Himachal pradesh
-
ఆపిల్ సాగును దేశవ్యాప్తం చేసి, పద్మశ్రీ అందుకున్న హారిమన్
ఆపిల్ పండ్ల తోటలను హారిమన్ శర్మ మంచు కొండల మీద నుంచి మైదాన ప్రాతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని గల్లసిన్ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్త΄ోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆ ప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండ ప్రాతాల్లో మాత్రమే ఆపిల్ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమ ్ర΄ాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్ ప్రయోగాలు చేయటం ప్రాంభించారు.పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదాన ్ర΄ాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్ఎంఎన్–99 అనే గ్రాఫ్టెడ్ ఆపిల్ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్కుమార్ ధుమల్ దృష్టికి వెళ్లటంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్ప్రదేశ్లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్ ఆపిల్ మొక్కలను అందించిన ఘనత ఆయనది. -
టీమిండియా ప్లేయర్ షాకింగ్ రిటైర్మెంట్..
టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్, హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 34 ఏళ్ల రిషి ధావన్ వైట్బాల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నిధావన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 గ్రూపు స్టేజి నుంచి హిమాచల్ ప్రదేశ్ నిష్క్రమించిన వెంటనే ధావన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు."పరిమిత ఓవర్ల క్రికెట్కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా బాధగా ఉంది. కానీ అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత 20 ఏళ్లగా క్రికెట్ నా జీవితంలో భాగమైంది. ఈ క్రీడ నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చింది.బీసీసీఐ (BCCI), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA), పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ధన్యవాదాలు. అత్యున్నత స్ధాయిలో నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు ఎల్లప్పుడూ గర్వకారణం" అంటూ ఇన్స్టాలో ధావన్ రాసుకొచ్చాడు. ధావన్ ఇకపై రెడ్బాల్ క్రికెట్లో మాత్రం ఆడనున్నాడు.ధోని సారథ్యంలో అరంగేట్రం..కాగా ఈ హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ 2016లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రిషి.. తన కెరీర్లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్లన్నీ 2016లోనే అతడు ఆడాడు. ఆ తర్వాత అతడికి ఛాన్స్లు లభించలేదు. భారత తరపున అతడు కేవలం 2 వికెట్లు మాత్రమే సాధించాడు.దేశవాళీ క్రికెట్లో అదుర్స్..దేశవాళీ క్రికెట్లో మాత్రం రిషి ధావన్కు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి సారథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీ(2021-22)ని గెలుచుకుంది. ఆ సీజన్లో ధావన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 458 పరుగులతో పాటు17 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు.తన కెరీర్లో 34 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన ధావన్.. 2906 పరుగులతో పాటు 186 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 135 టీ20ల్లో 1740 పరుగులతో పాటు 118 వికెట్లను అతడు సాధించాడు. మొత్తంగా 4,646 పరుగులు, 186 వికెట్లతో తన వైట్ బాల్ కెరీర్ను ధావన్ ముగించాడు. అదే విధంగా ధావన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్ -
సిమ్లాలో ఘనంగా భుండా మహాయజ్ఞం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలోని స్పాల్ లోయలో అరుదైన, పురాతనమైన సంప్రదాయం మళ్లీ ప్రారంభమైంది. దేవంతలందరినీ ఏకం చేస్తుందని నమ్మే సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనను పునరుద్ధరించారు. సిమ్లాలోని మారుమూలమైన దల్గావ్లో ధారి్మక కార్యక్రమం ‘భుండా మహా యజ్ఞం’ జరిగింది. ఈనెల 2న ప్రారంభమైన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. నాలుగురోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్పాల్ లోయను కలుపుతూ ఉండే రెండు పర్వతాల మధ్య ముంజి(పవిత్రమైన తాడు)పై జారే కార్యక్రమం శనివారం నిర్వహించారు. మరణలోయగా పిలుచుకునే స్పాల్ లోయలో ఒక కొండ నుంచి మరో కొండకు కనీసం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. రెండు కొండలపైన ఉన్న వ్యక్తులు తాడును బిగ్గరగా పట్టుకోగా.. ఆ తాడును పట్టుకుని జారతారు. ఈ సాహసోపేతమైన కార్యక్రమాన్ని సూరత్ రామ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు శనివారం ఆ తాడు గుండా జారాడు. మరో అంచున ఉన్న వ్యక్తుల చేతిలో తాడు చేజారింది. వెంటనే పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది తరలివచ్చారు. -
ముఖ్యమంత్రి సమోసాలు ఎవరు తీసుకున్నారు?.. సీఐడీ దర్యాప్తు
‘నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నేనొచ్చిన కార్యక్రమానికి నాకు సమోసాలు పెట్టకుండా.. నా సిబ్బందికి పెడతారా? వెంటనే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారెవరో గుర్తించి, కఠిన చర్యలు తీసుకోండి’ అని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమోస స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించేందుకు వెళ్లారు. సీఎం సుక్కు పర్యటన రాక నేపథ్యంలో ఐజీ ర్యాంక్ అధికారి.. సీఎం వస్తున్నారు. వెంటనే స్నాక్స్ ఏర్పాటు చేయండి అంటూ ఎస్సైని ఆదేశించారు. దీంతో సదరు ఎస్సై (సమోసాలు సీఎం కోసమని చెప్పకుండా) .. తన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), హెడ్ కానిస్టేబుల్ను సమోసాలు తీసుకుని రావాలని పురమాయించారు. ఎస్సై ఆదేశాలతో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థానిక లక్కర్ బజార్లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి మూడు పెట్టెల సమోసాలను తీసుకొచ్చారు. సీఎం సుక్కు కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడే ఉన్న ఏఎస్సై, కానిస్టేబుల్ తెచ్చిన సమోసాల్ని పక్కనే ఉన్న మహిళా ఎస్సైకి అందించారు. స్నాక్స్ పెట్టాలని కోరారు. మహిళా ఎస్సై ఆ సమోసాలను సీఎం కోసం తెచ్చినవే అని తెలియక బదులుగా సీఎం సిబ్బందిలోని మెకానికల్ ట్రాన్స్పోర్ట్ (ఎంటీ) విభాగానికి పంపించారు. ఆ విభాగంలోని ఉద్యోగులే ఆ సమోసాల్ని తిన్నారు.మీటింగ్లో ఉన్న సీఎంతోపాటు, సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. అధికారుల తీరుపై సీఎంతో పాటు సీఐడీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశాలకు జారీ చేశారు. -
‘క్షమించండి’ అని వేడుకున్నా.. కంగనాపై ఆగని విమర్శలు
ధర్మశాల : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ‘తప్పుగా మాట్లాడాను. క్షమించండి’ అని వేడుకున్నా అటు విపక్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఆగడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేసిన మూడూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాజాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఖంఢించారు. కంగనా మాటలు నిరాధారామైనవని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచిని దెబ్బ తీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోదీ చేస్తున్న మంచిని దెబ్బతీయొద్దు‘‘కంగనా రనౌత్ స్టేట్మెంట్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనికిరాని, నిరాధారమైన,అసంబద్ధమైన ప్రకటనలు, పంజాబ్ రైతులు పంజాబ్, పంజాబీ సంక్షేమం కోసం మోదీ చేస్తున్న అన్ని మంచి పనులను, అందిస్తున్న సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కంగనా వ్యవహరిస్తున్నారు’’ అని షెర్గిల్ మండిపడ్డారు. #WATCH | Delhi: On his tweet on actor & BJP MP Kangana Ranaut, party's national spokesperson Jaiveer Shergill says, "I am grateful to the BJP for distancing themself from the comments of Kangana Ranaut. But as a Punjabi, I must say that Kangana Ranaut's consistent rant, useless,… pic.twitter.com/jVa5qKJpe7— TIMES NOW (@TimesNow) September 25, 2024పంజాబ్, పంజాబ్ రైతులతో ప్రధాని మోదీకి ఉన్న బంధం విడదీయరానిది. మా పార్టీ ఎంపీ కంగనా చేసిన బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ బంధాన్ని అంచనా వేయొద్దని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలిమంగళవారం కంగనా తన నియోజకవర్గం మండిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ‘రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి. రైతులే దానిని డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.వ్యాఖ్యలు.. ఆమె వ్యక్తిగతంఆమె మాటలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వెల్లడించారు. పార్టీ తరుఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అధికారం లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కంగనా క్షమాపణలు చెప్పారు. అయినా బీజేపీ నేతలు మాత్రం కంగనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షెర్గిల్ సైతం ఖండించారు. చదవండి : సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు -
‘మీ పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పరిశుభ్రమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము’ అని పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.BIG NEWS 🚨 Himachal Congress Minister Vikramaditya Singh announces that all restaurants, food outlets will have to display owner’s identification. SHOCKING part is he referenced recent directive from CM Yogi Adityanath in his postYOGI MAGIC ACROSS INDIA 🔥🔥Yesterday CM… pic.twitter.com/J8YltyFvF4— Times Algebra (@TimesAlgebraIND) September 25, 2024పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో ఆహార లభ్యతపై ప్రజల్లో నెలకొన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త నిబంధనల్ని అమలు చేయాలని భావించినట్లు విక్రమాదిత్య సింగ్ చెప్పారు. 👉 చదవండి : రాష్ట్రంలో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్యూపీ యోగి సర్కార్ సైతంకాగా,మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేలా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు తినుబండరాలు అమ్మే ప్రదేశాల్లో యజమానులు, సిబ్బంది, చెఫ్లు తప్పని సరిగా మాస్క్లు, గ్లౌజ్స్ ధరించాలి. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు సిబ్బంది, ఇతర మేనేజర్లు ఇతర ఉద్యోగులు తప్పని సరిగా వారి వివరాల్ని మెనూ కార్డ్లో ప్రదర్శించాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మాకు జీతాలేం వద్దు.. సీఎం, మంత్రుల తీర్మానం
రాష్ట్రంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్), క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.రానున్న రెండు నెలలపాటు జీతాలు, టీడీ, డీఏలు తీసుకోబోమని కేబినెట్లో చర్చించిన తర్వాత మంత్రివర్గంలోని సభ్యులంతా నిర్ణయించారు’ అని సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్-ఆగస్ట్ నెలలో హిమాచల్ ప్రదేశ్లో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి.100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రెండు నెలల పాటు తమ జీత భత్యాల్ని తీసుకోమని తీర్మానించారు. -
విజయం దిశగా కంగనా? మండీ క్వీన్ ఇంట్లో సంబరాలు
హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాల ఫలితాల ట్రెండ్ వెలువడుతోంది. రాష్ట్రంలోని హాట్ సీట్ అయిన మండీపైనే అధికంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ హాట్ సీటు నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె తొలిసారి ఎన్నికల పోరులో దిగారు. ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్లో వెనుకంజలో ఉన్నా, ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఆమె అధిగమిస్తూ వస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ జెండా ఎగురవేయనుంది. మండీ లోక్సభ సీటు నుంచి కంగనాకు గెలవనున్నారనే అంచనాలున్నాయి. హిమాచల్ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలకు గాను మూడు లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఒక సీటు కాంగ్రెస్కు దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల్లో కంగనా విజయపథాన దూసుకుపోతుండటంతో ఆమె ఇంటిలో సంబరాల వాతావరణం నెలకొంది. -
ప్రపంచంలోనే ఎత్తయిన పోలింగ్ స్టేషన్లో ఓట్ల పండుగ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్ హిమాలయాల శిఖరాలపై 15,256 అడుగుల ఎత్తులోని తాషిగ్యాంగ్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు. అయినా ఇక్కడ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని స్పితి వ్యాలీ.. హిమాచల్లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది మండీ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై బీజేపీ నుంచి నటి కంగనా రనౌత్ పోటీకి దిగారు.తాషిగ్యాంగ్లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్లో 62 మంది ఓటు వేయనున్నారు. తాషిగ్యాంగ్లో పోలింగ్ నిర్వహించడం ఇది నాలుగోసారి. అదనపు జిల్లా కమిషనర్ జైన్ మాట్లాడుతూ 2022లో విపరీతమైన చలి ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన అర్హులైన ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. -
మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్తో పాటు బిహార్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM— ANI (@ANI) June 1, 2024 -
ముగిసిన లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్
Lok Sabha Election 2024 Phase 7 Updates.. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ 58.34 శాతంబీహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 48.86 శాతం పోలింగ్ నమోదుఛండీఘడ్ లో 62.80 శాతం పోలింగ్ నమోదుహిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 66.56 శాతం పోలింగ్ నమోదుజార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 67.95 శాతం పోలింగ్ నమోదుఒడిస్సా లో 6 లోక్ సభ స్థానాల్లో 62.46 శాతం పోలింగ్ నమోదుపంజాబ్ లో 13 స్థానాల్లో 55.20 శాతం పోలింగ్ నమోదుఉత్తరప్రదేశ్ 13 స్థానాల్లో 54. శాతం పోలింగ్ నమోదుపశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 68.98 శాతం పోలింగ్ నమోదు👉 మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.09 శాతం పోలింగ్ నమోదు ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదయిన పోలింగ్ శాతం 40.09బీహార్(8)-35.65ఛండీఘడ్(1)-40.14హిమాచల్ ప్రదేశ్(4)-48.63జార్ఖండ్(3)-46.80ఒడిస్సా(6)-37.64పంజాబ్(13)-37.80ఉత్తరప్రదేశ్ (13)- 39.31పశ్చిమ బెంగాల్( 9)-45.07 👉ఓటు వేసిన నటి, టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి. కోల్కత్తాలోని పోలింగ్ బూత్ ఓటు వేసిన మిమీ చక్రవర్తి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసి నా బాధ్యత తీర్చుకున్నాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. #WATCH | West Bengal: Actor and former TMC MP Mimi Chakraborty casts her vote at a polling booth in Kolkata. #LokSabhaElections2024 pic.twitter.com/lt8L6GSZJO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల వేళ విషాదం.. మనోరంజన్ సాహో మృతిఓడిషాలో బింజర్హర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-157లో బూత్ లెవన్ ఆఫీసర్ మనోరంజన్ సాహో మృతిచెందారు. ఎన్నికల విధుల్లోనే ఆయన మరణించినట్టు కలెక్టర్ నిఖిల్ పవన్ కల్యాణ్ తెలిపారు. Odisha | One BLO (Block Level Officer), Manoranjan Sahoo (58) of booth no-157 under Binjharpur Assembly Constituency of Jajpur district died while on election duty: Collector & DM cum DEO, Nikhil Pavan Kalyan#LokSabhaElections2024— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన నటుడు ఆయూష్మాన్ ఖురానా. ఛండీగఢ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.#WATCH | Actor Ayushmann Khurrana shows the indelible ink mark on his finger after voting at a polling booth in Chandigarh.He says, "I came back to my city to cast my vote and exercise my right...Mumbai recorded a very low voter turnout this time but we should cast our… pic.twitter.com/7UTPNGCMl1— ANI (@ANI) June 1, 2024 👉ఓటుపై అవగాహన కోసం వినూత్న ప్రయోగం.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంపై కుషీనగర్ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను 2012 నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా గుర్రంపై వచ్చి ఓటు వేస్తున్నట్టు తెలిపాడు. #WATCH | To create voter awareness, a man arrives on a horse at a polling station to cast his vote in Kushinagar, Uttar PradeshHe says, "In the 2012, 2017 & 2022 Assembly elections and 2014 & 2019 Lok Sabha polls also I had arrived on horse to cast my vote." pic.twitter.com/Qw2vlivoM1— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్.#WATCH | On clash during Lok Sabha elections in West Bengal today, BJP leader & MP Dilip Ghosh says, "...TMC is doing al this due to fear of losing, but voting will be completed." pic.twitter.com/VNFPikOiGR— ANI (@ANI) June 1, 2024👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ నేత బిక్రమ్ సింగ్ మజితియా. 👉 ఓటు హక్కు వినియోగించుకున్న రేఖా పాత. బసిర్హట్లోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రేఖా. #WATCH | North 24 Parganas, West Bengal: BJP Lok Sabha Candidate from Basirhat, Rekha Patra shows her inked finger after casting her vote for #LokSabhaElections2024TMC has fielded Haji Nurul Islam from Basirhat. pic.twitter.com/eNN5bg4OkI— ANI (@ANI) June 1, 2024 👉 11 గంటల వరకు 26.30 పోలింగ్ శాతం నమోదు. ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 26.30బీహార్(8)-24.25ఛండీఘడ్(1)-25.03హిమాచల్ ప్రదేశ్(4)-31.92జార్ఖండ్(3)-29.50ఒడిస్సా(6)-22.64పంజాబ్(13)-23.91ఉత్తరప్రదేశ్ (13)- 28.02పశ్చిమ బెంగాల్( 9)-28.10 👉ఓటు వేసిన హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ. హర్మీర్పూర్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. #WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu casts his vote at a polling station in Hamirpur for the seventh phase of #LokSabhaElections2024 pic.twitter.com/c7zzjs6SnO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్ సీఎం నితిశ్ కుమార్. భక్తియార్పూర్లోని పోలింగ్ బూత్లో ఆయన వేశారు.#WATCH | Bihar CM Nitish Kumar leaves after casting his vote at a polling booth in Bakhtiyarpur. #LokSabhaElections2024 pic.twitter.com/2qogPy72zU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీలోని గాజీపూర్లో వేశారు. #WATCH | Uttar Pradesh | Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha casts his vote for #LokSabhaElections2024 in Mohanpura village, Ghazipur. pic.twitter.com/LV5N4AoNjU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ ప్రెసిడెంట్ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఎస్ఏడీ నేత హర్సిమ్రత్ కౌర్. ఫిరోజ్పూర్లోని పోలింగ్ బూత్లో వీరు ఓటు వేశారు. #WATCH | Sri Muktsar Sahib, Punjab: Shiromani Akali Dal (SAD) leader Harsimrat Kaur Badal casts her vote at a polling booth in Badal village under the Firozpur Lok Sabha constituency SAD has fielded Nardev Singh Bobby Mann from this seat. BJP has fielded Gurmit Singh Sodhi,… https://t.co/BhwLlKUElF pic.twitter.com/FGxN45jioQ— ANI (@ANI) June 1, 2024 👉పోలింగ్ వేళ బెంగాల్లో ఉద్రిక్తతలు..సౌత్ పరగాణా-24లో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్. VIDEO | Lok Sabha Elections 2024: Punjab CM Bhagwant Mann interacts with media after casting vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/1YxNaPwBQ5— Press Trust of India (@PTI_News) June 1, 2024 VIDEO | Lok Sabha Elections 2024: "I hope there will be record voting. I am confident that the excitement in the seventh phase will be more that what we have witnessed in the last six phases of elections. There will be bumper voting and then later bumper victory," says Anurag… pic.twitter.com/RbDCOPjfY4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.VIDEO | Lok Sabha Election 2024: "I want to appeal to everyone to exercise their Constitutional rights and participate in this festival of democracy," says actor and BJP candidate from Himachal Pradesh's Mandi seat Kangana Ranaut (@KanganaTeam) after casting vote.… pic.twitter.com/7womwYt3xV— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్చుగ్. పంజాబ్లో అమృత్సర్లోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. VIDEO | Lok Sabha Elections 2024: "We have been given the right by the Constitution to choose who will rule for the next five years and who will decide the country's strategies. We should all exercise this right. I am feeling very proud and happy that I have come here along with… pic.twitter.com/zSElxK3PEd— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్ నమోదు.. ఢిల్లీ:చివరి విడతలో భాగంగా లోక్సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31బీహార్(8)-10.58ఛండీఘడ్(1)-11.64హిమాచల్ ప్రదేశ్(4)-14.35జార్ఖండ్(3)-12.15ఒడిస్సా(6)- 7.69పంజాబ్(13)-9.64ఉత్తరప్రదేశ్ (13)- 12.94పశ్చిమ బెంగాల్( 9)- 12.63 👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. గోరఖ్పూర్లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Uttar Pradesh: After casting his vote in Gorakhpur, Himachal Pradesh Governor Shiv Pratap Shukla says, "I have cast my vote today. All the voters should cast their votes today and vote for a government that can carry forward development work..."#LokSabhaElections2024 pic.twitter.com/WFVlID9xh3— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. #WATCH | Bihar: RJD chief Lalu Prasad Yadav, Rabri Devi and their daughter & party candidate from Saran Lok Sabha seat Rohini Acharya leave from a polling booth in Patna after casting their vote. #LokSabhaElections2024 pic.twitter.com/LTmGnXM4BH— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్నగర్లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Uttar Pradesh | Sikkim Governor Lakshman Prasad Acharya says, "I am happy to take part in this festival of democracy. I think that voting is a duty along with being a constitutional right and everyone should perform their duty and exercise their right..." https://t.co/qwNLm28hP9 pic.twitter.com/V2EMlKNxMu— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్. జలంధర్లోని పోలింగ్ బూత్ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్ చేశారు. #WATCH | Punjab: Former Indian cricketer and AAP Rajya Sabha MP Harbhajan Singh casts his vote at a polling booth in Jalandhar#LokSabhaElections2024 pic.twitter.com/Ph55BxqFbp— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్. గోరఖ్పూర్లోని పోలింగ్ బూత్ వేసిన రవి కిషన్, ఆయన కుటుంబ సభ్యులు. #WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan & his wife Preeti Kishan cast their votes at a polling booth in the constituency. The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf.#LokSabhaElections2024 pic.twitter.com/bTC51NMa3E— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్. గోరఖ్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన యోగి. గోరఖ్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్. #WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at a polling booth in Gorakhnath, Gorakhpur.The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf. #LokSabhaElections2024 pic.twitter.com/2Ao7uC7slU— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా #WATCH | BJP national president JP Nadda cast his vote at a polling booth in Bilaspur, Himachal Pradesh. His wife Mallika Nadda also cast her vote here. #LokSabhaElections2024 pic.twitter.com/7XZC3pU2zw— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా..👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్ చద్దా.. #WATCH | After casting his vote for the seventh phase of #LokSabhaElections2024, AAP MP Raghav Chadha says, "Today is the grand festival of India...Every vote by the citizen will decide the direction & condition of the country...I request everyone to exercise their right to… pic.twitter.com/tBqPTEdBci— ANI (@ANI) June 1, 2024 👉 చివరి దశలో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Voting for the seventh - the last - phase of #LokSabhaElections2024 begins. Polling being held in 57 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC— ANI (@ANI) June 1, 2024 👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. 👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్పాటు బీహార్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్లో ఒకటి, ఉత్తరప్రదేశ్లో ఒకటి, బెంగాల్లో ఒకటి, హిమాచల్ప్రదేశ్లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.👉 చివరి విడతలోని 57 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
కాంగ్రెస్ రెబల్కు బీజేపీ టికెట్.. మాజీ మంత్రి రాజీనామా
హిమాచల్ప్రదేశ్ మాజీ మంత్రి, లాహౌల్ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్ రెబల్కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్ లాల్ మార్కండ వైదొలిగారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్లాల్ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్ లాల్ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న ఠాకూర్ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్ లాల్ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని నాలుగు లోక్సభ స్థానాలైన హమీర్పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. -
సీఎం సీటుకు ఎసరు.. లోక్సభ ఎన్నికల వరకే ఆయన పదవి
లోక్సభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం సుఖ్వీందర్ సుకును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం స్థానాన్ని భర్తీ చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జైరామ్ ఠాకూర్. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందనే అనుమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. లోక్సభ ఎన్నికల్లో మొత్తం స్థానాల్ని గెలుపొందేలా పావులు కదుపుతున్న పార్టీ అధిష్టానం ఇప్పుడు వారినే ప్రలోభాలకు గురి చేస్తుందంటూ ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జై రామ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సంక్షోభం.. ఎమ్మెల్యేల తిరుగు బావుటా ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో రాజకీయం సంక్షోభం నెలకొంది. గత కొంత కాలంగా సీఎం సుఖ్వీందర్ సుకు తీరుపై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీకి కాంగ్రెస్కు చెందిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్ధికి క్రాస్ ఓటు వేశారు. ఈ అనూహ్య పరిణామాలతో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపించడంతో ఎమ్మెల్యేలపై రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్ధులుగా కొనసాగుతున్నారు. ఈ వరుస పరిణామాలపై జై రామ్ ఠాకూర్ స్పందించారు. సీఎం పదవి లోక్సభ ఎన్నికల వరకే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం లేదని తెలిపారు. అందుకు మండి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీపై ఓటర్ల వ్యతిరేకత, ప్రతిభా సింగ్పై పార్టీ కార్యకర్తల అసమ్మతే కారణమని అన్నారు. దీంతో పాటు లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం సుఖ్విందర్ సుఖ్ను భర్తీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష నాయకుడు పేర్కొన్నారు. రెబల్స్కు ఆఫర్లు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరుగురు రెబల్స్ను ప్రలోభాలకు గురి చేస్తుందని అన్నారు. పార్టీలోకి ఆహ్వానించి వారు కోరుకున్న పదవులతో పాటు పార్టీ టిక్కెట్లు కూడా ఆఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకు ఒప్పుకోకపోతే దాడులు తెగబడుతుందని మండి పడ్డారు. కేజ్రీవాల్ అవినీతిపై ఢిల్లీ సీఎం అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఆప్ చేస్తున్న ఆందోళనలపై ఠాకూర్ స్పందించారు. తనకు తానుగా అత్యంత నిజాయితీపరుడినని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ అవినీతి బహిర్గతమైందని, అలాంటప్పుడు ఆప్ నేతలు నిరసనలు చేసి ప్రయోజనం ఏముంటుందని బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్పై ఓటింగ్లో పాల్గొనలేదు. పార్టీ విప్ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్శర్మ, ఇందర్ దత్ లఖాన్పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్లోని బిర్ బిల్లింగ్లో ఈ ఘటన జరిగింది. పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి
దేశ రాజధాని ఢిల్లీలో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి ప్రస్తుత జనవరిలో నమోదైంది. ఈ నెల మొత్తంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీలుగా నమోదుకాగా, కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. ఈసారి చలిగాలుల ప్రభావం ఢిల్లీలో గరిష్టంగా ఐదు రోజుల పాటు కనిపించింది. జనవరి 30 వరకు నమోదైన డేటా ప్రకారం ఢిల్లీలో గత 12 ఏళ్లలో సగటున ఈ నెలలోనే చలి అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారి ఆర్కే జెనామణి తెలిపారు. జనవరిలో గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యింది. 2012 నుంచి 2024 వరకు ఢిల్లీలో ఇంత తక్కువ సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎన్నడూ నమోదు కాలేదు. అయితే కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలుగా నమోదయ్యింది. అంతకుముందు జనవరి 2013లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలుగా నమోదైంది. 2015లో గరిష్ట సగటు ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలు కాగా, 2022లో 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మంగళవారం దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది. కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత సూచిక 364 (చాలా పేలవమైన విభాగంలో) నమోదైంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నేటి ఉదయం పొగమంచు కమ్మేయనుంది. బుధవారం నుండి ఫిబ్రవరి 4 వరకు లడఖ్, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. -
‘పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయం’.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ఈ నిర్ణయం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు 2733గా ఉందని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్యూవీ కార్ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్ప్రదేశ్లోని లాహోల్ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్ వెహికిల్ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్ చౌదరి తెలిపారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్లతో పోలీసులు ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Challan issued after a video of driving a Thar in Chandra River of Lahaul and Spiti went viral on social media. SP Mayank Chaudhry said, "Recently, a video went viral in which a Thar is crossing the river Chandra in District Lahaul Spiti. The said… pic.twitter.com/V0a4J1sgxv — ANI (@ANI) December 25, 2023 ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
Christmas Celebrations: హిమాచల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సిమ్లా: క్రిస్మస్ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్, స్పితికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనాలి-రోహ్తంగ్ హైవేపై అటల్ టన్నెల్ వైపు వెళ్లే మార్గాలు కార్లతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో పోలీసులు డ్రోన్తో నిఘా పెట్టారు. సరిపడా పార్కింగ్ సౌకర్యాలు లేకపోవటం, వాహనాల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా మంది పర్యాటకులు పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో ట్రాఫిక్ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో ప్రయాణం.. ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తి లాహౌల్లో రోడ్డు మార్గం కాకుండా నది గుండా కారులో ప్రయాణించాడు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Video of tourist driving car in Chandra river in #Lahaul, Himachal goes viral, please do not expose yourself by doing such useless act. pic.twitter.com/kgLsbvnp3s — Nikhil Choudhary (@NikhilCh_) December 25, 2023 సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదీ చదవండి: యేసుక్రీస్తు బోధనలు దేశాభివృద్ధికి మార్గనిర్దేశం: ప్రధాని మోదీ -
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?
దేశంలోని పలు నగరాల తళుకుబెళుకులను మన చూసేవుంటాం. కానీ దేశంలోని అత్యంత అందమైన గ్రామాలను చూసివుండం. ఇప్పుడు మన దేశంలోని అందమైన గ్రామాలను దర్శిద్దాం. కల్ప (హిమాచల్ప్రదేశ్) కల్ప.. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న ఒక రహస్య గ్రామం. ఇది హైవే నుంచి అస్సలు కనిపించదు. అయితే ఈ గ్రామం అందం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. గ్రామం చుట్టూ యాపిల్ తోటలు కనిపిస్తాయి. ఇక్కడ నుండి కైలాస పర్వత మంచు శిఖరాలు చూడవచ్చు. ఇక్కడ కనిపించినట్లు ఆ శిఖరాలు మరెక్కడా అంత స్పష్టంగా కనిపించవు. మవ్లిన్నోంగ్ (మేఘాలయ) మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్లో ఉన్న మావ్లిన్నోంగ్.. ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం. దీనిని దేవుడి తోట అని కూడా పిలుస్తారంటే దీని అందాలను అంచనా వేయవచ్చు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం ఉండదు. వెదురుతో చేసిన డస్ట్బిన్లను ఇక్కడ ఉపయోగిస్తారు. ఖిమ్సర్ (రాజస్థాన్) చుట్టూ స్వచ్ఛమైన గాలి, ఇసుకతో కూడిన గ్రామం ఇది. ఊరి మధ్యలో సరస్సు కనిపిస్తుంది. గ్రామ సమీపంలో అందమైన చెట్లు ఉంటాయి. అందమైన గుడిసెలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్లోని ఈ గ్రామాన్ని ఇసుక దిబ్బల గ్రామం అని కూడా అంటారు. ఈ గ్రామం అందమైన రిసార్ట్ను తలపిస్తుంది. ఇక్కడ దాదాపు 300 నుంచి 400 అడుగుల ఎత్తులోని భారీ మట్టి దిబ్బలు ఉన్నాయి. పూవార్ (కేరళ) తిరువనంతపురానికి దక్షిణ తీరాన ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. ఇక్కడి పరిశుభ్రమైన, అందమైన బీచ్లు పర్యాటకులను ఇంకొన్ని రోజుల ఇక్కడ గడిపేలా చేస్తాయి. అక్టోబర్- ఫిబ్రవరి మధ్య కాలం ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. కొల్లెంగోడ్ (కేరళ) పచ్చదనం, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ చిన్న గ్రామం ఎంతో శుభ్రంగా ఉంటుంది. సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన కొల్లెంగోడ్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. జిరాంగ్ (ఒడిశా) స్వచ్ఛమైన గ్రామీణ జీవితాన్ని చవిచూసేందుకు చంద్రగిరి ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడి జిరాంగ్ లోయ, బౌద్ధ దేవాలయాలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ గ్రామం పరిశుభ్రతకు పెట్టిందిపేరుగా నిలుస్తుంది. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
మహిళా అధికారులు.. వరదలకు ఎదురు నిలిచి ధీరత్వం ప్రదర్శించారు
పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు మహిళా ఆఫీసర్ల ధైర్యగాధలు మార్మోగుతున్నాయి. ఇటీవలి పెను వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటంలో మహిళా కలెక్టర్లు, ఎస్పిలు రేయింబవళ్లు కష్టపడి ధీరత్వాన్ని ప్రదర్శించారు. చంటి పిల్లల్ని ఇళ్లల్లో వదిలి ప్రజల కోసం రోజుల తరబడి పని చేసిన ఈ ఆఫీసర్ల పరిచయం... ఉత్తర భారతాన్ని వానలు, వరదలు చుట్టుముట్టాయి. పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకూ కుంభవృష్టి ముంచెత్తింది. నదులు వెర్రెత్తి ఫ్రవహించాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. గిరి వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుని వరదనీటిలో అడ్డొచ్చినవాటిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగాయి. కార్లు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురయ్యాయి. ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఏర్పడింది. ఇలాంటి సమయాల్లో బయటకు అడుగు పెట్టడమే కష్టం. కాని ఈ సందర్భాలను సమర్థంగా ఎదుర్కొని ప్రశంసలు పొందారు మహిళా అధికారులు. ప్రకృతి విసిరే సవాళ్లకు తాము జవాబు చెప్పగలమని నిరూపించారు. సహాయక బృందాలను సమాయత్త పరచడం, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తరలించడం ఈ పనుల్లో స్వయంగా పాల్గొంటూ రేయింబవళ్లు పని చేశారు. అందుకే వారిని జనం మెచ్చుకుంటున్నారు. కృతజ్ఞతలు చెబుతున్నారు. పాటియాలా కలెక్టర్ ఉత్తర భారతానికి పెను వర్షగండం ఉందని వార్తలొచ్చాక ఆ గండం పంజాబ్లో పాటియాలా జిల్లాకు కూడా వచ్చింది. జూలై 9, 10 తేదీల్లో పాటియాలా జిల్లా వరదల్లో చిక్కుకుంది. ఆ జిల్లా కలెక్టర్ సాక్షి సహానె వెంటనే రంగంలో దిగింది. ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె బాగోగులు తన తల్లిదండ్రులకు అప్పజెప్పి దాదాపు 7 రోజులు ఇంటికే వెళ్లకుండా జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలను కాపాడింది సాక్షి సహానె. ముఖ్యంగా ఎగువన ఉన్న మొహాలీ జిల్లా నుంచి వరద నీరు పాటియాలాలోని సట్లజ్ యమున లింక్ కెనాల్కి చేరడంతో ఒక్కసారిగా వరద చండీగడ్–పాటియాలా హైవేపై ఉన్న రాజ్పుర ప్రాంతానికి వచ్చేసింది. అక్కడే చిత్కారా యూనివర్సిటీ, నీలమ్ హాస్పిటల్ ఉన్నాయి. రెండూ వరదలో చిక్కుకున్నాయి. ‘నీలమ్ హాస్పిటల్లో ఉన్న అందరు పేషెంట్లను, 14 మంది ఐసియు పేషెంట్లను విజయవంతంగా తరలించ గలిగాం’ అని సహానె తెలిపింది. అలాగే చిత్కారా యూనివర్సిటీలో విద్యార్థులందరూ బయటకు రాలేనంతగా వరద నీటిలో చిక్కుకున్నారు. సహానె స్వయంగా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లి ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ దళాల సహాయంతో ఆ విద్యార్థులను బయటకు తరలించారు. ‘సులూర్ అనే గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఆహారం కోసం జనం అల్లాడుతున్నారని నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. వెంటనే ఆహారం తీసుకుని ఆ వానలో వరదలో బయలుదేరాను. కారులో కూచుని ఉంటే వరద నీరు నా అద్దాల వరకూ చేరుకుంది. భయమూ తెగింపు కలిగాయి. అలాగే ముందుకు వెళ్లి ఆహారం అందించగలిగాను’ అంది సాక్షి సహానె. 2014 ఐ.ఏ.ఎస్ బ్యాచ్కు చెందిన సహానె తన చొరవ, చురుకుదనంతో పాటియాలా జిల్లా ప్రజల అభిమానం గెలుచుకుంది. కుల్లు ఎస్.పి. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లా ఎస్.పి 28 సంవత్సరాల సాక్షి వర్మను అందరూ ‘లేడీ సింగం’ అంటారు. సిమ్లా జిల్లాలో ఆమె పని చేసినప్పుడు బ్రౌన్షుగర్ సరఫరా చేసే ముఠాలను పట్టుకుంది. అలాగే పేరు మోసిన దొంగలను జైలు పాలు చేసింది. స్త్రీల రక్షణ కోసం ‘గుడియా హెల్ప్లైన్’, ‘శక్తి బటన్’, ‘హోషియార్ సింగ్’ అనే హెల్ప్లైన్లు ప్రారంభించింది. దాంతో జనం ఆదరణ పొందింది. కుల్లు ఎస్.పిగా చార్జ్ తీసుకున్నాక వచ్చిన తీవ్ర వరదలను సాక్షి వర్మ సమర్థంగా ఎదుర్కొంది. ‘ఈ వరదల్లో నాకు ఎదురైన పెద్ద సవాలు ఏమిటంటే మా జిల్లాలో ఉన్న పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్స్ మనాలి కావచ్చు, తీర్థన్ కావచ్చు... వీటన్నింటితో కమ్యునికేషన్ కోల్పోవడం. మొబైల్స్ పని చేయలేదు. మా పోలీసు శాఖ వైర్లెస్ ఫోన్లు కొన్ని చోట్ల మాత్రమే పని చేశాయి. మిగిలిన ప్రాంతాలకు శాటిలైట్ ఫోన్లు పంపి అక్కడి నుంచి సమాచారం తెప్పించాను. కాని శాటిలైట్ ఫోన్లు చేర్చడం కూడా పెద్ద సవాలైంది. అలాగే రోడ్లు ధ్వంసం కావడం వల్ల సహాయక బృందాలు చేరలేకపోయాయి. అయినా సరే మేమందరం సమర్థంగా సహాయక చర్యలు చేపట్టాము. పని చేసేటప్పుడు నేను స్త్రీనా, పురుషుడినా అనేది నాకు గుర్తు ఉండదు. ఒక ఆఫీసర్గా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను’ అని తెలిపింది సాక్షి వర్మ– 2014 ఐపిఎస్ బ్యాచ్ ఆఫీసర్. మండి ఎస్.పి. కుల్లు జిల్లా పక్కనే ఉంటుంది మండి జిల్లా. రెంటికీ రెండు గంటల దూరం. ఈ జిల్లా కూడా తీవ్రంగా వరద బారిన పడింది. వంతెనలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చివరకు పోలీస్ స్టేషన్లకు బిఎస్ఎఫ్ దళాలకు కూడా కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి సమయంలో గొప్ప సమర్థతతో పని చేసింది మండి ఎస్.పి సౌమ్య సాంబశివన్. 2010 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ఈ ఆఫీసర్ బియాస్ నది ఒడ్డున ఉన్న స్లమ్స్ చిక్కుకున్న 80 మందిని కాపాడగలగడంతో మొదటి ప్రశంస పొందింది. టూరిస్ట్ ప్రాంతం కాబట్టి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అక్కడికి వచ్చిన టూరిస్ట్లు ఎలా ఉన్నారంటూ ఫోన్ల వరద మొదలైంది. టూరిస్ట్లను సురక్షితంగా ఉంచడం సౌమ్యకు ఎదురైన పెద్ద సవాలు. ‘వారందరిని వెతికి స్థానిక సత్రాల్లో, గురుద్వారాల్లో చేర్చడం చాలా వొత్తిడి కలిగించింది. అలాగే ఇళ్లు విడిచి రావడానికి చాలామంది ఇష్టపడలేదు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులను వదిలి రావడం ఎవరికైనా బాధే. వారు అలాగే ఉంటే చనిపోతారు. ఎంతో ఒప్పించి వారిని ఖాళీ చేయించాను’ అందామె. సౌమ్య సాంబశివన్ కింద మొత్తం 1200 మంది సహాయక సిబ్బంది పని చేసి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. -
జలప్రళయం.. హిమాచల్ కకావికలం
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రమంతటా రోడ్లు కొట్టుకుపోయిన కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారు. రూ.4000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 1300 రోడ్లు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఛండీగఢ్-మనాలీ, సిమ్లా-కాల్కా జాతీయ రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. మనాలీలో చిక్కిన 1000 మంది పర్యటకుల వాహనాలను తరలించడానికి అర్ధరాత్రి పూట వన్వే ట్రాఫిక్ను తెరిచినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటకులు చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. More Scary visuals from Thunag area of Mandi, Himachal#Thunag #Mandi #HimachalPradesh #Manali #Kullu pic.twitter.com/qtyyo3OHcD — Anil Thakur (@Ani_iTV) July 9, 2023 ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జులై 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 20,000లకు పైనే ప్రజలను పునరావాస ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడి, వరదలతో భారీ నష్టం జరిగిన కులూ ప్రాంతాల్లో రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ పర్యటించారు. పరిస్థితిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. నష్టాన్ని పూరించడానికి చేయాల్సిన పని చాలా ఉందని అన్నారు. This is Temple in Sirmaur Himachal Pradesh under flood pic.twitter.com/PI3IIibmzp — Go Himachal (@GoHimachal_) July 11, 2023 గత నాలుగు రోజులుగా ఉత్తర భారతం భారీ వర్షాలతో వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు సంభవిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్లో భారీ నష్టం వాటిల్లింది. 80 Killed, ₹ 3,000 Crore Damage: Himachal Rain Devastation In Numbers https://t.co/7xnflWjHa5 pic.twitter.com/FFgvfMddRA — NDTV (@ndtv) July 12, 2023 కాగా.. రానున్న 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్లో రెడ్ అలర్ట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
దయచేసి అక్కడికి వెళ్లకండి.. మీకు గుండెపోటు ఖాయం: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ క్వీన్గా పేరు తెచ్చుకున్న కంగనా ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే తన సొంత బ్యానర్పై టికూ వెడ్స్ షేరూ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించారు. అయితే తాజాగా కంగనా రనౌత్ ప్రజలతో పాటు తన ఫ్యాన్స్కు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!) ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కంగనా తన అభిమానులను, ప్రజలను హెచ్చరించింది. దయచేసి ఈ సమయంలో హిమాచల్ప్రదేశ్కు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. రాబోయే రోజుల్లో వర్షం ఆగిపోయినా కొండచరియలు విరిగిపడే అవకాశముందని హెచ్చరించింది. కాగా.. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మనాలి జిల్లాలో జన్మించింది. కంగనా ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ..' ప్రస్తుతం హిమాచల్లో పరిస్థితి బాగాలేదు. అయినప్పటికీ అసాధారణమైనది ఏమీ లేదు. వర్షాకాలం హిమాలయాలంటే జోక్ కాదు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దయచేసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. వాటికి ఇది మంచి సమయం కాదు. బియాస్ నది ఉప్పొంగి గర్జించే స్థితిలో ఉంది. ఆ నది శబ్దాలకు మీకు గుండెపోటు వస్తుంది.' అని వార్నింగ్ ఇచ్చింది. (ఇది చదవండి: 'బేబీ'సినిమా.. హీరో విరాజ్ ఫుల్ కాన్ఫిడెన్స్!) -
వైరల్ వీడియో: కార్లు అలా కొట్టుకుపోతున్నాయి
-
గ్రామాన్ని ముంచెత్తిన వరద.. అంతా బురదమయం.. వీడియో వైరల్..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండల నుంచి జారు వారుతున్న వరద నీరు నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొండ వాలులో ఉన్న మండి జిల్లాలోని ఒనైర్ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని గ్రామంలోని మార్కెట్ ప్రాంతంపై ప్రవహించింది. ఇళ్లను, దుకాణాలను తనలో కలిపేసుకుంది. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. #Video| Continuous rain for 3 days wreaks havoc in #HimachalPradesh's Mandi pic.twitter.com/HieNQW5fm2 — NDTV (@ndtv) July 10, 2023 అటు.. ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rainfalls: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..
న్యూఢిల్లీ: ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. అయితే.. ఆయా రాష్ట్రాల్లో మరింత వర్షం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్ సహా పలు నగరాలు పట్టణాల్లో రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్ కష్టాలపై వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. హిమాచల్ అస్తవ్యస్తం హిమాచల్ ప్రదేశ్లోని 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సిమ్లా జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, కులు, చంబా జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. గత 36 గంటల్లో 14 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు, 13 ఆకస్మిక వరదల ఘటనలు నమోదయ్యాయి. వరదలతో కొట్టుకుపోయిన 700 రోడ్లను మూసివేశారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం లాహోల్ స్పిటిలోని చంద్రతాల్లో 200 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. బియాస్ వరదల్లో చండీగఢ్–మనాలి హైవేలోని కొంతభాగం కొట్టుకుపోయింది. మనాలి, కిన్నౌర్, చంబాల్లో వరదల్లో దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్కు రెడ్ అలర్ట్.. ఉత్తరాఖండ్లో ముగ్గురు గల్లంతు ఉత్తరాఖండ్లో భక్తులతో వెళ్తున్న జీపు రిషికేశ్–బద్రీనాథ్ నేషనల్ హైవేపై గంగా నదిలో పడిపోయి ముగ్గురు మృతి చెందారు. జీపులో 11 మంది ఉండగా, ఐదుగురిని కాపాడామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని యంత్రాంగం తెలిపింది. కశ్మీర్లో ఇద్దరు జవాన్ల దుర్మరణం జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్, హరియాణాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదీ చదవండి: ఉప్పొంగిన బియాస్ నది.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్ -
ఉప్పొంగిన బియాస్.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బియాస్ నదిలో ప్రవాహం ప్రమాద స్థాయిని మించి పారుతోంది. దీని కారణంగా బియాస్ నది పక్కనే ఉన్న జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రోడ్డుపైనే ప్రవాహం ఉద్ధృతంగా పారుతోంది. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో మండీ, కులు మధ్య రహదారిపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. #WATCH | Portion of National Highway 3 washed away by overflowing Beas river in Kullu, Himachal Pradesh pic.twitter.com/c8gRsvSkt5 — ANI (@ANI) July 9, 2023 వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అటు బియాస్ నది ప్రవాహం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలబడ్డాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సిమ్లా, సిర్మౌర్, లాహుల్, స్పితి, ఛంబా, సోల్ జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. #WATCH | River Beas flows furiously in Himachal Pradesh's Mandi as the state continues to receive heavy rainfall pic.twitter.com/Wau6ZwLLue — ANI (@ANI) July 9, 2023 రాష్ట్రంలో బియాస్ నదితో పాటు పలు నదుల్లో వరద నీరు ప్రమాద స్థాయిల్లో ప్రవహిస్తోంది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 133 మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. జులై 11 వరకు శ్రీఖండ్ మహాదేవ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కులు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.322 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్కు రెడ్ అలర్ట్.. -
15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. ప్రయాణికుల నరకం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురిసిన వర్షాలతో నదుల్లో వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. అటు భారీగా కురిసిన వర్షాలతో కొండ చరియలు రహదారులపై విరిగిపడ్డాయి. దీంతో మండి, కులును కలిపే జాతీయ రహదారిని బ్లాక్ చేశారు పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా మండీలోని చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నత్తనడకన కదులుతున్న వాహనాలతో పర్యటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 మంది పర్యటకులు రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారు. ముందుకు వెళ్లలేక వెనకకు మళ్లలేక పిల్లలతో సహా కుటుంబాలతో కలిసి రోడ్లపైనే ఉన్నామని చెప్పారు. ఇదో పీడకలలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎడతెరిపి లేని వర్షంతో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు జాతీయ రహదారులతోసహా 124 రోడ్లు దెబ్బతిన్నాయని సీనియర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి ఒకరు తెలిపారు. భారీ వర్షాల కారణంగా దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరదలతో వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. #WATCH | Heavy rainfall in Himachal Pradesh's Mandi district leads to landslide on Chandigarh-Manali highway near 7 Mile; causes heavy traffic jam (Drone Visuals from Mandi) pic.twitter.com/tmpPZ8aUbM — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..? కొండ చరియలు విరిగిపడగా.. ఆదివారం సాయంత్రం 5 గంటలకే రహదారిని మూసివేశారని పర్యటకులు తెలిపారు. రాత్రంతా రోడ్డుపైనే ఉన్నట్లు చెప్పారు. బస చేయడానికి హోటల్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దాదాపు 200 వందల కార్లపైనే వరుసగా ఉండిపోయాయని చెప్పారు. కొందరు బస్సుల్లో విహారయాత్రకు వచ్చి రాత్రంతా అందులోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విరిగిపడిన కొండ చరియలను రోడ్డుపై నుంచి ఎప్పుడు తొలగిస్తారో.. ఇంకా ఎంత సమయం వేచి ఉండాలో కూడా అధికారులు తెలపట్లేదని చెప్పారు. "The administration has said that there is a landslide ahead. I don't have much info, we have been here since 5 am," says a tourist from Scotland, who has been stranded in a traffic jam following a landslide on Chandigarh-Manali highway near 7 Mile pic.twitter.com/sWKeJpe5zq — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
హిమాచల్లో భారీ వానలు.. వరదల్లో చిక్కుకున్న టూరిస్టులు..
సిమ్లా: ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా, మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయని దీంతో టూరిస్టులు కూడా వరదల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. భారీ వర్షాల కారణంగా బాగిపుల్ ప్రాంతంలోని ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు మండి ప్రషార్ రోడ్లోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారు. చంబా నుండి వచ్చిన విద్యార్థుల బస్సు పరాశర్ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ సూద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుండి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు వెల్లడించారు. Cloudburst triggers flash floods in Mandi, Himachal Pradesh. Landslides Force Closure Of Pandoh-Mandi Highway VC: Deputy Commissioner Mandi#India #Himachal #Mandi #Cloudburst #Rains #Extreme #Floods #Storm #HimachalPradesh #Landslide #Flooding #Viral #Weather #Climate… pic.twitter.com/kqvAqG1qhb — Earth42morrow (@Earth42morrow) June 25, 2023 ఇదిలా ఉండగా.. పంచకులలో ఓ కారు వరదనీటిలో కొట్టుకుపోగా ఓ మహిళను స్థానికులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, హిమాచల్ ప్రదేశ్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. Damage reported in #Seraj Valley due to Flash Flood#HimachalPradesh #Monsoon pic.twitter.com/AJc4RQEqdX — Weatherman Shubham (@shubhamtorres09) June 25, 2023 Scary visuals emerged from Khark Mangoli Panchkula, where a lady's car was swept away by the sudden excessive water flow in the river, while parked nearby. Hats off to the people who came to their rescue. The lady along with her mother came to pay obeisance at a Temple. pic.twitter.com/Mh24O92rHJ — Gagandeep Singh (@Gagan4344) June 25, 2023 ఇది కూడా చదవండి: పెళ్లింట పెను విషాదం.. -
లక్ష రూపాయల స్కూటీకి కోటి రూపాయల నంబర్!
ఖరీదైన కార్లకు ఖరీదైన ఫ్యాన్సీ నంబర్లు కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ లక్ష రూపాయలు విలువ చేసే స్కూటీకి ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలకుపైగా వెచ్చించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లా కోట్ఖాయ్ పట్టణంలో రవాణా శాఖ HP-99-9999 నంబర్ను ఆన్లైన్లో వేలానికి ఉంచింది. దీని కనీస ధరను రూ. 1000గా నిర్ణయించింది. ఈ నంబరును దక్కించుకునేందుకు మొత్తం 26 మంది బిడ్డింగ్లో పాల్గొన్నారు. అందులో రూ.1.12 కోట్లకు పైగా ఆన్లైన్ బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఓ ఫ్యాన్సీ నంబర్కు ఇంత మొత్తం కోట్ చేయడం ఆ రాష్ట్రంలో ఇదే తొలిసారి. అయితే భారీ మొత్తంలో కోట్ చేసిన ఆ వ్యక్తి వివరాలు తెలియరాలేదు. బిడ్లు ముగించి నంబర్ను కేటాయించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై సిమ్లా డీసీ ఆదిత్య నేగి స్పందిస్తూ HP-99-9999 నంబర్ కోసం అత్యధికంగా రూ. 1,12,15,500 కోట్ చేశారని, సదరు వ్యక్తి ఈ నంబర్ను కొనుగోలు చేస్తున్నది ద్విచక్ర వాహనం కోసమా లేదా నాలుగు చక్రాల వాహనం కోసమా అన్నది తెలియలేదని వివరించారు. (ఇదీ చదవండి: యూపీఐకి క్రెడిట్ కార్డుల అనుసంధానం.. ఫస్ట్ టైమ్!) -
భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. స్టార్ బౌలర్ మృతి
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఫస్ట్క్లాస్ క్రికెటర్, స్టార్ బౌలర్ సిద్ధార్థ్ శర్మ(28) మృతి చెందాడు. గత కొన్ని రోజులగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధార్థ్.. గుజరాత్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం తుది శ్వాస విడిచాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధార్థ్ తన జట్టుతో కలిసి గుజరాత్లో ఉన్నాడు. అయితే కొన్ని రోజుల కిందట అతడు తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో హుటహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ జట్టులో సిద్ధార్థ్ శర్మ భాగంగా ఉన్నాడు. ఇక సిద్ధార్థ్ శర్మ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం భాభోర్ సాహెబ్ శ్మశానవాటికలో సిద్ధార్థ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో 6 మ్యాచ్లు ఆడిన 25 వికెట్లు పడగొట్టాడు. मुख्यमंत्री श्री @SukhuSukhvinder ने हिमाचल की विजय हजारे ट्रॉफी विजेता क्रिकेट टीम के सदस्य रहे और प्रदेश के स्टार तेज गेंदबाज सिद्धार्थ शर्मा के निधन पर गहरा शोक व्यक्त किया है। मुख्यमंत्री ने शोक संतप्त परिजनों के साथ अपनी गहरी संवेदनाएं व्यक्त की हैं। — CMO HIMACHAL (@CMOFFICEHP) January 13, 2023 చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు' -
తన సొంత రాష్ట్రం హిమాచల్లో పార్టీ ఓడినా.. పీఎంగారి రాష్ట్రంలో గెలిపించడానికి తీవ్ర కృషి చేశారు!
తన సొంత రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో పార్టీ ఓడినా.. పీఎంగారి రాష్ట్రంలో గెలిపించడానికి తీవ్ర కృషి చేశారు! -
హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్సింగ్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా సుఖ్వీందర్ సింగ్, ఉప ముఖ్యమంత్రిగా అగ్ని హోత్రిల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హిమాచల్ రాజధాని సిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేదికపై హిమచల్ప్రదేశ్న్ని ఆరు సార్లు పాలించిన రాజవంశీకుడు దివగంత వీరభద్ర సింగ్కి నాయకులందరూ నివాళులర్పించారు. ఆ తర్వాత వేదికపైనే వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ను రాహుల్ గాంధీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కాగా హిమచల్ప్రదేశ్ సీఎం పదవికి పలువురు ప్రయత్నాలు చేయడంతో ఒకరిని ఎంపిక చేయడం హైకమాండ్కి క అతిపెద్ద సవాలుగా మారింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించి,సుఖ్వీందర్సింగ్ని సీఎంగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సుఖ్వీందర్ సింగ్ బస్సు డ్రైవర్ కుమారుడు. ఆయన సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. (చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు) -
Himachal Elections 2022: హిమాచల్లో ముగిసిన పోలింగ్
Upadates హిమాచల్లో ముగిసిన పోలింగ్ - హిమాచల్ ప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు. ధర్మశాల, సిమ్లాలో ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం, వీవీప్యాట్స్కు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8వ తేదీన వెలువడుతాయి. Voting in Himachal Pradesh Assembly elections concludes. EVMs and VVPATs being sealed and secured at polling booths in Dharamshala and Shimla Counting of votes on December 8 pic.twitter.com/PF2wWWhgtD — ANI (@ANI) November 12, 2022 02:00PM 1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లకు ప్రియాంక సూచన.. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి, భవిష్యత్తు కోసం విచక్షణతో ఓటు వేయాలని సూచించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మీ గురించి, మీ రాష్ట్ర పరిస్థితి గురించి మీకే పూర్తిగా తెలుసునని, పరిస్థితులను గమనించి బంగారు భవిష్యత్తు కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 11:45AM 11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 40-45 సీట్లు గెలుస్తాం: కాంగ్రెస్ సిమ్లాలోని రాంపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్. అభివృద్ధికి ఓటు వేయాలని సూచించారు. 68 స్థానాల్లో 40-45 సీట్లు గెలుస్తాని దీమా వ్యక్తం చేశారు. సిమ్లాలోని సైనిక్ రెస్ట్ హౌస్ లాంగ్వుడ్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఆనంద్ శర్మ ఓటేసిన కేంద్ర మంత్రి.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ థుమాల్, ఆయన కుమారు, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్లు తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.హమిర్పుర్లోని సమిర్పుర్ పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో సీఎం జైరాం ఠాకూర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకే మళ్లీ అధికారం ఇస్తారని దీమా వ్యక్తం చేశారు అనురాగ్ ఠాకూర్. Former Himachal Pradesh CM Prem Kumar Dhumal, his son & Union Minister Anurag Thakur and their family cast their votes for #HimachalPradeshElections. Visuals from a polling station in Samirpur, Hamirpur. pic.twitter.com/D0vgw0ncxY — ANI (@ANI) November 12, 2022 10:30AM 5.02 శాతం ఓటింగ్ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.02శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా సిర్మౌర్లో 6.26 శాతం, లాహౌల్లో అత్యల్పంగా 1.56శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. 9:30AM ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించాలి: పీఎం మోదీ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కొత్తగా ఓటు హక్కు సాధించిన యువ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं। — Narendra Modi (@narendramodi) November 12, 2022 ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జైరాం ఠాకూర్ కుటుంబం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆయన కుటుంబంతో కలిసి వచ్చి సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండీలోని పోలింగ్ స్టేషన్ 44లో ఓటు వేశారు. ఈ సందర్భంగా తాము ఎంతో ఉత్సాంగా ఉన్నామని, మండీ ఎప్పుడూ సీఎం జైరాం ఠాకూర్కు మద్దతుగా ఉంటుందన్నారు ఆయన కూతురు చంద్రికా ఠాకూర్. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గమనించిన ప్రజలను మళ్లీ ఆ పార్టీకే ఓటు వేస్తారని దీమా వ్యక్తం చేశారు. 8:00AM హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి శనివారం జరిగే ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. సీఎం జైరామ్ ఠాకూర్, దివంగత సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల్లో 82 శాతం, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 90 శాతం కోటీశ్వరులే! మంచులో నడుస్తూ... మొత్తం 7,884 పోలింగ్ కేంద్రాల్లో 397 కేంద్రాలు మంచుతో నిండి అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో కాజాలోని తషిగాంగ్ పోలింగ్ బూత్ దేశంలోనే అత్యంత ఎత్తులో ఉండే పోలింగ్ కేంద్రం. నువ్వా, నేనా? బీజేపీ తరఫున ప్రచారాన్ని ప్రధాని మోదీ తానే ముందుండి నడిపించారు. ఆఖరి నిముషంలో ఓటర్లకు బహిరంగంగా లేఖ రాసి కమలం గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారమంతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపైనే పడింది. గత రెండేళ్లలో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ హిమాచల్లోనైనా గెలిచి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరసగా రెండోసారి గెలిచిన పార్టీగా చరిత్ర సృష్టిస్తుంది. ఈ విజయం వచ్చే ఏడాది హిందీ బెల్ట్లో జరిగే అత్యంత కీలకమైన తొమ్మిది రాష్ట్రాల గెలుపు అవకాశాలను పెంచుతుందన్న భావనలో పార్టీ ఉంది. -
ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం
హిమాచల్ ప్రదేశ్. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఆ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా రోడ్డుపక్కన టీ కొట్టుల్లో, ఆలయాల వద్ద, ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళలే వ్యాపారాలు చేస్తూ కనిపిస్తారు. ఆర్థిక స్వాతంత్య్రం రాజకీయ చైతన్యం ఇష్టపడే మహిళలు ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అందుకే ప్రధాన పార్టీలన్నీ మహిళా ఓటర్లపై గాలం వేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడంలో మహిళలు అత్యంత కీలకంగా మారారు. రాష్ట్ర జనాభాలో 49% మంది మహిళలే ఉన్నారు. 1998 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని విశ్లేషిస్తే పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 55,92,828 ఉంటే వారిలో పురుష ఓటర్లు 28,54,945, మహిళా ఓటర్లు 27,37,845, థర్డ్ జెండర్ ఓటర్లు 38 ఉన్నాయి. స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తి జాతీయ సగటు కంటే హిమాచల్ ప్రదేశ్లో అధికం. ప్రతీ వెయ్యి మంది పురుషులకు జాతీయ స్థాయిలో 976 మంది మహిళలు ఉంటే హిమాచల్ ప్రదేశ్లో 981 మంది ఉన్నారు. 18 నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి వెయ్యి దాటి ఉండడం విశేషం. ’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దేవేష్ కుమార్ వ్యాఖ్యానించారు. పోటీ పడి హామీలు అధికార బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక మేనిఫెస్టో స్త్రీ సంకల్ప పత్ర విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లయ్యే సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, ప్రాథమిక విద్య అభ్యసించే బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉన్నత విద్య అమ్మాయిలకు స్కూటీలు, మహిళా సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, ఆశావర్కర్ల జీతం రూ.4,700కి పెంపు వంటి హామీలు గుప్పించింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద 1.36 లక్షల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, రాష్ట్రస్థాయిలో గ్రామీణ సువిధ యోజన కింద 3.24 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీతో మహిళలు పొగ ముప్పు నుంచి విముక్తి చెందారని, తొలి స్మోక్ ఫ్రీ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ హర్ ఘర్ లక్ష్మి నారి సమ్మాన్ నిధి పథకం కింద నెలకి రూ.1500 ఇస్తామని ప్రకటించింది. ‘‘ఉన్నత విద్య అభ్యసించలేని యువతులు కానివ్వండి, సింగిల్ మదర్లు, వితంతువులు ఇలా అవసరం ఉన్న మహిళలందరికీ రూ.1500 బ్యాంకులో పడతాయి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది’’ అని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు. అంతకు ముందే ఆప్ తాము అధికారంలోకి వస్తే నెలకి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాతినిధ్యం ఏది ? మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించే పార్టీలు వారికి టికెట్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. 68 స్థానాలున్న అసెంబ్లీలో గత సారి కేవలం నలుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సారి బీజేపీ ఆరుగురికి టికెట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ముగ్గురుకి మాత్రమే ఇచ్చింది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇచ్చింది. 1998లో తొలిసారిగా ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 338 అభ్యర్థులు పోటీ పడితే వారిలో 19 మంది మాత్రమే మహిళలు. వారిలో నలుగురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 6% ఎక్కువగా మహిళల ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్లో మహిళా అక్షరాస్యత ఎక్కువ. ఓటు ఎంత విలువైనదో వారికి బాగా తెలుసు. సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా ఎంతో అవగాహనతో ఉంటారు. అందుకే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలవచ్చి ఓట్లు వేస్తారు. గత 20 ఏళ్లుగా పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6 శాతం అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లక్ష ఉద్యోగాలు.. మహిళలకు నెలకి రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రచార జోరు పెంచాయి రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్కు భారీగా ఆఫర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.680 కోట్లతో స్టార్టప్ ఫండ్, లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ పునరుద్ధరణ 18-60 ఏళ్ల మహిళలకు నెలకి రూ.1,500 వంటివి వాటితో మేనిఫెస్టో విడుదల చేసింది హస్తం పార్టీ. నవంబర్ 12న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తామని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారని ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ధాని రామ్ శైండిల్. ప్రజల అంచనాలను అందుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ‘ఇది కేవలం మెనిఫెస్టో కాదు, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన పత్రం.’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేసేంది కంగ్రెస్. కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించి ప్రజల సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామని, అందుకు వారు తిరస్కరించారని గుర్తు చేశారు. మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: Gujarat Election 2022: ఎన్నికల ముందు బీజేపీకి మాజీ మంత్రి షాక్..! -
ప్రజల మధ్య గొడవలు పెట్టడమే కాంగ్రెస్ పని
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. ప్రజల మధ్య గొడవలు పట్టడమే ఆ పార్టీ పని విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టకపోతే ఆ పార్టీ నాయకులకు మనశ్శాంతి ఉండదని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో మరోసారి బీజేపీనే అధికారంలో వస్తుందని అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1985 నుంచి ఏ ప్రభుత్వమూ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదని, ఈసారి తమదే విజయమని చెబుతున్న కాంగ్రెస్కు షాక్ ఇస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల మెజార్టీతో గెలిచింది, కాబట్టి ఈసారి కూడా ప్రజలు తమనే గెలిపిస్తారని షా జోస్యం చెప్పారు. మోదీ అభివృద్దిని చూసి అందరూ తమకే పట్టంకడతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్తో పాటు ఇతర మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోంది -
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. వీటి ప్రకారం నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయి. ♦ మొత్తం నియోజకవర్గాలు: 68 ♦ నోటిఫికేషన్ : అక్టోబర్ 17 ♦ నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 25 ♦ నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 27 ♦ నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్ 29 ♦ పోలింగ్ : నవంబర్ 12 ♦ ఫలితాలు : డిసెంబర్ 8 ♦ హిమాచల్లో మొత్తం ఓటర్ల సంఖ్య : 55,07,261 ♦ ఓటర్లు పురుషులు – 27,80,208 ♦ మహిళలు – 27,27,016 ♦ మొదటిసారి ఓటర్లు – 1,86,681 ♦ 80+ వయస్సు ఉన్న ఓటర్లు – 1,22,087 ♦ వందేళ్లపై ఉన్న ఓటర్లు – 1,184 ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కరోనా గురించి ఆందోళన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈమేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగియనుంది. గుజరాత్ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవలే పర్యటించారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత హిమాచల్ షెడ్యూల్ ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలుకు బీజేపీ 99 కైసవం చేసుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 77 స్థానాలకే పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్లో 68 స్థానాలకు బీజేపీ 45 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ 20 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆప్, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతిస్తున్నాయి. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్లో ఏ పార్టీ వరుసగా రెండుసార్లు గెలువలేదు. చదవండి: జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు -
మళ్లీ బీజేపీ వైపే హిమాచల్ ఓటర్లు
మండి: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో మాదిరిగా మళ్లీ బీజేపీకే అధికారమివ్వాలని హిమాచల్ ఓటర్లు నిశ్చయించుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి చెందిన బీజేపీ యువజన విభాగం కార్యకర్తలనుద్దేశించి ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అననుకూల వాతావరణం కారణంగా మండిలోని పడ్డల్ మైదాన్లో భారతీయ జనతా యువమోర్చా ఏర్పాటు చేసిన ‘యువ విజయ్ సంకల్ప్ ర్యాలీ’కి హెలికాప్టర్ ద్వారా చేరుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆయన ఆన్లైన్లోనే ప్రసంగించారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చాలన్న సంప్రదాయాన్ని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఓటర్లు పక్కనబెట్టారని ఆయన చెప్పారు. అదేవిధంగా, బీజేపీ పాలన, అభివృద్ధి పనులను చూసి హిమాచల్ ఓటర్లు, యువత కూడా మరోసారి బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ యువత ప్రాతినిథ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఫార్మా హబ్గా రూపుదాలుస్తోందని, డ్రోన్ విధానం రూపకల్పనలో ముందుందని చెప్పారు. -
ప్లీజ్ తప్పుకుంటున్నాను.. సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని వరుస షాక్లు తగులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ(69).. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ట్విస్ట్ ఇచ్చారు. తాను.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆనంద్ శర్మ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నా ఆత్మగౌరవంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. దీంతో, సోనియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. Anand Sharma Quits Himachal Congress Post Days After Kashmir Party Revolt https://t.co/Quv6xQMTWy NDTV's Sunil Prabhu reports pic.twitter.com/cOoSGKP6VD — NDTV (@ndtv) August 21, 2022 ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: బీజేపీ సంచలన నిర్ణయం.. ఉమాభారతి సన్నిహితుడికి షాక్! -
వర్షాల ఎఫెక్ట్.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్
Four Storey Building Collapsed In Shimla: దేశవ్యవాప్తంగా ఎడతెరిపలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో నదులు పొర్లొపొంగుతున్నాయి. పురాతన, శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, సిమ్లాలోని చౌపల్ బజార్లో ఓ భవనంతో బ్యాంకు, రెండు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఆ భవనం కూలిపోయింది. అయితే, వర్షాల నేపథ్యంలో ముందగానే భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరోవైపు.. కొద్దిరోజులుగా హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. A four story building collapsed in Chopal in #Shimla district in #HimachalPradesh on Saturday Thank God, No loss of life is reported pic.twitter.com/8HjpNfLPc0 — Rajinder S Nagarkoti रजिन्दर सिंह नगरकोटी (@nagarkoti) July 9, 2022 ఇది కూడా చదవండి: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. సీఎం కేసీఆర్ హెచ్చరిక ఇదే.. -
హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన యాత్రికులు?
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని మణికరణ్లో బుధవారం చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. చోజ్ గ్రామంలో క్లౌడ్బస్ట్ కావడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి, దీంతో ఆ పరిసరాల్లోని గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ఘటనలో నలుగురు గల్లంతు అయినట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శర్మ తెలిపారు. పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ ఆ ధాటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొందరు యాత్రికులు కూడా కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా దీనిపై స్పష్టత రావ్వాల్సి ఉంది. వరద ధాటికి పార్వతి నదిపై ఉన్న వంతెన కూడా ధ్వంసం అయ్యింది. నది సమీపంలో ఉన్న పలు షాపులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన వారి కోసం అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి.. ఒక్క లేఖతో కలకలం -
గాల్లోనే ఆరు గంటలు హైరానా
సిమ్లా: ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కేబుల్కార్ ఎక్కిన పర్యాటకులు రోప్వేలో సాంకేతిక లోపంతో కొన్ని గంటలపాటు తీవ్ర భయాందోళనల మధ్య గాల్లోనే గడపాల్సి వచ్చింది. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం సొలాన్ జిల్లా పర్వానూ సమీపంలోని టింబర్ ట్రయల్ ప్రైవేట్ రిసార్ట్ వద్ద ఢిల్లీకి చెందిన 11 మంది పర్యాటకులు సోమవారం టింబర్ ట్రయల్ కేబుల్ కార్ ఎక్కారు. రోప్వేలో సాంకేతిక లోపం కారణంగా అది మధ్యలోనే సుమారు 250 అడుగుల ఎత్తులో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం అక్కడికి చేరుకుని, మరో కేబుల్ కార్ ట్రాలీని అక్కడికి పంపించి, ఒక్కొక్కరికీ తాడు కట్టి క్షేమంగా కిందికి దించింది. 6 గంటలు శ్రమించి అందులో చిక్కుకు పోయిన ఐదుగురు మహిళలు సహా మొత్తం 11 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడినట్లు సీఎం జైరాం ఠాకూర్ చెప్పారు. ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఆయన వెంటనే ఘటనాస్థలికి పంపించారని వెల్లడించారు. 1992లోనూ టింబర్ ట్రయల్ వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా, కేబుల్ కార్లో చిక్కుకుపోయిన 10 మందిని ఆర్మీ కాపాడింది. గత ఏప్రిల్లో జార్ఖండ్లోని త్రికూట్ పర్వతాల వద్ద రోప్వే గాల్లోనే నిలిచిపోయింది. ఆర్మీ సుమారు 40 గంటలపాటు శ్రమించి 12 మందిని రక్షించగా మరో ముగ్గురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. చదవండి: Breaking: ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల #HimachalPradesh :- Eleven People are stucked in the Timber Trail due to techanical problem. They have been getting rescued by the management.#Himachal pic.twitter.com/EgMfJy0UPY — Gorish (@IGorishThakur) June 20, 2022 కాగా 1992 అక్టోబర్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదే రోప్వేలో 11 మంది ప్రయాణికులు చిక్కుకుపోగా ఆర్మీ, వైమానిక దళం జరిపిన ఆపరేషన్లో 10 మందిని రక్షించారు. ఒకరు మరణించారు. అలాగే జార్ఖండ్లోని డియోఘర్ జిల్లాలో గత ఏప్రిల్లో పర్యాటకులు 40 గంటలకు పైగా కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు మరణించారు. -
బీజేపీ మీటింగ్కు హాజరుకానున్న రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓ రాజకీయ పార్టీ మీటింగ్కు హాజరవుతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో జరుగనున్న బీజేపీ యువ మోర్చాలో రాహుల్ ద్రవిడ్ పాల్గొనబోతున్నాడని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే విశాల్ నహేరియా మంగళవారం ప్రకటించాడు. దీంతో ఈ వార్త నిమిషాల వ్యవధిలో నెట్టింట వైరల్గా మారింది. ద్రవిడ్ లాంటి సౌమ్యమైన వ్యక్తి రాజకీయ పార్టీ మీటింగ్లో పాల్గొంటున్నాడా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ద వాల్ తాజాగా స్పందించాడు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు. బీజేపీ మీటింగ్లో పాల్గొనబోతున్నాడన్న వార్తను ఖండించాడు. కాగా, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 12 నుంచి 15 వరకు జరగనున్న బీజేపీ యువ మోర్చాలో రాహుల్ ద్రవిడ్ పాల్గొనబోతున్నాడని ఓ వర్గం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో ద్రవిడ్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: ఆసీస్తో టి20 సిరీస్.. టి20 ప్రపంచకప్ 2022 లక్ష్యంగా! -
పోలీసులకు షాక్.. అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు.. సీఎం ఫైర్
సిమ్లా: వేర్పాటువాద ఖలిస్తాన్ జెండాలు హిమాచల్ప్రదేశ్లో కలకలం రేపాయి. ఏకంగా అసెంబ్లీ ప్రధాన గేటు, గోడపై ఖలిస్తాన్ జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ధర్మశాలలో ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై ఖలిస్తాన్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి గానీ లేక ఆదివారం ఉదయం గానీ ఈ జెండాలను పాతినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం జెండా చూసిన వెంటనే తొలగించామన్నారు. అయితే, ఈ జెండాలను పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులేనని పెట్టి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. జెండా పాతిన వారికి ధైర్యం ఉంటే రాత్రి కాదు.. పగలు వచ్చి జెండా పెట్టండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కారకాలను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. Flags of #Khalistan & #Khalistqn written on walls of #dharamshala #VidhanSabha #HimachalPradesh when @himachalpolice take action against these goons put UAPA then so called "s_kh" jathebqndi will say "sadde naal Dhaka hunda" #Shame pic.twitter.com/A4KY5DFhmb — Porus ਪੋਰਸ (@porusofpanjab) May 8, 2022 -
కేజ్రీవాల్ ‘క్రేజీ’ ఆఫర్.. టార్గెట్ ఫలిస్తుందా..?
సిమ్లా: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్.. శనివారం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ తలిపెట్టిన ర్యాలీలో కేజ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలను, ఆమ్ ఆద్మీపార్టీని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. అందుకే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఓ కొత్త హిమాచల్ను ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్కు ఒక్క ఛాన్స్ ఇస్తే సరికొత్త హిమాచల్ను చూపిస్తామని ప్రజలకు కోరారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. ఆయా పార్టీల్లో ఉన్న సచ్ఛీలురందరూ వెంటనే ఆప్లో చేరిపోవాలని కోరారు. BJP हिमाचल और गुजरात में आम आदमी पार्टी से डरी हुई है। असल में ये AAP से नहीं, जनता से डरे हुए हैं। BJP ने तय किया है कि Himachal और Gujarat के चुनाव जल्द कराएंगे। BJP चुनाव जब मर्ज़ी कराए, सत्ता आम आदमी के हाथ में आनी चाहिए। -CM @ArvindKejriwal #HimachalMeinBhiKejriwal pic.twitter.com/8jvySkuvEr — AAP (@AamAadmiParty) April 23, 2022 మరోవైపు.. హిమాచల్లో ప్రత్యామ్నాయంగా పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని అన్నారు. ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. ఢిల్లీలో ప్రవేశపెట్టిన పథకాలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తాము 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అని ప్రకటించగానే.. హిమాచల్ సీఎం ఠాకూర్ ఇక్కడ 125 యూనిట్ల వరకూ ఉచితమంటూ ప్రకటించారని అన్నారు. ఇది చదవండి: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. -
తెలంగాణకు కాంస్యం... విజేత హిమాచల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ టోర్నీలో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీ సెమీఫైనల్లో తెలంగాణ 9–16తో హిమాచల్ప్రదేశ్ జట్టు చేతిలో ఓడింది. ఫైనల్లో హిమాచల్ప్రదేశ్ 20–10తో రైల్వేస్ను ఓడించి చాంపియన్గా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ సంక్షేమ పథకాలపై హిమాచల్ప్రదేశ్ ఆసక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్సుభాగ్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పథకాల అధ్యయనానికి వచ్చిన ఆయనకు సోమవారం హైదరాబాద్ లేక్వ్యూ గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్అఫీఫియో కార్యదర్శి, కమిషనర్ తుమ్మా విజయ్కుమార్రెడ్డి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు, విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతన్నలకు అన్ని సేవలు అందిస్తున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఏర్పాటైన వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట అందించేందుకు ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై రామ్సుభాగ్ సింగ్ ప్రత్యేక ఆసక్తి చూపించారు. తమ రాష్ట్రంలో ఈ కార్యక్రమాల అమలుకు కృషిచేస్తామని, వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న అత్యుత్తమ పథకాలను తమ రాష్ట్రంలో అమలుచేసేందుకు ఆయా రాష్ట్రాల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను విజయ్కుమారెడ్డి ఆయనకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి కూడా పాల్గొన్నారు. -
సెంచరీతో మెరిశాడు.. వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయి!
విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ తొలిసారి ఛాంఫియన్గా నిలిచింది. జైపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో తమిళనాడును ఓడించి హిమాచల్ ప్రదేశ్ టైటిల్ను ముద్దాడింది. కాగా ఈ మ్యాచ్లో తమిళనాడు ఓటమి చెందినప్పటకీ.. ఆ జట్టు బ్యాటర్ దినేష్ కార్తీక్ విరోచిత ఇన్నింగ్స్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో కార్తీక్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 103 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. జట్టు 315 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కార్తీక్ కీలకపాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. అదే విధంగా బెంగాల్, పుదుచ్చేరి జట్లుపైన వరుసగా 87,65 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు కేకేఆర్ దినేష్ కార్తీక్ని రీటైన్ చేసుకోలేదు. దీంతో అద్భుతమైన ఫామ్లో ఉన్న కార్తీక్ని సొంతం చేసుకునేందుకు రానున్న వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడతాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: Ashes 2021: 13 సార్లు 200లోపూ.. 20 మంది ఆటగాళ్లు డకౌట్; ఇంగ్లండ్ చెత్త రికార్డు -
అర్ధ సెంచరీతో మెరిసిన దినేష్ కార్తీక్..
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు దినేష్ కార్తీక్ అర్ధసెంచరీతో మెరిశాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన తమిళనాడు ఆరంభంలో తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దినేష్ కార్తీక్, బాబా అపరిజిత్ తమిళనాడు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసే సరికి తమిళనాడు 4వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో దినేష్ కార్తీక్(68), అపరిజిత్(49) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. చదవండి: SA Vs IND: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ రీ ఎంట్రీ! -
తమిళనాడుతో హిమాచల్ ప్రదేశ్ ఫైనల్ పోరు... ధావన్ మళ్లీ మెరిసేనా!
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్గా అవతరించాలనే పట్టుదలతో హిమాచల్ప్రదేశ్... ఆరోసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో తమిళనాడు... జైపూర్లో నేడు జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత క్రికెటర్ రిషి ధావన్ నాయకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ చేరిన హిమాచల్ ప్రదేశ్ ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందో లేదో చూడాలి. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ టైటిల్ నెగ్గిన తమిళనాడు మరో టైటిల్పై గురి పెట్టింది. బాబా అపరాజిత్, వాషింగ్టన్ సుందర్లతోపాటు చివర్లో మెరుపులు మెరిపించే షారుఖ్ఖాన్ సూపర్ ఫామ్లో ఉండటం తమిళనాడుకు సానుకూల అంశం. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: IND-19 Vs PAK-19: పాక్పై చివరి బంతికి ఓడిన భారత్.. -
ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ కాదు: భగవత్
ధర్మశాల(హిమాచల్ప్రదేశ్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వెనుక నుంచి నడిపిస్తోందని మీడియా చిత్రీకరిస్తోందని, అది నిజం కాదని సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ వంటిదని మీడియా అంటోంది. అది అబద్ధం. స్వయంసేవకులకు ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఏం పొందారని మమ్మల్ని కొందరు అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే. పొందడానికి బదులు మేం ఉన్నది కోల్పోవచ్చు’అని వ్యాఖ్యానించారు. -
వీరజవాను కుటుంబానికి రూ.50 లక్షలు
మదనపల్లె సిటీ: హిమాచల్ప్రదేశ్లో దేశరక్షణ విధులు నిర్వర్తిస్తూ ఈనెల 4వ తేదీన మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ఆవుల కార్తీక్కుమార్రెడ్డి త్యాగం మరువలేమని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి మదనపల్లెలోని తన కార్యాలయంలో వీర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్బాషాల సమక్షంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన జవాను ఆవుల కార్తీక్కుమార్రెడ్డి మరణవార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారన్నారు. తక్షణం వారి కుటుంబానికి అండగా నిలవాలని తమను ఆదేశించారని తెలిపారు. వీరజవాను తల్లి సరోజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు దేశసేవలో అమరుడు కావడం గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్అస్లాం, జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్ఆజం, స్థానిక నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, దండు శేఖర్రెడ్డి, మౌళి, రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
Travel Tips: సోలంగ్ వ్యాలీ పర్యాటన ఓ అందమైన అనుభూతి..!
సోలంగ్ టూర్లో అడ్వెంచరస్ స్పోర్ట్స్ హబ్ సోలంగ్ వ్యాలీనే. సోలాంగ్ నది పరివాహక ప్రదేశం ఇది. మనాలికి 13 కిమీల దూరాన ఉంది. కులు–మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైన తర్వాత సినిమా షూటింగ్లు సోలంగ్ వ్యాలీలో జరుగుతున్నాయి. ఇప్పుడా సోలంగ్ వ్యాలీ పర్యాటకుల సాహస క్రీడావిహారానికి కేంద్రమైంది. ట్రెకింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, రివర్ రాఫ్టింగ్, స్నో స్కీయింగ్, గ్రాస్ స్కీయింగ్, హార్స్ రైడింగ్, స్నో స్కూటర్ రేస్, రివర్ క్రాసింగ్, వాల్ క్లైంబింగ్ వంటి ఆటలన్నీ ఆడుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడ పారా గ్లైడింగ్ చేశారు. అయితే సమీప గతంలో కాదు, అది గుజరాత్కి ముఖ్యమంత్రి కాక ముందు మాట. రొటీన్కి భిన్నంగా మనాలి పర్యటనలో రొటీన్గా చూసే మంచు కొండల్లో విహారానికి పరిమితం కాకుండా మరికొంచెం ఆసక్తిగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే నగ్గర్ కోటలో బస, సాహసక్రీడలు, ప్రాచీన వారసత్వ నిర్మాణాలు, ఆ ప్రదేశానికి పరిమితమైన వైవిధ్యమైన వాస్తుశైలి, జలపాతాల స్వచ్ఛత, నదిలో విహరింతలను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. మాల్ రోడ్డులో ఏమీ కొనకపోయినా సరే... హనీమూన్ కపుల్ చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడవడమే జీవితమంతా గుర్తుండిపోయే మధురానుభూతి. అలాగే కేబుల్ కార్ విహారం కూడా. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! ఇవన్నీ చూడాలి! హిడింబాలయం పాండవులలో రెండవ వాడు భీముని భార్య హిడింబి. ఆమె ఆలయమే ఇది. మనాలి సమీపంలోని దుంగ్రీ అటవీ ప్రాంతంలో ఉంది. మనాలి టూర్ ప్యాకేజ్లలో హిడింబ ఆలయం తప్పక ఉంటుంది. హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్స్ మ్యూజియం ఇది హిడింబ ఆలయానికి దగ్గరలోనే ఉంది. ఈ ప్రదేశంలో విలసిల్లిన నాగరకతను పురాతన వస్తువులు, ఆయుధాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. టిబెట్ మఠాలు మనాలిలో స్థిరపడిన టిబెట్ వాళ్ల నివాస ప్రదేశాలివి. నిర్మాణశైలి పరంగా ప్రత్యేకంగా ఉంటాయి. రంగులు కూడా ఆసక్తిగొలుపుతుంటాయి. వశిష్ఠ ఆలయం ఇది ఏకశిలలో తొలిచిన ఆలయం. ఈ ఆలయంతోపాటు ఇక్కడి వేడినీటి గుండాలు ప్రధాన ఆకర్షణ. జోగ్ని జలపాతం మంచుకొండలు, వేగంగా ప్రవహించే నదుల మధ్య ఉధృతంగా నేలకురికే జలపాతం సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేం. స్వయంగా వీక్షించి ఎవరికి వాళ్లు అనుభూతి చెందాల్సిందే. నయింగ్మ టెంపుల్ ఇది మనాలి, మాల్రోడ్లో ఉన్న బుద్ధుని ఆలయం. నిర్మాణశైలిపరంగా చూసి తీరాల్సిన ఆలయం. శాక్యముని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మాల్రోడ్లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా తినవచ్చు! ఈ పర్యటనలో రకరకాల రుచులను మిస్ కాకూడదు. మౌంట్ వ్యూ రెస్టారెంట్లో టిబెట్, జపాన్, చైనా, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ రుచి చూడవచ్చు. చలిమంట వెచ్చదనంతోపాటు బార్బిక్యూ వంటలను ఆస్వాదించాలంటే బాసిల్ లీఫ్ రెస్టారెంట్కెళ్లాలి. మనాలి హిమాలయాల నేపథ్యంలో ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలంటే రూఫ్టాప్ రెస్టారెంట్లో భోజనం చేయడం మంచి ఆలోచన. ఇది నగ్గర్ రోడ్లో ఉంది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! ఎప్పుడు! ఎలా! హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలంగ్– మనాలి టూర్కి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఏడాది సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే. సమీప విమానాశ్రయం భుంటార్ ఎయిర్పోర్టు. ఇది మనాలి సిటీసెంటర్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ కొనుక్కోవచ్చు ►మాల్రోడ్లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ►సింగింగ్ బౌల్: ఇది బౌద్ధానికి ప్రతీక. హిమాచల్ ప్రదేశ్, టిబెట్ రోజువారీ జీవితంలో భాగం. దీని నుంచి వచ్చే శబ్దం, ఆ ప్రకంపనలు వాతావరణాన్ని ఆహ్లాదపరచడంతోపాటు ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రతను కలిగిస్తాయని చెబుతారు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ సింగింగ్ బౌల్స్ను కొంటారు. ►కులు షాల్: ఉలెన్ దుస్తుల విభాగంలో అడుగుపెడితే దేనిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. స్వెటర్లు, మఫ్లర్లు, క్యాప్లు వందల రకాలుంటాయి. ప్రతిదీ అందంగానే ఉంటుంది. ఈ ట్రిప్కు గుర్తుగా కులు, కిన్నౌరి షాల్ తెచ్చుకోవడం మర్చిపోకూడదు. రకరకాల షేడ్లలో ఏ రంగు దుస్తులకైనా మ్యాచ్ అయ్యేటన్ని మోడల్స్ ఉంటాయి. ►ప్రేయర్ వీల్: ఇది టిబెట్ సంప్రదాయంలో ప్రధానమైనది. లోహం, చెక్క, తోలుతోపాటు రాతి చక్రాలు కూడా ఉంటాయి. ఈ వీల్స్ మీద టిబెట్ భాషలో ‘ఓంమణి పద్మే’ అనే మంత్రం ఉంటుంది. ఈ టూర్ గుర్తుగా డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు. ►దోర్జీ బెల్: ఇది కూడా టిబెట్ సంప్రదాయ వస్తు విశేషమే. గంట ఆకారంలో ఉంటుంది. మనాలిలో ఏ వస్తువైనా సరే ప్రభుత్వం అనుమతి పొందిన స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. మామూలు దుకాణాల్లో ధరలు ఆకాశాన ఉంటాయి. బేరం చేయగలిగిన సామర్థ్యానికి పరీక్ష. గట్టిగా బేరం చేయగలిగితే ధరలను నేల మీదకు దించవచ్చు. కానీ టూర్లో సమయం చాలా విలువైనది. బేరం చేయడం కోసం అంత సమయం వృథా చేయడం అర్థరహితం. మాల్ రోడ్ తర్వాత మనాలిలో హాంగ్కాంగ్ మార్కెట్ మీద ఓ కన్నేయవచ్చు. ట్రావెల్ టిప్స్ ►మాల్ రోడ్లో పగలు జరిగినంత షాపింగ్ రాత్రి కూడా జరుగుతుంది. హస్తకళాకృతులు లెక్కలేనన్ని రకాలుంటాయి. ఈ దుకాణాలను చూస్తే పురాతనంగా కనిపిస్తాయి. కానీ అన్నింటిలోనూ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్ చేయవచ్చు. ►మాల్ రోడ్లో దొంగతనాలు ఎక్కువ. ఇక్కడ పర్యటించేటప్పుడు విలువైన వస్తువులను దగ్గర ఉంచుకోకపోవడమే మంచిది. షాపింగ్ సమయంలో చేతిలో ఉన్న బ్యాగ్ను పక్కన పెట్టి మరీ వస్తువుల నాణ్యతను పరిశీలిస్తాం. అలాంటి సమయంలో మళ్లీ చూసుకునేటప్పటికి బ్యాగ్ ఉండకపోవచ్చు. ఒక్కోసారి కింద పెట్టిన బ్యాగ్ గురించి మనమే మర్చిపోవచ్చు కూడా. కొంత దూరం వెళ్లిన తరవాత గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చినా ప్రయోజనం ఉండదు. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
ప్రపంచంలో ఎతైన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా?
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. అయితే, ఈవీ కొనుగోలుదారులను ప్రధానంగ వేధించే ప్రశ్న ఏదైనా ఉంది అంటే? అది మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కంపెనీలు, రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మౌలిక సదుపాయాల సమస్యలను తగ్గించడానికి లడఖ్ పరిపాలన కేంద్ర పాలిత ప్రాంతంలోని స్పితి జిల్లాలో ఉన్న కాజాలో ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనీసం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. కాజా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) మహేంద్ర ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుత ప్రపంచంలోనే ఎతైన ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ కాజాలో ఉంది. ఇది ఇక్కడ మొదటి స్టేషన్. ఈ స్టేషన్ కు మంచి స్పందన లభిస్తే, మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేస్తాము. ఇది వాహన కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి కూడా సహాయపడుతుంది" అని అన్నారు. ఈ రోజు ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ వాహనంపై మనాలి నుంచి కాజాకు వచ్చారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల ఈ రోజుల్లో వాతావరణం అకస్మాత్తుగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే వాయువుల ఉద్గారం ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి అని ఆయన అన్నారు.(చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు) -
ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్: నరేంద్ర మోదీ
మనదేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో 1.25 కోట్ల కోవిడ్ డోసులు వేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేసే ఈ కోవిడ్ డోసులు సంఖ్య అనేక దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువగా అని నొక్కి చెప్పారు. అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసును అర్హులైన అందరికీ అందించిన రాష్టంగా నిలిచిన హిమచల్ప్రదేశ్ ప్రజలతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మోదీ.. దేశంలో ఇప్పటివరకు 70 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో "దవాయ్ భీ, కరాయ్ భీ(టీకాలు వేయండి, కోవిడ్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించండి)" అనే మంత్రాన్ని మనం మరచిపోకూడదని మోదీ అన్నారు.(చదవండి: ప్రపంచ దేశాధినేతల్లో టాపర్గా ప్రధాని మోదీ) లాజిస్టిక్ ఇబ్బందులు ఉన్నప్పటికీ అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి మోతాదును ఇచ్చిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ "ఛాంపియన్"గా మారిందని అన్నారు. అలాగే, ఆ రాష్ట్రంలో 30 శాతం మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు మోడీ అన్నారు. సీక్కిం, దాద్రా, నాగర్ హావేలీ కూడా ఈ లక్ష్యాన్ని సాధించాయని, అనేక ఇతర రాష్ట్రాలు దీనిని సమీపిస్తున్నాయని మోదీ చెప్పారు. హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ను ప్రశంసించిన ప్రధానమంత్రి, ఎలాంటి వృధా లేకుండా వ్యాక్సినేషన్ వేగంగా వేసేలా చూడటం రాష్ట్రానికి "పెద్ద విజయం" అని అన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులతో సహా "కోవిడ్ యోధులు" చేసిన "అలుపెరగని కృషి"ని మోదీ ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజల భాగస్వామ్యం, బహిరంగ చర్చల ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం అయ్యిందని అన్నారు. -
షాకింగ్ వీడియో: ఏకంగా జాతీయ రహదారి లోయలోకి పడిపోయింది..
-
భయానకం: విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి!
-
భయానకం: విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి!
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ వద్ద ఘోరసంఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బండరాళ్ల ధాటికి సమీపంలో ఉన్న వంతెన కూలిపోయింది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న వాహనాలు, విశ్రాంతి గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక దృశ్యాలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో జరిగింది. గత వారం భారీగా కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలకు గురయ్యే పలు ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని క్షతగాత్రులకు వైద్య సహయాన్ని అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ అబిద్ హూస్సేన్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించిన కొద్ది రోజుల తరువాత ఈ సంఘటన జరిగింది. గత వారం భారీ వర్షపాతం కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 13 కు చేరింది. -
Spiti Valley: నింగికీ నేలకూ మధ్య ఓ నది
పదిహేను వేల అడుగుల ఎత్తు. లామాలకు ఇష్టమైన ప్రదేశం. ఎటు చూసినా మంచుకొండలు. మంచు కరిగి నీరవుతోందా లేక... చుట్టూ ఉన్న మంచు చల్లదనానికి నీరు గడ్డకట్టిపోతోందా? ఏమో! రెండూ నిజమే కావచ్చు!! స్పితిలోయలో ఏడాదిలో కొంతకాలం కొండలు కరిగి నీరవుతుంటే... మరికొంత కాలం నీరు మంచుగా మారుతుంది. కంటి ముందు మంద్రంగా ప్రవహిస్తున్న నది చూస్తూ ఉండగానే ప్రవాహం వేగం తగ్గిపోయి గడ్డకడుతుంది. ఇది హిమాలయ శ్రేణుల్లో విస్తరించిన ప్రదేశం. కులు నుంచి స్పితిలోయకు వెళ్లే దారిలో కనిపిస్తుంది కుంజుమ్ కనుమ. శీతాకాలంలో పర్వతాలను కప్పేసిన మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. స్పితి లోయలో ప్రవహిస్తున్న నది. ఈ నది మరీ పెద్దదేమీ కాదు. ప్రవాహ దూరం నూటముప్పై కిలోమీటర్లు మాత్రమే. స్పితి అంటే... మధ్యనున్న నేల అని అర్థం. అటు నింగికీ– ఇటు భూమికీ మధ్యనున్న నేల కావడంతో దీనికి అదే పేరు స్థిరపడింది. లామాల నివాసం హిమాచల్ప్రదేశ్లోని స్పితిలోయ బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం. బౌద్ధలామాలు మౌనంగా పర్వతసానువుల్లో అలవోకగా నడిచిపోతుంటారు. పదిహేను వేల అడుగుల ఎత్తు బోర్డు దాటి ముందుకెళ్లి కొండ మలుపు తిరిగితే అనేక బౌద్ధారామాలు, చైత్యాలతోపాటు ‘కీ’ మోనాస్టెరీ, టాబో మోనాస్టెరీలు కనిపిస్తాయి. ఇవి బౌద్ధం పురుడుపోసుకున్న తొలినాళ్లలో కట్టిన బౌద్ధచైత్యాలు. అందుకేనేమో ఇది దలైలామాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అయింది. -
ధోని మెసేజ్పై అభిమానుల ఆగ్రహం.. ట్వీట్ వైరల్
సిమ్లా: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్లా పర్యటనలో ఉన్న ధోని తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సిమ్లాలో ధోని ఉన్న ఇళ్లు పూర్తిగా చెక్కతో తయారుచేశారు. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఇళ్లు చెక్కతోనే నిర్మిస్తారు. అక్కడి వాతావారణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించిన ధోని ఫోటోలను షేర్ చేస్తూనే 'చెట్లు నాటండి.. అడవులు కాపాడండి' అంటూ మెసేజ్ ఇచ్చాడు. ఈ మెసేజ్ ధోని అభిమానులను రెండుగా చీల్చింది. ఒక వర్గం ధోనిని పొగిడితే.. మరో వర్గం మాత్రం ధోని చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఒకవైపు చెట్లను నరికి ఇల్లు కడుతున్న ధోనీ.. వేరే వాళ్లకు మాత్రం చెట్లు నాటమని సలహా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ధోని ఆ ఇంటి నిర్మాణం కోసం ఎన్ని చెట్లను నరికావో చెప్పు'' అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సీఎస్కే స్పందింస్తూ 'ప్లాంటింగ్ ద రైట్ థాట్స్' అంటూ క్యాప్షన్ పెట్టింది. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే జట్టును ఎంఎస్ ధోని విజయవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్ను మరిపిస్తూ చెన్నై ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. కాగా ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్న ధోని ఆగస్టులో సీఎస్కే టీంతో కలవనున్నాడు. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. Planting the right thoughts! 💛 Thala 😍#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/rbZmSwGA2n — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) June 25, 2021 -
‘అన్న అంత్యక్రియల కోసం వచ్చిన నన్ను చూసి అందరు ఏడ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి సమయంలో జైలు నుంచి వచ్చి అన్న అంత్యక్రియల్లో పాల్గొన్న తనను చూసి అందరూ చలించిపోయారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 1975 జూన్ 25న అమలులోకి వచ్చిన ఆత్యయిక స్థితి నాటి రోజులు, పడిన కష్టాలు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. ఆత్యయిక స్థితి అమలులోకి వచ్చిన రోజును ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన రోజుగా ఆయన అభివర్ణించారు. మన దత్తన్నే.. మారు వేషంలో ‘‘ఆ సమయంలో ఆర్ఎస్ఎస్లో సంఘ్ ప్రచారక్గా పనిచేస్తున్నా. ఆర్ఎస్ఎస్ను నిషేధించడంతో పలువురితో కలసి రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. మారువేషాల్లో జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలోని సంఘర్షణ సమితికి పనిచేసే వాళ్లం. తొమ్మిది నెలల తర్వాత నేటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు మీసా చట్టం కింద అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలోనే అన్న అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల కోసం పెరోల్పై బయటకు వచ్చాను. పోలీసుల రక్షణ వలయంలో వ్యాన్ నుంచి దిగిన నన్ను చూసి బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు’’ అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్ -
ఈపాస్ల కోసం ఏకంగా ట్రంప్, అమితాబ్లను వాడేశారు..
షిమ్లా : కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్ వైపు మొగ్గుచూపాయి. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలతో అష్టదిగ్బంధనం చేశాయి. తమ రాష్ట్రంలోకి ప్రవేశించటానికి ఈపాస్లు తప్పనిసరి చేశాయి కొన్ని రాష్ట్రాలు. ఈపాస్లు ఉన్న వారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఈపాస్లతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ప్రముఖ వ్యక్తుల పేర్లతో ఈపాస్లకోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ల పేర్లపై ఈపాస్లను రిజిస్టర్ చేశారు దుండగులు. రెండు ఈపాస్లు హెచ్పీ-2563825, హెచ్పీ2563287.. ఒకే ఆధార్, ఫోన్ నెంబర్పై రిజిస్టర్ చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి : కేటుగాళ్ల మాయ.. 19 లక్షలు స్వాహా -
పారాగ్లైడింగ్.. పాపం భయపడింది!
ఖాద్దర్: మనలో చాలా మంది ఎగ్జిబిషన్కు వెళ్తారు. అక్కడ జైంట్ విల్ ఉంటుంది. అయితే.. కొంత మంది మాత్రమే, ధైర్యంచేసి ఎక్కుతారు. అది పైకి పోయి కిందకు వచ్చేవరకు కూడా భయపడుతూనే ఉంటారు. అయితే, పారాగ్లైడింగ్ అడ్వెంచర్ కూడా ఇలాంటిదే.. ఇది బాగా ఎత్తైన ప్రదేశంలో నుంచి చేస్తారు. దీన్ని డ్రైవ్ చేయాలంటే కొంచెం ధైర్యంకూడా ఉండాలి. ఇప్పుడు హిమచల్ ప్రదేశ్లో ఒక మహిళ చేసిన పారాగ్లైడింగ్ అడ్వెంచర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీనిలో.. ఖాజ్జర్ ప్రాంతానికి చెందిన మహిళ ధైర్యంచేసి పారాగ్లైడింగ్ కు సిద్ధమైంది. మొదట బాగానే ఉంది. క్రమంగా వేగం పెరిగి, ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమహిళ వెంటనే కళ్ళుమూసుకుంది. వెంటనే తన వెనుక ఉన్న గైడ్ ఆమెకు ధైర్యం చెబుతున్న కూడా ఆమె అవేమి పట్టించుకొవడంలేదు. ఆమె కళ్ళుతెరచి కిందకు చూసింది. అయితే , భయపడిపోయిన ఆ మహిళ వెంటనే హిందిలో ‘మూజే ఛోడ్దో..(నన్ను వదిలేయండి)’.. హల్లుజానేదో..(మెల్లగా పోనివ్వండి)..అంటూ హిందీలో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే, ఈ వీడియోను ఇన్క్రెడెబుల్ హిమాలయా అనే ట్రావెల్ ఏజేన్సీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మా అక్క ఉంది కాస్త మెల్లగా పోనివ్వండా...పాపం భయపడింది..బతికితే చాలనుకుంటొంది..కాబోలు..అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 2019లో ఇదే తరహాలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ వీడియోను కోడ్ చేస్తూ తాజా వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. చదవండి: వైరల్: అమ్మో..పాము ఎంత భయంకరంగా దాడిచేసింది! -
డాక్టర్ అందమైన జ్ఞాపకం.. రాక్చమ్ కుగ్రామం
డాక్టర్ శిల్ప న్యూఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్నారాయణ్ హాస్పిటల్లో డాక్టర్. అది గత ఏడాది అక్టోబర్ వరకు. ఇప్పుడామె హిమాచల్ ప్రదేశ్లోని సంగ్లా బ్లాక్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తోంది. ఈ రెండింటి మధ్య ఓ అందమైన జ్ఞాపకం కిన్నౌర్ జిల్లా, రాక్చమ్ అనే కుగ్రామం. ఆ అందమైన జ్ఞాపకం శిల్పకు మాత్రమే కాదు ఆ గ్రామస్థులకు కూడా. డాక్టర్ లేని హాస్పిటల్ డాక్టర్ శిల్ప పుట్టింది చత్తీస్గడ్లో. అప్పటికి ఆమె తండ్రి అక్కడ కేంద్ర పరిశ్రమల భద్రత విభాగం అధికారిగా ఉన్నారు. తండ్రి బదలీలతోపాటు ఆమె అనేక ప్రదేశాలను చూసింది. ముంబయి వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్న వైద్యసేవలను గమనించింది. ఒక మోస్తరు పట్టణాల్లో ఉండే చిన్న హాస్పిటళ్లనూ చూసింది. ఇవేకాక... ఒకసారి స్నేహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్లో టూర్కెళ్లినప్పుడు మనదేశంలో డాక్టర్ ముఖం చూడని గ్రామాలు కూడా ఉన్నాయని తెలుసుకుంది. ప్రభుత్వ వైద్యకేంద్రాలలో పోస్టింగ్ అందుకున్న డాక్టర్లు ఆ మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేయడానికి వెళ్లకపోవడమనే వాస్తవం ఆమెను కలచివేసింది. ఇదంతా ముప్పై ఏళ్ల లోపే. అందుకే న్యూఢిల్లీ నుంచి నేరుగా హిమాలయాల బాట పట్టింది. ఆ వెళ్లడం బదలీ మీద కాదు, స్వచ్ఛందంగా. న్యూఢిల్లీ ఉద్యోగాన్ని వదిలేసి సిమ్లా పరిపాలన విభాగం నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పేరు నమోదు చేసుకుంది శిల్ప. ఆమెను ఇంటర్వ్యూ చేసిన వైద్య అధికారులు హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా, రాక్చమ్ పబ్లిక్ హెల్త్ సెంటర్ పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయగలిగింది, కానీ డాక్టర్లను పంపించలేకపోతోంది. ఎవర్ని నియమించినా సెలవు మీద వెళ్లే వాళ్లే కానీ వైద్యం చేయడానికి ఆ గ్రామానికి వెళ్లేవారు కాదు. శిల్ప ఆ ఇంటర్వ్యూ వెళ్లడంలో ఉద్దేశమే వైద్యం అందని గ్రామాలకు వైద్య సేవలనందించడం. దాంతో ఆమె సంతోషంగా వెళ్లింది. రాక్చమ్లోని పీహెచ్సీ తాళాలు తీసి గ్రామస్థుల సహాయంతో శుభ్రం చేయించింది. నర్సు కానీ, ఇతర వైద్య సిబ్బంది కానీ ఎవరూ లేరు. డాక్టర్ శిల్ప అన్నీ తానే అయి వైద్య సేవలు మొదలు పెట్టింది. డాక్టర్ డ్యూటీ మానరాదు రాక్చమ్లో ఎనిమిది వందల మంది నివసిస్తున్నారు. నడి వయసు దాటిన వారిలో దాదాపుగా ఓ యాభై మందికి పైగా బీపీ, డయాబెటిస్తో బాధపడుతున్నారు. కానీ తమకు అనారోగ్యం ఉందన్న సంగతి వాళ్లకు తెలియదు. వాళ్లకు క్రమం తప్పకుండా మందులు వాడడం, హాస్పిటల్కు వచ్చి పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసింది డాక్టర్ శిల్ప. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు... అందరికీ వైద్య ప్రదాత ఆమె. కరోనా సమయంలో ఇంటికి రమ్మని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు పిలిచినప్పుడు ‘డాక్టర్ రోగానికి భయపడకూడదు. అలా భయపడి పారిపోవడం వైద్యవృత్తికే అవమానం’ అని చెప్పింది శిల్ప. ఆమె అన్నట్లుగానే... కరోనాకు వెరవకుండా రాక్చమ్ గ్రామంలో ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ఎవరిలోనైనా వ్యాధి లక్షణాలున్నాయేమోనని పరీక్ష చేసింది. అనుమానం వచ్చిన వారికి జాగ్రత్తలు సూచిస్తూ అవసరమైన వారిని సంగ్లా గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించేది. అలా నోటి మాట ద్వారా ఆమె సేవలు తెలుసుకున్న సంగ్లా వైద్య అధికారులు కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన సమయంలో ప్రత్యేకమైన వైద్య సేవల కోసం శిల్పను సంగ్లాకు బదలీ చేశారు. ఇప్పుడామె సంగ్లాలో విధులు నిర్వర్తిస్తోంది. కానీ రాక్చమ్ గ్రామస్థులు అప్పుడప్పుడూ ఆమెను చూడడానికి వస్తుంటారు. అనారోగ్యంతో వచ్చిన వాళ్లు డాక్టర్ శిల్ప దగ్గరే చూపించుకుంటామని పట్టుపడుతున్నారు. వైద్యరంగం, డాక్టర్లు డబ్బు కోసం రోగి ప్రాణాలతో ఆడుకుంటున్న రోజుల్లో ఇలాంటి డాక్టర్ గురించి తెలిస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. పుట్టింటి ఆత్మీయత రాక్చమ్ నాకు డ్యూటీ స్టేషన్ మాత్రమే కాదు, పుట్టింటితో సమానం. గ్రామస్థులు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. మహిళలు రోజూ ఎవరో ఒకరు హాస్పిటల్కు వచ్చి నేను పేషెంట్లను చూడడం పూర్తయ్యే వరకు నాకు తోడుగా ఉండేవారు. వాళ్లింటికి భోజనానికి, టీకి తీసుకెళ్లేవారు. భోజనం అయిన తర్వాత నన్ను ఇంటి దగ్గర దించి వెళ్లేవాళ్లు. నేను వాళ్లకు వైద్యం మాత్రమే చేశాను. వాళ్లు నాకు ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమను పంచారు. – డాక్టర్ శిల్ప -
అతి పొడవైన టన్నెల్ని ప్రారంభించనున్న మోదీ
షిమ్లా: మనాలి–లేహ్ మధ్య 46 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని తగ్గించే హిమాచల్ప్రదేశ్లోని రోహ్తంగ్ వద్ద కీలకమైన అటల్ టన్నెల్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే హైవేపై నిర్మించిన అతి పొడవైన టన్నెల్. 9.02 కిలోమీటర్ల ఈ టన్నెల్ రక్షణ రీత్యా అత్యంత వ్యూహాత్మకమైనది. మనాలీ లేహ్ల మధ్య 4 నుంచి 5 గంటల ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ఈ టన్నెల్ను సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో, అత్యాధునిక సాంకేతికతతో నిరి్మంచారు. ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ, బస్సులో ఈ టన్నెల్ మార్గంలో ప్రయాణిస్తారు. (కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం) -
ఆన్లైన్ చదువు కోసం ఆవు అమ్మకం
పాలంపూర్: తమ ఇద్దరు పిల్లల ఆన్లైన్ పాఠాల కోసం, కుటుంబానికున్న ఏకైక జీవనాధారమైన ఆవుని రూ.6,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్కు. కుల్దీప్ పిల్లలు అన్నూ నాల్గవ తరగతి, డిప్పు రెండవ తరగతి చదువుతున్నారు. మార్చి నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో పాఠశాలలు మూత పడ్డాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. చదువు కొనసాగించాలంటే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సిందేనని కుల్దీప్పై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. ఎవ్వరూ రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో విసిగిపోయిన కుల్దీప్ తన బిడ్డల చదువుకోసం తన ఏకైక జీవనాధారమైన ఆవుని ఆరువేల రూపాయలకు అమ్ముకొని, పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టారు. విషయం తెల్సి జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ దావ్లా విస్మయం వ్యక్తంచేశారు. తక్షణమే కుల్దీప్కి ఆర్థిక సాయం చేయాల్ సిందిగా స్థానిక బీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. -
స్మార్ట్ఫోన్ కోసం ఆవును అమ్మేశాడు
సిమ్లా : ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్ల పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రుల జేబులు గుల్లచేస్తున్నాయి. తమ ఇద్దరు చిన్నారుల ఆన్లైన్ క్లాస్ల కోసం స్మార్ట్ఫోన్ కొనేందుకు హిమాచల్ ప్రదేశ్లో ఓ వ్యక్తి తన జీవనాధారమైన ఆవును అమ్మిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో స్కూళ్లన్నీ విద్యార్ధుల కోసం ఆన్లైన్ క్లాస్ల బాట పట్టాయి. కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఈ క్లాస్లకు హాజరు కాలేకపోయారు. నాలుగో తరగతి, రెండో తరగతి చదువుతున్న తమ పిల్లలు ఆన్లైన్ క్లాస్లకు హాజరవడంలో ఇబ్బందులు పడుతుండటంతో కుల్దీప్పై స్మార్ట్ఫోన్ కొనాలనే ఒత్తిడి పెరిగింది. పిల్లలు చదువు కొనసాగించాలంటే స్మార్ట్ఫోన్ తప్పనిసరని ఉపాధ్యాయులు సైతం కుల్దీప్కు సూచించారు. స్మార్ట్ఫోన్ కొనేందుకు తాను బ్యాంకులు, వడ్డీవ్యాపారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని కుల్దీప్ వాపోయారు. దిక్కుతోచని పరిస్థితిలో కేవలం 6000 రూపాయల కోసం తన జీవనాధారమైన ఆవును అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జ్వాలాముఖిలో ఉంటానని, తనకు కనీసం రేషన్ కార్డు కూడా లేదని కుల్దీప్ పేర్కన్నారు. ఆర్థిక సాయం కోసం తాను పలుమార్లు పంచాయితీని సంప్రదించినా ఎలాంటి సాయం అందలేదని కుల్దీప్ ది ట్రిబ్యూన్కు వెల్లడించారు. ఈ ఉదంతంపై జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలా స్పందిస్తూ కుల్దీప్ కుమార్కు సత్వరమే ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. చదవండి : ఆన్లైన్ విద్యతో లక్ష్యాలు నెరవేరేనా! -
కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీలపై కేసు నమోదు
సిమ్లా: కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్నందుకు గాను సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మంది మీద హిమాచల్ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడిని మండి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్ చౌదరిగా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం అంబులెన్స్లో శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు కాన్సా, తన్వా గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అంబులెన్స్ను అడ్డుకున్నారు. దాంతో సుమన్ చౌదరితో పాటు మిగతా వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశాం’’ అన్నారు పోలీసులు. సుమన్ చౌదరి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఓ వైపు కాంగ్రెస్ నాయకులు కరోనాను ఓడించండి.. మానవత్వాన్ని బతికించండి అంటూ ప్రచారం చేస్తుండగా.. మరో వైపు సుమన్ చౌదరి కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకూ లాక్డౌన్
సిమ్లా : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ను జూన్ 30 వరకూ లాక్డౌన్ పొడిగించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హిమాచల్లో ప్రస్తుతం 214 వైరస్ కేసులు నమోదవగా వీరిలో 63 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఐదుగురు మరణించారు. హిమాచల్ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సడలించడం, కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించిన క్రమంలో హిమాచల్ప్రదేశ్ లాక్డౌన్ను పొడిగించడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 31తో ముగియనుంది. అత్యధిక కేసులతో తల్లిడిల్లుతున్న మహారాష్ట్ర మాత్రమే ఇప్పటివరకూ లాక్డౌన్ పొడిగింపును కోరుతోంది. మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించిన తర్వాత మూడుసార్లు లాక్డౌన్ను పొడిగించారు. చదవండి : కార్మికులు లేక ‘పరిశ్రమల లాక్డౌన్’ -
దగ్గు మందు తాగి 9మంది మృతి
సాక్షి, శ్రీనగర్: ఫార్మాసుటికల్ కంపెనీలు మందులు తయారు చేసే ప్రదేశాలు ఎక్కడున్నా ఉత్పత్తులు మాత్రం దేశం నలుమూలలకి వెళ్తుంటాయి. ఏ కొంత నిర్లక్ష్యం వహించినా వాటి వలన జరిగే నష్టం అంచనా వేయలేం. తాజాగా జమ్మూలో చిన్నారులకు దగ్గు మందు కావాల్సి వచ్చింది. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఓ కంపెనీ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్ జిల్లా చిన్నారులకు పంపింది. అందులో పాయిజన్ కాంపౌండ్ కలిపిన సంగతి తెలియని చిన్నారులు 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు. గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 'ప్రైమా ఫేసీ', 'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్, ఛండీఘర్లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని' డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు. ఈ దగ్గుమందు కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయి మరణాలు సంభవించినట్లు డైరక్టర్ హెల్త్ సర్వీస్కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో మొత్తంగా 5,500 మందు బాటిళ్లను సీజ్ చేశారు. తయారీ యూనిట్ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కంపెనీ మందులు సరఫరా అయ్యే ఉత్తరాఖండ్, హర్యానా, తమిళానాడు, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, త్రిపురలో తనిఖీలు చేపడుతున్నట్లు హిమాచల్ప్రదేశ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
నేను ఉరి తీస్తా.. ఆమె ఆత్మ శాంతిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: 2012లో డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్యాచార ఘటన ‘నిర్భయ’ కేసు దోషులకు మరణ శిక్ష ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారి లేకపోవడంతో జైలు అధికారులు టెన్షన్ పడుతున్నారన్న వార్తకు స్పందన వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాకు చెందిన రవి కుమార్ దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ తీహార్ జైలులో ఎగ్జిక్యూటర్ లేనందున తనను తాత్కాలిక తలారిగా నియమించాలని కోరారు. తద్వారా నిర్భయ కేసు దోషులను త్వరలో ఉరి తీయవచ్చు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆయన పేర్కొన్నారు. కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా మార్చారు. నేరస్థులో ఒకడైన రాంసింగ్ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాల నేరస్థుడు సంస్కరణ గృహంలో ఉన్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడంతో, తీహార్ జైలులో ఉన్న వినయ్ శర్మ రాష్ట్రపతిని ఆశ్రయించాడు. అయితే దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టవద్దని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్కు మరణశిక్షను అమలు చేయనున్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ పిటిషన్ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీ చేసే అవకాశముందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అక్కడ తలారి లేక.. ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనూ పదవీ విరమణ చేసిన తలారీలు ఎవరైనా ఉన్నారా? అని వెతికే పనిలో ఉన్నారు. తలారీని కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. Himachal Pradesh: Ravi Kumar, from Shimla has written to President Kovind to appoint him as temporary executioner in Delhi’s Tihar Jail as there is no executioner there.He states, “Appoint me executioner so ‘Nirbhaya’ case convicts can be hanged soon & her soul rests in peace". pic.twitter.com/fqZLarNZIQ — ANI (@ANI) December 4, 2019 -
ధర్మశాలలో మోదీ.. అభివృద్ధిపై ప్రశంసలు
ధర్మశాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం జైరాం థాకూర్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రధానికి పుష్పాలతో స్వాగతం పలికారు. ధర్మశాలలో జరుగుతున్న రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ భేటీని ప్రధాని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా హిమాచల్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని గడిచిన రెండేళ్లలో హిమాచల్ ప్రదేశ్ గణనీయ అభివృద్ధిని సాధించిందన్నారు. -
హిమచల్ప్రదేశ్ గవర్నర్గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
-
దైవభూమిని ముంచెత్తిన వరదలు
తిరువనంతపురం: దైవభూమి కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలకు మృతిచెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 121కి చేరుకోగా.. గల్లంతయిన వారి సంఖ్య 40కి చేరింది. వరదలకు అత్యధికంగా మలప్పురం జిల్లాలో 50 మంది, కోజికోడ్లో 17 మంది, వాయనాడ్లో 12 మంది, కన్నూర్, త్రిసూర్లో 9 మంది చొప్పున మృత్యువాతపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.13 లక్షల మంది ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కేరళ వ్యాప్తంగా 805 సహాయక పునరావాస శిబిరాల్లో 41,253 కుటుంబాలకు చెందిన 1,29,517 మంది ఇంకా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వరదలకు మొత్తం 1,186 ఇల్లు పూర్తిగా నెలమట్టమయ్యాయని, 12,761 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. శిధిలాల కింద చిక్కుకున్న వారికోసం రెస్క్యూ టీంలు గాలిస్తున్నారు. ఇక్కడ జీపీఎస్ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. చదవండి: భయపెడుతున్న బియాస్.. 28కి చేరిన మృతులు మరోవైపు ఉత్తర భారతంలో కూడా వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. బియాస్, సట్లేజ్ నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని యమున నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులంతా సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. -
హిమాచల్లో పోటెత్తిన వరద : 18 మంది మృతి
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతతో రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పోటెత్తిన వరదతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మరణించారు. వరద తీవ్రతతో సిమ్లా, కులు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సిమ్లాలో ఎనిమిది మంది, కులూ, శ్రీమర్, సొలన్, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వరద నీరు ఇళ్లు, రహదారులను ముంచెత్తింది. వరద ఉధృతి కారణంగా కులు పట్టణం సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. సట్లెజ్ నది పోటెత్తడంతో ముందుజాగ్రత్తగా సట్లజ్ జల విద్యుత్ నిగమ్కు చెందిన దేశంలోని అతిపెద్ద హైడ్రో ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను విడుదల చేశారు. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
‘హిమాచల్’ మృతులు14
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 14కు చేరింది. గాయపడిన వారి సంఖ్య 28కి చేరింది. మరణించిన వారిలో 13 మంది సైనికులు ఉన్నారు. వారితో పాటు మృతి చెందిన ఓ పౌరుడి మృతదేహాన్ని శిధిలాల నుంచి వెలికితీశారు. గాయపడిన 28 మందిలో 17 మంది ఆర్మీ సైనికులు కాగా మరో 11 మంది సాధారణ పౌరులు ఉన్నారు. వీరంతా నాలుగు అంతస్తుల రెస్టారెంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భవనం కూలిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శివ్ కుమార్ తెలిపారు. భవనాన్ని నిబంధనలకు లోబడి నిర్మించకపోవడం వల్లే కూలిపోయిందని పోలీసులు గుర్తించారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక పరిశీలించాక తగు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆదివారం నుంచే హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రోహిత్ రాథోర్ను ఈ ఘటన వివరాలు సేకరించేందుకు నియమించామని డిప్యూటీ కమిషనర్ కేసీ చమాన్ అన్నారు. మొదట అది భూకంపం అనుకున్నామని గాయపడిన ఓ సైనికుడు చెప్పారు.