
సిద్దిపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో దంపతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ముందుగా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఆపై భార్త కూడా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం ఎల్లారెడ్డిలో ఈ దారుణం జరిగింది. కెమ్మసారం భాగ్య పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
దీన్ని చూసిన భర్త నాగరాజ్.. భార్య లేని జీవితం వద్దకుని అతను కూడా పురుగుల మందు సేవించాడు. దాంతో నాగరాజ్ కూడా తనువు చాలించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ దంపతులకున్న నలుగురు పిల్లలు అనాథులుగా మారిపోయారు. అమ్మా, నాన్న ఇక తమతో ఉండరని తెలిసి రోదిస్తున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment