
ఏ క్షణంలో కరోనా మహమ్మారి కబలిస్తుందో తెలియని అనిశ్చితి వాతావరణంలో హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వేచి ఉన్న ప్రయాణికులు.

ఉపాధి కోసం దేశం దాటి వచ్చిన నేపాలీలకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. కోవిడ్ సెకండ్వేవ్ ఉధృతి నేపథ్యంలో హైదరాబాద్లోని నేపాలీలంతా మూటా ముల్లె సద్దుకుని స్వదేశానికి తిరుగుపయనం అవుతున్నారు.

ముంబైలోని ఎంఎంఆర్సీ కోవిడ్ సెంటర్లో 45 ఏళ్లు పైబడిన వారి కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో గురువారం రద్దీ

గుజరాత్లోని అహ్మదాబాద్లో బారికేడ్లు తొలగించిమరీ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న రోగులు

రష్యా నుంచి రెండు కార్గో విమానాల్లో ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం ఉదయం చేరుకున్న 22 టన్నుల వైద్య సామాగ్రి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 8వ విడత పోలింగ్లో గురువారం ముగిసింది. కరోనా భయాలను కూడా ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ముర్షీదాబాద్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు జనం బారులు తీరారు.

భార్య మృతదేహాన్ని తరలించడం వీలుకాక సాయం కోసం చూస్తున్న తిలక్ధారి. తోడెవరూ రాక నిస్సహాయతతో సైకిల్ను వదిలేసి పక్కన కూర్చున్న తిలక్ధారి. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లా అంబర్పూర్ గ్రామంలో జరిగిన విషాద ఘటన.

నవీ ముంబైలో టీకా డోస్లు లేకపోవడంతో జనంలేక ఖాళీగా ఉన్న ఓ ప్రభుత్వ టీకా కేంద్రం

చిన్నారులు ముక్కు, గొంతు నుంచి కరోనా శాంపిల్స్ సేకరించే సమయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారెంతో ఇష్టంగా తినే లాలీపాప్ ఆకారంలో రూపొందించిన పరికరమిది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని కొన్ని స్కూళ్లలో ఈ విధానంలో కోవిడ్ పరీక్షలు జరుపుతున్నారు. మెత్తగా ఉండే ఈ పరికరాన్ని బ్రష్ మాదిరిగా నోటిలో అటూఇటూ తిప్పి పరీక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment