-
ఆయన పీఎం అయితే నేను ఎమ్మెల్యే కాలేనా?
పూరీ (ఒడిశా): ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఒడిశాకు చెందిన ఓ ఛాయ్వాలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. టీ అమ్ముతూ జీవనం గడుపుతున్న 26 ఏళ్ల సుకాంత ఘడాయ్ పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.కరీంపూర్ గ్రామానికి చెందిన ఘడాయ్ తనకు స్థిర, చర ఆస్తులు ఏమీ లేవని తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఘడాయ్ తనకు ప్రధాని నరేంద్ర మోదీనే స్ఫూర్తి అని, ఆయన ప్రధాని కాగలిగితే, తోటి ఛాయ్వాలా అయిన తాను ఎమ్మెల్యే కాలేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే లంచాల సంస్కృతిని అరికట్టి నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతానని, అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడాన్ని పరిష్కరిస్తానని తన ప్రణాళికను ప్రకటించారు. తాను సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సుకాంత ఘడాయ్ చెబుతన్నారు.కాగా బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బీజేడీ అభ్యర్థి ఉమాకాంత సామంతరాయ్, బీజేపీకి చెందిన ఉపాస్నా మహపాత్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రభాను మోహపాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ మే 25న పోలింగ్ జరగనుంది. -
Odisha: రెండు చోట్ల పోటీ చేస్తున్న సీఎం
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ గతంలోనూ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే తర్వాత బిజేపూర్కు రాజీనామా చేసిన ఆయన హింజిలీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ ఇప్పటివరకు 126 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒడిశాలో 147 నియోజకవర్గాలు, 21 లోక్సభ స్థానాలకు గాను నాలుగు దశల్లో మే 13, 20, 25, జూన్1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
కమల దళం కార్యాచరణ జోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరింత కష్టపడితే... రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. -
Narendra modi: జమ్మూకశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా
ఉద్ధంపూర్/జైపూర్: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతోదూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకోవచ్చని తెలియజేశారు. గతంలో జమ్మూకశ్మీర్లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించేవని, ప్రస్తుతం అవన్నీ చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనల ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగబోతున్నాయని చెప్పారు. శుక్రవారం జమ్మూకశ్మీర్లోని ఉద్ధంపూర్లో, రాజస్తాన్లోని బార్మర్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. రాజస్తాన్ రాష్ట్రం దౌసాలో రోడ్షోలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. ఆ అడ్డుగోడ కూల్చేశాం.. శకలాలు సమాధి చేశాం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. గతంలో వైష్ణోదేవి, అమర్నాథ్ భక్తుల భత్రతకు ముప్పు ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వెల్లడించారు. గతంలో కుటుంబ పార్టీల నిర్వాకం వల్ల జమ్మూకశ్మీర్ ఎంతో నష్టపోయిందన్నారు. ఆర్టికల్ 370 అనే అడ్డుగోడను సృష్టించింది కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఈ ఆర్టికల్ వల్ల ప్రజలకు రక్షణ లభిస్తుందన్న భ్రమను కుటుంబ పారీ్టలు కలి్పంచాయని ధ్వజమెత్తారు. ప్రజల అండతో ఈ అడ్డుగోడను కూలి్చవేశామని, దాని శకలాలను సైతం సమాధి చేశామని వ్యాఖ్యానించారు. ఓ వర్గం ఓట్ల కోసమే మాంసాహార వీడియోలు విపక్ష ‘ఇండియా’ కూటమిది మొఘల్ రాజుల మైండ్సెట్ అని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం బీజేపీ ఎన్నికల ఎత్తుగడ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రామాలయం కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని అన్నారు. రామజన్మభూమి అంశానికి 500 ఏళ్ల చరిత్రఉందని, అప్పట్లో ఎన్నికలు లేవని చెప్పారు. మొఘల్ పాలకులు ఆలయాలను కూలి్చవేసి, మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపర్చి ఆనందిస్తూ ఉండేవారని తెలిపారు. అదే ఆలోచనాధోరణితో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. కాంగ్రెస్తోపాటు ప్రతిపక్ష నాయకులు ఓ వర్గం ప్రజలను సంతృప్తిపర్చి ఓట్లు దండుకోవడానికి పవిత్ర మాసాల్లో, నవరాత్రుల్లో మాంసాహారం తింటూ, ఆ వీడియోలను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని శక్తిహీనంగా మారుస్తారా? భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎంతగానో గౌరవిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడొచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగం భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ లాంటిందని అన్నారు. తమకు రాజ్యాంగమే సమస్తం అని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తామని విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు చెబుతున్నాయని మోదీ తప్పుపట్టారు. మనకు ఇరువైపులా అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాలున్నాయని చెప్పారు. మనకు అణ్వాయుధాలు లేకపోతే ఏం జరుగుతుందో తెలియదా? అని నిలదీశారు. మీరు ఎవరు ఆదేశాలతో పని చేస్తున్నారో చెప్పాలని ఇండియా కూటమిని నిలదీశారు. దేశాన్ని శక్తిహీనంగా మార్చడమే ఇండియా కూటమి లక్ష్యమా? అని ప్రధానమంత్రి మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఒక చోట అత్తా అల్లుడు.. మరో చోట అన్నాదమ్ములు!
దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోరు ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల పోరులో సోదరుల మధ్య పోటీ నెలకొంది. చికిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో సోదరులు ఢీ కొడుతున్నారు. వీరు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంత్రాయ్ కుమారులు. వారిలో తమ్ముడు మనోరంజన్ ద్యన్ సామంతరాయ్కు బీజేపీ టిక్కెట్టు ఇవ్వగా, అన్న రవీంద్నాథ్ ద్యన్ సామంతరాయ్ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. చింతామణి కాంగ్రెస్ సీనియర్ నేత. చికిటి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్పై విజయం సాధించారు. జూనియర్ సామంతరాయ్ కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన అన్నయ్య తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) చికిటి అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద్ శ్రీరూప్ దేబ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఉషాదేవి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఉషాదేవి ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటు బీజేడీకి దక్కింది. మే 13న జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో అత్త, మేనల్లుడి మధ్య ఎన్నికల పోరు నెలకొంది. నబరంగ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కౌశల్య ప్రధాన్ను బీజేడీ తన అభ్యర్థిగా బరిలోకి దించగా, అదే నియోజకవర్గం నుంచి ఆమె మేనల్లుడు దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ పోరు అత్త, మేనల్లుడి మధ్య కాదని, రెండు పార్టీల మధ్య మాత్రమేనని, తమ కుటుంబంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని కౌసల్య మీడియాకు తెలిపారు. -
ఒకటికి రెండు.. రెండుకు నాలుగు! బెట్టింగ్ బంగార్రాజుల జోరు
రండన్నా రండి.. వెయ్యికి రెండు వేలు.. లచ్ఛకు రెండు లచ్చలు.. గవర్నమెంట్ ఎవరిదీ వస్తుంది.. జగనా ? చంద్రబాబా ? ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి. రండి పందెం కాసుకోండి అంటున్నారు గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు.. కోడిపందాలు.. క్రికెట్ పందాలు.. ఇలా రకరకాల పందేలకు పేరుగాంచిన భీమవరంలో ఇప్పుడు రాజకీయ పందేలు మొదలయ్యాయి. ఇంకా నెలన్నరలో ఎన్నికలు జరగనుండగా.. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ ఇప్పుడే పందేలు కాస్తున్నారు.. ఈ మేరకు అగ్రిమెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ రాజకీయ పందేలు గత దసరా నుంచే మొదలయ్యాయి...అప్పట్లో కొందరు టీడీపీ అభిమానులు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెసుకు యాభై సీట్లకన్నా తక్కువే వస్తాయని చెబుతూ అలా పందెం కాశారు. అది కూడా కోసు పందెం... అంటే ఫ్యానుకు యాభై సీట్లకు మించి వస్తే టీడీపీ వాళ్ళు రెండు రెట్లు.. మూడు రెట్లు డబ్బులిస్తారన్నమాట.. అంటే లక్ష పందెం కాసారనుకోండి.. జగన్ పార్టీకి యాభై సీట్లకు లోపు వస్తే ఆ లక్ష పోయినట్లు... కానీ యాభైకి మించి వస్తే టీడీపీ వాళ్ళు.. రెండు.. మూడు లక్షలు ఇస్తారన్నమాట.. ఇలా అప్పట్లో పందేలు ఫిక్స్ చేసుకుని నోట్లు.. అగ్రిమెంట్లు.. పెద్దమనుషుల సమక్షంలో మాట కూడా తీసుకోవడం జరిగింది.. ఇదిలా ఉండగా సంక్రాంతి పోయాక పందెం తీరు మారింది... జగనుకు 70 - 80 సీట్లు వస్తాయంటూ సమపందెం కాస్తున్నారు. అంటే పందెంలో ఎంత వేస్తె అంత వస్తుంది.. ఎంత కాస్తే అంతే ఓడిపోతారు తప్ప.. రెండు మూడు రెట్లు అనేది ఉండదు. ఇదిలా ఉండగా మర్చి నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. మళ్ళీ జగన్ వస్తున్నారట.. పేదలు.. బీసీలు.. మహిళలు.. రైతులు అందరూ జగన్ పక్షాన ఉండడంతో ప్రభుత్వానికి ఎదురేలేదట.. నూట ఇరవై సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నారట అనే భావన పల్లెల్లో మొదలైంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనేదానిమీద పందేలు కాస్తున్నారు. అయితే గతంలో జగన్ కు 50 సీట్లకు మించి రావంటూ రెండు మూడు రెట్లు ఇచ్చేలా పందెం ఖరారు చేసుకున్నవాళ్ళంటా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కూటమిలో సీట్ల చిచ్చు.. వాళ్ళిస్తున్న మ్యానిఫెస్టో.. హామీలను ప్రజలు నమ్మకపోవడం... గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలా తుంగలోకి తొక్కింది.. ఇవన్నీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.. అంతేకాకుండా చెప్పినమాటమీద.. ఇచ్చిన హామీ మీద నిలబడే జగన్ అంతే జనానికి నమ్మకం కుదిరిందని, ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి కూడా చేసి చూపుతున్న జగన్ గెలుపు విషయంలో సందేహాలు లేనేలేవని ప్రజల్లో అభిప్రాయాలూ గట్టిగా వినిపిస్తుండడంతో ఇప్పుడు పందెం తీరు మారింది. ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.. వంద.. నూట ఇరవై.. ఇలా ఇప్పుడు పందేలు కాస్తున్నారు.. మొత్తానికి గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు పూర్తి భిన్నంగాఉండడంతో పందెం రాయుళ్లు ఇప్పుడు జగన్ గెలుపు మీద కాపు కాస్తున్నారు.. అయితే గతంలో టీడీపీ గెలుపు మీద లక్షల్లో అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు దిగాలు పడిపోతున్నారు.. ఈ నెలలో పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగై... నూట నలభై.. వరకూ ఎగబాకుతుందని.. కూడా పందెం రాయుళ్లు అంటున్నారు.. మరోవైపు జగన్ గెలిస్తే లక్ష ఇస్తాం.. టీడీపీ గెలిస్తే మీరు అరవై.. డెబ్బై వేలు ఇస్తే చాలు అన్నట్లుగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది. -సిమ్మాదిరప్పన్న -
ప్రత్యేక పరిశీలకుల నియామకం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వచ్చే నెలలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఎన్నికల్లో డబ్బు, కండ బలం, అక్రమ మద్యం, ఉచితాల పంపిణీపై పకడ్బందీగా నిఘా పెట్టేందుకు ఏపీ సహా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్కు ఈ ప్రత్యేక పరిశీలకులు నియమితులయ్యారు. మంచి ట్రాక్ రికార్డు కలిగిన రిటైర్డ్ సివిల్ సర్విసు అధికారులను నియమించడమే కాక ఆయా రాష్ట్రాల్లో పర్యవేక్షించాల్సిన అంశాలను సీఈసీ వివరించింది. ఆంధ్రప్రదేశ్కు సాధారణ ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ మిశ్రా, పోలీసు ప్రత్యేక పరిశీలకునిగా దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలకునిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ నిగమ్ను నియమించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై వీరు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ నిఘా ఉంచుతారని పేర్కొంది. అలాగే.. ♦ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జిల్లాల్లో నియమించిన ఇతర ఎన్నికల పరిశీలకుల పనికి ఇబ్బంది కలిగించకుండా ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. సమన్వయ విధానంలో ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ♦ ప్రాంతీయ అధిపతులు, పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాల్గొన్న వివిధ ఏజెన్సీలు, నోడల్ అధికారులతో సమస్వయం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందే అధికారం కలిగి ఉంటారు. ♦ ఎన్నికల సందర్భంగా సరిహద్దు ప్రాంతాలు ఎదుర్కొనే సున్నితమైన సమస్యలు, ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలి. ♦ ఎన్నికల ప్రక్రియలో కమిషన్ మార్గదర్శకాల అమలు, ఇంటర్ ఏజెన్సీ సమన్వయం, తప్పుడు సమాచారంపై అధికారుల ప్రతిస్పందన కోసం వెచి్చస్తున్న సమయం, ఎన్నికలకు 72 గంటల ముందు చేయకూడని.. చేయాల్సిన పనులను పర్యవేక్షించడం, స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. ♦ ఇక ఎన్నికల సంఘం లేదా జోనల్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డీసీఈఓలు, ఎస్పీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే సమావేశాల్లో కూడా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తారు. ♦ ఎన్నికలు నిష్పాక్షికత, విశ్వసనీయతను నిర్ధారించడానికి కీలకమైన పూర్తి బాధ్యతలను, అధికారాలను ఈ పరిశీలకులకు అప్పగించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు భేష్ ఇక సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని రామ్మోహన్ మిశ్రా అభినందించారు. ఇదే పంథాను చివరివరకు కొనసాగించాలని సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంను, ఎంసీఎంసీ, సోషల్ మీడియా విభాగాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కంట్రోల్ రూమ్లోని సీ–విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ టాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్), కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టీకే రాణా వివరించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల వివరాలు, గత ఎన్నికల్లో పోలింగ్ శాతం వంటి వివరాలను చెప్పారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో 85 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ టీకే రాణా జిల్లాలో ఎలక్షన్ సీజర్లను, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపట్ల కూడా రామ్మోహన్ సంతృప్తి వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే డేటాను సరైన విధంగా విశ్లేíÙంచి సరైన కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు. అనంతరం గూడవల్లి ఇంటర్ డి్రస్టిక్ట్ బోర్డర్ చెక్పోస్టును ఆయన సందర్శించి సిబ్బందికి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీఓ బీహెచ్ భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈశాన్యం ఎవరి వశం!
సెవెన్ సిస్టర్స్గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరింటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవలి మణిపూర్ మారణకాండ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి... నోట్: ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్సభ సీట్లున్న అసోంపై విడిగా కథనం అందిస్తాం మణిపూర్.. కాంగ్రెస్కు షాక్ మణిపూర్లో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్కు 2019లో తొలిసారి షాక్ తగిలింది. ఇక్కడి రెండు సీట్లలో ఓటమి పాలైంది. ఒకటి బీజేపీ, మరోటి ప్రాంతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు గెలుచుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 60 సీట్లకు గాను బీజేపీ 32 స్థానాలు కైవసం చేసుకుని సొంతంగా మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్ సింగ్ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. గతేడాది కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు దేశమంతటా ప్రకంపనలు సృష్టించాయి. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్ అట్టుడికింది. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వం అల్లర్ల బీజీపీ నివారణలో విఫలమైందని, మోదీ కనీసం ఒక్కసారైనా పర్యటించలేదంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మేఘాలయ... బీజేపీకి అందని ద్రాక్ష ఇక్కడా ప్రాంతీయ పార్టీల హవాయే సాగుతోంది. కాంగ్రెస్ పోటీ ఇస్తున్నా బీజేపీ పెద్దగా సోదిలో లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్పీపీ చెరో సీటు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కన్పిస్తోంది. ఇక మిజోరంలో ఏకైక లోక్సభ స్థానం ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. 2019లో ఎంఎన్ఎఫ్ గెలిచింది. నాగాలాండ్లో ఏకైక లోక్సభ సీటును 2004, 2014ల్లో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. 2019లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్సీపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. సర్వేలు ఏమంటున్నాయి... అరుణాచల్, త్రిపురల్లోని 4 సీట్లూ బీజేపీవేనని, మణిపూర్లో బీజేపీ, కాంగ్రెస్ చెరోటి, మిజోరంలో జెడ్పీఎం, నాగాలాండ్లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎస్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ ఈశాన్యంలో తన 5 సీట్లను నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని చేజార్చుకోనుంది. రెండు విడతల్లో పోలింగ్ అసోం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో 11 లోక్సభ స్థానాలున్నాయి. అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కో సీటు ఉన్నాయి. అరుణాచల్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వెస్ట్, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గాల్లో తొలి విడత (ఏప్రిల్ 19) ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర ఈస్ట్, ఔటర్ మణిపూర్లో రెండో దశలో (ఏప్రిల్ 26) పోలింగ్ నిర్వహించనున్నారు. త్రిపుర.. కమ్యూనిస్టుల కోట బద్దలు ఈ కమ్యూనిస్టుల కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగరింది. 1998 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని సీపీఎం నేత మాణిక్ సర్కార్ ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్ కుమార్ దేవ్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ రెండు సీట్లలోనూ బీజేపీ చేతిలో సీపీఎం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్నా లోక్సభ పోరులో మాత్రం పూర్తిగా వెనకబడింది. అరుణాచల్లో బీజేపీ పాగా కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో ఎట్టకేలకు కమలనాథులు పాగా వేశారు. ఇక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 2004 నుంచి 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెసే అధికారాన్ని చేజక్కించుకుంది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లనూ 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్ నెగ్గాయి. 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019 మాత్రం మోదీ సునామీ ఈశాన్యాన్ని కూడా ముంచెత్తింది. దాంతో అరుణాచల్ పూర్తిగా బీజేపీ ఖాతాలో చేరింది. రెండు లోక్సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ ఎన్డీఏ పాగా వేసి కాంగ్రెస్ (యూపీఏ) సుదీర్ఘ పాలనకు తెరదించింది. 60 సీట్ల అరుణాచల్ అసెంబ్లీలో ఎన్డీఏ భాగస్వాములు బీజేపీ 41 సీట్లు, జేడీయూ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ 5 గెలుచుకున్నాయి. పెమా ఖండూ సీఎంగా తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోలింగ్కు ముందే ఖాతా తెరిచింది. సీఎం పెమా ఖండూతో సహా 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఖండూతో పాటు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది. సిక్కింలో లోకల్ హవా ఈ బుల్లి రాష్ట్రంలో కూడా లోక్సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుతున్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే పూర్తి హవా. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సీఎం పదవిలో కొనసాగిన రికార్డు దక్కించుకున్న (1994 నుంచి 2019 వరకు, 5 సార్లు) పవన్ కుమార్ చామ్లింగ్కు గత ఎన్నికల్లో షాక్ తగిలింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) చేతిలో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఓటమి చవిచూసింది. లోక్సభ సీటు కూడా ఎస్కేఎం వశమైంది. దాంతో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోటీ లేదు.. ప్రచారం లేదు.. గెలిచేసిన బీజేపీ అభ్యర్థులు!
Arunachal Pradesh Assembly Elections: షెడ్యూల్ ప్రకారం ఎన్నికల తేదీకి వారాల ముందే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుందని ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రకటించారు. శనివారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్తోపాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. "మేము పోటీ లేకుండా 10 సీట్లు గెలుచుకున్నాం. ఎన్నికలకు ముందే ఇది చాలా పెద్ద విజయం. మా అభివృద్ధి పనులకు ప్రజలు ఇస్తున్న భారీ మద్దతుకు ఇదే నిదర్శనం. ప్రజలు మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. మా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. అలాగే రెండు లోక్సభ స్థానాలను కూడా భారీ మెజారిటీతో గెలుచుకుంటాం” అని సీఎం ఖండూ అన్నారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో బీజేపీ మద్దతుదారులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 60 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో పోటీ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
అరుణాచల్లో 10 ఏకగ్రీవాలు
ఇటానగర్: అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఆయా నియోజకవర్గాల్లో వారు మాత్రమే బరిలో మిగిలారు. దాంతో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్లోని మిగతా 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన తొలి విడతలో పోలింగ్ జరగనుంది. -
అసెంబ్లీ ఎన్నికలు: ఆ రెండు రాష్ట్రాల కౌంటింగ్ తేదీల్లో మార్పు
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసింది సీఈసీ. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ను సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కంటే రెండు రోజుల ముందే జూన్ 2వ తేదీన చేపట్టనున్న ఈసీ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ రెండో తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక.. ఏప్రిల్ 19న మొదటి విడతలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తాజా మార్పు ప్రకారం ఫలితాలు జూన్ రెండున వెల్లడికానున్నాయి. -
