Wife Murdered Husband In Karnataka - Sakshi
Sakshi News home page

భర్త హోటల్‌లో పని చేసే సప్లయర్‌తో భార్య వివాహేతర సంబంధం

Jul 4 2023 8:55 AM | Updated on Jul 8 2023 9:22 AM

wife murders husband  - Sakshi

మ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా  తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది.

కర్ణాటక: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడి సహా ఐదుగురిని తలఘట్టపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు...గతనెల 29న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా నణ్ణూరుకు చెందిన అరుణ్‌కుమార్‌ (34) ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి రోడ్డులో జేఎస్‌ఎస్‌ కళాశాల పక్కన హోటల్‌ నడిపిస్తున్నాడు. ఆ హోటల్‌కు గణేశ్‌ అనే వ్యక్తి నీటిని సరఫరా చేస్తున్నాడు. ఇతనితో అరుణ్‌కుమార్‌ భార్య రంజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది.

దీనికి తోడు అరుణ్‌కుమార్, గణేశ్‌తో చేబదులుగా కొంత నగదు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే గణేశ్, రంజిత వివాహేతర సంబంధం గురించి అరుణ్‌ తెలుసుకుని భార్యను తీవ్రంగా మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా  తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. గతనెల 28న పార్టీ చేసుకుందామని చెప్పి అరుణ్‌ను గణేశ్‌ అతని శివానంద, దీపు, శరత్‌లు పిలిపించారు.

అరుణ్‌ రాగానే అతని కళ్లపై కారంపొడి చల్లి మారణాయుధాలతో చంపి హత్య చేశారు. మరుసటి రోజు తలఘట్టపుర పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా  కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా  రంజిత మొబైల్‌ ఫోన్‌కాల్‌ డేటా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement