ఆర్మీ స్కూల్పై ఉగ్రవాదులు మారణోమం సృష్టించిన నేపథ్యంలో తాలిబాన్లపై పాకిస్థాన్ సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం కరాచీలో ఇద్దరు తాలిబన్ తీవ్రవాదులను పాకిస్థాన్ ఆర్మీ మట్టుబెట్టింది. తమకు మారీపూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడ ఆపరేషన్ చేపట్టినట్లు సీఐడి అధికారి ఒకరు తెలిపారు. గురువారం జరిపిన దాడిలో 50 మంది తాలిబన్ తీవ్రవాదులను హతమార్చగా, శుక్రవారం మరో 12 మందిని అంతమొందించారు. పెషావర్ లో సైనిక స్కూల్పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధాని నవాజ్షరీఫ్ ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. పెషావర్ దాడిలో132 మంది విద్యార్థులు సహా 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
పాక్ లో 12 మంది తాలిబన్లు హతం
కరాచీ: పెషావర్లో ఆర్మీ స్కూల్పై ఉగ్రవాదులు మారణోమం సృష్టించిన నేపథ్యంలో తాలిబాన్లపై పాకిస్థాన్ సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఇద్దరు తాలిబన్ కమాండర్లతో పాటు 12 మంది తీవ్రవాదులను శుక్రవారం పాకిస్థాన్ ఆర్మీ మట్టుబెట్టింది. వీరిలో ఒక విదేశీయుడు ఉన్నాడు. బలూచిస్థాన్ లోని కరాచీ, జియరాత్ జిల్లాల్లో దాడులు జరిపి తాలిబాన్లను హతమార్చింది. ఈ తెల్లవారుజామున కరాచీలోని హక్స్ బై ప్రాంతంలో నలుగురిని, జియరాత్ జిల్లాలో 8 మంది తీవ్రవాదులను పాకిస్థాన్ రేంజర్స్ హతమార్చాయి. ఖైబర్లోని తాలిబన్ స్థావరాలపై గురువారం సైన్యం జరిపిన దాడిలో 50 మందిపైగా తీవ్రవాదులు మృతి చెందారు. -
పాక్లో భూకంపం: 238కి పెరిగిన మృతులు
పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో నిన్న సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 238కి చేరుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. భూకంప తీవ్రతకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయిని, ఆ నేపథ్యంలో సహాయ చర్యలకు విఘాతం ఏర్పడిందని చెప్పింది. అప్పటికి మూడొందల మంది భద్రత, సరిహద్దు దళాలను ఇప్పటికే సహాయ చర్యలో పాల్గొన్నాయని వివరించింది. భూకంపాన్ని తీవ్రత దృష్ట్యా అవరణ్, మరో ఐదు జిల్లాలో అత్యవసర పరిస్థితిని బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ మాలిక్ బలొచి నిన్నే ప్రకటించిన విషయాన్ని మీడియా ఈ సందర్బంగా గుర్తు చేసింది. గాయపడిన వారికి వైద్య సాయం కోసం స్థానికంగా శిబిరాలను ఏర్పటు చేసి ఇప్పటికే వైద్య సాయం అందజేస్తున్నామని బెలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. -
93కు చేరిన పాక్ భూకంప మృతులు
నైరుతి పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో నిన్న సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయానికి 93 కి చేరింది. మరో 200 మంది గాయపడ్డారు. వారు స్థానికంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఘటనలో మరణించనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ భూకంపం ధాటికి పేక మేడల్లా కుప్పకులిన భవనాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఘటనపై పాక్ ప్రభుత్వ వెంటనే స్పందించింది. వైద్య బృందాలు, భద్రత దళాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పాక్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బెలూచిస్థాన్ ప్రావెన్స్లో నిన్న మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్పై 7.7గా నమోదు అయింది. -
పాక్లో 20 'నాటో' ట్యాంకర్లపై ఉగ్రవాదుల దాడి
పాకిస్థాన్లో 'నాటో' ఆయిల్ ట్యాంకర్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆదివారం రాత్రి బెలూచిస్థాన్ రాష్ట్రంలో 20 ట్యాంకర్లను పేల్చివేశారు. అఫ్ఘనిస్థాన్లోని నాటో దళాలకు ఆయిల్, ఇతర వస్తువులను సరఫరా చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు పాక్ మీడియా వెల్లడించింది. హబ్ జిల్లాలో రోడ్డు పక్కన ఓ రెస్టారెంట్ సమీపంలో వాహనాల్ని ఆపిన సమయంలో సుమారు 10-15 మంది ఉగ్రవాదులు రాకెట్లతో మెరుపు దాడి చేసి పారిపోయినట్టు సమాచారం. ఆరు ట్యాంకర్లలో మంటలు రేగి ఇతర వాహనాలకు వ్యాపించడంతో భారీ నష్టం జరిగింది. భద్రత దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. బెలూచిస్థాన్ రాష్ట్రంలోని ఖుజ్దార్ జిల్లాలో శుక్రవారం కూడా ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది నాటో ట్యాంకర్లను ధ్వంసం చేశారు. -
బెలూచిస్థాన్లో 10 మంది తీవ్రవాదులు హతం
పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో భద్రతాదళాలు శనివారం జరిపిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు మరణించారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. మండ్ నగర ప్రాంతంలో జరిగిన ఆ ఘటనలో పలు తీవ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. కాల్పులు జరిగిన సంఘటన స్థలంలో అధిక మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే భద్రతదళాల వైపు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని మీడియా తెలిపింది.