Hyderabad: ట్యాంకర్‌ ఢీ కొట్టి.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగింది | Young woman died In Road Accident | Sakshi
Sakshi News home page

Hyderabad: భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌పై ఘోరం.. ట్యాంకర్‌ ఢీ కొట్టి.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగింది

Jan 18 2024 12:31 PM | Updated on Jan 18 2024 1:24 PM

Young woman died In Road Accident - Sakshi

పాపం.. ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న సునీత.. వాటర్‌ ట్యాంకర్‌ అతివేగానికి.. 

హైదరాబాద్, సాక్షి: భరత్ నగర్ ఫ్లైఓవర్ పై ఘోరం జరిగింది. వాటర్‌ ట్యాంక్‌ ఢీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సునీతగా పోలీసులు ధృవీకరించారు. 

సునీత స్వస్థలం కర్నూల్‌ శ్రీశైలం. నగరంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోంది. గురువారం ఉదయం కూకట్‌ పల్లి నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా.. ఓ వాటర్‌ ట్యాంక్‌ దూసుకొచ్చింది. వెనుక నుంచి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. 

యాక్సిడెంట్‌ను చూసేందుకు అటుగా వెళ్లే వాహనదారులు ఆగిపోవడంతో.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement