కొబ్బరి శాస్త్రవేత్తలకు టీమ్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి శాస్త్రవేత్తలకు టీమ్‌ అవార్డు

Published Fri, Feb 28 2025 12:08 AM | Last Updated on Fri, Feb 28 2025 12:08 AM

కొబ్బరి శాస్త్రవేత్తలకు టీమ్‌ అవార్డు

కొబ్బరి శాస్త్రవేత్తలకు టీమ్‌ అవార్డు

అంబాజీపేట: వివిధ పంటలపై ఆశించే పురుగులు, తెగుళ్ల సమర్ధ నివారణకు జీవ నియంత్రణ పద్ధతుల వినియోగంపై స్థానిక డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలకు టీమ్‌ అవార్డు లభించినట్టు కేంద్ర అధిపతి డాక్టర్‌ ఎన్‌.బి.వి.చలపతిరావు తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరులో జరిగిన రెండవ అంతర్జాతీయ జీవ నియంత్రణ సమావేశంలో ఈ అవార్డును ఇండియన్‌ కౌన్సిల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌, నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇన్సెక్ట్స్‌ రీ సోర్సెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. ఎస్‌.సుశీల్‌, పరిశోధనా కేంద్ర అధిపతి డాక్టర్‌ చలపతిరావుకు ప్రదానం చేశారు. కొబ్బరి, కోకో, పంటలపై పురుగులు, తెగుళ్లను జీవ నియంత్రణ పద్ధతులలో నివారిస్తూ, బదనికలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేసినందుకు ఈ అవార్డు లభించినట్లు చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ఇతర పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement