పులకించిన పీఠికాపుర వీధులు
పిఠాపురం: గరళ కంఠుడి రథ చక్రాల ఘట్టనలతో పీఠికాపురం పులకించి పోయింది. ఆది దేవుడు కై లాసం నుంచి భువికి దిగి వచ్చాడా అన్నట్టుగా భక్త జనం బారులు తీరి పుర వీధుల్లో నిర్వహించిన ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి దివ్య రథోత్సవం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున పిఠాపురం మహారాజా రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ పేరున ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో లింగోద్భవ పూజలు, అభిషేకాలు, తొలి అర్చన చేశారు. భక్త జన సందోహం నడుమ కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాల అనంతరం ఆలయం నుంచి పల్లకీలో ఊరేగింపుగా కుంతీ మాధవస్వామి వారి ఆలయం వద్ద ఉన్న స్వామివారి రథం వద్దకు తీసుకెళ్లారు. బ్యాండుమేళాల నడుమ విద్యుద్దీపాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించిన రథంపై పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించిన ఉత్సవ విగ్రహాలను రథంపై అధిష్టింప చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. మెయిన్రోడ్డు మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగిన రఽథోత్సవానికి అశేష భక్త జనవాహిని కదిలి వచ్చింది. భక్తులు రథాన్ని లాగి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పులకించిన పీఠికాపుర వీధులు
Comments
Please login to add a commentAdd a comment