Lok sabha elections 2024: సార్వత్రిక సమరం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్సింగ్ సంధుతో కలిసి శనివారం ఢిల్లీలో ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా లోక్సభతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కూడా మే 13 న నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదలవడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచి్చనట్టు సీఈసీ ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు ముగియగానే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ప్రకటించారు. షెడ్యూల్ నుంచి ఫలితాల వెల్లడి దాకా చూసుకుంటే ఈసారి ఎన్నికల ప్రక్రియ ఏకంగా 82 రోజుల సాగనుండటం విశేషం! 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల 119 రోజుల పాటు జరిగాయి. తర్వాత అత్యంత సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఇదే కానుంది. తమిళనాడుతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడతలోనే పోలింగ్ పూర్తవుతోంది. మొత్తమ్మీద 23 రాష్ట్రాలు, యూటీల్లో ఒకే విడతలో; యూపీ, పశి్చమబెంగాల్, బిహార్లలో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘సుపరిపాలన, అన్ని రంగాలకూ అందించిన అభివృద్ధి ఫలాల ప్రాతిపదికన అధికార పక్షం ఎన్నికల బరిలో దిగుతుండటం గత పదేళ్ల బీజేపీ పాలనలో భారత్ సాధించిన అద్భుత మార్పు’’ అని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం బారినుంచి కాపాడేందుకు ఈ ఎన్నికలు బహుశా చివరి అవకాశమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రపంచానికే తలమానికంగా... ప్రపంచానికే ప్రామాణికంగా నిలిచిపోయేలా ఈసారి ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్కుమార్ ప్రకటించారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్ల మంది ఓటర్లుండగా 61.5 కోట్ల మంది, అంటే 67.4 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతాన్ని ఇతోధికంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఈసీ వివరించారు. అందుకోసం వయోవృద్ధ, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు సదుపాయం వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలని కోరారు. రీ పోలింగ్ తదితరాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. 2022–23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు జప్తు చేసినట్లు వెల్లడించారు. అత్యధికంగా గుజరాత్లో రూ.802 కోట్లు, తెలంగాణలో రూ.778 కోట్లు, రాజస్థాన్లో రూ.704 కోట్లు జప్తు చేశారు. ఈసీ ఇంకేం చెప్పారంటే... ► జాతుల హింస బారిన పడ్డ మణిపూర్లో శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అక్కడే ఓటేసేలా చర్యలు తీసుకున్నాం. ► సూర్యాస్తమయం తర్వాత బ్యాంకు వాహనాల రాకపోకలు నిషిద్ధం. ► నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా, తనిఖీ ఉంటాయి. ► అక్రమ ఆన్లైన్ నగదు బదిలీలపై ఆద్యంతం డేగ కన్నుంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తారు. ► ప్రచారంలో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నియోగించరాదు. ఆ లోక్సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్! ఈసీ విడుదల చేసిన లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో ఒక విశేషం చోటుచేసుకుంది. మొత్తం లోక్సభ స్థానాలు 543 కాగా 544 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు సీఈసీ వివరణ ఇచ్చారు. ‘‘మణిపూర్లో జాతుల హింసతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఔటర్ మణిపూర్ లోక్సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందుకే మొత్తం స్థానాలు 543 అయినా 544గా కనిపిస్తున్నాయి’’ అని వివరించారు. ఔటర్ మణిపూర్లోని 15 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఏప్రిల్ 19న తొలి దశలో, మిగతా 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో 26న పోలింగ్ జరగనుంది. ‘4ఎం’ సవాలుకు సిద్ధం ‘‘స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈసీ ముందు ప్రధానంగా నాలుగు రకాల సవాళ్లున్నాయి. అవే మజిల్ (కండ బలం), మనీ (ధన బలం), మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), మోడల్ కోడ్ వయోలేషన్స్ (కోడ్ ఉల్లంఘన). వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈసీ సర్వసన్నద్ధంగా ఉంది’’ అని సీఈసీ ప్రకటించారు. గత ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ‘‘1.5 కోట్ల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియోగిస్తున్నాం. జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద డ్రోన్ ఆధారిత తనిఖీలు, నాన్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా ఉంటాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వార్తలు, ఎన్నికల హింసపై ఉక్కుపాదం మోపుతాం. కండబలానికి చెక్ పెట్టి, అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు వీలుగా కలెక్టర్లు, ఎస్పీలు అనుసరించాల్సిన పలు నియమ నిబంధనలను ఇప్పటికే జారీ చేశాం. ప్రతి జిల్లాలోనూ సమీకృత కంట్రోల్ రూములు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటాయి’’ అని పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనను, ఎన్నికల హింసను సహించబోమన్నారు. వాటికి పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘గతంలో గట్టిగా మందలించడంతో సరిపెట్టేవాళ్లం. ఇప్పుడు మాత్రం కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అరుణాచల్ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19 న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13, మే 20, 25న, జూన్ 1ల్లో నాలుగు విడతల్లో పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తెలంగాణలో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మే 13న ఉప ఎన్నిక జరుగనుంది. హోరాహోరీ తలపడండి, కానీ... ఎన్నికల బరిలో పార్టీలు హోరాహోరీగా తలపడవచ్చని, అయితే ఆ క్రమంలో గీత దాటకుండా చూసుకోవాలని సీఈసీ సూచించారు. విద్వేష ప్రసంగాలకు, కుల, మతపరమైన విమర్శలు, ప్రకటనలకు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. నేతలు కూడా వ్యక్తిగత దాడికి, దిగజారుడు భాషకు నేతలు ఉండాలన్నారు. ఈ డిజిటల్ యుగంలో మాట్లాడే ప్రతి మాటా కనీసం వందేళ్ల పాటు రికార్డై ఉండిపోతుందని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘కావాల్సినంత ద్వేషించుకుందాం. కానీ తర్వాతెప్పుడైనా మిత్రులం కావాల్సొస్తే సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూసుకుందాం’’ అన్న ప్రసిద్ధ ఉర్దూ కవితా పంక్తిని ఈ సందర్భంగా సీఈసీ చదివి విని్పంచారు! ‘‘ప్రకటనలను వార్తలుగా చిత్రించడం, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రత్యర్థులను అవమానించడం, వేధించడం వంటివి కూడదు. స్టార్ ప్రచారకులు ఎన్నికల ప్రచారంలో హుందాతనాన్ని కాపాడాలి’’ అన్నారు. తప్పుడు వార్తల సృష్టికర్తలపై కఠిన చర్యలు తప్పవన్నారు. విరాళాలపై నిఘా పారీ్టలకు అందే విరాళాలపై నిఘాకు యంత్రాంగం ఉండాలని సీఈసీ అన్నారు. ‘‘అదేసమయంలో దాతల గోప్యతను కాపాడాలి. వారిని వేధించకూడదు. పారీ్టలకు అనధికార మార్గాల గుండా అందే లెక్కలోకి రాని నిధులకు అడ్డుకట్ట వేసే ఉత్తమ వ్యవస్థ రావాలి. చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అన్ని విషయాలూ తెలియాలి’’ అన్నారు. -
‘ఓటమి భయంతోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించట్లేదు’
శ్రీనగర్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను ఈసీ విడుదల చేసింది. అయితే జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సైతం ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందని కశ్మీర్లోని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ.. శనివారం ఈసీ నుంచి అటువంటి ప్రకటన వెలువడలేదు. లోక్సభ ఎన్నికల అనంతరం జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూ కశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా పలు అనుమానాలను వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవటంలో ఏదో తేడా కొడుతోందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించాలని చూస్తోందని.. ఇది దానికి ఒక అవకాశంలా కనిపిస్తోందన్నారు. జమ్ము కశ్మీర్లో లోక్సభ ఎన్నికలు నిర్వమించగా లేని సమస్య అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తే ఏం జరుగుతుంది? అని ప్రశ్నించారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలను ఆశించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర గ్రీన్ సిగ్నర్ ఇవ్వకపోవటం బాధకరమన్నారు. ఎన్సీతో పాటు బీజేపీ నేతలు సైతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహిచాలని డిమాండ్ చేశాయని తెలిపారు. ఇదీ చాలా బాధకరం.. ఇంకా ఎన్ని రోజులు ఇలా రాష్ట్ర ప్రజలు లెఫ్ట్నెంట్ గవర్నర్ పరిపాలనలో ఉండాలని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ప్రజల హృదయాలు గెలుచుకోవాంటే ఇదే సరైన సమయం ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తూ.. జమ్ము కశ్మీర్ రాష్ట్రం తన సొంతం ప్రభుత్వం ఎన్నుకోకుండా ఎందుకు నిరాకరిస్తున్నారని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర బీజేపీకి లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించపోవటానికి కారణం.. జమ్ము కశ్మీర్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇక.. వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం పూర్తిగా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఎన్సీ చీఫ్ ఫరూర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. -
నేడు విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్... లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..ఇంకా ఇతర అప్డేట్స్
-
Survey: ఏపీలో మళ్లీ ఫ్యాన్దే హవా
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి విజయదుందుభి మోగిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. పొలిటికల్ క్రిటిక్ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వైఎస్సార్సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. టీడీపీ- జనసేన-బీజేపీల కూటమిపై వైఎస్సార్సీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఆ పార్టీల పొత్తు తర్వాత కూడా వైఎస్సార్సీపీ ముందంజలో ఉందని సర్వే పేర్కొంది. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేసింది. అసెంబ్లీ సీట్ల సర్వే ఫలితాలు వైఎస్సార్సీపీ:121+/-5 టీడీపీ-జనసేన-బీజేపీ: 54+/-5 కాంగ్రెస్: 00 ఇతరులు: 00 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం అంచనా వైఎస్సార్సీపీ: 49.5 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ: 43 శాతం కాంగ్రెస్: 2.5 శాతం ఇతరులు: 5 శాతం YSRCP Poised to be elected again in Andhra Pradesh, Even Against Alliance of TDP, JSP, and BJP According to our survey findings, the YSRCP in Andhra Pradesh stands in a strong position to secure another term in the 2024 elections. Despite potential alliances forming against it,… pic.twitter.com/PCdwZx6w6B — Political Critic (@PCSurveysIndia) March 14, 2024 కాగా, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్సార్సీపీకి అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. -
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు.. భారీగా సీట్ల తగ్గింపు
సాక్షి, గుంటూరు: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు వెన్నుపోటు పొడిశారు. బీసీలకు భారీగా సీట్ల తగ్గించారు. రెండు లిస్టులలో కలిపి ఇప్పటికి బీసీలకు కేటాయించింది కేవలం 24 సీట్లే.. గత ఎన్నికల్లో 43 ఇచ్చి ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కమ్మలకు ఏకంగా 28 సీట్లను కేటాయించుకున్న చంద్రబాబు.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న చంద్రబాబు.. కాపులకు 8, మైనారిటీలు 3 సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై కమ్మేతర వర్గాలు ఫైర్ అవుతున్నారు. అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక వదలించుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ‘బీసీలు టీడీపీకి బ్యాక్ బోన్’ అంటూ ఉత్తుత్తి మాటలతో దశాబ్దాలుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. -
సినబాబు సిలక్కొట్టుడు.. టిక్కెట్ల పేరిట డబ్బులు వసూళ్లు
టీడీపీలో నంబర్ టూ స్థానంలో ఉన్నానని భావిస్తున్న లోకేష్ కొన్ని సందర్భాల్లో పార్టీని తానే సొంతంగా లీడ్ చేయాలని ఆశిస్తుంటారు. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లోనూ కొన్ని సార్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి ఎదురుతంతున్నప్పటికీ తీరు మార్చుకొని లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేస్తూ తండ్రిని ఇరకడంలో పెడుతున్నారు. జనసేనతో అధికార పంపిణీ విషయంలో అయన చేసిన కామెంట్స్ జనసైనికుల్లో అగ్రహాన్ని లేపాయి. అసలు అలాంటి ఆలోచనే లేదని, కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని తేల్చేసారు. దానికి తోడు యువగళం పాదయాత్రలో తనలో పోరాట పటిమ, పరిణితి బాగా పెరిగిందని భావిస్తున్న లోకేష్ ఇప్పటికే తండ్రిని ఓవర్ టేక్ చేసి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో చిక్కులు తెస్తున్నట్లు పెద్దలు గుర్తించారు. వాస్తవానికి ఆమధ్య పాదయాత్రలో భాగంగా లోకేష్ చాలాచోట్ల బహిరంగసభల్లో మాట్లాడారు. ఆ సందర్భంగా కొందరు నాయకులను అక్కడికక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేసారు. అయితే అయన ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రకటించుకుంటూ వెళ్లడంతో చంద్రబాబు ఆగ్రహించి ఇకముందు అలా చేయొద్దని హెచ్చరించడంతో ఆ తరువాత అయన అభ్యర్థుల ప్రకటనను ఆపేసారు. కానీ తనలోని పెద్దరికపు కోరికను చంపుకోలేని లోకేష్ దాదాపు నలభై మంది వరకు ఆశావహుల దగ్గర టిక్కెట్లు ఆశచూపి డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. గుంటూరు, కృష్ణ, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువమంది లోకేష్ కు దాదాపు ఐదేసి కోట్లవరకు డబ్బులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వారికి టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నర్థకంగా మరేంది. గుంటూరు జిల్లాలో ఓ విద్యాసంస్థకు చెందిన యజమాని దగ్గర దాదాపు ఐదు కోట్లు తీసుకున్నారని తెలిసింది. ఐతే ఇప్పుడు అయన టిక్కెట్ వెనుకబడినట్లు చెబుతున్నారు. లోకేష్ హామీ ఇచ్చినావాళ్ళకు ప్రజాదరణ లేదని సర్వేల్లో తేలిందని, అందుకే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేసారని అంటున్నారు. అనంతపురంలో ఓ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి దగ్గర కూడా ఇలాగే కొంత డబ్బు తీసుకుని లోకేష్ హామీ ఇచ్చినా అక్కడ ఐవీఆర్ఎస్ ద్వారా మళ్ళీ సర్వే చేస్తున్నారు. అందులోకానీ సదరు నాయకుడికి మంచి మార్కులు రాకపోతే టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేశారట. విశాఖ నుంచి కూడా ఇలాగే కొందరికి హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారో తెలియడం లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని, ఎమ్మెల్సీలు ఇస్తామని లోకేష్ నచ్చజెబుతున్నట్లు అంటున్నారు. కానీ ఆ మాటలు నమ్మేలా లేవని, అనవసరంగా డబ్బులిచ్చి ఇరుక్కున్నామని వారు వాపోతున్నారు. మొత్తానికి చినబాబు లోకేష్ జోక్యం పార్టీకి పెద్ద తలనొప్పులు తెచ్చిందని అంటున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
‘బీజేపీకి ఒమర్ అబ్దుల్లా సవాల్.. ఎన్నికలు నిర్వహించండి’
ముంబై: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ జమ్ము కశ్మీర్లో అభివృద్ధి, శాంతి స్థాపనకు కృషి చేశామని చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. ముంబైలో 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్లో ఒమర్ అబ్దుల్లా పాల్గొని మట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కాకుండా సుప్రీం కోర్టుతో జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహిస్తామని చెప్పించటం బీజేపీకి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తమ పార్టీ జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2019 తర్వాత ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించకపోవటం సిగ్గుచేటు. 2024లో జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి. మేము బీజేపీతో పోరాడుతాం. జమ్ము కశ్మీర్ ప్రజలు హక్కులు, భూములు, 2019లో దెబ్బతిన్న కశ్మీర్ను మరల యథాస్థానానికి తీసుకురావటానికి పోరాడుతాం’ అని అన్నారు. ‘ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు చేరువలో లేదు. మేము 2014 నుంచి ఎన్నికలు చూడలేదు. 2019 తర్వాత కశ్మీర్ ప్రజల్లో శాంతి స్థాపన జరిగే మరి ఎందుకు ఎన్నికలు నిర్వహించరు?. 2024లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేస్తున్నా’ అని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఇక.. ఇప్పటికే ఇండియా కూటమిలో పొత్తులేకుండా తమ జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లోక్సభ ఎన్నికలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సీట్ల కేటాయింపుల విషయంలో 3-3 ఫార్ములతో నేషనల్ కాన్ఫరెన్స్తో ఒప్పించేందుకు కసరత్తు చేస్తోంది. -
బాబు రాజకీయాలకు పనికిరాడని ఇప్పుడు తెలిసిందా.. భువనేశ్వరీ?
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే మూడు ‘సిద్ధం’ సభలు జరిపామని, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలను.. నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని ప్రజలకు వివరించామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (మహిళాశిశు సంక్షేమం) నారమల్లి పద్మజ అన్నారు. ‘2019 మ్యానిఫెస్టోలో మేము చెప్పిన ప్రతీ వాగ్దానాన్నీ.. చేసి చూపించాం. మా పాలనే సాక్ష్యంగా 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్ళి.. కాలర్ ఎగరేసి మరీ ఓట్లు అడుగుతామని ఆరోజు చెప్పాం.. ఈరోజూ అదే చెబుతున్నాం’ అని అన్నారు. మూటాముల్లె సర్దేసిన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం.. మా పాలనే దానికి సాక్ష్యం.. మమ్మల్ని మరోమారు ఆశీర్వదించడానికి సిద్ధమా..? అని మా నాయకుడు జగన్ గారు ప్రజలను కోరినప్పుడు వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ను చూసి తెలుగుదేశం పార్టీకి వెన్నులో చలి పుట్టిందేమో.. ఇప్పటికే మూటాముల్లె సర్దేసింది. దాని పరిణామాలు కూడా ఒక్కొక్కటిగా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు రెస్టు తీసుకోవాలని భువనమ్మే చెబుతోంది ఈరోజు నారా భువనేశ్వరి కూడా ఇదే విషయాన్ని మరోమారు ధృవీకరించింది. మా ఆయన చంద్రబాబు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసిపోయాడని.. మీడియా ముందుకొచ్చి ఆమె మాట్లాడిన సందర్భాన్ని చూశాం. ఇది నిజమే.. హైదరాబాద్లోని ఏఏజీ ఆస్పత్రి కూడా చంద్రబాబు గురించి అదే చెప్పింది. ‘నీకు సకల రోగాలు ఉన్నాయి. నువ్వు గానీ నడవాలంటే.. వెనుక ఒక అంబులెన్స్ ఉండాలి. ఇక, బిజీ రాజకీయాలకు నువ్వు పనికిరావు.. రెస్టు తీసుకోవాలి..’ అని ఆస్పత్రి రిపోర్టు ద్వారానే చెప్పారు. అయినా.. ఆయన విన్లేదు. అందుకే.. చంద్రబాబు బైబై.. అని ఓపెన్గా చెప్పింది తన భార్యను ఎవరూ ఏమీ అనకుండానే వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. మా నాన్నను ముసలోడంటున్నారని లోకేశ్ కూడా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. తండ్రీ కొడుకులు ఎంతగా ఏడ్చినా.. మొత్తుకున్నా.. ప్రజల నుంచి వారు ఆశించినంత స్పందన రాకపోవడంతో ఇక, చివరికి కుర్చీలు మడత పెట్టుకునే పనిలో పడ్డారు. పాపం, తన భర్త, కొడుకు పడుతున్న పాట్లు గమనించిన భువనేశ్వరి ఈరోజు ఓపెన్గానే చంద్రబాబు బైబై.. అని చెప్పారు. ఆయన కూడా రాజకీయాలకు బైబై చెప్పాల్సిన అవసరముందని.. రెస్టు తీసుకోవాల్సిన వయసొచ్చిందని.. నీకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని తన భర్తకూ ఆమె గుర్తుచేశారు. వెన్నుపోటుకు బదులు చెప్పిందా..? లోకేశ్ మాట్లాడించాడా..? సుదీర్ఘకాలం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇక పనికిరాడని స్వయంగా ఆయన భార్యే చెబుతున్న క్రమంలో.. అందరిలోనూ ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఆయన ఎమ్మెల్యేగానే పనికిరాడా..? లేదంటే, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడా..? అని భువనేశ్వరి మాటల అంతరార్థాన్ని విశ్లేషిస్తున్నారు. ఆమె ఇవన్నీ నిజంగానే చెబుతుందా..? లేదంటే, తండ్రి ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటుకు బదులుగా చెబుతుందా..? ఒకవేళ.. లోకేశ్బాబే తన తల్లి చేత ఇలా మాట్లాడిస్తున్నాడా..? మా నాన్న పని అయిపోయింది. నేటి రాజకీయాలకు ఆయనెటూ పనికిరాడని.. ఎలాగైనా మూలన కూర్చోబెట్టాలని తల్లికి చెప్పాడా..? అనేది తేలాల్సిన సందర్భమిది. అబద్ధాలాడటంలో తండ్రీకొడుకుల్ని మించిపోయింది భువనేశ్వరి అక్క పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంది. అలాగే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా భువనేశ్వరి చేపడితే బాగుంటుందేమో.. ఎందుకంటే, ఆమె మాటల్లోని అబద్ధాల్ని చూస్తుంటే.. ఖచ్చితంగా రాజకీయాల్లోకి పనికొస్తుందని చెప్పొచ్చు. కన్నార్పకుండా అబద్ధాలు అల్లి ప్రచారం చేయడంలో తన భర్త, తన కొడుకును మించిపోయింది. మహిళల పక్షాన అప్పుడెందుకు నోరుమెదపలేదు..? ఆడపిల్ల ఆర్థరాత్రి నడవాలంటే మంచి ప్రభుత్వం రావాలంటున్న నువ్వు.. నీ బుద్ధి, నీ విచక్షణను నీ భర్త పాలనలో ఎక్కడ పెట్టుకున్నావని మేం ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు పాలన లేకుంటే మహిళలు వీధుల్లో నడవలేని పరిస్థితుల్లేవని మాట్లాడుతున్న నీకు మేము కొన్ని ప్రశ్నలడుగుతున్నాం. జవాబివ్వగలవా..? నీ భర్త చంద్రబాబు హయాంలో మహిళలపై అనేక దురాగతాలు జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు..? కాల్మనీ, సెక్స్రాకెట్లో నీ తెలుగుదేశం పార్టీ నాయకులే దాదాపు 200 మంది మహిళల్ని లైంగికంగా హింసించి.. బెదిరించి బ్లూ ఫిల్మ్లు తీసినప్పుడు నువ్వెందుకు స్పందించలేకపోయావు..? తహశీల్దార్ వనజాక్షిని నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏవిధంగా దాడిచేసి అవమానించాడో మీడియా సాక్షిగా నువ్వు చూసినా.. బయటకొచ్చి ఇది తప్పు అని మహిళల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోయావు..? రిషితేశ్వరి అనే విద్యార్థినిని అత్యంత పాశవికంగా హింసిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణిస్తే చదువుకునే బాలికల తరఫున నువ్వెందుకు నీ భర్తను నిలదీయలేదు..? వీటన్నింటికీ.. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. బీసీ, దళిత మహిళల్ని అవమానిస్తే.. నువ్వు స్పందించలేదేం..? కుప్పంలో ఓ బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ మీటింగ్కు హాజరైందని .. ఆమెను వివస్త్రను చేసి వీడియోలు చిత్రించి హింసించిన వైనం నీకు తెలియదా ..? ఆ ఘటనను కుప్పం ప్రజలు మరిచిపోగలరా..? అదేవిధంగా పెందుర్తిలో ఓ దళిత మహిళ.. తన అసైన్డ్ స్థలాన్ని లాక్కోవద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడితే నీ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎలా కిరాతకంగా ప్రవర్తించాడో నీకు మీడియాలో నువ్వు చూడలేదా.? నీ సొంత తమ్ముడు మహిళల గురించి ఏం మాట్లాడాడో.. వినలేదా..? వాటిని చూసి ఒక మహిళగా స్పందించలేదెందుకు..? మీ హయాంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పు సభా వేదికపైనే ఒక మహిళను చూస్తే ముద్దెట్టుకోవాలి.. కడుపైనా చేయాలని నీ సోదరుడు మాట్లాడిన సంగతి నీకు తెలిసీ ఎందుకు మౌనంగా ఉన్నావు..? సాటి మహిళగా స్పందించి.. నీ తమ్ముడుకి గడ్డిపెట్టాలని అనిపించలేదా..? నీ తమ్ముడు బాలకృష్ణలాంటి అచ్చోసిన ఆంబోతుల్ని ఏం చేయాలి..? నిలువునా కాల్చేయాల్నా..? వీటన్నింటికీ నువ్వు స్పందించి.. నీ పార్టీ హయాంలో జరిగిన తప్పులను ఒప్పుకుని.. మీ తెలుగుదేశం పార్టీ తరఫున.. నీ తమ్ముడి తరఫున బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భువనేశ్వరిని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో జరిగిన నేరాలనూ ఆంధ్రకు అంటగడతారా..? చంద్రబాబుకు మూటలు మోసే నాయకుడున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కిందటేడాది ఆగస్టు 22న జరిగిన అత్యాచారం గురించి ఈరోజు ఇక్కడ భువనేశ్వరి మాట్లాడింది. అక్కడ ఓ బాలికపై గంజాయి తాగిన ఉన్మాదులు అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ నేరాన్ని తెచ్చి ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ప్రభుత్వంపై అంటకట్టడానికి ప్రయత్నించడం నీకు సిగ్గనిపించడం లేదా..? అని భువనేశ్వరిని అడుగుతున్నాను. అబద్ధాల్లో నీ భర్త, నీ కొడుకును మించి పోయావు గనుక.. ఇప్పుడు నిలువునా మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీకి నువ్వు అధ్యక్షరాలివయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక పగ్గాలు చేపట్టమని చెప్తున్నాం. -
హస్తం గూటికి జెడ్పీ సారథులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా, తాండూరు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అధిష్టానానికి షాక్లిస్తున్నారు. ఓ వైపు లోక్సభ ఎన్నిక లు దగ్గర పడుతుండగా, మరో వైపు గులాబీ పార్టీ కి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కారు దిగి హ స్తం గూటికి చేరుకోగా, తాజాగా వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి శుక్రవారం గాందీభవన్ వేదికగా హస్తం గూటిలో చేరనున్నారు. ముందుగా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీభవన్కు వెళ్లి సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్మున్షీ, మంత్రుల సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెతో పాటు కుమారుడు రినీష్ రెడ్డి కూడా పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిరువురినీ పార్టీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి.. తాను మాత్రం త్వరలో చెవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ కండువా వేసుకోనున్నట్టు చెబుతున్నారు. సునీత దారిలోనే అనిత.. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ను కలిశారు. అధికారికంగా పార్టీ కండువా కప్పుకోక పోయినా.. పార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కృష్ణారెడ్డి కోడలు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా త్వరలో కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎప్పుడు పార్టీ లో చేరనున్నారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 20న జెడ్పీ సర్వసభ్య సమావే శం ముగిసిన తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. కాగా, అనితారెడ్డి మరోసారి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సారి మహేశ్వరం నుంచి కాకుండా కందుకూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జెడ్పీ పీఠాన్ని మళ్లీ ఆమెకే కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలినా.. గ్రేటర్ హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల ముందు ఊహించని షాక్ తగులుతోంది. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్లోకి వలసలు జోరందుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఆదివారం సాయంత్రం బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇందుకు ఊతమిస్తోంది. త్వరలోనే తన అనుచరులతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. చిన్నచూపు చూశారనే.. ► విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్ బాబా ఫసియుద్దీన్లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచి్చన తర్వాత బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో తగిన గుర్తింపును ఇచి్చంది. రెండో దఫా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఉద్యమ వీరులను చిన్నచూపు చూసిందని, అసలు లక్ష్యమే పక్కదారి పట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ► మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పారీ్టతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తుండగా... మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెప్పినా బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకో లేదంటూ ఇటీవల కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో.. ఆయన కాంగ్రెస్లో ఆయన చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా నగరంలో పట్టు కోసం బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ టచ్లో 20 మంది కార్పొరేటర్లు ► బీఆర్ఎస్కు చెందిన సుమారు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీడిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పారీ్టపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు గులాబీలు చేజారకుండా కట్టడి చేయాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ నుంచి పోతే పోనీ.. వాళ్ల కర్మ అన్నట్లు వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్ బాట పడుతున్నట్లు సమాచారం. -
ఓటర్లపై ఒత్తిడి తెస్తే.. చర్యలు తీసుకోవాల్సిందే!
కూకట్పల్లి (హైదరాబాద్): ‘‘ప్రజలు స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ఓటు హక్కును విని యోగించుకునేలా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండాలి. ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఒత్తిడి చేసే లా అభ్యర్థులు వ్యవహరిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ బాగా పనిచేసింది. కానీ ఓ అభ్యర్థి తనకు ఓటేయకపోతే ఆత్మ హత్య చేసుకుంటానంటూ ప్రచార మాధ్యమా లలోకెక్కారు. అది విచారకరం. ప్రజలను ఒత్తి డికి గురిచేసి గెలవడానికి అభ్యర్థి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం సరి కాదు..’’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన పాడి కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమ ర్శించారు. గురువారం మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ప్రజలు ఓటు హక్కును ఆయుధంలా ఉపయోగించుకుని తమ జీవన పరిస్థితులకు మార్చుకోవచ్చని.. ఆ మార్పే దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు. మంచి వారికి ఓటేయాలి.. తమ సమస్యలను వినడంతోపాటు అభివృద్ధి చేయగల సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకా శం ఓటు ద్వారానే లభిస్తుందని.. అభ్యర్థుల గుణ గణాలను పూర్తిగా విశ్లేషించాకే ఓటేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గుంతల రోడ్లను చూసి ఎమ్మెల్యేలు, ఎంపీలను తిట్టేకంటే ముందు మంచివారికి ఓటు వేయటం మంచి నిర్ణయమన్నారు. ఓటింగ్ సమయంలో వచ్చిన సెలవులను ఉపయోగించుకొని కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్తున్నారని.. ఆ ఆలోచన సరికాదని స్పష్టం చేశారు. యువత ఓటు హక్కును తప్ప కుండా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ మాట్లా డుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. గెలవకుంటే శవయాత్ర అంటూ.. గతంలో కేసీఆర్ సర్కారు పాడి కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా గవర్నర్ పెండింగ్లో పెట్టడం, దీంతో కౌశిక్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపించకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత తాను గెలిస్తే జైత్రయాత్ర, లేకుంటే శవయాత్ర జరుగుతుందని ఆయన పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం కౌశిక్రెడ్డిని ఉద్దేశిస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
100 మీటర్ల గొయ్యితీసి..బీఆర్ఎస్ను పాతిపెడతా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ను బొక్కబోర్లాపడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆనవాళ్లు లేకుండా 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరో, మేమో చూసుకుందామని సవాల్ చేశారు. పులి బయటికి వస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని.. దాని కోసమే ఎదురుచూ స్తున్నానని, తమ దగ్గర బోను, వల ఉందని వ్యాఖ్యానించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి శుక్రవారం లండన్లో నిర్వహించిన ‘ఇండియా డయాస్పోరా ఆర్గనైజేషన్స్ మీట్’కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘‘దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీ యాలు మాట్లాడొద్దని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలనుకుని బయలుదేరాను. కానీ ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చ లు.. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి ప్రజలెన్ను కున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూశాక.. లండన్ గడ్డమీద రాజకీయ అంశాలు మాట్లాడదల్చుకున్నా. మంచి పనులకు ఎవరు పునాదిరాయి వేసినా.. వాటిని కొనసాగించడానికి నాకు గానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. కానీ కొందరు తమ కుటుంబం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టి, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. పైగా ఈ రోజు అవినీతి గురించి చర్చే జరగొద్దన్నట్టు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించవద్దన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచంతో పోటీ పడతాం.. మేం సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళుతుంటే కొందరు ఓర్వలేకపో తున్నారు. నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నా. ఇది ఆషామాషీగా రాలేదు. అయ్యనో, తాతనో ఇస్తే రాలేదు. నేను అయ్య పేరు చెప్పుకుని మంత్రి అయ్యి, విదేశీ పర్యటనల పేరు మీద విలాస జీవితం గడపడానికి రాలేదు. రాష్ట్ర అభివృద్ధిని మనసులో పెట్టుకుని వచ్చా. పక్క రాష్ట్రాలతో పోటీపడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీపడే ఆలోచన. ప్రపంచంతో పోటీపడే యువత, హైదరాబాద్ నగరం, ఐటీ మేధావులు, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఓఆర్ఆర్, ఐటీ, ఫార్మా కంపెనీలు నా దగ్గరున్నాయి. ప్రపంచంతో పోటీపడతానే తప్ప దివాలా తీసిన దద్దమ్మలతో నాకేం పోటీ? వారికి అధికారం పోయినా అహంకారం, బలుపు తగ్గినట్టు లేదు. మేం బ్రిటన్కు వచ్చి ఇంతమంది కుటుంబ సభ్యులను కలిశాం. ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ రావాలి. అక్కడి పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించాలి. ఫొటోలు దిగాలి. థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తాం..’’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ శక్తి, వారసత్వ సంపదకు మీరే ప్రచారకులని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని లండన్లోని ఎన్నారైలను కోరారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళతానని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం 60 ఏళ్లలో 16 మంది సీఎంలు రూ.72 వేల కోట్లు అప్పులు చేస్తే.. గత పదేళ్లలో ఒకే ఒక్క కుటుంబం రూ.ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఆ దరిద్రాన్ని మన నెత్తిమీద పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే దిశలో పనిచేస్తామని చెప్పాం. కానీ అసెంబ్లీ మొదలుపెట్టిన రోజునే.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని బిల్లా, రంగాలు అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని, నాయకులను బొక్కబోర్లా పడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదు. ఇంకా మాట్లాడుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం. బిల్లారంగా, చార్లెస్ శోభారాజ్లకు సూటిగా సవాల్ విసురుతున్నా. రెండు రోజుల్లో తెలంగాణ గడ్డమీద కాలుపెడతా. ఈ నెల 26వ తేదీ తర్వాత ఇంద్రవెల్లిలో మొదలుపెట్టి తెలంగాణ నలుమూలలా సుడిగాలి పర్యటన చేస్తా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీ నిషాన్ (ఆనవాళ్లు) లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా. -
ఎంబీటీతో ఎంఐఎంకు చెక్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ)తో చెక్ పెట్టే దిశలో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన ఎంఐఎంను కట్టడి చేసేందుకు ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహంలో భాగంగా ఎంబీటీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆ ప్రతిపాదన అమల్లోకి వచ్చేలా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రానున్న లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎంబీటీకి కేటాయించాలనే ప్రతిపాదన అధిష్టానం పెద్దల వరకు చేరింది. అంతకంటే ముందే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో ఎంబీటీని చేర్చుకోవాలని, తద్వారా ఎంఐఎంకు దీటుగా ఎంబీటీని దేశ స్థాయిలో ప్రోత్సహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి సమావేశాల్లో ఎంబీటీని భాగస్వామిని చేయడంతో పాటు ఎన్నికల ప్రచార సభలకు ఆహా్వనించడం ద్వారా ఎంఐఎం ద్వారా బీజేపీకి కలుగుతున్న లబ్ధి, ఆ రెండు పార్టీల దోస్తీని ముస్లిం మైనార్టీలకు అర్థమయ్యేలా పాతబస్తీ పార్టీ అయిన ఎంబీటీతోనే చెప్పించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ‘బస్తీ’మే సవాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్తో కలిసి పనిచేసిన ఎంఐఎం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్కు కొరకరాని కొయ్యగా తయారయింది. పాతబస్తీలో తనకున్న బలాన్ని, బలగాన్ని వేదికగా చేసుకుని అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ నిలబడింది. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందూ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పట్ల ఎంఐఎం వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు అదనపు బలంగా, తమకు వైరిపక్షంగా మారిన ఎంఐఎంకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంది. పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ఇక ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ పాతబస్తీలో ఒవైసీ సేనకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ అంచనాలతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఎంబీటీ (యాకుత్పుర), కాంగ్రెస్ (నాంపల్లి) ఢీ అంటే ఢీ అనేలా ఎంఐఎంతో తలపడ్డాయి. చాలా తక్కువ తేడాతో ఓడిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిన నేపథ్యంలో ఎంబీటీని ముందుంచడం ద్వారా ఆ రెండింటితో పాటు మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టవచ్చనే అంచనాల్లో కాంగ్రెస్ నాయకులున్నారు. ఈ ప్రయత్నంలోనే విజయం సాధిస్తామని, ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎంను కొంతమేర నిలువరించగలిగినా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి మరింత సమర్థవంతంగా ఎంఐఎంను ఢీ కొట్టగలుగుతామనేది అటు ఎంబీ టీ, ఇటు కాంగ్రెస్ల భావనగా కనిపిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నప్పుడే ఎంఐఎంను కట్టడి చేయగలం. ఇందుకు ఎంబీటీని వేదికగా చేసుకుని ముందుకెళితే మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం. లోక్సభ ఎన్నికలే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మా రెండు పార్టీలు అవగాహనతో వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ ఎన్నికలకు ముందే వాస్తవానికి, ఎంబీటీతో పొత్తుపై అసెంబ్లీ ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయి. అప్పట్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా వచ్చిన ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ రెండు, మూడుసార్లు భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎంబీటీతో స్నేహం నష్టం చేస్తుందనే భావనతో వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే స్నేహం ద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టే దిశలో ముందుకెళుతోంది. ఇందుకు ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ కూడా సుముఖంగా ఉన్నారు. పాతబస్తీలోని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సానుభూతిపరులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
పడకేసిన పాలన!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో పనులు పడకేశాయి. కోటి మందికి పైగా ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలో సేవలందడం లేదు. చెత్త సమస్యల నుంచి రోడ్ల అవస్థల దాకా.. ప్రాపర్టీట్యాక్స్ ఫిర్యాదుల నుంచి దోమల నివారణ దాకా ప్రజా సమస్యల పట్టింపు లేకుండా పోయింది. మూడు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల పేరిట పనులు కుంటుపడగా.. ప్రస్తుతం ‘ప్రజా పాలన’ పేరిట పనులు జరగడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమ సమస్యలు తీర్చే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ► నవంబర్ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అంతకు ముందునుంచే ఎన్నికల నిబంధనల పేరిట పనులు కుంటుపడ్డాయి. పలువురు అధికారులు సైతం ఎన్నికల విధుల్లోనే ఉండటంతో తమ విభాగాలకు సంబంధించిన పనులు పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో తెలియదని పనుల జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలిశాక చేయాలనే తలంపుతో పనులు చేయడం లేరు.దానికి తోడు నిధుల లేమితోనూ శ్రద్ధ చూపడం లేదు. ► ప్రాజెక్టులకు సంబంధించిన పనులను అలా వదిలివేయగా, ప్రజల నిత్య సమస్యలను సైతం పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ముగిసేంత దాకా ఎన్నికల విధుల సాకుతో సమస్యలను వినిపించుకోలేదు. ప్రస్తుతం ‘ప్రజాపాలన’ పేరిట మిగతా విషయాలను పట్టించుకోవడం లేదు. వివిధ విభాగాల అధికారులను, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి విభాగాధిపతుల దాకా ప్రజాపాలనలో భాగస్వాములను చేశారు. కార్యక్రమం పకడ్బందీగా, త్వరితగతిన నిర్వహించాలనే తలంపుతో టీమ్లీడర్లు, స్పెషలాఫీసర్లు, తదితర పేర్లతో నియమించారు. దాంతో వారు తమ రెగ్యులర్ విధులు నిర్వహించడం లేదు. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. వివిధ స్థాయిల్లోని అధికారుల మధ్య సమన్వయం కోసమని స్పెషలాఫీసర్లను నియమించినా సమన్వయం కనిపించడం లేదు. ఎందరున్నా.. ఎందరిని నియమించినా తగిన పర్యవేక్షణ, సమన్వయం లేకే ప్రజాపాలన దరఖాస్తుల్ని బజారు పాల్జేసి అభాసుపాలయ్యారు. అందుకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోలేకపోయారు. డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లనుంచి వివిధ విభాగాల అధికారులందరూ ‘ప్రజాపాలన’ విధుల్లోనే ఉన్నారంటున్నారు. సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేరని కొందరు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.ఆయా విభాగాల అధికారులతోపాటు కమిషనర్ సైతం ‘ప్రజాపాలన’ పనుల కోసం ఇతర జోన్లకు వెళ్లారనడంతో నిస్సహాయంగా వెనుదిరిగారు. ‘ప్రజావాణి’కి వెళ్లాల్సిందేనా.. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జరిగే ‘ప్రజావాణి’కి హాజరు కావాల్సిందేనా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుడ్డిలో మెల్ల చందంగా కనీసం సర్కిల్, జోనల్స్థాయిల్లో ‘ప్రజావాణి’ని ఇటీవలే ప్రారంభించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులనైనా వెంటనే పరిష్కరిస్తారో లేదో?!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
క్రాప్లోన్ కట్టాల్సిందే...!
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
ఢిల్లీ అండతో.. అడ్డుకుంటున్నారు: సీఎం జగన్
Lok Sabha Election 2024: మట్టిమనిషి!
మోదీ నుంచి నడ్డా వరకు
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
తప్పక చదవండి
- మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
- బీజేపీకే దక్షిణ భారత్: అమిత్ షా
- Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
- బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
- Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
- Lok Sabha Election 2024: మట్టిమనిషి!
- Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం
- రేవంత్కు మతి భ్రమించింది
- Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
- కూటమి వస్తే ప్రధాని ఎవరు?
Advertisement