
సాక్షి, నారాయణపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న కారు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో డ్రైవర్ తీవ్ర గాయాల పాలవ్వగా.. ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. ప్రమాదవార్త తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కూతురు లేని లోకంలో ఉండలేను!)
Comments
Please login to add a commentAdd a comment