జార్ఖండ్‌ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎమ్‌ఎస్‌ ధోనీ | MS Dhoni Appointed Brand Ambassador For Jharkhand Elections | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎమ్‌ఎస్‌ ధోనీ

Oct 26 2024 10:08 AM | Updated on Oct 26 2024 10:32 AM

MS Dhoni Appointed Brand Ambassador For Jharkhand Elections

రాంచీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్‌ ధోనీ ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ వెల్లడించారు. ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని జార్ఖండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ కె.కుమార్ అన్నారు. 

స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లకు.. ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ విజ్ఞప్తిని, ప్రజాదరణను వినియోగించుకోవాలని  ఎన్నికల సంఘం భావిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement