ఆపిల్‌ సాగును దేశవ్యాప్తం చేసి, పద్మశ్రీ అందుకున్న హారిమన్‌ | The Apple Man of India Hariman Sharma Padma Sri success story | Sakshi

ఆపిల్‌ సాగును దేశవ్యాప్తం చేసి, పద్మశ్రీ అందుకున్న హారిమన్‌

Jan 28 2025 5:23 PM | Updated on Jan 28 2025 5:46 PM

The Apple Man of India Hariman Sharma Padma Sri  success story

ఆపిల్‌ పండ్ల తోటలను హారిమన్‌ శర్మ మంచు కొండల మీద నుంచి మైదాన  ప్రాతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని గల్లసిన్‌ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్త΄ోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆ  ప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్‌ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండ ప్రాతాల్లో మాత్రమే ఆపిల్‌ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమ ్ర΄ాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్‌ ప్రయోగాలు చేయటం  ప్రాంభించారు.

పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదాన ్ర΄ాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్‌ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్‌ఎంఎన్‌–99 అనే గ్రాఫ్టెడ్‌ ఆపిల్‌ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ దృష్టికి వెళ్లటంతో  ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్‌ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. 

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్‌ ఆపిల్‌ మొక్కలను అందించిన ఘనత ఆయనది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement