Uppal
-
సన్రైజర్స్ మ్యాచ్లో వెంకటేశ్ సందడి.. జెండా పట్టుకుని హుషారు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో చాలాసార్లు టీమిండియా మ్యాచ్ల్లోనూ సందడి చేశారు. తాజాగా ఐపీఎల్ సీజన్లో మరోసారి స్టేడియంలో మెరిశారు. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు ఆయన హాజరయ్యారు. ఎస్ఆర్హెచ్ జెండాను పట్టుకుని టీమ్కు మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోను సన్రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది.కాగా.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మన హీరో విక్టరీ వెంకటేశ్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.Anytime, Uppal center lo Single handedly support chese our Victory Venkatesh is here 💪🧡#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/2v4qDKh4bI— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025 -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్, తేడా వస్తే తాటతీస్తాం.. బుకీలకు పోలీసుల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్-18 మ్యాచ్ కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ముస్తాబైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద సందడి షురూ అయ్యింది.ఈ తరుణంలో హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం 2700 మంది పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. 450 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సీజన్లో మొత్తం 10 జట్లు.. మొత్తం 73 మ్యాచ్లు ఆడనున్నాయి. మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ బుకీలు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్,రిసార్ట్స్, రెస్టారెంట్స్ క్లబ్స్పై ఓ కన్నేశారు. ఏమాత్రం తేడా వచ్చినా బెట్టింగ్ రాయుళ్ల తాటతీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు39వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో.. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలనూ అర్ధరాత్రి వరకూ పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..సన్రైజర్స్ సత్తా చాటుతుందా ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలు కానుంది. దీంతో హైదరాబాద్ గట్టుపై బోణీ కొట్టేదెవరని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..ఈ సారి కూడా సన్రైజర్స్ సత్తా చాటుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పట్టిష్టంగా ఇరు జట్లుసన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తుండగా..ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడంతో..హెడ్, అభిషేక్, క్లాసెన్లు ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్లు ఆడగా…అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్లలో విజయం సాధించింది. -
ఉప్పల్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ దందా
-
జాప్యానికి జరిమానా..!
సాక్షి, హైదరాబాద్: ఐదున్నరేళ్ల జాప్యంతో వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపుతున్న ఉప్పల్–మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం మొదలైన పనులు ఇంకా సగం కూడా పూర్తి కాకపోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ కారణమని తేల్చి.. రెండింటికి పెనాల్టీ విధించింది. పనుల్లో జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరగనుండటంతో దాదాపు రూ.60 కోట్ల మేర అంచనాను పెంచింది. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ కారిడార్ను ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఇదీ నేపథ్యం..: హైదరాబాద్–భూపాలపట్నం 163 జాతీయ రహదారి మీద హైదరాబాద్–వరంగల్ మధ్య వాహనాల రద్దీ బాగా పెరిగి ఉప్పల్ సమీపంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. దీంతో దిగువన 150 మీటర్ల సర్వీసు రోడ్డు నిర్మిస్తూ, ఘట్కేసర్ వైపు వెళ్లే వాహనాలకు నిరాటంక ప్రయాణానికి వీలు కల్పించేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2017లో ప్రతిపాదించారు. ఉప్పల్ కూడలి నుంచి మేడిపల్లి వరకు 6.2 కి.మీ నిడివితో 45 మీటర్ల వెడల్పు ఉండే ఆరు వరుసల ఫ్లైఓవర్కు డిజైన్ చేశారు. హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 11.5 కి.మీ. నిడివితో నిర్మించిన పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే తర్వాత, ఇదే పెద్ద ఫ్లైఓవర్ కానుండటం గమనార్హం. 2018 జూలైలో ప్రారంభమైన పనులను 2020 జూలై నాటికి పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. రూ.670 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. కానీ, నిర్మాణ సంస్థ అసాధారణ రీతిలో వ్యవహరించిన తీరు మొదటికే మోసం తెచ్చింది. ఓ రష్యన్ కంపెనీతో కలిసి నిర్మాణ సంస్థ ఏకంగా 25 శాతం తక్కువకు టెండర్ దక్కించుకుంది. అంత తక్కువ మొత్తంలో ఈ వంతెనను పూర్తి చేయటం కష్టమని దానికి తర్వాత తెలిసొచ్చింది. అదే సమయంలో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. 43 శాతం మాత్రమే పనులు చేసి ఆపేసింది. అసంపూర్తి పనులతో ఆ మార్గంలో వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏడేళ్లుగా వాహనదారులు ఆ ప్రాంతాన్ని దాటేందుకు నానా అవస్థలకు గురవుతున్నారు. నిర్మాణం పాత సంస్థదే.. పర్యవేక్షణకు స్వతంత్ర సంస్థటెండర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్త టెండర్ పిలిచి మరో నిర్మాణ సంస్థకు బాధ్యత అప్పగించాలని తొలుత అధికారులు భావించారు. కానీ, దీనివల్ల మరింత జాప్యంతోపాటు ఖర్చు కూడా పెరుగుతుందని గుర్తించి, పాత నిర్మాణ సంస్థకే బాధ్యత అప్పగించారు. పని పూర్తి చేసేందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. కంపెనీ ఆర్థిక నష్టాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యవహారం నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను నియమించాలని నిర్ణయించారు. ఆర్థిక వ్యవహారాలు సహా మొత్తం ఆ సంస్థే పర్యవేక్షించనుంది. మరో సంస్థతో అవగాహన కుదుర్చుకుని నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. 20 నెలల్లో పూర్తి: ప్రాజెక్టు పనులను 20 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. 2026 అక్టోబర్ 31 నాటికి వంతెనను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించింది. తాజా నిర్ణయాలు ఇవీరూ.28 కోట్ల పెనాల్టీ: పనుల్లో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థల తీరు కారణమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ తేల్చింది. సకాలంలో భూసేకరణ పూర్తి చేయలేకపోవటం, నిర్మాణానికి వీలుగా స్తంభాలు, ఇతర కట్టడాలను తొలగించకపోవటంతో పనుల్లో జాప్యం జరిగింది. పనులు మొదలయ్యాక నిర్మాణ సంస్థ మధ్యలో ఆపేసి ఆ జాప్యాన్ని కొనసాగించింది. దీంతో.. ఆ ఫ్లైఓవర్ను పూర్తి చేసేందుకు భవిష్యత్తులో ఖర్చుచేసే మొత్తంపై 10 శాతాన్ని పెనాల్టీగా విధించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ చెరిసగం భరించాలని పేర్కొంది.అంచనా రూ.60 కోట్లు పెంపు: ఈ ప్రాజెక్టు ఒప్పంద అంచనా రూ.425.10 కోట్లు. ఇందులో ఇంకా 225.56 కోట్ల పని చేయాల్సి ఉందని లెక్క తేలింది. కానీ, ఆ మొత్తంతో పని పూర్తి కాదు. మరో రూ.60 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. అంటే రూ.286 కోట్లు ఖర్చవుతుందన్నమాట. నిర్మాణ సంస్థ పెనాల్టీగా రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. ఆ మొత్తాన్ని చెల్లించే క్రమంలో రూ.14 కోట్ల పెనాల్టీని మినహాయించుకోవాలని అధికారులను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశించింది. -
8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య
-
కారులో షార్ట్ సర్క్యూట్: Uppal
-
పుట్టిన రోజే.. ఆఖరి రోజు.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
వాషింగ్టన్ డీసీ : పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఓ సరదా అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటనలో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముందే స్నేహితుడు ప్రాణ కోల్పోవడంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేని స్థితిలో గుండెలవిసేలా రోదించారు. దీంతో ఉప్పల్ కళ్యాణ్ పురిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికా పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.ఉప్పల్ కళ్యాణ్ పురికి చెందిన ఆర్యన్ రెడ్డి(23) అమెరికాలోని జోర్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అయితే ఈ క్రమంలో నవంబర్ 13న అతని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అదే రోజు తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తుపాకీ మిస్ఫైర్ అయి ఆర్యన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇవాళ రాత్రి ఆర్యన్ రెడ్డి మృతదేహాన్ని తరలించనున్నారు. -
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య -
HCA: అజారుద్దీన్కు ఈడీ సమన్లు
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1984- 2000 వరకు అజారుద్దీన్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.తన కెరీర్లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్గా పేరొందిన అజారుద్దీన్ కెప్టెన్గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.ఈ క్రమంలో 2020 - 2023 మధ్యలో హెచ్సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. -
తెలంగాణలో కొత్త లైన్, ఉప్పల్ స్టేషన్.. రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్–హసన్పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి బండి సంజయ్ లేఖ ఇచ్చారు.ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలో..‘కరీంనగర్ నుండి హసన్పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్–వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్ను విస్తరించాలన్నారు. అలాగే, సోలార్ ప్యానల్స్ను కూడా అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఎందుకీ హైడ్రామాలు.. బండి సంజయ్ ఫైర్ -
హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6వ తరగతి విద్యార్థిని మృతి
సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో గురువారం విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొట్టడంతో పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.ప్రమాదంతో అప్రమత్తమైన వాహనదారులు బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.కొద్దిరోజుల క్రితంమరోవైపు హబ్సిగూడా ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది.ఆగస్ట్ 17, శనివారం ఉదయం హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థిని సాత్విక ఎప్పటిలాగే ఉదయం 7 గంటలకు ఆటోలో స్కూల్కు బయలుదేరింది. హబ్సిగూడ చౌరస్తాలో సిగ్నల్ పడి ఉండటంతో ఆర్టీసీ బస్సు వెనకాల ఆటోను ఆపి ఉంచాడు డ్రైవర్. ఈ క్రమంలో మితిమీరిన వేగంలో వెనక నుంచి దూసుకువచ్చిన ఓవర్ లోడ్తో ఉన్న టస్కర్ (18 చక్రాల లారీ) వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో స్వాతిక ప్రయాణిస్తున్న ఆటో ముందున్న ఆర్టీసీ బస్సు కిందకు చొచ్చుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎల్లయ్య తీవ్రంగా గాయపడగా..సాత్విక ప్రాణాలు కోల్పోయింది. ఇలా వరుస ప్రమాదాలతో ఉన్నత విద్యాసంస్థలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న హబ్సిగుడాలో వరుస రోడ్డు ప్రమాదాలు విద్యార్థులు,వారి తల్లిదండ్రుల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. -
ఎట్టకేలకు స్పందించారు
‘ఎన్నాళ్లీ నరకం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. వరంగల్ జాతీయ రహదారిపై అసంపూర్తి దశలో నిలిచిపోయిన ఉప్పల్– నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అక్కడికక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్జాం ఏర్పడింది. Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం? -
Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం?
ప్రత్యక్ష నరకం మీరెప్పుడైనా చవిచూశారా? అయితే.. ఉప్పల్– నారపల్లి రహదారిలో ప్రయాణించండి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆరేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్– నారపల్లి మధ్య 6.2 కిలో మీటర్ల మేర చేపట్టిన కారిడార్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం నరకాన్ని అనుభవించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుమ్మూ ధూళి.. బురద.. కంకర తేలి గుంతలు ఏర్పడి.. వానొస్తే రోడ్డుపై కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుర్గతి పట్టింది. ఆరేళ్లుగా ఈ దురావస్థతోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతుండటం శాపంలా పరిణమించింది. ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ బాధితులు. ఇప్పటికైనా ఏళ్లుగా పడుతున్న నరకం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకొంటున్నారు. ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలో మీటర్ల మేర 148 పిల్లర్లతో ఫ్లై ఓవర్ పనులకు అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.625 కోట్లు. 2018 జులైలో ప్రారంభమైన పనులు 2020 జూన్లో పూర్తి కావాలి. కానీ.. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 6.2 కి.మీ మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రహదారిలో నిమిషానికి దాదాపు 960 నుంచి 1000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ కూడా ఒకటి. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. అభివృద్ధి శరవేగం.. ఇటు అధ్వానం..ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వర్తక, వాణిజ్య దుకాణాలు రోడ్డు వెడల్పు పనులతో తీవ్రంగా నష్టపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 450 షాపులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో రోడ్డు సరిగా లేని కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల జాబితాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మెట్రో రైలు.. మినీ శిల్పారామం, స్కైవాక్ వంతెన, ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఇలా ఎటు చూసినా అన్నివిధాలా ఉప్పల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో జాప్యంతో ఇక్కడి ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు ఆరేళ్లుగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి అనేక అడ్డంకులు రావడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎదురు చూపులే మిగిలాయి. కాంట్రాక్టు రద్దు చేశారా? ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కాంట్రాక్టును గాయత్రీ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకున్న విషయం విదితమే. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా సదరు సంస్థ గడువులోగా పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. మరో సంస్థకు మిగిలిన పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.బిజినెస్ నిల్.. వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ మార్గంలో స్టేషనరీ, వస్త్ర, వాణిజ్య షాపులు, పూజా సామగ్రి, కిరాణా, ఆటోమొబైల్, ఫర్నిచర్, స్వీట్ దుకాణాలు, హోటళ్లు తదితర అనేక వ్యాపారాలు మనుగడ పొందుతున్నాయి. కాగా.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా దుమ్మూ ధూళితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. రోడ్లు వేయక పోవడం, విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచక పోవడంతో వందలాది మంది వ్యాపారులు అవస్థలు పడుతున్నట్లు వర్తక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరేళ్లుగా వ్యాపారాలు నిల్.. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లు లేక దుమ్ము కొట్టుకుపోవడంతో గిరాకీ లేక అవస్థలు పడుతున్నాం. 90 శాతం గిరాకులు దెబ్బతిన్నాయి. వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోయాం. – శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రతినిధి రోడ్డుపైకి రావాలంటే సాహసం చేయాల్సిందే.. ఉప్పల్ రోడ్డు మీదకు రావాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ఏళ్లుగా పాడైపోయిన రోడ్ల మీద వాహనం నడిపి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీనివాస్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్గత ప్రభుత్వ అశ్రద్ధతోనే.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే రోడ్డు ఎటూ కాకుండా పోయింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాని పారీ్టలను దృష్టిలో పెట్టుకుని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి. – మేకల శివారెడ్డి, ఉప్పల్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ -
హైదరాబాద్ లో పిల్లర్ పక్కనే కుంగిపోయిన భూమి
-
ఇన్స్టా రీల్స్ చేస్తోందన్న కోపంతో భార్యను..!
ఉప్పల్: ఫోన్లో నిత్యం రీల్స్ చూస్తోందని.. ఇన్స్టాలో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందని భార్యపై కక్షగట్టిన ఓ భర్త.. ఆమెను చంపేసి పరారైన కేసును ఉప్పల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ చక్రపాణి వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న ఉప్పల్ న్యూభరత్నగర్లోని ఓ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూడగా ఓ గోనే సంచిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత (28) దంపతులు ఆరు నెలలుగా ఉప్పల్ న్యూ భరత్నగర్లో ఉంటున్నారు. వీరికి కేన్సర్తో బాధపడుతున్న 8 నెలల కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగు తున్నాయి. ఇంటికి వచ్చిన భర్త ప్రదీప్ను మధుస్మిత పట్టించుకోకపోవడం, పలకరించకపోవడం.. ఎప్పుడు చూసినా ఫోన్లో రీల్స్ చూస్తూ ఉండేది. మధుస్మిత నిత్యం వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడేదని, దీంతో ఆమెపై అనుమానంతో ఈ నెల 7న రొట్టెల పీటతో కొట్టి చంపేశాడు. 8 నెలల కూతురును వెంట తీసుకుని సికింద్రాబాద్కు రైల్వేస్టేషన్కు వెళ్లాడు. తన కూతురును కాస్త చూస్తూ ఉండండని పక్కవాళ్లకు చెప్పి ప్రదీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు బేగంపేట్లోని ఓ హోటల్ పని చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో శనివారం ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడు ప్రదీప్ బోలాను పట్టుకున్నారు. భార్య తనను పట్టించుకోకపోయేదని, రోజంతా ఫోన్లో రీల్స్ చూస్తుండట.. రీల్స్ చేస్తుండటం.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో అనుమానం పెంచుకుని భార్యను చంపినట్లు విచారణంలో తేలిందని పోలీసులు చెప్పారు. కేసు మిస్టరీని ఛేదించిన సీఐ ఎలక్షన్ రెడ్డి, స్పెషల్ టీమ్ బృందాన్ని ఏసీపీ అభినందించారు. -
సీఎం రేవంత్రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమ ర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ కోతలు లేవుని, 24 గంటలు నాణ్యమైన కరెంట్ను తమ ప్రభుత్వం సరాఫరా చేస్తుందని చెప్పారు. అలా చెప్పి 24 గంటలు కూడా కాకముందే ప్రజలు కరెంట్ కోసం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు.CM Revanth says NO power cuts & 24 Hour uninterrupted, quality power is being supplied Why are these people protesting at Substation ? https://t.co/xlAK3PDFcA— KTR (@KTRBRS) June 3, 2024 హైదరాబాద్లోని ఉప్పల్లో రాత్రి కరెంట్ లేక సబ్ స్టేషన్ ముందు ప్రజలు ధర్నాలు చేశారని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు..
హైదరాబాద్: ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భర్తపై ఉన్న అనుమానంతో ప్రశి్నంచినందుకు అర్దరాత్రి భార్య గొంతుపై కాలు పెట్టి తొక్కి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడో కిరాతకుడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం లింగంపల్లి ప్రాంతానికి చెందిన భూక్యా రమేశ్, కొండాపూర్ దుబ్బ తండాకు చెందిన భూక్యా కమలకు 2016లో వివాహం జరిగింది. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లారు. కాగా గత కొంత కాలంగా భర్త రమేష్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కమల అనుమానించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు నిలదీసి పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యా భర్తల మధ్య గొడవ మొదలయింది. అనంతరం ఇద్దరు కలిసి ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చారు. రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగి..రమేశ్ భార్య తలపై కొట్టడంతో కింద పడిపోయింది. వెంటనే ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కి..చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కమల హత్య వార్త తెలుసుకున్న కుంటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్లో లక్నో సన్రైజర్స్తో తలపడింది.టాపార్డర్ పూర్తిగా విఫలం ఉప్పల్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.పరుగుల సునామీవీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు- 89 రన్స్).కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్రైజర్స్.పాపం రాహుల్లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్పై సీరియస్ అయ్యాడు. చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
సాక్షి, హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.అయితే, వర్షం రూపంలో సన్రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్లో సన్రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్బోర్డ్, జూబ్లీ బస్స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.మెట్రోలో సైతంఅలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.చదవండి: సంజూ శాంసన్కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐThe Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024 -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్రైజర్స్ ఉప్పల్లోనూ ఆ సీన్ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్లో సన్రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
గ్రేటర్లో బీఆర్ఎస్కు మరో నేత రాజీనామా
మేడ్చల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా మరో నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు తన రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల వేళ పలువరు కీలక నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు కే. కేశవరావు, పట్నం మహేందర్రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నగేందర్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలపటం గమనార్హం. -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్రైజర్స్ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో) -
CSK అభిమానికి చేదు అనుభవం.. HCAపై ఆగ్రహం! పోస్ట్ వైరల్
మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలాకు ఇదే చివరి సీజన్ అన్న నేపథ్యంలో గతేడాది అతడిని చూసేందుకు అభిమానులు మైదానాలకు పోటెత్తిన విషయం తెలిసిందే. స్టేడియం ఏదైనా.. తమ సొంత జట్టును కూడా కాదని ధోని బ్యాటింగ్ వచ్చిన మూమెంట్స్ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ధోని ఐపీఎల్-2024లోనూ ఆడుతుండటంతో అభిమానులకు రెట్టింపు సంతోషాన్నిస్తోంది. ఇక ఈసారి ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కాకున్నా ఆటగాడిగా మైదానంలో దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వీరాభిమాని అయిన జునైద్ అహ్మద్ అనే యువకుడు సన్రైజర్స్తో సీఎస్కే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 అయితే, శుక్రవారం ఉప్పల్ స్టేడియానికి వచ్చిన అతడికి వింత అనుభవం ఎదురైంది. ఏకంగా రూ. 4,500 పెట్టి ఖర్చు పెట్టి మ్యాచ్ కోసం వచ్చిన జునైద్ అహ్మద్ టికెట్లో.. అతడికి J-66 సీట్ నెంబర్ అలాట్ చేసినట్లు ఉంది. సంతోషంగా స్టేడియానికి వెళ్లగా.. ఆ నంబరుతో అసలు సీటే కనిపించలేదు. J-65 తర్వాత J-67 సీట్ ఉండటంతో అతడు షాకయ్యాడు. సిబ్బందికి విషయం చెప్పినా వారూ ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా జునైద్ అహ్మద్ మ్యాచ్ మొత్తం నిలబడే చూడాల్సి వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం వల్లే తనకు ఈ దుస్థితి తలెత్తిందంటూ అతడు ఎక్స్ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. డబ్బులు పెట్టి టికెట్ కొంటే.. నాలుగు గంటలపాటు నిలబడి మ్యాచ్ చూడాల్సి వచ్చిందని వాపోయాడు. తనకు కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా తిరిగి డబ్బులు పొందగలనా? అంటూ బీసీసీఐతో పాటు హెచ్సీఏ అధ్యక్షుడిని కూడా జునైద్ ట్యాగ్ చేశాడు. అతడి ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్కు ముందు స్టేడియంలోకి అనుమతించే క్రమంలోనూ పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఏదేమైనా హెచ్సీఏ తీరు మారకపోవడంతో ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. స్టేడియానికి వెళ్తే ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటామని వాపోతున్నారు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంత మైదానంలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ Disappointed that I’ve booked a ticket and seat Number was J66 in Stand. Sorry state that seat doesn’t exist and had to stand and enjoy the game. Do I get a refund and compensation for this.#SRHvCSK #IPL2024 @JayShah @BCCI @IPL @JaganMohanRaoA @SunRisers pic.twitter.com/0fwFnjk641 — Junaid Ahmed (@junaid_csk_7) April 5, 2024 -
#Dhoni: కమిన్స్కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని!
IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్కే ఫ్యాన్స్ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. Overwhelming Yellove! Chaala Thanks, Hyderabad! 🥳💛#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/nZIYuBrbdA — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024 ఇక ధోని క్రేజ్ను చూసి సన్రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్కే స్టార్కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్కు ఫిదా అయ్యాడు. కాగా శుక్రవారం ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్.. సీఎస్కేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. స్లో వికెట్పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్ మిచెల్(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్ బౌలింగ్లో మిచెల్ అవుట్ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 తలా అలా గ్రౌండ్లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేయగా.. సన్రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. వైజాగ్లో వింటేజ్ ధోని విధ్వంసం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్-2024లో ధోని తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? 2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: వావ్.. గెలిచాం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి?
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన కమిన్స్ బృందం.. తర్వాత సొంతగడ్డపై రికార్డు విజయం అందుకుంది. ఉప్పల్లో ముంబై ఇండియన్స్ను మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లిన సన్రైజర్స్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్ కోసం మళ్లీ ఉప్పల్కు విచ్చేసిన సన్రైజర్స్ హోం గ్రౌండ్లో తమకు తిరుగు లేదని నిరూపించింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ విన్నింగ్స్ ట్రాక్ ఎక్కేసింది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చెన్నైపై రైజర్స్ విజయం తర్వాత ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ‘‘అవును.. గెలిచాం.. వావ్’’ అంటూ చప్పట్లతో కావ్య తన జట్టును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చెన్నైతో మ్యాచ్లో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. తద్వారా రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ తల్లి, సోదరి వచ్చి అభిషేక్తో ఫొటోలు దిగారు. ఆ అమ్మాయి ఎవరంటే? ఇక అభిషేక్ శర్మ సోదరి.. విక్టరీ సింబల్ చూపిస్తూ కావ్యా మారన్తో కూడా ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కాగా కావ్యా మారన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా మందికి ఆమె గుర్తుకువస్తారు. స్టాండ్స్లో ఉండి సన్రైజర్స్ను ఉత్సాహపరుస్తూ ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కావ్య ఎక్స్ప్రెషన్స్ ఒడిసిపట్టేందుకు కెమెరామెన్ చాలా మటుకు ఆమెపైనే ఫోకస్ పెడుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా?! చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ -
మా బౌలర్ల తప్పు లేదు.. ఓటమికి కారణం అదే: పాండ్యా
IPL 2024: Hardik Pandya backs bowlers after SRH mauling: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఐపీఎల్-2024లో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా బౌలర్ల వైఫల్యం కారణంగా ప్రత్యర్థి జట్టు కేవలం మూడు వికెట్ల నష్టానికే 277 పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. తద్వారా సన్రైజర్స్ ఐపీఎల్లో ఆల్టైమ్ రికార్డు సృష్టిస్తే.. ముంబై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఉప్పల్ వికెట్ బాగుందని.. ఓటమికి బౌలర్లను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఈ పిచ్పై ఇంత స్కోరు నమోదు అవుతుందని అస్సలు ఊహించలేదన్నాడు. ‘‘ఈ వికెట్ చాలా బాగుంది. ఇక్కడ బౌలర్లు ఎంత మంచిగా బౌలింగ్ చేసినా.. ప్రత్యర్థి 277 పరుగులు స్కోరు చేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఈ విషయంలో క్రెడిట్ రైజర్స్ బ్యాటర్లకు కూడా ఇవ్వాలి. నిజానికి.. టాస్ సమయంలో.. ఎస్ఆర్హెచ్ ఇంత స్కోరు చేస్తుందని అనుకోలేదు. వాళ్లను కట్టడి చేయడానికి మా బౌలర్లు బాగానే ప్రయత్నం చేశారు. కానీ పిచ్ వారికి అనుకూలించలేదు. ఇక్కడ 500కు పైగా పరుగులు స్కోర్ అయ్యాయంటే.. వికెట్ బ్యాటర్లకు అనుకూలించిందనే అర్థం కదా! ఏదేమైనా ఇప్పుడు మా జట్టులో చాలా మంది యువ బౌలర్లే ఉన్నారు. ఈ మ్యాచ్ నుంచి వాళ్లు పాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు క్వెనా మఫాకా అద్భుతంగా ఆడాడు. తన తొలి మ్యాచ్లోనే ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. తనకిది మొదటి మ్యాచ్. ఇక్కడ కుదురుకోవడానికి తనకు ఇంకాస్త సమయం కావాలి. మా బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. కానీ.. సరైన సమయంలో రాణించలేకపోయారు’’ అని హార్దిక్ పాండ్యా తమ బౌలింగ్ విభాగాన్ని సమర్థించాడు. కాగా ఉప్పల్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 246 పరుగుల వద్దే నిలిచి.. తాజా ఎడిషన్లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో పాండ్యా నాలుగు ఓవర్ల బౌలింగ్లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ద్వారా సౌతాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల పేసర్ క్వెనా మఫాకా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
500 కోట్లు స్కాం బోర్డు తిప్పేసిన జేపీ బిల్డర్స్
-
ఎల్ఈడీ లైట్లే కొంప ముంచాయా?
ఉప్పల్: ఉప్పల్ సీఎంఆర్ వస్త్ర దుకాణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి ఎల్ఈడీ లైట్లే కారణమని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కారణంగా షార్ట్ సర్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై సీఎంఆర్ మేనేజర్ గౌతమ్ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతులపై అన్నీ అనుమానాలే..? సీఎంఆర్ దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అయినా వస్త్ర దుకాణం నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పని చేసే చోట భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఆక్యుపెన్సీ(ఓసి) లేకుండా అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకే వ్యాపార సంస్థకు అనుమతులు ఇచ్చారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ట్రాఫిక్ విషయంలో సంబంధిత అధికారులు అనుమతి ఉందా? ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బుధవారం ఉదయం అనుమతులపై ఆరా తీశారు. నిర్వాహకులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తమే కానీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని టౌన్ప్లానింగ్ అధికారి స్వయంగా పేర్కొనడం గమనార్హం. -
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
గద్వాలలో కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లో చేరిన డీసీసీ అధ్యక్షుడు
సాక్షి, జోగులాంబ గద్వాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు నేతలు పార్టీని వీడారు. గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే టికెట్కెట్ దక్కలేదన్న అసంతృప్తితో ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. అనంతరం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రెడ్డి టీపీసీసీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గద్వాల కాంగ్రెస్ టికెట్ను రేవంత్ కొత్తగా వలస వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ సరితకు అమ్ముకున్నారని విమర్శించారు. గద్వాలలో రేవంత్ రెడ్డి బ్యానర్ను ప్రభాకర్ రెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. ఇప్పటికే సరిత అభ్యర్థిత్వాన్ని అటు కాంగ్రెస్ అసమ్మతి నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనకు గౌరవం లేని పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకన్న లక్ష్మారెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. సాయంత్రం ప్రగతి భవన్కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను కలువనున్నారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. చదవండి: మహబూబ్నగర్ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్ -
WC 2023: ‘పసికూన’పై కివీస్ ప్రతాపం.. వరుసగా న్యూజిలాండ్ రెండో విజయం
ICC Cricket WC 2023- New Zealand vs Netherlands, 6th Match: వన్డే వరల్డ్కప్-2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. రెండో మ్యాచ్లో ‘పసికూన’ నెదర్లాండ్స్ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. హైదరాబాద్లోని ఉప్పల్ మ్యాచ్లో జయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. ముగ్గురు అర్ధ శతకాలతో రాణించి ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 51, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో రాణించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విక్రంజిత్ సింగ్(12), మాక్స్ ఒడౌడ్(16) వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ.. వన్డౌన్ బ్యాటర్ కొలిన్ అకెర్మాన్ డచ్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆశలు రేపాడు 69 పరుగులతో రాణించిన అతడు అవుట్ కావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. సాంట్నర్ దెబ్బకు డచ్ జట్టు పెవిలియన్కు క్యూ కట్టింది. దీంతో... 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు వికెట్లతో చెలరేగిన సాంట్నర్ స్పిన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఐదు వికెట్లు కూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. పేసర్ మ్యాట్ హెన్రీకి మూడు, మరో లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక తెలుగు మూలాలున్న డచ్ బ్యాటర్ తేజ నిడమనూరు రనౌట్గా వెనుదిరిగాడు. చదవండి: WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్! పాకిస్తాన్తో మ్యాచ్ నాటికి.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
Hyderabad: టీచర్ కర్కశత్వం.. పసి ప్రాణం బలి
ఉప్పల్(హైదరాబాద్): ఓ టీచర్ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. టీచర్ కొట్టిన దెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వివేక్ నగర్లో స్ట్రీట్ నెంబర్10 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిని టీచర్ తలపై బలంగా కొట్టాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలుకతో కొట్టడం తో స్పృహ తప్పి పడిపోయాడు అభం శుభం తెలియని చిన్నారి. దాంతో ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఈ రోజు ఉదయం చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి మృతదేహాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉంచి తల్లిదండ్రులు, బంధువులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు -
ఉప్పల్లో పాక్-న్యూజిలాండ్ పోరు.. సర్వం సిద్దం
ప్పల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్కు అంతా సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సన్నహాక మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్కు ప్రేక్షకులకు బీసీసీఐ అనుమతి నిరాకరిచింది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్టు ఇప్పటికే హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి. బుధవారం పాక్, న్యూజిలాండ్ జట్లు భాగ్యనగరానికి చేరుకున్నాయి. అనంతరం గురువారం(సెప్టెంబర్28)న ఇరు జట్లు నెట్ప్రాక్టీస్లో కూడా పాల్గోనున్నాయి. కాగా ప్రస్తుత పాక్ జట్టులో మహ్మద్ నవాజ్, ఆగా సల్మాన్ మినహా మిగితా ఆటగాళ్లకు ఎవరికి భారత పిచ్లపై ఆడిన అనుభవం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కేన్మామ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అదే విధంగా గాయంతో ఇంగ్లండ్ సిరీస్లో మధ్యలో ఇంటిముఖం పట్టిన స్టార్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఫిట్నెస్ సాధించాడు. ఈ మ్యాచ్లో అతడు కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పాక్ జట్టుకు ఘన స్వాగతం.. ఇక 7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై పెట్టిన పాక్ క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. అభిమానుల ఆదరణకుపాకిస్తాన్ క్రికెటర్లు ఫిదా అయిపోయారు. పాక్ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ కృతజ్ఞతలను తెలిపారు. హైదరాబాదీ అభిమానులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఆనందాన్ని కలిగిస్తోందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. మాకు హైదరబాదీల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. చాలా బాగుంది. భారత్లో గడిపే రానున్న నెలన్నర రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మరో పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఓ పోస్ట్ చేశాడు. -
NZ vs PAK: ప్రేక్షకులు లేకుండానే క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న సన్నాహక మ్యాచ్కు ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈమేరకు రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ బీసీసీఐ, హెచ్సీఏ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఇరు జట్ల క్రీడాకారులతో పాటు బీసీసీఐ/ఐసీసీ అధికారులు తప్ప సాధారణ వీక్షకులకు ప్రవేశం లేదని చెప్పారు. క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రతిష్టాత్మకమైనవి కావున క్రీడాకారులకు ఎలాంటి శాంతిభద్రత సమస్యలు లేకుండా చూడా లని పోలీసుల సిబ్బందికి సూచించారు. సమావేశంలో రిటైర్డ్ డీజీపీ (సీఆర్పీఎఫ్) దుర్గాప్రసాద్, డీసీపీ అభిషేక్ మహంతి, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీబాల, ఏసీపీలు నరేష్ రెడ్డి, శ్రీనివాస్, బీసీసీఐ, హెచ్సీఏ అధికారులు పాల్గొన్నారు. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్గౌడ్, పిసరి మహిపాల్రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
కాంగ్రెసోళ్ల ఫొటో పెట్టుకునోడికి బీఆర్ఎస్ టికెట్టా?
‘‘ఉరి తీసేవాడ్ని కూడా ఆఖరి కోరిక అడుగుతరు. ఒక బలి ఇచ్చేటప్పుడు కూడా నోట్లో నీళ్లు పోస్తరు. అంతకన్నా దారుణంగా నన్ను ట్రీట్ చేసిండ్రు. టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. ఎమ్మెల్యే అయినాక ఆస్తులు అమ్ముకున్నా. పార్టీతో.. ఎమ్మెల్యే పదవితో లాభం పొందింది లేదు. పార్టీలో దందాలు, గుండాయిజాలు చేసినోళ్లు ఉన్నారు. నిజాయితీగా ఉన్న నాలాంటోడికేమో అన్యాయం జరుగుతోంది. టికెట్ రాకపోవడానికి.. నేనూ వాళ్లలా ఏదైనా తప్పు చేసి ఉండాలా? :::ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తనకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంపై వారం తర్వాత మీడియా ముందుకు వచ్చి అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. మంగళవారం తన కుటుంబం, అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్లో ఉన్న ఒకేఒక్క ఉద్యమకారుడ్ని నేను. అలాంటిది నగరంలోని నా ఒక్క సీటే తొలగించడం బాధగా అనిపిస్తోంది. 2001 నుంచి పార్టీలో ఉన్నా. పద్మారావు గౌడ్ నా తర్వాత వచ్చి మంత్రి అయ్యారు. నేను మాత్రం పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ ఇలాగే ఉండిపోయా. ఎన్నో ఇబ్బందులు పడి ఉప్పల్లో పార్టీని కాపాడాను. ఎవరైనా ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు పెంచుకుంటారు. నేను మాత్రం ఆస్తులు అమ్ముకున్నా. అడ్డగోలుగా సంపాదించుకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చారు. అసలు బండారు లక్ష్మారెడ్డి(ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి)కి టికెట్ ఎలా ఇస్తారు? ఆయన ఏ జెండా మోశాడు?. కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకున్నోడికి టికెట్ ఎలా ఇస్తారు?. కాంగ్రెస్ నేత అయిన తన అన్న ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. అలాంటోళ్లకు టికెట్ ఇస్తారా?. అసలు టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. నేనేం తప్పు చేశా. నన్నెందుకు బలి చేశారు?. టికెట్ ఇవ్వనుందుకు నిరసనగా నా కుటుంబం రోడ్డెక్కి ధర్నా చేద్దామంది. మా క్యాడర్ ఆందోళన చేస్తామంది. నేనే వద్దాన్నా. పార్టీలో ఉన్నాం.. అలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పా. వారం రోజులైనా ఇప్పటికీ నన్ను పిలిచి మాట్లాడలేదు. కనీసం ఏ నేత ద్వారా సంప్రదింపులు జరపలేదు. ఏ పార్టీ నుంచి నాకు ఆహ్వానం అందలేదు. మరో వారం వేచిచూసి కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం ప్రకటిస్తా. పార్టీని నమ్ముకుని.. ఇంత మంది భవిష్యత్తును నమ్ముకుని పని చేశా అని సుభాష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉప్పల్ నుంచి నేనే పోటీలో ఉంటా
హైదరాబాద్: ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.. ఉప్పల్ నుంచి తిరిగి నేనే పోటీలో ఉంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీ కోసం.. మీ ఎమ్మెల్యే పాదయాత్ర బుధవారం 27వ రోజు డాక్టర్ ఏఎస్రావునగర్ డివిజన్లో కొనసాగింది. డివిజన్ పరిధిలోని కమలానగర్, మహేశ్నగర్, పంచవటికాలనీ, శ్రీనివాసనగర్, అరూల్కాలనీ, ఏఎస్రావునగర్, అణుపురం కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది. మూడు రోజుల పాటుగా సాగిన పాదయాత్రలో గుర్తించిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం అణుపురం కమ్యూనిటీహాల్లో విలేకరులతో మాట్లాడుతూ తిరిగి ఉప్పల్ నుంచి తానే బరిలో ఉండబోయేదని, అందులో సందేహం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షాలకు పిచ్చెక్కిపోతోందన్నారు. దిక్కుతోచని స్థితిలో రెండు లక్షల రుణమాఫీ, రూ.4 వేల పింఛన్లు వంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కానీ ఆ పథకాలన్నీ ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న వాస్తవాలను ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. ఉప్పల్లో కారిడార్ నిర్మాణం చేయకుండా చేతులెత్తేసిన పార్టీ నాయకులే పనులు నిలిచిపోయాయంటూ ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. జమ్మిగడ్డ శ్మశానవాటికకు సంబంధించి స్థల యజమానులతో మాట్లాడమని త్వరలోనే ఆ సమస్య కొలిక్కి వస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీరెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, గుండారపు శ్రీనివాస్రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, సుడుగు మహేందర్రెడ్డి, డప్పు గిరిబాబు, బోదాసు రవి, మురళిపంతులు, సీతారాంరెడ్డి, మల్కా రమాదేవి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి
హైదరాబాద్: వయసు తేడాలు లేకుండా.. హఠానర్మణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మరణాలు ప్రజల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. కార్డియాక్ అరెస్ట్ లేదంటే గుండెపోటుతోనో కుప్పకూలి కన్నుమూస్తున్నారు. తాజాగా.. నగరంలోనూ అలాంటి మరణం ఒకటి సంభవించింది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు ఓ వ్యక్తి. బుధవారం ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46)గా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు ఆయన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: పిల్లలు లేరనే ఆవేదనతో.. -
Hyderabad: రూ.10 లక్షల మోసం.. ఉప్పల్లో నకిలీ జడ్జి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో నకిలీ జడ్జిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి అవతారమెత్తి వివాదాస్పద భూములను పరిష్కరిస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను మల్కాజిగిర ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఉప్పల్ పీఎస్లో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ డిగ్రీ చదవి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి రామంతాపూర్లో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో గతంలో దొంగతనాలు, బైక్ చోరీలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చాడు. అతనిపై పోలీసులు పీడీ చట్టం కూడా ఉపయోగించారు. తరువాత హైకోర్టులో వివాదాస్పద భూముల కేసులు త్వరగా పరిష్కరిస్తామనిఫేస్బుక్లో ఓ పేజ్ రూపొందించాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గార్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి దగ్గర పదిలక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు. కేసు పరిష్కారం కాకపోవడంతో బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు.. నకిలీ జడ్జి నామాలా నరేందర్తోపాటు అతని వెంట గన్మెన్గా తిరుగుతూ నిందితుడికి సహకరిస్తున్న చిక్కం మధుసూదన రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. నిందితుల వద్ద అనుమతి లేని ఓ పిస్టల్ , అయిదు రౌండ్ల బుల్లెట్లు, ఒక కారు, ఫేక్ జడ్జి ఐడి కార్డు , రూ. 7500 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
కేంద్రం నిధులతోనే ఉప్పల్–వరంగల్ ‘కారిడార్’ నిర్మాణం
ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నిర్మాణ పనులు పనులు 28 నుంచి పునఃప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. ఉప్పల్ స్కై ఓవర్ నిర్మాణ పనులలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లే జాప్యం జరుగుతుండటాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తాను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యుద్ధ ప్రాతిపదిక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలని కోరామన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జులై 24న అవసరమైన నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశానారన్నారు. ఈ నెల 28 నుంచి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి అదేశించారని ప్రభాకర్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ద్వారా రోడ్డుకు ఇరువైపులా బీటీ రోడ్డు వేస్తామని ప్రకటన చేయించారని ఎద్దేవాచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని రోడ్డు వేయిస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ కోరారు. దాన్ని మేమే వేస్తున్నామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకానికి తెర తీసిందని ఆయన విమర్శించారు. -
ఉప్పల్ సరే.. మరి లష్కర్?
హైదరాబాద్: ఉప్పల్ చౌరస్తాలో నిర్మించిన స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. రక్షణ శాఖ స్థలాన్ని కేటాయిస్తే మెహిదీపట్నం వద్ద మరొకటి నిర్మిస్తామని హెచ్ఎండీఏ ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. 2011లో సర్వే చేసిన సికింద్రాబాద్ స్కైవాక్ ఊసే లేకుండాపోయింది. నగరంలోనే తొలి స్కైవాక్గా దీన్ని నిర్మించాలని అప్పట్లో భావించిన అధికారులు ఫీల్డ్ సర్వే కూడా చేశారు. ఇది జరిగి పుష్కర కాలమైనా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్ ► ఉమ్మడి రాష్ట్రంలో ఎన్.కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా హయాంలో హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేస్తానంటూ ‘ప్రాజెక్ట్ 100 రోజుల్లో’ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి విభాగాల వారీగా ప్రతిపాదనలు కూడా కోరారు. వీటిలో భాగంగా ట్రాఫిక్ విభాగం అధికారులు పంపిన ప్రపోజల్స్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో, బేగంపేట ప్రాంతంలో ప్రయాణికులకు ఉన్న ఇక్కట్లు తొలగించడానికి పెద్దపీట వేశారు. వివిధ రకాలైన అంశాలతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించాలని ప్రతిపాదించారు. ► వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఫీల్డ్ విజిట్ను ఆదేశించింది. అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్లతో సహా వివిధ శాఖలతో కలిపి ఏర్పాటు చేసి కో–ఆర్డినేషన్ కమిటీకి ఈ బాధ్యతల్ని అప్పగించింది. 2011 ఫిబ్రవరి 10న ఫీల్డ్ సర్వే చేసిన ఈ కమిటీ స్కైవాక్తో పాటు బేగంపేట రహదారిలో ఉన్న ట్రాఫిక్ అడ్డంకులను తొలగింపు పైనా దృష్టి పెట్టి నివేదిక రూపొందించింది. ► నిత్యం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో పాదచారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు స్టేషన్ నుంచి ఇటు రేతిఫైల్, అటు 31 బస్టాప్ల మధ్య చిరు వ్యాపారుల కారణంగా మరిన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. వీటికి తోడు వాహనాల రద్దీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. వెరసీ.. ఈ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తూ ఉంటుంది. వీటిని పరిష్కరించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా రెండు వైపులకు స్కైవాక్ నిర్మించాలని కో–ఆర్డినేషన్ కమిటీ సూచించింది. కాగితాలకే పరిమితం.. ► పాదచారులు నడవటానికి ఉపకరించే ఈ స్కైవాక్లు అప్పటికి బయటి రాష్ట్రాల్లోనే వినియోగంలో ఉన్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జి మాదిరి ఉండే ఈ వంతెనల్ని అంత ఎత్తులో కాకుండా నిర్మించాలని ప్రతిపాదించారు. రోడ్డు పక్కగా 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండాలని, పాదచారులు వీటిపై నడిచి నిర్దేశించిన ప్రాంతాలకు చేరుకునేలా డిజైన్ చేయాలని భావించారు. వీటి నిర్మాణం వల్ల రోడ్డుకు అడ్డంగా పాదచారులు నడవటం, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటడం, చిరు వ్యాపారుల ఆక్రమణలు తదితర సమస్యలు శాశ్వతంగా తొలగుతాయని ప్రతిపాదించారు. ► ప్రయాణాల నేపథ్యంలో రేతిఫైల్ బస్టాప్ నుంచి రైల్వేస్టేషన్ వరకు, అక్కడ నుంచి ‘31 బస్టాప్’ వరకు ఉన్న ప్రాంతంలో పాదచారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు తొలివిడతగా ఈ మూడు ప్రాంతాల మధ్య స్కైవాక్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు ఫైళ్లల్లోనే ఉండిపోయాయి. వివిధ ప్రాంతాల్లో స్కైవాక్లపై చర్చ జరుగుతున్నా అటు జీహెచ్ఎంసీ, ఇటు హెచ్ఎండీఏ ఎవరూ లష్కర్ స్కైవాక్ విషయం పట్టించుకోవట్లేదు. -
వారెవ్వా అద్భుతంగా ఉప్పల్ స్కైవాక్.. (ఫొటోలు)
-
ఉప్పల్ స్కైవాక్ను ప్రారంభించిన కేటీఆర్.. ప్రత్యేకతలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు గుడ్న్యూస్. ఉప్పల్ కూడలిలో నిర్మించిన స్కైవాక్ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. కాగా, కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్ఎండీఏ దీన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఉప్పల్ చౌరస్తాలో 665 మీటర్ల మేర రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను హెచ్ఎండీఏ నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇక.. పాదచారులు, ప్రయాణీకులు ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమర్చిన ఎల్ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పించ్చిన రూఫ్లను ఏర్పాటు చేశారు. Witness the magnificent Uppal Skywalk, a true jewel of urban connectivity! Thanks to the visionary leadership of CM Sri KCR and guidance of Municipal Administration and Urban Development Minister Sri @KTRBRS, infrastructure in Hyderabad has undergone a phenomenal transformation.… pic.twitter.com/K0FQ2PiRCn — BRS Party (@BRSparty) June 25, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతలు బిజీ.. రాహుల్ సమక్షంలో భారీగా చేరికలు -
నేడు ఉప్పల్ స్కైవాక్ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో నగరవాసులకు మరో గుడ్న్యూస్. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ చౌరస్తాలో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను హెచ్ఎండీఏ నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక.. పాదచారులు, ప్రయాణీకులు ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. 500 వాహనాల కాన్వాయ్తో కేసీఆర్.. -
ఉప్పల్లో తిప్పలుండవ్!
హైదరాబాద్: మహా నగరానికి తూర్పు దిక్కున మరో మణిహారం సిద్ధమైంది. ఉప్పల్లో వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆకాశ నడక మార్గం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. మంత్రి కేటీఆర్ నేడు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు, ఉప్పల్ నుంచి రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు.. ప్రతి రోజు వేలాది మంది పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఉప్పల్ రింగురోడ్డు వద్ద రోడ్డు దాటేందుకు ఎంతో ప్రయాస పడుతుండేవారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 30 వేల మందికి పైగా ప్రయాణికులు సైతం ఎటు వైపు వెళ్లాలన్నా ఎంతో ఇబ్బందిగానే ఉండేది. ఈ క్రమంలో ఈజీగా రోడ్డు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్కైవాక్తో ఉప్పల్ రింగురోడ్డు వద్ద పాదచారులు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించనున్నారు. నగరంలోనే మొదటిది.. దాదాపు రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ ఉప్పల్ స్కైవాక్ను నిర్మించింది. 660 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆకాశ నడక మార్గం నగరంలో మొట్టమొదటి నిర్మాణం. రాబోయే వందేళ్ల పాటు వినియోగంలో ఉండేలా ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కైవాక్ను ఎంతో పటిష్టంగా నిర్మించినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికోసం సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ను వినియోగించారు. వివిధ రకాల స్కైవాక్ నమూనాలను పరిశీలించిన అనంతరం హెచ్ఎండీఏ ప్రస్తుతం ఉన్న ఏర్పాటును ఖరారు చేసింది. ఇందుకోసం హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 2020లోనే పనులు ప్రారంభించినప్పటికీ కోవిడ్ కారణంగా నిర్మాణంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ప్రస్తుతం నిర్మా ణం పూర్తి చేసుకొని వినియోగంలోకి రానుంది. బహుళ ప్రయోజన ఫంక్షన్ హాల్కూ శ్రీకారం.. ఉప్పల్ శిల్పారామం వద్ద హెచ్ఎండీఏ నిర్మించిన బహుళ ప్రయోజనాల ఫంక్షన్హాల్ను కూడా మంత్రి కేటీఆర్ సోమవారం నాటి పర్యటనలో ప్రారంభించనున్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వంటి వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఈ ఫంక్షన్ హాల్ను నిర్మించారు. శిల్పారామం వద్ద చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వినియోగ చార్జీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉప్పల్లో స్కైవాక్ ప్రత్యేకతలు ఇవీ.. ● మొత్తం పొడవు 660 మీటర్లు ● 37 పిల్లర్లు ఏర్పాటు చేశారు ● 3, 4, 6 మీటర్ల వెడల్పు కలిగి.. భూ ఉపరితలం నుంచి 6 మీటర్ల ఎత్తు ● నిర్మాణ వ్యయం : రూ.25 కోట్లు ● 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 8 ఎలివేటర్లు ● బ్యూటిఫికేషన్ లుక్ కోసం పైభాగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 40 శాతం మేరకు రూఫ్ టాప్ ● ప్రతిరోజు 20 వేల మందికి పైగా పాదచారులు, మరో 25 వేల మందికి పైగా మెట్రో ప్రయాణికులు స్కైవాక్ను వినియోగించుకోవచ్చు. ● ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా చేయడంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ● మెట్రో ప్రయాణికులు కాంకోర్ వరకు చేరుకుంటారు. -
గుండె గు‘బిల్లు’!.. ఖాళీగా ఉన్న ఇంటికి రూ. 7,97,576 కరెంట్ బిల్లు
సాక్షి, ఉప్పల్: ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 300 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ. 7,97,576 రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. ఇదేమని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే డీడీ కట్టి మీటర్ను చెక్ చేయించుకోవాలని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని గద్దించారు. ఈ సంఘటన ఉప్పల్ ఏఈ పరిధిలో హైకోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఉప్పల్ హైకోర్టు కాలనీకి చెందిన పాశం శ్రీదేవి పేరిట రెండు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఖాళీ పోర్షన్కు ఉన్న విద్యుత్ మీటరుకు ప్రతి నెల రూ. 300లోపు మిని మం బిల్లు వచ్చేది. అయితే మే నెలకు సంబంధించి జూన్లో వచ్చిన బిల్లు ఆన్లైన్లో చెక్ చేయగా ఏకంగా రూ. 7,97,576లు రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం చెబుతూనే మీటరు టెస్టింగ్కు డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందిగా లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. దీంతో చేసేది లేక రూ. 150 డీడీ కట్టి మౌలాలిలో మీటర్ చెక్ చేయించారు. మీటరు డిఫెక్ట్ ఉన్నట్లు రిపోర్టులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వివరణ కోసం మాట్లాడేందుకు యత్నించగా ఉప్పల్ సర్కిల్ ఏడీఈ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చదవండి: పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్ -
సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ రెడీ.. రూ.5 వేల కోట్లకు ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ మరోసారి సన్నాహాలు చేపట్టింది. సుమారు రూ.5 వేల కోట్లు సమకూర్చుకోవడమే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, ఫ్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఎయిర్పోర్టు మార్గంలో ఉన్న బుద్వేల్లో భారీ లేఅవుట్ పనులు వేగంగా కొనసాగుతుండగా.. కోకాపేటలో రెండో దశ, ఉప్పల్ భగాయత్లో మూడో దశ ఆన్లైన్ బిడ్డింగ్కు కార్యాచరణ చేపట్టింది. మరోవైపు పోచారంలో ఏడంతస్తుల చొప్పున ఉన్న రెండు రాజీవ్ స్వగృహ టవర్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెండు టవర్లలో కలిపి 142 ఫ్లాట్లు ఉన్నాయి. అందరిచూపు బుద్వేల్ వైపే.. ఐటీ సంస్థలు మొదలుకొని మధ్యతరగతి వరకు ఇప్పుడు అందరిచూపు బుద్వేల్ వైపు పడింది. విమానాశ్రయం మార్గంలో ఉండటంతో సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా బుద్వేల్ హెచ్ఎండీఏ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ సుమారు 182 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రీన్ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అధికారులు రూ.200 కోట్లతో పనులు ప్రారంభించారు. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 6.13 ఎకరాల నుంచి 14.58 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. తొలివిడత ఇక్కడ 50 ఎకరాల్లో విక్రయాలు చేపట్టనున్నారు. బహుళ ప్రయోజనాల జోన్గా ఈ వెంచర్ను అభివృద్ధి చేస్తున్నారు. అంటే కార్యాలయ సముదాయాలు, నివాసాలు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్ వంటివి అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. వేలం ద్వారా ప్లాట్లను కొనుగోలు చేసేవారికి మూడు వారాల్లో నిర్మాణ అనుమతులన్నీ మంజూరు చేయనున్నారు. ఈ భూముల విక్రయాల ద్వారా కనీసం రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. కోకాపేటలో 64 ఎకరాలకు.. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్లో రెండో దశ ప్లాట్ల విక్రయానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. 2021 జూలైలో నిర్వహించిన మొదటి దశ వేలంలో సుమారు 49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 8 ప్లాట్లను విక్రయించారు. ఎకరానికి రూ.25 కోట్ల చొప్పున కనీస ధర నిర్ణయించినా.. అనూహ్యమైన పోటీతో ఎకరానికి కనిష్టంగా రూ.40.05 కోట్ల నుంచి గరిష్టంగా రూ.60 కోట్ల వరకు ధర పలికింది. ఇప్పుడు కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలోనే 64 ఎకరాలను విక్రయించనున్నారు. రూ.2,500 కోట్లకుపైగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఉప్పల్ భగాయత్లో మూడో దశ.. ఉప్పల్ భగాయత్లో ఇప్పటికే రెండుసార్లు హెచ్ఎండీఏ ప్లాట్లను విక్రయించారు. మెట్రోస్టేషన్కు అందుబాటులో ఉన్న ఈ స్థలాలకు బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ మొత్తం 450 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేశారు. మొదటి, రెండో దశలో ప్లాట్లను కొనుగోలు చేసినవారు పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు చేపట్టారు. 2021 డిసెంబర్లో జరిగిన వేలంలో చదరపు గజానికి కనిష్టంగా రూ.75 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు పలికింది. ప్రస్తుతం మూడో దశలో 40 ఎకరాలను విక్రయిస్తామని, రూ.650 కోట్లకు పైగా రావచ్చని అధికారులు చెప్తున్నారు. ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు -
SRH vs KKR : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
అదిగో నవలోకం.. వారికి అండగా ఆమె! దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తూ..
ఉన్నది ఒకటే జీవితం ... కోరుకున్న విధంగా బతకాలన్నదే తాపత్రయం.. అడ్డుపడే వైకల్యం .. అడ్డంపడే కుటుంబ నిబంధనల నుంచి తమకంటూ ఓ కొత్త లోకాన్ని ఏర్పాటు చేసుకోవాలని తపించే వారికి అండగా ఉంటుంది కృష్ణప్రియ. హైదరాబాద్ ఉప్పల్లో ఉంటున్న దివ్యాంగురాలైన కృష్ణప్రియ తను నిలదొక్కుకోవడమే కాకుండా తనలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తోంది. కష్టపడుతూనే ఇష్టమైన జీవన ఫలాలను అందుకోవడానికి తపిస్తున్న కృష్ణప్రియను కలిస్తే తమ గురించి ఇలా వివరించింది.. ‘‘మూడేళ్ల వయసులో నరాల సమస్య వల్ల కాళ్లు రెండు చచ్చుబడిపోయాయి. అయినా, నా ఉత్సాహం చూసి స్కూల్ చదువు వరకు చెప్పించారు మా అమ్మానాన్న. ఇక చదువు వద్దు అంటే నేనే మొండికేసి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో సినిమాలు చూడటానికి కంప్యూటర్ తీసుకున్నారు నాన్న. ఖాళీ సమయంలో యూ ట్యూబ్ చూసి డిజిటల్ వర్క్స్ నేర్చుకున్నాను. డిటిపీ వర్క్స్, ఆన్లైన్, సోషల్మీడియా వర్క్స్ చేస్తుండేదాన్ని. హాస్టల్లో ఉండి నన్ను నేను పోషించుకుంటాను అని ఓ రోజు చెప్పాను. ‘మేం నీకు ఇంత తిండి పెట్టలేమా? బయట అవస్థలు పడుతుంటే నలుగురు చూసి ఏమనుకుంటారు?’ అని అమ్మానాన్నా, ‘నడవడమే సరిగా రాదు, ఏం సాధిస్తావని, ఇంటి పట్టున ఉండక’ అని తెలిసినవాళ్లు.. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. ప్రతిదానికి ఇంట్లో వారిపై ఆధారపడటం, భారంగా ఉండటం ఇష్టం లేక ఎనిమిదేళ్ల క్రితం బయటకు వచ్చేశాను. మూడేళ్లు ఒక్కదాన్నే రూమ్ తీసుకుని ఉన్నాను. వచ్చిన కంప్యూటర్ వర్క్స్ నాకు కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. ఒక్కొక్కరూ జతగా చేరి.. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను కలిశాను. అక్కడ నాలాంటి వారెందరో కలిశారు. వైకల్యం ఎలాగూ బాధిస్తుంది. మరొకరి మీద ఆధారపడటం మరింతగా బాధిస్తుంది. ఇంట్లో వారిమీద ఆధారపడటం ఇష్టలేని కొంతమంది దివ్యాంగ అమ్మాయిలు నాతో కలిశారు. దీంతో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇంటి యజమానులు మాకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. ‘మీ పనులు మీరే సరిగా చేసుకోలేరు. ఇక ఇంటినేం శుభ్రంగా ఉంచుతారు’ అనేవారు. కొన్ని రోజుల ప్రయత్నంతో ఎలాగో ఇల్లు దొరికింది. మరో ఆరుగురు నాతో కలిశారు. చిన్న హాస్టల్లా ‘ఆద్య’ అనే పేరుతో దివ్యాంగుల కోసం హోమ్ ప్రారంభించాను. మాలాంటి వారి సమస్యల పట్ల మాకే అవగాహన ఉంటుంది కాబట్టి, అందరం ఒకింటి సభ్యుల్లా కలిసిపోయాం. పెళ్లితో కొత్త జీవితం.. దివ్యాంగుల చదువు, ఉద్యోగం, పెళ్లి .. ప్రయత్నాల్లో ఉండేవారికి, తమ గురించి తాము ఆలోచించుకోవడానికి తగిన వాతావరణం గల ప్రత్యేక హోమ్స్ అంటూ ఏమీ లేవు. జీవితంలో నిలదొక్కుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించే సరైన వసతి మాకు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఎక్కువ వైకల్యం ఉన్న వారికోసం నేనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాను. రెండేళ్ల క్రితం దివ్యాంగుడైన సత్తయ్యను పెళ్లి చేసుకున్నాను. అతను ఫ్లోర్వాకర్. ఎన్జీవోల సాయంతో చిన్న షాప్ నడుపుతున్నాడు. నాకంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాతోపాటు ఉన్న అమ్మాయిలలో నలుగురికి దగ్గరుండి పెళ్లిళ్లు జరిపించాను. ఇందుకు అవసరమైన డబ్బులను పోగుచేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవమానకరంగా మాట్లాడినవారూ ఉన్నారు. కానీ, మాకూ ఓ జీవితం ఉందని తెలియజేయాలనుకున్నాను. దివ్యాంగులైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కొంచెం వెనకంజ వేసేవారు. తమనెవరు పెళ్లి చేసుకుంటారనే నిస్పృహ వారిలో ఉండేది. ఇందుకోసం చాలా కౌన్సెలింగ్ చేయాల్సి వచ్చింది. మాకు ఇళ్లలో చదువు, కళలు, వ్యాపారాలు, వృత్తి విద్యలæపట్ల ఆసక్తి ఉన్నా పెద్దగా ప్రోత్సాహం ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా ఎంత వయసు వచ్చినా ఏళ్ళకేళ్లు ఇంటికే పరిమితమవ్వాలి. ఇక వివాహం .. కల్లో కూడా ఊహించలేం. ఈ పరిస్థితులన్నీ మనకు మనమే అధిగమించాలని చెబుతుంటాను. మాకు మేమే పరిష్కారం మాకు అసలు పెళ్లి భాగ్యం ఉందా అనుకున్న అమ్మాయిలు ఒకింటి వారై తమకు తాముగా కొత్త జీవితాన్ని గడుపుతుండటం చాలా ఆనందంగా ఉంటుంది. దివ్యాంగుల పెళ్ళిళ్లు, పోషణ నిమిత్తం మా స్నేహితులు, బంధువులు, ఎన్జీవోల సాయం తీసుకుంటున్నాను. ‘ఇవన్నీ ఎందుకు? మీరే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ పెళ్ళిళ్లు చేసుకొని ఎందుకు కష్టపడతారు’ అంటుంటారు. కానీ, మాకూ ఓ కుటుంబ జీవనం కావాలని, నలుగురిలో మేమూ గొప్పగా జీవించాలనీ ఉంటుంది కదా! అందుకే ఇంతగా తాపత్రయపడుతున్నాను. భార్యాభర్తలు ఇద్దరూ దివ్యాంగులే అయితే, మా సమస్యలు మాకు బాగా అర్ధం అవుతాయి. ఒకరికొకరం తోడుగా ఉంటాం. దివ్యాంగ సమావేశాలు ఎక్కడ జరిగినా, మాకు అందే అవకాశాల గురించి ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ అందరూ ఆప్యాయంగా అక్కా అని పిలుస్తుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా చెప్పుకోవడానికి తోడున్నామనే భరోసా ఉంది. మరిన్ని అవకాశాలు లభిస్తే ఎవరి మీదా ఆధారరపడకుండా బతకాలన్నదే మా ఆలోచన’’ అని వివరించింది కృష్ణప్రియ. దివ్యంగా ఉన్న ఆమె ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
SRH Vs DC: ఉప్పల్లో కింగ్! అప్పుడు మా వార్నర్ అన్న.. ఇప్పుడు..
IPL 2023 SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు హైదరాబాద్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఏడు సీజన్ల పాటు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఆస్ట్రేలియా ఓపెనర్. హైదరాబాద్ సారథిగా జట్టును ముందుకు నడిపించి 2016లో సన్రైజర్స్కు తొలి టైటిల్ అందించాడు. తెలుగు ప్రేక్షకుల మనసు దోచి మైదానంలో ఆటతో ఆకట్టుకున్న వార్నర్ భాయ్.. మైదానం వెలుపల టాలీవుడ్ హీరోల రీల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. వార్నర్తో పాటు అతడి కుటుంబం మొత్తం ఆరెంజ్ ఆర్మీలో భాగమైంది. ‘వార్నర్ అన్నా’ అంటూ అభిమానులు అతడిని అక్కున చేర్చుకున్నారు. అవమానకర రీతిలో జట్టును వీడి కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అవమానకర రీతిలో వార్నర్ రైజర్స్ను వీడాల్సి వచ్చింది. అయినప్పటికీ హైదరాబాదీల ప్రేమను నేటికీ పొందుతున్నాడతడు. ఐపీఎల్-2023లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ఉప్పల్ మైదానంలో వార్నర్ అడుగుపెట్టనున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత.. ఫ్యాన్స్ ఎమోషనల్ రిషభ్ పంత్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్ స్టార్.. సోమవారం నాటి మ్యాచ్తో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు సన్రైజర్స్కు ఆడిన వార్నర్ను గుర్తు చేసుకుని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఉప్పల్లో కింగ్ వార్నర్ ‘‘అన్నా.. నువ్వు ఏ జట్టులో ఉన్నా.. మాకు మాత్రం ఎప్పుడూ హైదరాబాదీవే!’’ అంటూ ట్వీట్లు, మీమ్స్తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో వార్నర్ పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. కాగా 2014- 21 వరకు వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆఖరి సీజన్ మినహా ప్రతి ఎడిషన్లో 500 పైచిలుకు(528, 562, 848, 641, 692, 548, 195) పరుగులతో ఎస్ఆర్హెచ్ టాప్ బ్యాటర్గా నిలిచాడు. ఇక ఉప్పల్ స్టేడియంలో ఆడిన 31 ఇన్నింగ్స్లో వార్నర్ సాధించిన పరుగులు 1602. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, మూడు శతకాలు ఉన్నాయి. చదవండి: ధోని కోపంతో బ్యాట్ విరగ్గొట్టాడు: హర్భజన్ సింగ్ ప్రేమ విషయం పేరెంట్స్కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా? David Warner coming to uppal after 5 years🥹 pic.twitter.com/bkQgozSe6B — Remo Mama (@RemoMowa) April 24, 2023 David Warner at the Rajiv Gandhi International Stadium: Innings - 31. Runs - 1,602. Average - 66.75. Strike Rate - 161.65. Fifties - 15. Hundreds - 3. - 18 fifty plus scores in just 31 innings! Hyderabad's favourite returns after 4 long years, but this time for DC. pic.twitter.com/9ZAhYQ0ODl — Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2023 David Warner returns to Hyderabad today, it will be an emotional day, he was the heart of soul of SRH, played 7 seasons for Orange Army. 2014 - 528 runs 2015 - 562 runs 2016 - 848 runs 2017 - 641 runs 2019 - 692 runs 2020 - 548 runs 2021 - 195 runs The GOAT of SRH - Warner. pic.twitter.com/bWfoFtISJW — Johns. (@CricCrazyJohns) April 24, 2023 -
తిలక్ ఇంట్లో సచిన్, రోహిత్, సూర్య సందడి.. ఫొటోలు వైరల్! ఎన్నటికీ మరువం!
IPL 2023- SRH Vs MI: హైదరాబాదీ బ్యాటర్, ముంబై ఇండియన్స్ స్టార్ తిలక్ వర్మ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ సహా ఎంఐ కుటుంబం మొత్తం తిలక్ ఇంటికి కదిలివచ్చింది. ఈ అతిరథ మహారథులందరికీ తిలక్ వర్మ ఫ్యామిలీ రుచికరమైన భోజనం వడ్డించి మురిసిపోయింది. ఇందుకు సంబంధిన ఫొటోలను తిలక్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్ మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. డెవాల్డ్ బ్రెవిస్తో తిలక్ కుటుంబం ఈ రోజును ఎన్నటికీ మరువం హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై జట్టు నగరానికి చేరుకుంది. ఈ క్రమంలో తిలక్ వర్మ సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించాడు. తమ జట్టులోని యువ సంచలనం కోరిక మేరకు ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఖుషీ చేసింది. సచిన్ , రోహిత్ సహా సూర్య తిలక్ ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలో.. ‘‘నా ఎంఐ పల్టన్ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్ పార్టీ. ఈ అద్భుతమైన రోజును నేను, నా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. సత్తా చాటుతున్న తెలుగు తేజం గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్(ఇషాన్ కిషన్- 418 తర్వాతి స్థానం)గా తిలక్ వర్మ నిలిచాడు. తన అరంగేట్ర ఎడిషన్లోనే 14 ఇన్నింగ్స్లో 397 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లలో ఈ తెలుగు తేజం 177 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్లో పరుగుల జాబితాలో ముంబై టాప్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. చదవండి: Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హైదరాబాద్లో మళ్లీ పోస్టర్ వార్.. అదే దారిలో బీజేపీ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాల్ పోస్టర్ల వార్కు తెర తీయగా.. ఇప్పుడు అదే దారిలో బీజేపీ కౌంటర్కు దిగింది. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఫ్లై ఓవర్కు బీజేపీ అతికించింది. ఈ క్రమంలో మళ్లీ పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది. ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్పై రచ్చ కొనసాగుతోంది. మొన్న మోదీ ఫొటోలతో ఫ్లై ఓవర్ పనులు సాగడం లేదని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు కొందరు వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్లు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా ఏర్పాటు చేశారు. కాగా, వాస్తవాలు తెలుసుకోవాలంటూ ఒక దిన పత్రికలో వచ్చిన వార్తతో వాల్ పోస్టర్ వెలిసింది. ఉప్పల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ ర్యాలీ నిర్వహించి, ధర్నాకు దిగారు. ఫ్లై ఓవర్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే కారణమని బిజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. చదవండి: ‘మోదీగారు.. ఇంకెన్నాళ్లూ?’ ఉప్పల్ తిప్పల్పై పిల్లర్లకు పోస్టర్లు -
ఉప్పల్ తిప్పల్.. మోదీ పోస్టర్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఉప్పల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్ళు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఉప్పల్ నుండి ఘట్కేసర్ వెళ్ళే వరంగల్ హైవే పై కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఐదేళ్లలో సగం పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో.. ఆ రూట్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పనులు నడుస్తుండడంతో సాయంత్రం వేళ్ల ఉప్పల్, మేడిపల్లి మధ్య ప్రయాణం గంటకు పైనే పడుతోంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లేవారు ఉప్పల్ రింగ్రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది. దీంతో వాహనదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది. ఉప్పల్ వరంగల్ హైవేపై.. ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారత్మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని భావించింది కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2018 మేలో ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశారు. జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు. దీంతో ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. హైదరాబాద్ లో మళ్ళీ పోస్టర్ల కలకలం ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ 5 ఏండ్లు అయినా 40% పూర్తి కాలేదు.. ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు మోడీ గారు అంటూ ఫ్లైఓవర్ పిల్లర్లపై వెలసిన పోస్టర్లు.#ModiDisasterForIndia#ModiHataoDeshBachao pic.twitter.com/tAXRBbull3 — Latha (@LathaReddy704) March 28, 2023 -
పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: తీన్మార్ మల్లన్నను మంగళవారం మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 20 మంది పోలీసులు పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి క్యూ న్యూస్ ఆఫీస్పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంపై తీన్మార్ మల్లన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ ఆఫీసును పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని మేడిపల్లి పోలీసులు లేదా మల్కాజిగిరి ఏసీపీ ధ్రువీకరించడం లేదు. కాగా, తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ల అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
ఉప్పల్ మెట్రో ఓసీసీకి చుక్కలుచూపిస్తున్న మూసీ కాలుష్యం, ఇలాగైతే ఎలా?
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రోపై మూసీ కాలుష్యం పంజా విసురుతోంది. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో పరుగులు తీసే మెట్రో రైళ్లను నియంత్రించే ఉప్పల్లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)కు మూసీ కాలుష్యం పొగబెడుతోంది. బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీల వ్యర్థ జలాలు ప్రవహిస్తున్న మూసీ నది నుంచి తరచూ వెలువడుతున్న ఘాటైన వాసనలు ఈ కేంద్రంలోని సున్నితమైన ఎల్రక్టానిక్, హార్డ్వేర్, కంప్యూటర్ ఆధారిత సేవలను దెబ్బతీస్తున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ఓసీసీ కేంద్రంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామంతో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతింటోంది. దీంతో పట్టాలపై ఉన్నపళంగా మెట్రో రైళ్లు నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మెట్రో అధికారులు సైతం తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో హతాశులవుతున్నారు. ఉప్పల్లో సుమారు 104 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మెట్రో డిపోను, ఓసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ ప్రాంగణంలో రైళ్లను నిత్యం శుభ్రపరచడం, రైళ్ల గమనాన్ని నియంత్రించడం, తరచూ తలెత్తే సమస్యలు, ఇతర నిర్వహణ, మరమ్మతులు చేపడుతున్నారు. దీనిపై మెట్రో నిర్మాణ,నిర్వహణ సంస్థ ఎల్అండ్టీతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఈ అంశంపై మాట్లాడేందుకు వారు నిరాకరించడం గమనార్హం. పరిష్కారమిదే.. నగరంలో బాపూఘాట్– ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ నదిలో బల్క్డ్రగ్, ఫార్మా వ్యర్థాలు అత్యధికంగా చేరుతున్నాయి. ప్రధానంగా కూకట్పల్లి నాలా నుంచి నిత్యం సుమారు 400 మిలియన్ లీటర్ల మేర హానికారక రసాయనాలు కలిసిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తుండడంతో తరచూ ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జలమండలి వ్యర్థజలాల్లోని మురుగు,ప్లాస్టిక్ ఇతర ఘన వ్యర్థాలను పలు ఎస్టీపీల్లో తొలగిస్తోంది. కానీ రసాయనాలను తొలగించేందుకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసీ ప్రవాహ మార్గంలో నిర్మించాల్సి ఉంది. ఈటీపీల్లో శుద్ధి చేసిన తరవాతనే నాలా నీరు మూసీలోకి చేరే ఏర్పాట్లు చేస్తే కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మెట్రో రైళ్ల గమనానికి వినియోగిస్తున్న కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్కంట్రోల్ వ్యవస్థను మన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్రో అధికారులు మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని స్పష్టంచేస్తున్నారు. చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు.. -
హైదరాబాద్ రాత మారలేదంతే! ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ ఘోర ఓటమి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Delhi: రంజీ ట్రోఫీ 2022-23ని హైదరాబాద్ క్రికెట్ జట్టు మరో ఓటమితో ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఢిల్లీ జట్టుతో ఉప్పల్లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆట మూడో రోజు(గురువారం) ఓవర్నైట్ స్కోరు 223/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు ఆయుశ్ బదోని వీరోచిత సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసింది. అదరగొట్టిన ఆయుశ్ బదోని నిజానికి 277 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి 300 పరుగుల్లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే ఆయుశ్ బదోని (191; 24 ఫోర్లు, 6 సిక్స్లు) అసాధారణరీతిలో ఆడి భారీ సెంచరీ సాధించాడు. పదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (58; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆయుశ్ ఢిల్లీ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆయుశ్, హర్షిత్ తొమ్మిదో వికెట్కు 122 పరుగులు జోడించారు. ‘డబుల్ సెంచరీ’కి చేరువైన దశలో.. అనికేత్ రెడ్డి బౌలింగ్లో ఆయుశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దివిజ్ మెహ్రా (8 నాటౌట్)తో కలిసి హర్షిత్ చివరి వికెట్కు 34 పరుగులు జత చేశాడు. అజయ్దేవ్ గౌడ్ బౌలింగ్లో హర్షిత్ ఎల్బీగా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 143 పరుగులిచ్చి 5 వికెట్లు, అజయ్దేవ్ గౌడ్ 87 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ భారీ స్కోరు ఈ నేపథ్యంలో 433 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి కేవలం 12 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 124 వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా ఇక తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్ రాయుడు.. రెండో ఇన్నింగ్స్లో 32 పరుగులతో హైదరాబాద్ బ్యాటర్లలో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన వాళ్లలో తోల్కంటి గౌడ్ (21), ప్రణీత్ రాజ్ మాత్రమే (27) 20 పైగా పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్ హర్షిత్ రాణా ధాటికి బెంబేలెత్తి పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 124 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. కాగా 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు కూల్చి హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించిన హర్షిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరో ఢిల్లీ బౌలర్ దివిజ్ మెహ్రా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేట్’ డివిజన్కు పడిపోయిన హైదరాబాద్ హైదరాబాద్ కేవలం ఒక్క పాయింట్తో గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఎలైట్ లీగ్లోని నాలుగు గ్రూప్ల్లో కలిపి చివరి స్థానంలో నిలిచింది. కాగా ఎలైట్ గ్రూప్ల్లో ఓవరాల్గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్కు ‘ప్లేట్’ డివిజన్కు పడిపోతాయి. రంజీ ట్రోఫీ 2022-23 హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ స్కోర్లు హైదరాబాద్- 355 & 124 ఢిల్లీ- 433 & 47/1 చదవండి: Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్స్లామ్ టైటిళ్లు అంటే? Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్.. ఫొటోలు వైరల్ -
Hyderabad: బయటకు వెళ్లొస్తానని చెప్పి.. యువకుడు అదృశ్యం
సాక్షి, లక్డీకాపూల్ : సాయంత్రం సరదాగా బయటికి వెళ్లి వస్తానని చెప్పిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామంతాపూర్ ప్రాంతానికి చెందిన రోహిత్ మనోజ్ (19)(బబ్లూ) ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అతడి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో అతడి మేనమామ బోడపాటి శ్రీనివాసరావు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. ఇంటినుంచి బయటికి వెళ్లిన సమయంలో రోహిత్ మనోజ్ నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని వద్ద ఫోన్ కూడా లేదని ,కేవలం స్టూడెంట్ బస్ పాస్ మాత్రమే ఉందన్నారు. అతడి ఆచూకీ తెలిస్తే 9493106929, 9912199554, 98661311010 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్) -
కుటుంబమంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాత్మకంగా! ‘ఈరోజు’ నీది కాదంతే!
Who Is Michael Bracewell: మైకేల్ బ్రేస్వెల్.. గతేడాది నెదర్లాండ్స్తో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం.. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.. అయితే, ఒక వికెట్ మాత్రం తీయగలిగాడు ఈ న్యూజిలాండ్ ఆల్రౌండర్. అదే ఏడాది జూన్లో ట్రెంట్బ్రిడ్జ్లో ఇంగ్లండ్తో మ్యాచ్తో టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగుతో అర్ధ శతకం చేసే అవకాశం చేజార్చుకున్నాడు. అయితే, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20లలో ఐర్లాండ్తో మ్యాచ్తో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల బ్రేస్వెల్.. ఇప్పటి వరకు తన కెరీర్లో సాధించినవి రెండు సెంచరీలు. అది కూడా వన్డేల్లో! మొదటిది ‘పసికూన’ ఐర్లాండ్పై! మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆతిథ్య ఐరిష్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల ‘భారీ’ స్కోరు చేసింది. పర్యాటక కివీస్కు అంత తేలికగా గెలిచే అవకాశమూ ఇవ్వలేదు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మినహా అర్ధ శతకం(51) మినహా టాపార్డర్లో అందరూ చేతులెత్తేశారు. ఒక్క వికెట్ తేడాతో.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన బ్రేస్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 127 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బ్రేస్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ చలువ వల్ల న్యూజిలాండ్ ఎట్టకేలకు ఒక్క వికెట్ తేడాతో గెలుపొందగలిగింది. ఆ తదుపరి రెండు మ్యాచ్లలోనూ గెలిచి సిరీస్ను గెలిచింది. బ్యాట్ ఝులిపించి.. ఇక రెండో వన్డే సెంచరీ.. కివీస్ మ్యాచ్ ఓడినా.. బ్రేస్వెల్ కెరీర్లో మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. సొంతడ్డపై.. పటిష్టమైన టీమిండియాపై.. అదీ కొండంత లక్ష్యం ముందున్న వేళ.. సహచరులు వరుసగా 40, 10, 18, 9, 24, 11 పరుగులకే పెవిలియన్ చేరిన తరుణంలో.. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ బ్రేస్వెల్ బ్యాట్ ఝులిపించాడు. ఫలితం తారుమారయ్యేదే! 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 140 పరుగులతో చెలరేగాడు. సులువుగానే మ్యాచ్ గెలుస్తామని భావించిన టీమిండియాకు చెమటలు పట్టించాడు. ఓటమిని ఒప్పుకోలేక ఆఖరి ఓవర్ వరకు అసాధారణ పోరాటం చేశాడు. నిజానికి శార్దూల్ ఠాకూర్ గనుక బ్రేస్వెల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే ఉప్పల్ మ్యాచ్ ఫలితం తారుమారయ్యేదే! అదృష్టవశాత్తూ అలా జరుగలేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా అంతా ఫిదా అయితే, ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీకి ఫిదా అయినట్లే.. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా.. మ్యాచ్ మన నుంచి లాగేసుకుంటాడనే భయం వెంటాడినా టీమిండియా అభిమానులు సైతం అతడిని ప్రశసించకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు. బ్రేస్వెల్ పోరాటపటిమకు మన ఆటగాళ్లు కూడా ముగ్ధులుకాకుండా ఉండలేకపోయారు. కానీ.. దురదృష్టం బ్రేస్వెల్ను వెక్కిరించింది. వెరసి జట్టు ఓటమిపాలైంది. దీంతో కివీస్ అభిమానులు హృదయాలు ముక్కలయ్యాయి. బ్రేస్వెల్ పరిస్థితి కూడా అదే! ‘‘భారీ స్కోరు చేసిన టీమిండియాను ఓడించడం అంత తేలికేం కాదు. కానీ దురదృష్టవశాత్తూ మేము ఈరోజు పని పూర్తి చేయలేకపోయాం. ఆఖరి వరకు పోరాడాం. కానీ.. ఈరోజు నాది కాదు.. నిజంగా ఈ రోజు నాది కాకుండా పోయింది’’ అని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశాడు. క్రికెటర్ల కుటుంబం.. లేట్ అయినా.. మైకేల్ బ్రేస్వెల్ తండ్రి మార్క్ కూడా క్రికెటరే! డొమెస్టిక్ లెవల్లో ఆడాడు. అంతేకాదు మైకేల్ అంకుల్స్ బ్రెండన్ బ్రేస్వెల్, జాన్ బ్రేస్వెల్లు కూడా క్రికెట్ ఆడినవాళ్లే. ఇక మైకేల్ కజిన్ డగ్ బ్రేస్వెల్ కూడా న్యూజిలాండ్కు ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి అండర్-19 జట్టు ఆడారు. అయితే, డగ్ 2011లో ఎంట్రీ ఇవ్వగా.. మైకేల్కు చాలా కాలం పట్టింది. ఉప్పల్ మ్యాచ్లో డగ్ బెంచ్కు పరిమితం కాగా.. మైకేల్ ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఇదిలా ఉంటే.. చిన్ననాటి నుంచే క్రికెట్ వాతావరణంలో పెరిగిన మైకేల్కు ఐదేళ్ల వయసు నుంచే ఆటపై మక్కువ పెరిగిందట. అయితే, క్రికెట్తో పాటు రగ్బీ, బాస్కెట్బాల్పై కూడా అతడికి ఇష్టం ఎక్కువే. బ్రేస్వెల్ మరో కజిన్ మిలానీ బ్రేస్వెల్ కమెడియన్గా రాణిస్తున్నాడు. ఇంట్లో ఎంతమంది క్రికెటర్లు ఉన్నా మైకేల్ బ్రేస్వెల్కు మాత్రం ఆసీస్ దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ ఆరాధ్య ఆటగాడు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రేస్వెల్ 2019లో లారెన్ రాల్స్టన్ను పెళ్లాడాడు. ఈ జంటకు కుమారుడు లెనాక్స్ సంతానం. నాన్న మాటే వేదం 1991 ఫిబ్రవరి 14న వయారరపలో జన్మించిన మైకేల్ బ్రేస్వెల్.. ఫస్ట్క్లాస్లో అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆలస్యమైనా.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నాడు. ఆడిన నాలుగో వన్డేలోనే శతకం బాది సత్తా చాటాడు. తండ్రి మాటకు విలువనిస్తాడు బ్రేస్వెల్. ‘‘నేను అందరితో అంత తొందరగా కలిసిపోలేను. అయితే, కాస్త సమయం దొరికినా మా నాన్నతో మాట్లాడుతూనే ఉంటా. నాకు రెండేళ్ల వయసున్నప్పటి నుంచి ఆయన నాకు సలహాలు ఇస్తున్నారు. నేను వాటిని పాటిస్తున్నా’’ అని బ్రేస్వెల్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. -సాక్షి, వెబ్డెస్క్ చదవండి: సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా.. Hashim Amla Facts In Telugu: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు -
సెలక్టర్లకు తలనొప్పి! కిషన్తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా
Shubman Gill- Rohit Sharma- Ishan Kishan: సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023కు ముందు యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్.. డబుల్ సెంచరీలతో దుమ్మురేపడం టీమిండియాకు శుభసూచకంగా పరిణమించింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతూ సెలక్టర్లకు తలనొప్పి తెప్పిస్తున్నారు ఈ యువ డైనమైట్లు. అయితే, ఈ ‘స్నేహపూరిత వైరం’ ఆట వరకే! బయట వీళ్లు జాన్జిగిరీ దోస్తులట.. డ్రెస్సింగ్రూంలో వీళ్లు చేసే అల్లరి ముఖ్యంగా.. ఇషాన్ వేసే చిలిపి వేషాలు మామూలుగా ఉండవట! ఈ విషయాన్ని శుబ్మన్ గిల్ స్వయంగా వెల్లడించాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో మొదటి వన్డేలో అద్భుతమైన ద్విశతకం బాది పంజాబీ బ్యాటర్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సందడి చేశారీ ఇద్దరు మిత్రులు. ముచ్చటగా ముగ్గురు డబుల్ సెంచరీల వీరులు ఒక్కచోట చేరి సంభాషణ సాగించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. ఇషాన్ కిషన్: నేను అతడిని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా! మ్యాచ్కు ముందు నీ రొటిన్ ఎలా ఉంటుంది గిల్? రోహిత్ శర్మ: (మధ్యలో కలుగజేసుకుంటూ).. ఆ విషయం అయితే నీక్కూడా తెలియాలి. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు కదా! శుబ్మన్ గిల్: కిషన్ నా ప్రి- మ్యాచ్ రొటిన్ మొత్తాన్ని పాడు చేస్తాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఫుల్ సౌండ్ పెట్టి మూవీస్ చూస్తూ ఉంటాడు. నేను తనని తిట్టకుండా ఉండలేను. సౌండ్ తగ్గించమని చెప్తాను. కానీ తను మాత్రం మాట వింటే కదా! ఇది నా రూమ్.. నేను చెప్పిన రూల్సే ఇక్కడ పాటించాలి అంటాడు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇదే నా ప్రి- మ్యాచ్ రొటీన్. ఒకే ఫ్రేమ్లో భారత ఓపెనింగ్ డబుల్ సెంచరీ వీరులు(PC: BCCI) ఇషాన్ కిషన్: నేనిలా ఎందుకు చేస్తానంటే.. నువ్వు నా గదిలో పడుకుంటున్నావు. అంతేకాదు నేను చేయాల్సిన పరుగులు నీ ఖాతాలో వేసుకుంటున్నావు! బహుశా అందుకే ఇలా జరుగుతుందేమో! రోహిత్ శర్మ: ఇదంతా ఊరికే సరదాకి! వీళ్లిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాన్నాళ్లుగా టీమిండియాకు ఆడుతున్నారు. వీళ్లకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇద్దరూ పరస్పరం సోదరభావంతో మెలుగుతారు. ఇషాన్ రికార్డు బద్దలు వీరి ముగ్గురి సరదా ముచ్చటకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషన్(24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉన్న రికార్డును గిల్ (23 ఏళ్ల 132 రోజులు) బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దీనితో పాటు మరిన్ని అరుదైన ఘనతలు కివీస్తో మ్యాచ్ సందర్భంగా సాధించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కివీస్తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో గెలుపొందింది. శుబ్మన్ డబుల్ సెంచరీతో మెరవగా.. లోకల్ బాయ్ సిరాజ్ నాలుగు వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కివీస్ బ్యాటర్ బ్రేస్వెల్ టీమిండియాను కంగారు పెట్టాడు. అయితే, ఉత్కంఠరేపిన మ్యాచ్లో భారత్దే పైచేయి అయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ గడ్డపై ద్విశతకం బాదిన ఇషాన్.. బుధవారం నాటి ఉప్పల్ మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. చదవండి: IND VS NZ 1st ODI: డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్మన్ గిల్ Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ 1⃣ Frame 3️⃣ ODI Double centurions Expect a lot of fun, banter & insights when captain @ImRo45, @ishankishan51 & @ShubmanGill bond over the microphone 🎤 😀 - By @ameyatilak Full interview 🎥 🔽 #TeamIndia | #INDvNZ https://t.co/rD2URvFIf9 pic.twitter.com/GHupnOMJax — BCCI (@BCCI) January 19, 2023 -
కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. సిరాజ్ భావోద్వేగ ట్వీట్
India vs New Zealand, 1st ODI- Mohammed Siraj: ఉప్పల్ స్టేడియంలో పరుగుల ఉప్పెన ఎగిసింది. మధ్యాహ్నం ఎండలో.. సాయంత్రం చలిగాలిలో... రాత్రి చుక్కల ఆకాశంలో... అభిమానులు ప్రతి పరుగునూ, ప్రతి బంతినీ ఆస్వాదించారు. ముందుగా శుబ్మన్ గిల్ పరుగుల వరదకు... అనంతరం ‘లోకల్ బాయ్’ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు... చివర్లో న్యూజిలాండ్ బ్యాటర్ మైకేల్ బ్రేస్వెల్ పోరాట పటిమకు ముగ్ధులయ్యారు. వెరసీ.. హైదరాబాద్లో భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ సూపర్ హిట్ అయ్యింది. నువ్వా.. నేనా అంటూ చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠ పోరు కొనసాగింది. అభిమానులు వెచ్చించిన ప్రతి పైసాకు ఫుల్ వినోదం లభించింది. మ్యాచ్ను వీక్షిస్తున్న సిరాజ్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు భాగ్యనగరంలో న్యూజిలాండ్తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత్ ఓడిపోలేదు. ఈసారీ అదే ఆనవాయితీని టీమ్ ఇండియా కొనసాగించింది. తన అజేయ రికార్డును నిలబెట్టుకుంది. 12 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. భావోద్వేగ ట్వీట్ ఇక ఈ మ్యాచ్లో లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 46 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు తీశాడు. కాగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సిరాజ్కు టీమిండియా తరఫున ఇది తొలి మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం సిరాజ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నా కుటుంబ సభ్యులు, స్నేహితుల కోలాహలం నడుమ సొంతమైదానంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఉప్పల్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్ శుబ్మన్ గిల్ సహా న్యూజిలాండ్ బ్యాటర్ బ్రేస్వెల్ను సిరాజ్ ఈ సందర్భంగా అభినందించాడు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ IND vs NZ: బ్రెస్వెల్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా IND vs NZ: టీమిండియాకు ‘శుబ్’ ఘడియలు వచ్చేశాయి.. The @mdsirajofficial effect! 🔥🔥 Middle stump out of the ground 👌 Live - https://t.co/IQq47h2W47 #INDvNZ @mastercardindia pic.twitter.com/mxYajNShmC — BCCI (@BCCI) January 18, 2023 Indeed a special feeling to play my first international match at my home ground while my family & friends were cheering for me. Long way ahead 🙏 and top knock today @ShubmanGill. Even Bracewell 👏 pic.twitter.com/ciRNUl9OFb — Mohammed Siraj (@mdsirajofficial) January 18, 2023 -
సెంచరీతో మెరిసిన శుబ్మన్ గిల్..
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గిల్ 87 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు మినహా గిల్ బ్యాటింగ్లో ఎక్కడా లోపం కనిపించలేదు. కాగా గిల్కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలోనూ గిల్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవరాల్గా వన్డేల్లో గిల్కు ఇది మూడో సెంచరీ. వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న గిల్ ఈ క్రమంలోనే వన్డేల్లో గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. గిల్కు వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 19 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఓవరాల్గా వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా.. పాక్ ఆటగాడు ఇమాముల్ హక్తో కలిసి గిల్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో పాకిస్తాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్(18 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. ఇక టీమిండియా ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గిల్ 111, పాండ్యా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు సూర్యకుమార్ 31 పరుగులు చేసి ఔట్ కాగా.. రోహిత్ 34 పరుగులు చేశాడు. కోహ్లి 4, ఇషాన్ కిషన్ 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. Milestone 🚨 - Shubman Gill becomes the fastest Indian to score 1000 ODI runs in terms of innings (19) 👏👏 Live - https://t.co/DXx5mqRguU #INDvNZ @mastercardindia pic.twitter.com/D3ckhBBPxn — BCCI (@BCCI) January 18, 2023 చదవండి: న్యూజిలాండ్తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్మన్ గిల్ -
Ind Vs NZ: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. అరుదైన ఘనత
India vs New Zealand, 1st ODI- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా హిట్మ్యాన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా హైదరాబాద్లోని ఉప్పల్లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం ఆరంభమైంది. తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఇక భారత ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.. మూడో ఓవర్లో కివీస్ బౌలర్ హెన్రీ షిప్లే బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్ దిశగా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న రికార్డును హిట్మ్యాన్ సవరించాడు. ఆ తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి మరోసారి షిప్లే బౌలింగ్లోనే రోహిత్ సిక్స్ బాదాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో తొలి వన్డేలో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 34 పరుగులు(4 ఫోర్లు, 2 సిక్స్లు) చేశాడు. టిక్నర్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు ►రోహిత్ శర్మ- 125 ►ఎంఎస్ ధోని- 123 ►యువరాజ్ సింగ్- 71 చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. -
ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్గా! ఆ ఒక్క లోటు తప్ప..
India vs New Zealand, 1st ODI- Mohammed Siraj- Hyderabad: హైదరాబాద్.. మాసాబ్ట్యాంక్ సమీపంలో ఖాజానగర్లో ఓ ఇరుకైన అద్దె ఇల్లు.. ఓ ఆటో డ్రైవర్ తన కుటుంబంతో కలిసి జీవించే వాడు. కష్టపడి పెద్ద కొడుకును ఇంజనీరింగ్ చదివించలిగాడు. ఇక చిన్నోడు.. తనకేమో ఆటే ప్రపంచం.. క్రికెట్ అంటే పిచ్చిప్రేమ.. పెద్దోడు ఎలాగోలా సెటిల్ అవుతాడు.. మరి ఈ చిన్నోడి పరిస్థితి ఏమవుతుందోనని తల్లి ఆందోళన. ఆటో డ్రైవర్గా అరకొర సంపాదనతో ఎన్నాళ్లు నెట్టుకురావాలో తెలియని దీనస్థితిలో ఉన్న తండ్రిని చూసి చిన్నోడు తట్టుకోలేకపోయాడు. వేన్నీళ్లకి చన్నీళ్లు తోడన్నట్లు ఇళ్లకు పెయింట్ వేసే పని కూడా చేసేందుకు సిద్ధపడ్డాడు. కానీ ఎప్పుడూ ఆటను వదల్లేదు. సహజ ప్రతిభ పూర్తిస్థాయిలో మెళకువలు నేర్వకముందే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్న ఈ హైదరాబాదీ సహజ ప్రతిభ అతడి గుర్తింపునకు కారణమైంది. లీగ్ స్థాయి క్రికెట్లో సత్తా చాటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్ల దృష్టిలో పడి.. అండర్-23 జట్టు తరఫున సత్తా చాటడం వరకు అద్నాన్, మహబూబ్ అహ్మద్ వంటి కోచ్ల సహకారం ఉంది. అందుకు ముందడుగు అంచెలంచెలుగా ఎదుగుతూ రంజీల్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఆ కుర్రాడు. దేశవాళ్లీ క్రికెట్లో సత్తా చాటాడు. కొడుకు ప్రతిభ చూసి ఆ తండ్రి మురిసిపోయాడు. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడని, గొప్ప క్రికెటర్గా పేరు సంపాదిస్తాడని ఆయన భావించాడు. అందుకు ముందడుగు అన్నట్లు 22 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. దశ తిరిగింది ప్రతిభావంతుడైన ఆ యువ పేసర్ను 2017 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో ఆ కుర్రాడి దశ తిరిగింది. తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన ఆ ఫాస్ట్బౌలర్.. 2017లో న్యూజిలాండ్తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రఖ్యాత మైదానంలో 2019లో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2020లో ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ సంచలనం సృష్టించాడు. అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. సీనియర్ మహ్మద్ షమీ స్థానంలో తుది జట్టులో అవకాశం దక్కించుకున్న అతడు.. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి టీమిండియా పేస్ విభాగంలో కీలక బౌలర్గా ఎదుగుతూ.. ఇప్పుడు సొంత మైదానంలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆ ఒక్క లోటు అయితే, కొడుకు సాధించిన ఘనతను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పుడు ఆ తండ్రి లేడు. తమను పోషించడానికి ఆటో నడిపిన ఆయనను మెర్సిడెస్లోనే తిప్పాలన్న ఆ కొడుకు ఆశ నెరవేరలేదు. అయితే, భౌతికంగా దూరమైనా ఆ తండ్రి ఆశీస్సులు మాత్రం కొడుక్కి మెండుగా ఉంటాయి. ఆ తండ్రి పేరు గౌస్.. తల్లి షబానా.. వాళ్ల చిన్నోడు మరెవరో కాదు మహ్మద్ సిరాజ్. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేని లోటు తీర్చే విధంగా భారత ప్రధాన పేసర్గా ఎదుగుతున్న మన హైదరాబాదీ. వికెట్ల వీరుడు! 28 ఏళ్ల మహ్మద్ సిరాజ్ ఇటీవల అద్భుత ఫామ్లో ఉన్నాడు. 2022 జనవరి 1 నుంచి చూస్తే 18 వన్డేల్లో అతను కేవలం 19.87 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. అసోసియేట్ జట్లను మినహాయిస్తే ఒక బౌలర్ పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే. అదీ 4.53 ఎకానమీతో పరుగులు కూడా ఇవ్వకుండా కట్టడి చేయగలిగాడు. 42 మ్యాచ్ల కెరీర్ తర్వాత తన సొంత నగరంలో సిరాజ్ బుధవారం తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. అతడి ప్రతిభ, నైపుణ్యంపై మేనేజ్మెంట్, కెప్టెన్కు ఎంత నమ్మకం ఉందో.. రోహిత్ శర్మ ప్రెస్మీట్ చూసిన వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది. మూడు ఫార్మాట్లలో కీలకం కివీస్తో ఉప్పల్లో తొలి మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతనిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించడం విశేషం. జట్టులో సిరాజ్ విలువేమిటో చెబుతూ అతనికి బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘సిరాజ్ గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలో ఎంతో మెరుగయ్యాడు. లైన్ అండ్ లెంగ్త్ ఎంతో మెరుగైంది. ముఖ్యంగా అవుట్ స్వింగ్లో పదును పెరిగింది. కొత్త బంతితో బంతిని స్వింగ్ చేయడం అంత సులువు కాదు. కెప్టెన్ ప్రశంసల జల్లు ఈ విషయంలో అతను ఎంతో నైపుణ్యం సంపాదించాడు. అలాంటి బౌలింగ్ను ఎదుర్కోవడం ఏ బ్యాటర్కైనా చాలా కష్టం. సరిగ్గా చెప్పాలంటే తన బౌలింగ్ను అతను అర్థం చేసుకోవడంతో పాటు జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో కూడా గుర్తించాడు. ఆరంభంలో, మధ్య ఓవర్లలో వికెట్లు తీయగల సత్తా అతనిలో ఉంది. రాన్రానూ అతని గ్రాఫ్ మరింత పైకి వెళుతోంది. సిరాజ్ను సరైన రీతిలో మేనేజ్ చేయడం మాకు అవసరం. వరల్డ్కప్, త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం అతడికి తగిన విరామాలు ఇస్తూ సరైన రీతిలో ఉపయోగించుకుంటాం. హోం గ్రౌండ్ మ్యాచ్లో అతనికి బెస్ట్ విషెస్’ అని రోహిత్ అన్నాడు. మనం కూడా మన హైదరాబాదీ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!! చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు 🗣️🗣️'Siraj is an important player for India' Hear what #TeamIndia captain @ImRo45 has to say on local lad @mdsirajofficial ahead of the first #INDvNZ ODI in Hyderabad pic.twitter.com/XoSSOplZ20 — BCCI (@BCCI) January 17, 2023 -
ఉప్పల్లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే!
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు రేపటితో తెరలేవనుంది. బుధవారం ఉప్పల్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. టీమిండియా హోంగ్రౌండ్స్లోనూ క్రికెటర్లకు అచ్చొచ్చిన మైదానాలు చాలానే ఉంటాయి. వాటినే మన భాషలో ఫెవరెట్ గ్రౌండ్ అని పిలుస్తుంటాం. ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్న కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం ఒకటి. ఉప్పల్ స్టేడియం అనగానే కోహ్లికి పూనకాలు రావడం గ్యారంటీ. ఈ పిచ్పై అద్బుతమైన బ్యాటింగ్ రికార్డు కలిగి ఉన్న కోహ్లి బ్యాట్ నుంచి మరో సెంచరీ వస్తుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు ఫార్మాట్లు కలిపి 74 సెంచరీలు బాదిన కోహ్లి.. 75వ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతనున్న ఫామ్ దృశ్యా ఇది అంత పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఇక వన్డే క్రికెట్ అంటే కోహ్లికి కొట్టిన పిండి. 30 నుంచి 40 పరుగులు చేశాడంటే కచ్చితంగా సెంచరీ సాధించే దాకా క్రీజును వదలడం లేదు. ఇక కోహ్లి ఈ గ్రౌండ్లో కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 9 మ్యాచ్లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్) ఆడాడు. ఒక డబుల్ సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 673 పరుగులు సాధించాడు. గతేడాది సెప్టెంబర్లో ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్లో చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్లో 66 పరుగులతో మెరిసిన కోహ్లి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు Ind Vs NZ: అతడి కోసం కోహ్లి త్యాగం చేయాలి! అప్పుడే ఆ ఇద్దరు.. -
జూనియర్ ఎన్టీఆర్తో సూర్య, దేవిషా!.. బ్రదర్ అంటూ ట్వీట్.. వైరల్
Suryakumar Yadav- Junior NTR: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను కలిశాడు. తారక్తో కలిసి సతీసమేతంగా ఫొటో దిగాడు. ప్రపంచ వేదికపై మరోసారి భారతీయ సినిమా సత్తాను చాటిన ఆర్ఆర్ఆర్ సినిమా పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం పట్ల సూర్య హర్షం వ్యక్తం చేశాడు. బ్రదర్ అంటూ ట్వీట్ ఈ సందర్భంగా తారక్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. భార్య దేవిషా శెట్టి, ఎన్టీఆర్ నడుమ తాను నిలబడి ఉన్న ఫొటోను పంచుకున్న సూర్య.. ‘‘మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరా! ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మీకు మరోసారి శుభాకాంక్షలు’’ అని ట్విటర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్కు వచ్చాడు. ఉప్పల్లో మ్యాచ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్ మధ్య తొలి వన్డే జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా క్రికెటర్లు ఎన్టీఆర్ను కలవడం విశేషం. కాగా టీ20లలో నంబర్ 1గా ఎదిగిన సూర్యకుమార్.. ఇటీవల స్వదేశంలో ముగిసిన శ్రీలంకతో సిరీస్లో సత్తా చాటాడు. నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి జట్టు, సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో వన్డేలో చోటు దక్కించుకున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. కివీస్తో వన్డేల్లో అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తోంది. It was so lovely meeting you, brother! Congratulations once again on RRR winning the Golden Globe award 🤩 pic.twitter.com/6HkJgzV4ky — Surya Kumar Yadav (@surya_14kumar) January 17, 2023 ఇక రామ్ చరణ్, జూనియర్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. ప్రేమ్రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో తొలి వన్డే.. సూర్యకుమార్కు నో ఛాన్స్! కిషన్కు చోటు Murali Vijay: సెహ్వాగ్లా నాక్కూడా ఆ ఫ్రీడం దొరికి ఉంటే కథ వేరేలా ఉండేది! నా విషయంలో.. -
ఉప్పల్లో మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఉప్పల్ నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రసాభాస చోటుచేసుకుంది. మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని పిలవకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ మేయర్ విజయలక్ష్మిని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేయర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు, మేయర్ వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పనంటూ శంకుస్థాపన చేయకుండానే మేయర్ వెనుదిరిగారు. -
మేయర్ ను అడ్డుకున్న పార్టీ కార్యకర్తలు
-
ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాది కొత్తగూడెం, చెంచుపల్లి గ్రామానికి చెందిన మేకల లిఖిత్ నవనీత్ (24) పోచారం ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ స్నేహితుడు మచ్చ నవీన్తో కలిసి దిల్శుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం వారిరువురు బైక్పై హాస్టల్ నుంచి పోచారానికి వెళుతుండగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడ్డారు. బస్సు వెనక చక్రాలు లిఖిత్ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లిఖిత్ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవీన్ చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరు మేకల రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిందని దారుణం.. కుటుంబీకులే..!) -
ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు?
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గులాబీ కోటలో గ్రూపులు బయల్దేరుతున్నాయి. టిక్కెట్లు ఆశించేవారు గళం విప్పుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడంలేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాలవారీగా విడిపోతున్నారు. గ్రేటర్లోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూపుల గురించి చూద్దాం. గులాబీ ముళ్లు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. (చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత) రాజకీయాల మధ్య కులం ఉప్పల్ లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్ గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావిడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట. ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో... కార్పొరేటర్, మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్ గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్ళుగా భరిస్తున్నానని ఇంక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్తా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది. (చదవండి: ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?) సిట్టింగ్ హామీ ఏమవుతుంది? కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. సిటింగ్లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిటింగ్లను కాదని వేరేవారికి టిక్కెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఏమో తనకూ బీసీ కోటాలో ఛాన్స్ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి.. బండారి లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారని.. బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయితీ ప్రగతి భవన్కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ ధోబీఘాట్ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ వర్గాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయి తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా బలాలను ప్రదర్శించుకుంటూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చాటుతున్నారు. ఈ క్రమంలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కుషాయిగూడలో ఆధునిక యాంత్రిక ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగా తనకు అవమానం జరిగిందని స్థానిక కార్పొరేటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. ప్రొటోకాల్ తనకు సంబంధించిన అంశం కాదని అది అధికారుల చూసుకుంటారంటూ ఎమ్మెల్యే చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మహిళా కార్పొరేటర్నైన తనను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అడుగడుగునా అవమానపరుస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఒక మహిళనని చూడకుండా గడిచిన మూడేళ్లుగా అనేక అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో లేని విధంగా ఎమ్మెల్యే చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ ప్రమేయం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’ ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి చేస్తూ ప్రొటోకాల్ సమస్యకు తెరలేపుతూ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళనైన తనను అంతటా అవమానపరుస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధిష్టానానికి అందజేస్తానన్నారు. తాజాగా కుషాయిగూడ ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగానూ తనను అగౌరవపరిచినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ధోబీఘాట్ వద్దే తాను ఉన్నానని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రావడం మరో అరగంట సమయం ఉందని నిర్వాహకులు చెప్పడంతో పూలే వర్ధంతి సభలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చేలోపు మంత్రి, ఎమ్మెల్యే ధోబీఘాట్ యంత్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ప్రస్తావన లేకుండా నిమిషాల వ్యవధిలో ప్రారంభించి వెళ్లి తనను అవమానపరిచారని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అవి పూర్తి అసత్యాలని కొట్టి పడేశారు. -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. బొంతు శ్రీదేవి కంటతడి
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్లో మరో వర్గపోరు బయటపడింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ నడుమ వివాదం చోటు చేసుకుంది. చర్లపల్లిలో సోమవారం ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ఎదుట.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. తన డివిజనల్లో తనకు తెలియకుండానే.. ఎమ్మెల్యే సుభాష్రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆమె ఆరోపిస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ‘‘నేను మాత్రం ఊరుకునేది లేదు. మూడేళ్లు ఊరుకున్నా. ఇక ఊరుకోను. ఈసారి సాక్ష్యాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పదివేలు పడేస్తే.. చంపేస్తారంటూ బెదిరిస్తున్నారు. నా సత్తా ఏంటో కూడా చూపిస్తా’’ అంటూ ఆమె సవాల్ విసిరారు. కులం పేరుతో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె ఎమ్మెల్యే సుభాష్రెడ్డిపై ఆరోపిస్తూనే.. బీసీ సంఘాలు ఈ వ్యవహారంపై స్పందించాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై అధిష్టానానికి కలిసి ఫిర్యాదు చేస్తానని బొంతు శ్రీదేవి చెప్పారు. ఎమ్మెల్యే సుభాష్రెడ్డి సీరియస్ ఇదిలా ఉంటే.. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి. ఉప్పల్లో గత కొంతకాలంగా బొంతు, బేతి వర్గాల నడుమ విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా.. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చేసిన ఆరోపణలపై ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శ్రీదేవి చేసిన అసత్య ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని సుభాష్రెడ్డి ప్రకటించారు. ఇదీ చదవండి: ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు -
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ..!
-
Hyderabad: నేనేమి చేశాను నేరం!
సాక్షి, ఉప్పల్: నెలన్నర వయస్సున్న ఆడ శిశువును చెట్ల పొదల్లో వదిలేసిన ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉప్పల్ హెచ్ఎండీఎ లే అవుట్ భగాయత్ లేఅవుట్ డీమార్టు వద్ద చెట్ల పొదల్లో ఆదివారం ఓ చిన్నారిని గుర్తించిన వాకర్స్ 108, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువును పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టంనిమిత్తం గాం«దీకి తరలించారు. అయితే.. చనిపోయిన శిశువును వదిలేసి వెళ్లారా.. లేక బతికి ఉండగానే వదిలేసి వెళ్లారా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప్పల్ జంట హత్య కేసులు: కక్షతోనే అంతం..ఎనిమిది మంది నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: క్షుద్ర పూజలు చేసినా పోలీసు ఉద్యోగం రాలేదు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులూ వెంటాడటంతో కక్షగట్టి ప్రాణాలు తీశాడని రాచకొండ పోలీసులు తేల్చేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఉప్పల్ జంట హత్యల కేసును ఎట్టకేలకు ఛేదించారు. ప్రధాన నిందితుడు లక్కీ వినయ్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. మంగళవారం ఆయన మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్లతో కలిసి వివరాలు వెల్లడించారు. 1991లో బాలాపూర్లోని మామిడిపల్లికి చెందిన లక్కీ వినయ్ తండ్రి పర్మ యోగేందర్ రెడ్డి రాజకీయ కక్షల నేపథ్యంలో తుకారాంగేట వద్ద హత్యకు గురయ్యారు. అనంతరం లక్కీ, అతడి అన్న, సోదరితో కలిసి ఉప్పల్లోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఇక్కడి హనుమాన్సాయినగర్కు చెందిన పురోహితుడు నర్సింహ శర్మతో లక్కీకి పరిచయమైంది. ఈ క్రమంలో నర్సింహకు అతీత శక్తులున్నాయని, పూజలతో ఏదైనా సాధించగలడని అతడు నమ్మకం పెంచుకున్నాడు. 2016లో ఎస్ఐ పరీక్షకు లక్కీ హాజరయ్యాడు. ఆ సమయంలో నర్సింహా పూజలు చేసి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతడి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానంటూ కిస్మత్పురాకు చెందిన వాలి, రాజ్యలక్ష్మీలకు రూ.12.50 లక్షలు ఇప్పించాడు. ఈ నేపథ్యంలో పూజలు చేసినా ఎస్ఐ ఉద్యోగం రాకపోవటంతో తాను ఇచి్చన డబ్బులు తిరిగి ఇవ్వాలని నర్సింహపై లక్కీ ఒత్తిడి పెంచాడు. నర్సింహ కాలయాపన చేస్తూ తప్పించుకు తిరిగేవాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం, అనారోగ్యం క్షీణించడం, ఆర్థిక ఇబ్బందులకు లోనుకావటంతో.. పూజారి నర్సింహ క్షుద్ర పూజల కారణంగానే తాను దీన స్థితికి వచ్చానని లక్కీ భావించాడు. నర్సింహను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. రక్తం మరకలు.. దుస్తులను శుభ్రం చేసిన తల్లి.. జంట హత్యల అనంతరం నిందితులు లక్కీ, బాలకృష్ణలు తప్పించుకునేందుకు జల్పల్లికి చెందిన గడ్డి కార్తీక్, ఎల్బీనగర్కు చెందిన వాకిటి సుధాకర్ రెడ్డిలు రూ.35 వేలు కమీషన్ తీసుకొని రెండు ద్విచక్ర వాహనాలను సమకూర్చారు. హత్యల అనంతరం రక్తం మరకలున్న దుస్తులు, కత్తి, కొడవలిని మామిడిపల్లిలోని లక్కీ ఇంట్లో వదిలేసి పారిపోయారు. లక్కీ తల్లి సావిత్రి రక్తపు మరకలు కనిపించకుండా దుస్తులను శుభ్రం చేసింది. నర్సింహ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలను సేకరించి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రక్తం మరకులున్న దుస్తులు, కత్తి, కొడవలి, రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్లో నక్కి.. రెక్కీ లక్కీ తన స్నేహితుడైన చంపాపేటకు చెందిన యెళ్ల బాలకృష్ణను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు. నర్సింహ కదలికలను పసిగట్టేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్ గదిని అద్దెకు తీసుకున్న మామిడిపల్లికి చెందిన లాల్ జగదీష్ గౌడ్, కార్వాన్కు చెందిన గన్వయ రామ్, ఫిల్మ్నగర్కు చెందిన గైక్వాడ్ శ్యాం సుందర్లు రెక్కీ చేసి సమాచారాన్ని లక్కీకి చేరవేసేవారు. సరైన సమయం కోసం వేచి ఉన్న లక్కీ, బాలకృష్ణలు శుక్రవారం తెల్లవారుజామున కొడవలి, కత్తులతో నర్సింహ ఇంట్లోకి ప్రవేశించి అతడిని హత్య చేశారు. తిరిగి వెళ్లిపోతుండగా నర్సింహ చిన్న కుమారుడు శ్రీనివాస్ అడ్డుకోవటానికి ప్రయతి్నంచగా.. అతడినీ బాలకృష్ణ కత్తితో పొడిచి చంపేశాడు. (చదవండి: 'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితాన్ని చాలిస్తున్నా') -
ఉప్పల్ డబుల్ మర్డర్ వెనుక క్షుద్రపూజలు
-
ఉప్పల్ జంట హత్యల కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, సిటీబ్యూరో: సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు!. ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ (78), ఆయన కుమారుడు నర్సింహుల శ్రీనివాస్ (45)లు గత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్థిరాస్తి తగాదాలే హత్యలకు కారణమని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు క్షుద్ర పూజల కోణంలో దొరికిన ఆధారాలతో కేసును ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి సమీపంలో లభ్యమైన బ్యాగులో పసుపు, కుంకుమ పొట్లాలు లభ్యం కావడమే అందుకు కారణంగా తేలింది. హత్య జరిగిన అనంతరం నర్సింహశర్మ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు రావటంతో ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. ప్రత్యక్ష సాక్షి నర్సింహ శర్మ ఇంటి పని మనిషి, స్థానికులను విచారించగా.. నర్సింహ శర్మ క్షుద్ర పూజలు, వాస్తు పూజలు చేసేవారని, ఈ వ్యవహారంలోనే నిందితులు ఆయనపై కక్షగట్టారని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. సెల్ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా హత్య అనంతరం దుండగులు విశాఖకు పారిపోయినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందంతో వెళ్లిన పోలీసులు మామిడిపల్లికి చెందిన వినాయక్ రెడ్డి, అతని స్నేహితుడు సంతోష్ నగర్కు చెందిన బాలకృష్ణా రెడ్డిలను అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. క్షుద్ర పూజలతో చెడు జరిగిందని.. క్షుద్ర పూజల నేపథ్యంలో హతుడు నర్సింహ శర్మతో వినాయక్రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లిందని వినాయక్ రెడ్డి భావించి, ఎలాగైనా పురోహితుడిని అంతమొందించాలని పగపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్నేహితుడు బాలకృష్ణారెడ్డితో కలిసి హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. నర్సింహ శర్మ కదలికలను తెలుసుకునేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్లో అద్దెకు దిగారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి, శుక్రవారం ఉదయం బ్యాగులలో కత్తులు పెట్టుకొని నర్సింహ శర్మ ఇంట్లోకి ప్రవేశించి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తండ్రిని హత్య చేసి తిరిగి వెళ్లిపోతున్న నిందితులను అడ్డుకోవటానికి ప్రయత్నించిన శ్రీనివాస్పై విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీనివాస్ మృతదేహంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. స్పష్టత లేని సీసీటీవీ ఫుటేజీ మృతుడి ఇంటిలో సీసీటీవీ కెమెరా ఉందని, కానీ కొన్ని రోజులుగా అది పనిచేయడం లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కెమెరా పనిచేయడం లేదన్న విషయం నర్సింహ శర్మకు, ఆయన కుమారుడు శ్రీనివాస్కు తెలియదని తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఉన్న హాస్టల్, సమీప ప్రాంతంలోని సుమారు 200– 250 సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. వీటిలో నిందితుల ముఖాలు స్పష్టంగా రికార్డు కాలేదని, దీంతో సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించినట్లు తెలిపారు. పూర్తి వివరాలను రాబట్టేందుకు నిందితులను రహస్య ప్రాంతంలో ఉంచి, విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కేసు పూర్తి వివరాలను ఒకట్రెండు రోజులలో పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. సంబంధిత వార్త: తండ్రి కొడుకుల హత్య కేసు.. నేత్ర దానం -
తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
ఉప్పల్: ఉప్పల్లో శుక్రవారం జరిగిన తండ్రి కొడుకుల దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థిరాస్థి విషయంలో కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, విచారణలు వెరిసి ఒకే కుటుంబంలో ఇద్దరి హత్యకు దారితీసిన విషయం విదితమే. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆస్థి తగాదాలతో పాటు మరేదైన కోణం ఉందా అనే విషయంలో సైతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుల విచారణ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే దాదపుగా 40 మంది అనుమానితులను విచారించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీల ఆధారంగా, నిందితుల చాయ చిత్రాలతో అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ నంబర్లు, సెల్ టవర్లు లోకేషన్లతో కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసుల అదుపులో మరో నలుగురు శనివారం మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం అనుమానితులైన కొందరిని అదుపులోకి విచారించిన సంగతి విదితమే. దుండగులు అదే గల్లీలో బాధితుల ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంటూ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణంలో వెల్లడైంది. హాస్టల్లోని సీసీ ఫుటేజీలతో పాటు డీవీఆర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తండ్రీ కొడుకుల దారుణ హత్య) -
తండ్రీ కొడుకుల దారుణ హత్య
హైదరాబాద్(ఉప్పల్): ఉప్పల్లో శుక్రవారం తెల్లవారుజామున జంట హత్యలు చోటు చేసుకున్నాయి. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తండ్రీకొడుకుల్ని దారుణంగా చంపేశారు. ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎస్ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, హతుల కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ (78) పురోహితుడు. ఆయన భార్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు కొన్నాళ్లుగా మరో ప్రాంతంలో ఉంటున్నారు. దీంతో చాలాకాలం నర్సింహ ఒక్కరే హనుమసాయినగర్లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన చిన్న కుమారుడు, మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన నర్సింహుల శ్రీనివాస్ (45) తండ్రి బాగోగులు చూడటానికి మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చి తండ్రితో కలిసి ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పని మనిషి ఇంటి గేటు తీసుకుని లోపలకు వెళ్లింది. అప్పటికే ఆ ప్రాంతంలో వేచి ఉన్న ఇద్దరు దుండగులు భుజానికి ఉన్న బ్యాగ్తో ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించారు. పంతులు గారిని పిలవాలంటూ పని మనిషికి చెప్పడంతో ఆమె ‘మీ కోసం ఎవ్వరో వచ్చారు అయ్యగారు’ అంటూ నర్సింహకు చెప్పింది. దీంతో పూజలో ఉన్న ఆయన గది నుంచి బయటకు వచ్చి పోర్టికోలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ‘ఎవరు మీరు? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ఓ దండగుడు ఆయన సమీపంలోకి వెళ్లి వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఏదో జరుగుతోందని భావించిన నర్సింహ్మ గట్టిగా అరిచారు. ఈ అరుపులు విని అక్కడకు వచ్చిన పనిమనిషి జరుగుతోంది చూసి భయంతో అరుస్తూ పరుగులు పెట్టింది. ఈలోపే మరో దుండగుడు తనతో తెచ్చుకుని కత్తితో నర్సింహ గొంతు కోశాడు. దీంతో ఆయన పక్కకు పడిపోయారు. ఈ గొడవ విన్న చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంటి మొదటి అంతస్తు నుంచి హడావుడిగా కిందికి వచ్చాడు. అప్పటికే తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్న దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గేటు సమీపంలో శ్రీనివాస్ పైనా వాళ్లు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్పకూలిన అతడు కన్నుమూశాడు. ఈలోపు అక్కడకు చేరుకున్న స్థానికులు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లు కత్తులతో బెదిరించడంతో వెనక్కు తగ్గారు. ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా టీషర్టులు ధరించి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టడం, తదితర పరిణామాల నేపథ్యంలో వీళ్లు కిరాయి హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యలపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాల వద్ద నుంచి బయలుదేరిన పోలీసు జాగిలాలు సమీపంలోనే దుండగులు పడేసిన బ్యాగ్ వరకు వెళ్లి వెనక్కు వచ్చాయి. ఆ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెరిచిన చూడగా... అందులో కుంకుమ, పుసుపు, అగర్బత్తీలు కనిపించాయి. ఆస్తి తగాదాలు...కోర్టు వ్యాజ్యాలు నర్సింహకు కొందరితో ఆస్తి తగాదాలతో పాటు కోర్టులో వ్యాజ్యాలు ఉన్నాయి. వాళ్లు రెండేళ్ల క్రితం ఓసారి నర్సింహపై దాడి చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుల ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ముగ్గురిగా అనుమానిస్తున్నారు. మూడో వ్యక్తి కాస్త దూరంలో ఉండి ఇద్దరిని నర్సింహ ఇంటికి పంపినట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కోసం మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని వచ్చిన శ్రీనివాస్ పాత కక్షలకు బలయ్యాడంటూ కుటుంబీకులు విలపించారు. వారం రోజుల రెక్కీ.. నర్సింహ హత్యకు రంగంలోకి దిగిన దుండగులు వారం రోజుల పాటు పక్కాగా రెక్కీ చేశారు. దీనికోసం వాళ్లు హతుల ఇంటి ఎదురుగానే ఉన్న ఓ డీలక్స్ హాస్టల్లో బస చేశారు. అక్కడ ఉంటూనే ప్రతి రోజూ నర్సింహ ఇంటిని పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరెవరు వస్తుంటారు? ఆ ఇంటి పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు ఏ సమయంలో ఎలా ఉంటాయి? తదితర అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చివరకు తెల్ల వారుజాము సమయమే తమకు అనుకూలమని భావించి శుక్రవారం తమ పని పూర్తి చేసి పారిపోయారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న దుండగుల బ్యాగ్లో పూజా సామాగ్రితో పాటు కారం ప్యాకెట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన ఆ ఇంటి పని మనిషి నుంచి వాంగ్మూలం సేకరించారు. -
ఉప్పల్ లో తండ్రీకొడుకుల దారుణ హత్య
-
ఉప్పల్లో తండ్రీకొడుకుల దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉప్పల్లో నర్సింహ శర్మ, శ్రీనివాస్ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కాగా, శ్రీనివాస్.. మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. నెల క్రితమే మలేషియా నుంచి స్వదేశానికి వచ్చాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి హత్య చేశారు. బంధువులతో ఆస్తి వివాదం కేసు కోర్టులో నడుస్తోంది. ఆస్తి వివాదమే హత్యలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న టీ–20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. రాచకొండ పోలీసులు 2,500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్, ఆక్టోపస్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఐటీ సెల్, షీ టీమ్స్ అన్ని పోలీసు విభాగాలు విధుల్లో ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మైదానం, పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. ట్రాఫిక్ ఆంక్షలిలా.. మైదానం చుట్టూ నేటి మధ్యాహ్నం నుంచి తెల్లవారు జాము వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా ప్రవేశం లేదు. గేట్– 1 వీఐపీ ద్వారంలోని పెంగ్విన్ గ్రౌండ్లో 1,400 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్డేడియం నలువైపులా అయిదు క్రేన్లు అందుబాటులో ఉంటాయి. ఎన్జీఆర్ఐ గేట్ –1, జెన్ప్యాక్ట్లకు రోడ్డుకిరువైపులా ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక యాప్ ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి రూట్ను చూపించే యాప్ మెసేజ్ రూపంలో వస్తుంది. 21 పార్కింగ్ ప్రాంతాలు ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 370 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. స్టేడియం చుట్టూ దాదాపు 21 పార్కింగ్ ప్రాంతాలను అందుబాటులో ఉంచామన్నారు. వీటితో పాటు స్టేడియం చుట్టూ 7.5 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లపై పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించినట్లు, ప్రధాన కూడళ్లు నాగోల్ చౌరస్తా, ఉప్పల్ చౌరస్తా, హబ్సిగూడ ఎల్జీ గోడౌన్ వద్ద, హబ్సిగూడ చౌరస్తాలో పార్కింగ్ ప్రదేశాలను చూపే అతి పెద్ద సమాచారమిచ్చే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు.. ►ఉప్పల్ వైపు వచ్చే అన్ని భారీ వామనాలను దారి మళ్లించనున్నారు. ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను చెంగిచర్ల వద్దే దారి మళ్లిస్తారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలను దారి మళ్లించి దిల్సుఖ్నగర్ మీదుగా వయా అంబర్పేట నుంచి పంపించనున్నారు. వీటికి అనుమతి లేదు.. ►స్టేడియం లోపలికి మొబైళ్లు, ఇయర్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. హెల్మెట్లు, కెమెరా, బైనాక్యులర్, ల్యాప్ట్యాప్, సిగరెట్లు, తినుబండారాలు, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్పిన్స్, బ్లేడ్లు, చాకులు, వాటర్ బాటిళ్ల వంటివేవీ స్టేడియం లోనికి అనుమతించరు. -
ఉప్పల్ 'దంగల్'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
సాక్షి, హైదరాబాద్: నగర క్రీడాభిమానుల మూడేళ్ల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. మొహాలీలో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా.. నాగ్పూర్లో భారత్ మెరిసింది. ఇక చివరిదైన మూడో మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోవడానికి రోహిత్ సేన, ఫించ్ బృందం సిద్ధమయ్యాయి. శనివారం సాయంత్రం రెండు జట్లూ హైదరాబాద్కు చేరుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం తర్వాత నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి వ్యూహాలకు పదును పెట్టుకోనున్నాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సిరీస్ను తేల్చే మ్యాచ్ కావడం.. మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ను వీక్షించే అవకాశం రావడం... ఈ నేపథ్యంలో ఉప్పల్ మైదానం ‘హౌస్ఫుల్’ కానుంది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని అభిమానులు ఎలాగైనా తమ అభిమానుల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.... టికెట్లపై ఆశలు వదులుకున్న వారు మాత్రం ఇంట్లో టీవీల ముందు కూర్చోని చూసేందుకు... లేదంటే మొబైల్స్లో వీక్షించడానికి... హోటల్స్లో పెద్ద స్క్రీన్లపై ఆస్వాదించడానికి సిద్ధమైపోయారు. సమరం... సమం.. ►2005 నుంచి ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో (వన్డే, టెస్టు, టి20) కలిపి 12 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టి20 మ్యాచ్ ఉన్నాయి. అయిదు టెస్టుల్లో భారత్ నాలుగింటిలో నెగ్గగా, మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఇక ఆరు వన్డేల్లో భారత్ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. ఏకైక టీ20లో భారత్నే విజయం వరించింది. ►ఉప్పల్ వేదికపై భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా నాలుగుసార్లు (మూడు వన్డేలు, ఒక టెస్టు) తలపడ్డాయి. రెండుసార్లు భారత్... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచి సమవుజ్జీగా ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో మాత్రం ఈ రెండు జట్ల మధ్య సిటీలో తొలిసారి పోరు జరగనుంది. ►2007 అక్టోబర్ 5న జరిగిన వన్డే మ్యాచ్లో ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 290 పరుగులు సాధించింది. మాథ్యూ హేడెన్ (60; 10 ఫోర్లు), మైకేల్ క్లార్క్ (59; 4 ఫోర్లు), ఆండ్రూ సైమండ్స్ (89; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 47.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. యువరాజ్ సింగ్ (121; 12 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరాటంతో సెంచరీ సాధించాడు. ►2009 నవంబర్ 5న ఈ వేదికపై రెండోసారి భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డేలో తలపడ్డాయి. ఈసారి ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 350 పరుగులు సాధించింది. షేన్ వాట్సన్ (93; 9 ఫోర్లు, 3 సిక్స్లు), కామెరాన్ వైట్ (57, 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా... షాన్ మార్‡్ష (112; 8 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో అలరించాడు. 351 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (141 బంతుల్లో 175; 19 ఫోర్లు, 4 సిక్స్లు) గొప్పగా ఆడి సెంచరీ సాధించినా భారత్ను విజయతీరానికి చేర్చలేకపోయాడు. ►2013 మార్చి 2 నుంచి 5 వరకు ఇదే వేదికపై భారత్, ఆస్ట్రేలియా టెస్టు ఆడగా... భారత్ ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులు చేయగా... భారత్ 503 పరుగులు సాధించింది. మురళీ విజయ్ (167; 23 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ, చతేశ్వర్ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ చేశారు. 266 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 131 పరుగులకే కుప్పకూలింది. ►2019 మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడోసారి వన్డేలో పోటీపడగా... ఈసారి భారత్ను విజయం వరించింది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసి విజయం సాధించింది. కేదార్ జాదవ్ (81 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), ధోని (59 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో భారత్ను గెలిపించారు. -
కలిసొచ్చిన ఉప్పల్ స్టేడియం.. కోహ్లి మెరిసేనా!
భారత్లో విరాట్ కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం ఒకటి. ఈ గ్రౌండ్లో కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 8 మ్యాచ్లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్) ఆడాడు. ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 607 పరుగులు స్కోరు చేశాడు. 2019లో చివరిసారి ఈ గ్రౌండ్లో వెస్టిండీస్తో జరిగిన టి20 మ్యాచ్లో కోహ్లి అజేయంగా 94 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న టి20 సిరీస్లో కోహ్లి పెద్దగా రాణించలేదు. తొలి టి20లో 2 పరుగులకే వెనుదిరిగిన కోహ్లి.. నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో టి20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఈ మైదానం ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు అచ్చిరాలేదు. ఈ గ్రౌండ్లో రోహిత్ 3 మ్యాచ్లు ఆడి కేవలం 46 పరుగులు సాధించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్కు కూడా ఈ గ్రౌండ్ కలిసి రాలేదు. 2019 మార్చి 2న భారత్తో ఇక్కడ జరిగిన వన్డేలో ఫించ్ ‘డకౌట్’ అయ్యాడు. ఇక తొలి రెండు టి20ల్లో చెరొక విజయం సాధించిన ఇరుజట్లు హైదరాబాద్లో మ్యాచ్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. చదవండి: ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది -
ఫైనల్ ఫైట్
-
హెచ్సీఏ కీలక నిర్ణయం! రాత్రి 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు!
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సిరీయస్గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్తో చర్చల అనంతరం హెచ్సీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లను విక్రయించాలని హెచ్సీఏ నిర్ణయించకున్నట్లు సమాచారం . సూమారు 7000 టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు హెచ్సీఏ వర్గాలు పేర్కొన్నాయి. కాగా జింఖానా గ్రౌండ్లో టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో హెచ్సీఏ పేర్కొంది. మరోవైపు ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలపై హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రం భిన్నంగా స్పందించినట్లు సమాచారం. ఓవైపు ఆన్లైన్లో టికెట్లు అని వార్తలు వస్తుంటే.. ఆయన మాత్రం టికెట్లన్నీ అయిపోయాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్ను బాయ్కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! -
అతనిది ఉప్పల్.. ఆమెది కెనడా
కుషాయిగూడ: నగరంలోని ఉప్పల్కు చెందిన యువకుడు, కెనడాకు చెందిన యువతి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉప్పల్కు చెందిన రోహిత్, కెనడాకు చెందిన కియర్ర ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అనుమతితో ఆదివారం మల్లాపూర్లోని ఓ కల్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నారు. ఎంఎస్ కోసం కెనడాకు వెళ్లిన రోహిత్.. చదువు పూర్తయిన అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన పనిచేసే సంస్థలో కియర్ర తండ్రి జేసన్ క్లబ్ పని చేస్తున్నారు. జేసన్ ఇంట్లో జరిగే పలు శుభకార్యాలకు వెళ్లిన రోహిత్కు, కియర్రకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసి పరిణయానికి బాటలు వేసింది. నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆశీర్వదించారు. (చదవండి: వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు కలవు) -
ఉప్పల్: ల్యాబ్ సెంటర్లో డ్రగ్స్ తయారీ!.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లోని అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్లో మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి కొకైన్ మాత్రలు, ఎల్సీడీలతో పాటు 53 గ్రాముల సింథటిక్ డ్రగ్స్, 3.6 కిలోల నార్కోటిక్ పదార్థాల ద్రవం, 50 కిలోల హైడ్రోక్లోరైడ్, 12 బాటిళ్ల మిథైలమైన్, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కే మురళీధర్తో కలిసి సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ►నల్లగొండ జిల్లా ఓపులాయిపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి లెనిన్ బాబు వరంగల్లోని సీకేఎం కాలేజీలో కర్బన్ రసాయన శాస్త్రంలో పీజీ పూర్తి చేశాడు. 2004–13 మధ్య సువాన్, మిత్రోస్, సాయి లైఫ్ సైన్సెస్, అల్బానీ వంటి పలు ఫార్మా కంపెనీలలో జూనియర్ సైంటిస్ట్గా పనిచేసి, ఆర్ అండ్ డీ విభాగంలో సీనియర్ కెమిస్ట్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత 2014లో నాచారంలోని జీవీకే బయో సైన్సెస్ సమీపంలో అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్ను ఏర్పాటు చేశాడు. కొంతకాలం నడిపిన తర్వాత దీన్ని 2019లో ఉప్పల్కు మార్చాడు. ►2017లో ప్రభాకర్ అనే వ్యక్తి నాంపల్లి లెనిన్బాబాకు గుంటూరు జిల్లా కొరటిపాడు గ్రామానికి చెందిన పులిచెర్ల శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేశాడు. అగ్రి కెమికల్స్ తయారు చేయాలని సూచించాడు. ఇద్దరి స్నేహ బలపడిన తర్వాత.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న ఇరువురు మాదక ద్రవ్యాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అక్షజ్ మాలిక్యులర్ ల్యాబ్స్లో లెనిన్బాబు సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తే, వాటిని శ్రీనివాస్ రెడ్డి చెన్నైలోని నెపోలియన్కు సరఫరా చేసేవాడు. ►ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న భువనగిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు, ఉప్పల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆకస్మిక దాడులు చేసి లెనిన్బాబు, శ్రీనివాస్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. నెపోలియన్ పరారీలో ఉన్నాడు. చదవండి: సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు ఏడేళ్ల నుంచి శ్రీనివాస్ రెడ్డి పరారీలోనే.. 1994లో జేఎస్ఎస్ ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రీనివాస్ రెడ్డి.. తార్నాకలోని కిమ్టీ కాలనీలో స్థిరపడ్డాడు. కొంత కాలం మెడికల్ రిప్రజెంట్గా పనిచేశాడు. 2010లో ఎఫెడ్రిన్ సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో చెన్నై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. 2014లో మెథాంఫేటమిన్ డ్రగ్ సప్లయి కేసులో హైదరాబాద్ ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటికి వచ్చాక కూడా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. 2015లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో 2015లో కీసర్ పీఎస్లో ఎన్డీపీఎస్ కేసు నమోదయింది. అప్పటి నుంచి శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. 2018లో ఉప్పల్ పీఎస్లో నమోదయిన ఎన్డీపీఎస్ కేసులోనూ శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్న శ్రీనివాస్.. తాజాగా రాచకొండ పోలీసులకు చిక్కాడు. చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! -
హైదరాబాద్: ఉపాధి ఆశ చూపి వ్యభిచారంలోకి..!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ యువతులను నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాలో ఆరుగురిని యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్, ఉప్పల్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, 7 సెల్ఫోన్స్, 5 సిమ్ కార్డులు, 7 నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. వ్యభిచార ముఠా నుంచి నుంచి ఓ బాలికతో పాటు మహిళను కాపాడారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్ భగవత్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సతీష్ రజక్(25) ముంబైలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తను బంగ్లాదేశ్కు చెందిన బ్రిష్టిఖాతున్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అక్రమంగా పశ్చిమ బెంగాల్కు వచ్చి అక్కడ నకిలీ ఆధార్ కార్డు తీసుకుని ముంబైకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన దీపక్ చంద్, మావత్ ప్రకాష్(30), మహారాష్ట్రకు చెందిన సురేష్ బలుసోనన్నే(36,) అస్లాం చంద్ పటేల్, అరుణ్ రామచంద్ర జాదవ్(56), పశ్బిమ బెంగాల్కు చెందిన ప్రియాంక కలిసి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీపక్ చంద్, సతీష్ రజక్లు వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతులును ఉపాధి పేరుతో ఆకర్షించి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్లో యువతులు, మహిళల అర్ధనగ్న ఫొటోలు అప్లోడ్ చేసి.. కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దేశంలో క్లయింట్లకు కావాల్సిన చోటికి యువతులను పంపిస్తున్నారు. విమాన, రైలు, బస్సు, నెట్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ డబ్బు దండుకుంటున్నారు. సతీష్ రజక్, భార్య బ్రిష్టిలు హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో ఉంటూ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను, బాలికలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్ చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం తన బంధువైన బ్రిష్టిని సంప్రదించగా ఇండియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆమె తన సోదరితో కలిసి అక్రమంగా జూన్ 27న బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు రాగా, అక్కడ నుంచి రజక్, బ్రిష్టిలు ఉప్పల్ తీసుకొచ్చారు. వారిద్దరినీ బలవంతంగా వ్యభిచారంలో దింపడంతో వారు ఈనెల 11న అక్కడి నుంచి తప్పించుకుని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి బంగ్లాదేశ్ మహిళలతో పాటు 15 ఏళ్ల బాలికను రక్షించారు. దీపక్ చంద్కు బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా రవాణా చేసేవారితో మంచి పరిచయాలు ఉన్నాయని, వారు మహిళలను అక్రమంగా భారత దేశ సరిహద్దులు దాటించి పశ్బిమ బెంగాల్కు పంపుతారని, వారికి నకిలీ ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు తాను ఏర్పాటు చేస్తానని పోలీసుల విచారణలో సతీష్రజక్ కు తెలిపాడు. గత ఐదేళ్లుగా వీరు నగరంలోని సంపన్నులు నివాసం ఉండే ప్రాంతాల్లో బ్యూటీపార్లర్లు నిర్వహించేవారు. అమ్మాయిలను మసాజ్ గరల్స్గా ఏర్పాటు చేసి వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. మహిళలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, శిక్షలు అమలవుతాయని రాచకొండ సీపీ హెచ్చరించారు. పట్టుబడ్డవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ముఠాలోని ప్రకాష్, ప్రియాంక పరారీలో ఉన్నారని, వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకన్న నాయక్, మాల్కాజిగిరి ఏసీపీ నరేష్రెడ్డి, ఏహెచ్టీయూ సీఐ నవీన్కుమార్, ఉప్పల్ సీఐ గోవింద్రెడ్డి, బాలకృష్ణ, సుధాకర్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉప్పల్ కష్టాల్’ ఇలా తీరున్.. ప్రత్యామ్నాయ మార్గాలెన్నో..
ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ చక్రబంధనం తప్పేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక్కడ వాహనాల రద్దీని నిలువరించి సమస్యను పరిష్కరించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కోవడం తప్పనిసరి. ఇక్కడ చేపట్టిన స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లయితే ట్రాఫిక్ పద్మవ్యూహం సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. చదవండి: ఇన్స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి.. ఆ స్థలాన్ని సేకరిస్తే.. ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ స్టేడియం పక్కనే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఉన్నతాధికారులు, పాలకులు మాట్లాడి శాశ్వత లేక తాత్కా లిక పద్ధతిలోనైనా స్థలాన్ని సేకరిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. జిల్లా బస్టాప్ను మారిస్తే.. ఉప్పల్ వరంగల్ బస్ స్టాప్ నుంచి మొదలు నలువైపులా కిలోమీటరు మేర బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చౌరస్తా వరకు బస్సుల వరుస నిత్యకృత్యం. దీంతో పాటు ఉప్పల్ చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు రోడ్డుకు అడ్డుగా బస్సులను నిలిపివేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా బస్ స్టాప్ను మెట్రో స్టేషన్ వద్దకు మార్చవచ్చు. సమాంతర రహదారుల్ని అభివృద్ధి చేస్తే.. వరంగల్ జాతీయ రహదారికి సమాంతరంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ సమాంతర రోడ్ల మీదుగా ట్రాఫిక్ను డ్రైవర్షన్ చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలను నిలువరిస్తే.. ఉప్పల్ వరంగల్ రహదారి.. ఇటువైపు ఎల్బీనగర్ వెళ్లే మార్గం దాదాపు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తున్నాయి. వాటికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆ స్థానంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఫుట్పాత్ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో ఆర్టీఏ కార్యాలయం వరకు ప్రైవేట్ వాహనాల షోరూంల యజమానులు దాదాపుగా సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు వీరిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. సర్వీస్ రోడ్డును క్లియర్ చేస్తే ఎల్బీనగర్ రోడ్డు దాదాపుగా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. పనుల నత్తనడకకు స్వస్తి పలికితే.. ఉప్పల్ చౌరస్తా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇవి నత్త నడకన జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020లోనే పూర్తవ్వాలి. అధికారుల అలసత్వంతో ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యకు ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. బస్టాప్తో బోలెడు కష్టాలు.. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఆర్టీసీ, మున్సిపల్, అర్అండ్బీ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరం. యాదాద్రి టెంపుల్ తెరిచినప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఉప్పల్ వరంగల్ బస్స్టాప్ను నుంచే యాదాద్రి వెళ్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపైకి మినీ బస్సులను సైతం ఉప్పల్ నుంచే ప్రారంభించారు. ఈ కారణంగానూ రద్దీ మరింత పెరిగింది. అదనంగా ఇమ్లీబన్, జూబ్లీ బస్స్టేషన్ వరంగల్, హన్మకొండ, పరకాల, చెంగిచర్ల, ఉప్పల్ డిపోల బస్సులు సైతం ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒకే బస్స్టాప్ ఉంది. అది వరంగల్ బస్స్టాప్ మాత్రమే. సరైన బస్ బే లేక పోవడంతో రోడ్లపైనే బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. వీటిని పక్కపక్కనే పెట్టడంతో ట్రాఫిక్జాం సమస్య తలెత్తుతోంది. -
ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం
మీరెప్పుడైనా ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వాహనంపై వెళ్లారా? అయితే.. అక్కడి ట్రాఫిక్తో నరకం అనుభవించే ఉంటారు! వాహనాల ప్రవాహంతో ఆ కూడలి దిగ్బంధనంలో చిక్కుకున్న దృశ్యం మీకు కనిపించే ఉంటుంది. మరోసారి ఈ దారి నుంచి రావొద్దురా బాబు అని అనుకునే ఉంటారు. ఇసుక పోస్తే రాలనంత వాహనాల సమూహం. అక్కడి పరిసరాలన్నీ నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహం. ఓ వైపు సికింద్రాబాద్, హబ్సిగూడల నుంచి.. మరోవైపు ఎల్బీనగర్ నుంచి.. ఇంకోవైపు కోఠి, ఎంజీబీఎస్, అఫ్జల్గంజ్, రామంతాపూర్ ప్రాంతాల నుంచి వచ్చీ వెళ్లే వాహనాలతో ఉప్పల్ కూడలితో పాటు దాని సమీప ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లోపం, స్కైవే నిర్మాణంలో జాప్యం తదితర కారణాలతో వాహన దిగ్బంధనం కొనసాగుతోంది. భారీ ప్రాజెక్టులు, ఆకాశాన్నంటే వంతెనలు, ఆకాశ మార్గాల్లో నడకదారులు.. ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నా ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థ తీరు మాత్రం మారడం లేదు. – ఉప్పల్ పెరిగిన వ్యక్తిగత వాహనాలు.. కోవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలు పెరగడంతోనూ ట్రాఫిక్ సమస్యకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఈస్ట్ సిటి అభివృద్థిలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ వైపు ఐటీ కారిడార్లను తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్ వద్ద జెన్ప్యాక్, అరీనా టవర్స్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు, డీఎస్ఎల్ మాల్ లాంటి అనేక కంపెనీలో అడుగుపెట్టాయి. మరిన్ని సంస్థలు వచ్చి చేరడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. వీటికి మార్గం సుగమం కావాలంటే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ అవసరం. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన యూటర్న్ సిస్టంపై నెట్టుకుంటూ వస్తున్నారు. ఉప్పల్ చౌరస్తా మీదుగా నిమిషానికి సుమారు 600 నుంచి 700 వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. బస్టాప్తో పరేషాన్.. హబ్సిగూడ, రామంతాపూర్ల నుంచి ఉప్పల్కు వచ్చే దారిలో బస్స్టాప్ ఉంది. సిటీ బస్సులతో పాటు వివిధ డిపోలకు చెందిన బస్సులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. యాదాద్రి, వరంగల్కు వెళ్లడానికి ఈ బస్సుస్టాపే ప్రధానమైంది. దీంతో పాటు నాలుగు అడుగుల దూరంలోనే ఉప్పల్ చౌరస్తా వద్ద సిగ్నల్ ఉండటంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమవుతోంది. స్కైవే ఎఫెక్ట్తో.. ఉప్పల్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. రామంతాపూర్ వైపు స్కైవే నిర్మాణం జరుగుతుండగా భారీ వాహనాలను దారి మళ్లించడంతో రద్దీ రెట్టింపైంది. ఉప్పల్ చౌరస్తా నుంచి కేవీ– 2 స్కూల్ నుంచి వెళ్లాల్సిన భారీ వాహనాలను ఏక్ మినార్ మజీద్, ఉప్పల్ క్రికెట్ స్టేడియం మీదుగా రామంతాపూర్కు మళ్లించారు. బస్సు పక్కన బస్సుతో.. హబ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే దారిలో వరంగల్ వైపు వెళ్లే బస్సులతో పాటు మిగతావాటికీ ఇక్కడే బస్టాప్. వరంగల్, యాదాద్రి వెళ్లడానికి ఇదే ప్రధాన బస్టాప్గా మారడంతో ఇమ్లిబన్, జూబ్లీ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. దీంతో బస్సు వెనక బస్సు కాకుండా బసు పక్కన బస్సులను నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికి తోడు యాదాద్రికి వెళ్లడానికి ఉప్పల్ చౌరస్తా ప్రధాన రహదారి కావడం, ఎల్బీనగర్ వైపు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. వీఐపీల ప్రయాణాలు అధికంగా ఉండటంతోనూ ట్రాఫిక్ నిత్యం నరకంగా మారుతోంది. అదనంగా లోకల్ బస్సు డిపోలకు సంబందించిన బస్సులు చేంజ్ ఓవర్ కూడా ఇక్కడే ఉండటంతో మరింత జటిలమవుతోంది. బోడుప్పల్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు అడ్డదిడ్డం ఉప్పల్ బస్డిపో నుంచి ఉప్పల్ చౌరస్తా, ఎల్బీనగర్ బస్టాప్ వరకు దాదాపు 2 కి.మీ రోడ్లు అడ్డదిడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. స్కైవే నిర్మాణం జరుగుతోందని ఈ రోడ్డును ఏమీ చేయలేమని జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నత్తనడకన ఫ్లై ఓవర్ పనులు.. ఉప్పల్ ఎల్బీనగర్ బస్స్టాప్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు దాదాపు 2 కి.మీ దూరం. ఉప్పల్ చౌరస్తాలోనే నాలుగు జిల్లాల ఆర్టీసీ బస్సులకు ఇక్కడే స్టాప్. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి బస్స్టాప్ కూడా ఇక్కడే ఉండటం, రోడ్డుకు ఇరువైపులా మెట్రో స్టేషన్లు.. ఇలా దారి పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులే. వీటికి తోడు నాగోల్ బ్రిడ్జి దాటిన తర్వాత నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగటంలేదు. ఉప్పల్ ప్రయాణమంటేనే హడల్ రోడ్లు సరిగా లేవు. స్కైవే నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇంకా కొలిక్కి రారేదు. మరోపక్క స్కైవాక్ వంతెన కూడా పూర్తి కాలేదు. రోడ్డు దాటాలన్నా హడలెత్తిస్తోంది. ఎప్పుడే ప్రమాదం వచ్చి పడుతుందోననే భయం వెంటాడుతోంది. – సతీష్, ప్రైవేటు ఉద్యోగి, ఉప్పల్ ఆదర్శ్నగర్ ట్రాఫిక్తో పాటు కాలుష్యం.. ఉప్పల్ జంక్షన్కు వస్తున్నామంటనే ట్రాఫిక్ భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేనందువల్లే అభద్రతా భావం ఏర్పడుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగడం లేదు. ట్రాఫిక్ పోలీసుల దృష్టి కేవలం చలానాలపైనే ఉంటోంది. – ప్రదీప్ కుమార్, ఉప్పల్ -
తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని.. ఇప్పుడే పెళ్లి వద్దని..
సాక్షి, ఉప్పల్: భర్త, అత్త వేధింపులకు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్, గాంధీనగర్ జనప్రియ అపార్టుమెంట్లో నివసించే పసుమర్తి రాఘవేంద్రరావు, భార్య మణిదీపిక (32), వీరికి సాయి విజ్ఞేష్ (15) ఆశ్రిత (12) సంతానం. గత నాలుగేళ్లుగా రాఘవేంద్రరావు మద్యానికి బానిసై నిత్యం భార్యను కొడుతుండేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా ఫలితం లేకపోయింది. గురువారం తండ్రి పంగలూరి లక్ష్మీనారాయణ దాస్కు ఫోన్ చేసి తన భర్త 20వ తేదీన తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని తెలిపింది. 21వ తేదీన మణిదీపిక అత్త సుగుణమ్మ లక్ష్మీనారాయణ దాస్కు ఫోన్ చేసి మీ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణ దాస్ అత్త, భర్తల పోరు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఉప్పల్: బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేçసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ భరత్నగర్కు చెందిన శ్రీనివాస్ కుమార్తె దర్శ అలేఖ్య (20), బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఇటీవల పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి ఇప్పుడే వద్దని చదువుకుంటాననడంతో తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం’
ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ మున్సిపల్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హబ్సిగూడలోని వివేకానందనగర్లో గత నెల 25వ తేదీన రేకుల షెడ్డును మున్సిపల్ అధికారులు నోటీసు గడువు ముగియక ముందే తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితుడు పి.నర్సింహరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం మున్సిపల్ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేతలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకుని, బాధితునికి నష్టపరిహారం ఇవ్వాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు బుధవారం బాధితుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కక్షపూరితంగానే ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ తమ కార్యాలయ షెడ్డును కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి..
సాక్షి, ఉప్పల్: యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్న యువకుడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బాసవి రవితేజ (35), రామంతాపూర్ గోకులేనగర్లో నివాసముంటున్నాడు. అమాయక యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్నాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు గత నెల 7న రవితేజను రిమాండ్కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు శనివారం పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాసవి రవితేజ (35) చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు? -
ఉప్పల్: ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యభిచారం.. నిర్వాహకురాలు అరెస్ట్
సాక్షి, ఉప్పల్: వ్యభిచార నిర్వాహకురాలిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పల్ ఎస్సై మధుసూదన్ తెలిపిన మేరకు.. ఉప్పల్ ఆదర్శ్నగర్లో ఉంటున్న కుర్రి అరుణ అలియాస్ అరుణారెడ్డి (36) ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యభిచారం నిర్వహిస్తుందన్న సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించి ఒక సెల్ఫోన్, కండోమ్ ప్యాకెట్లు, నగదును స్వాదీనం చేసుకొని నిందితురాలిని రిమాండ్కు తరలించారు. చదవండి: భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్.. ఉద్యోగం మానేయడంతో అసలు విషయం బయటకు -
ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ .. అంతేనా చక్కగా షాపింగ్ కూడా
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో నడక. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ వగైరా... అంతేనా చక్కగా షాపింగ్ చేయొచ్చు. అలా ఆకాశంలో నిల్చుని కాలక్షేపం కూడా చేయొచ్చు.ఇదంతా ఎలా సాధ్యమనుకుంటున్నారా? కచ్చితంగా సాధ్యమే. హైదరాబాద్ మహానగర కూడళ్లలో మణిహారాల్లా రూపుదిద్దుకుంటున్న స్కైవాక్లలో షాపింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొదట మెహిదీపట్నం స్కైవాక్లో ఈ తరహా షాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. చిన్న చిన్న కియోస్క్ల రూపంలో ఉండే ఈ సెంటర్లు స్కైవాక్ పాదచారులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. టీ,కాఫీ, స్నాక్స్ వంటి వాటితో పాటు తక్కువ స్థలంలో విక్రయించేందుకు అనుగుణంగా ఉండే షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. నగరంలోని స్కైవాక్లను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్కైవాక్ మార్గాల్లో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లే పాదచారులు కొద్దిసేపు పైనే సేదతీరేందుకు వీలుగా ఇవి ఉంటాయి. రూ.28 కోట్ల వ్యయంతో.. ► మెహిదీపట్నం కూడలిలో ప్రస్తుతం నిర్మిస్తున్న స్కైవాక్లో అన్ని వైపులా సుమారు 20 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానున్నట్లు అంచనా. మొత్తం 350 మీటర్ల పొడవులో రూ.28 కోట్ల వ్యయంతో స్కైవాక్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు నాలుగు వైపులా నడుచుకుంటూ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కనీసం లక్షమందికి పైగా స్కైవాక్ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు. ► ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఈ స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా హెచ్ఎండీఏకు అదనపు ఆదాయం లభించనుంది. మరోవైపు పాదచారులకు కూడా ఆటవిడుపుగా మారనుంది. తక్కువ స్థలంలో ఏర్పాటు చేయగలిగే షాపులకే స్కైవాక్ అనుకూలంగా ఉంటుందని ఒక అధికారి చెప్పారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం సెప్టెంబర్ నాటికి ఉప్పల్లో స్కైవాక్.. ► నిత్యం వాహనాలు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఉప్పల్ కూడలిలో స్కైవాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 650 మీటర్ల పొడవుతో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ రింగు రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేవిధంగా ఈ స్కైవాక్ను ఏర్పాటు చేస్తున్నారు. ► మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తాము ఏ వైపునకు వెళ్లాలనుకొన్నా స్కైవాక్లోనే వెళ్లవచ్చు. అలాగే సిటీ బస్సులు, దూరప్రాంతాల బస్సుల్లో వచ్చేవారు ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నాటికి వినియోగించలోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో మరిన్ని.. జన సమ్మర్థం ఉన్న ప్రధాన కూడళ్లలో మరిన్ని స్కైవాక్లను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధ్యయనం చేపట్టింది. అమీర్పేట్, కోఠి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో స్కైవాక్ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరంలోని మలక్ పెట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చంపా పేట్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, జూపార్క్, ఫలక్నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నగర శివారులోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లి, పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగింది. -
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. హైదరాబాద్లో మరో భారీ ఐటీ ప్రాజెక్ట్..!
హైదరాబాద్: మహానగరం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు అభివృద్ధిలో దూసుకపోతోంది. ఈ మహా నగరం ఇప్పటికే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ కంపెనీలకు అడ్డాగా తెలంగాణను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫలితంగా స్టార్టప్ కంపెనీలతో పాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు హైటెక్ సిటీ వరకు మాత్రమే పరిమితమైన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు నగరం నలుమూలాల విస్తరిస్తున్నాయి. తాజాగా.. ప్రముఖ ఐటీ కంపెనీ జెన్పాక్ట్ ఉప్పల్లో భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘జెన్పాక్ట్ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్లోని తమ క్యాంపస్ను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఉప్పల్ క్యాంపస్కు భూమి పూజ జరగనుంది. దీంతో 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్లో లక్ష ఉద్యోగాల కల్పనను చేరుకోనున్నాము’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అందులో భాగంగానే… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉప్పల్ క్యాంపస్కు భూమి పూజ చేశారు. తూర్పు ప్రాంతంలో జెన్పాక్ట్ సంస్థ 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. Ministers @KTRTRS & @chmallareddyMLA laid foundation stone for expansion of @Genpact Campus in Uppal in alignment with the GRID (Growth in Dispersion) Policy. pic.twitter.com/CRtLYN3TSr — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 13, 2022 హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నట్లుగా సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు భారీ ఫ్లైఓవర్ వేస్తున్నట్లు, ఇంకా 4, 5 మంది ప్రైవేటు డెవలపర్స్ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. వారికి కూడా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. ఈ ప్రాంతంలో ఐటీ విస్తరించడం ద్వారా చాలా మందికి ఉపాధి దొరుకుతుందన్నారు మంత్రి కేటీఆర్. Good news for Eastern Hyderabad!@Genpact will be creating 15,000 seats as part of expansion of their campus in Uppal in alignment with our GRID Policy. We will be reaching the 1 lakh employment mark in this part of Hyderabad soon! Laying the foundation today for 1.9 Mn campus pic.twitter.com/sPAyb3XG3C — KTR (@KTRTRS) February 13, 2022 (చదవండి: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్తో పాటుగా దీని వేలం కూడా..!) -
Uppal: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ మరోసారి అ‘ధర’హో అనిపించింది. గురువారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో చదరపు గజానికి ఏకంగా రూ.లక్షా ఒక వెయ్యి ధర పలికింది. ఓ కొనుగోలుదారు 222 చదరపు గజాల ప్లాట్ను సొంతం చేసుకోగా, మరొకరు ఇంతే ధర చెల్లించి 368 చదరపు గజాలను దక్కించుకున్నారు. 1,196 గజాలున్న మరో ప్లాట్కు రూ.77 వేల ధర లభించింది. మరోవైపు గురువారం నాటి బిడ్డింగ్లో 1,787 గజాలున్న మరో ప్లాట్కు గజానికి రూ.53 వేల చొప్పున కనిష్ట ధర లభించింది. ఈ వేలంలో సగటున గజానికి రూ.71,815.5 చొప్పున ధర పలికినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో హెచ్ఎండీఏకు రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్ భగాయత్లో వేలం నిర్వహించతలపెట్టిన 44 ప్లాట్లలో సుమారు 150 చదరపు గజాల నుంచి 1,787 చదరపు గజాల వరకు మొత్తం 19,719 చదరపు గజాల మేర విస్తరించి ఉన్న 23 ప్లాట్లకు ఆన్లైన్ బిడ్డింగ్ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.77000, కనిష్టంగా రూ.53 వేలు పలికింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.లక్షా వెయ్యి చొప్పున, కనిష్టంగా రూ.73 వేల చొప్పున డిమాండ్ రావడం విశేషం. లుక్ ఈస్ట్ లక్ష్యంగా.. ►సుమారు రెండు వేల గజాల నుంచి 15 వేల గజాలకు పైగా ఉన్న మరో 21 ప్లాట్లకు శుక్రవారం ఈ– బిడ్డింగ్ జరగనుంది. ఉప్పల్ భగాయత్లోని హెచ్ఎండీఏ లేఅవుట్ ప్లాట్లకు వేలం నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి. 2019లో నిర్వహించిన ఈ బిడ్డింగ్లో గజానికి గరిష్టంగా రూ.79 వేలు, కనిష్టంగా రూ.36 వేల వరకు ధర పలికింది. ఈ సారి పోటీ మరింత పెరిగింది. ►ఉప్పల్లో నిర్మాణ రంగం ఊపందుకుంది. పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. మెట్రో రైలు సదుపాయంతో పాటు ఉప్పల్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా సదుపాయం ఉండడం, ఇటు వరంగల్ హైవేకు, అటు విజయవాడ హైవేకు అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాలు ఉప్పల్ భగాయత్పై ఆసక్తి చూపుతున్నాయి. ►ఈ క్రమంలోనే ప్రభుత్వం సైతం ‘లుక్ ఈస్ట్’ లక్ష్యంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించింది. దీంతో బడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు 10 అంతస్థుల నుంచి 26 అంతస్థుల వరకు కూడా అపార్ట్మెంట్ల నిర్మాణాలను చేపట్టాయి. ఈ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు హాట్ కేక్లా అమ్ముడవుతుండడంతో నిర్మాణ సంస్థలు ఈసారి మరింత పోటీ పడ్డాయి. ►గతంలో రూ.79 వేల వరకు డిమాండ్ రాగా ఈ సారి రూ.లక్ష దాటినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 1.35 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 44 ప్లాట్లలో 21 రెసిడెన్షియల్ ప్లాట్లు, 15 బహళ ప్రయోజన ప్లాట్లు ఉన్నాయి. షాపింగ్ కేంద్రాల కోసం మరో ప్లాట్లు, ఆస్పత్రులకు 2, విద్యాసంస్థలకు 2 ప్లాట్ల చొప్పున కేటాయించారు. -
కుక్కలున్నాయ్... పిక్కలు జాగ్రత్త..!
గౌతంనగర్: గౌతంనగర్ డివిజన్లో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. రాకపోకలు సాగించే వారిపై మూకుమ్మడి దాడి చేసి గాయపరుస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వీధి కుక్కలు కాలనీల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయని ఆయా కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఒంటరిగా బయటకు వెళ్తే కుక్కకాట్లకు గురి కావాల్సిందేనని వాపోతున్నారు. బయటికి వెళ్లాలంటే భయం.. గౌతంనగర్, మల్కాజిగిరి రైల్వేస్టేషన్, మల్లికార్జుననగర్, న్యూ అండ్ ఓల్డ్ మిర్జాల్గూడ, సంతోష్నగర్, ఏకలవ్యనగర్, సాయినగర్, సంజయ్నగర్, యాదవనగర్, వీణపానినగర్, రామాంజనేయనగర్, అన్నపూర్ణ ప్రాంతాల్లో వీధి కుక్కల బె డద తీవ్రంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నా రు. కాలనీలలో ఒంటరిగా వెళ్లాలంటే ఏ క్షణంలో దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాత్రి సమయంలో కుక్కలు భయంకరంగా అరుస్తూ వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయని బస్తీ వాసులు వాపోతున్నారు. విధులు, పనులు ముగించుకుని రాత్రి పూట ద్విచక్ర వాహనాలపై వచ్చే క్రమంలో వెంబడించి గాయపరుస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లే దని ఆయా ప్రాంతాల వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
వేలానికి 44 ప్లాట్లు.. అందరి చూపు ఉప్పల్వైపు.. నిబంధనలు ఇవే!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మధ్యతరగతి వేతన జీవుల్లో మరోసారి ఆశలు రేకెత్తిస్తోంది. సొంతింటి కలను సాకారం చేసుకొనేందుకు నగరవాసులు తూర్పు వైపు దృష్టి సారించారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ను ఆనుకొని ఉన్న విశాలమైన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మిగిలిన 44 ప్లాట్లకు ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాట్లపై నిర్వహించిన ప్రీ–బిడ్డింగ్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. వివిధ వర్గాలకు చెందిన కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక రియల్ఎస్టేట్ వ్యాపారులతో పాటు, బిల్డర్లు, డెవలపర్లు, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ఏజెన్సీల ప్రతినిధులు సమావేశానికి హాజరై నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ అధికారులు బి.ఎల్.ఎన్.రెడ్డి(చీఫ్ ఇంజినీర్), కె.గంగాధర్ (ఎస్టేట్ ఆఫీసర్), సి.విజయలక్ష్మి (చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్), ఎం.రాంకిషన్ (ఓఎస్డీ), కె.గంగాధర్ (చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్), ప్రసూనాంబ (ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్) ఎంఎస్టీసీ పాల్గొన్నారు. (చదవండి: ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!) మధ్యతరగతిలో కొత్త ఆశలు.. ► సుమారు 733 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్పల్ భగాయత్లో 250 ఎకరాల్లో అన్ని మౌలిక వసతులతో వెంచర్ను అభివృద్ధి చేశారు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న ఉప్పల్ భగాయత్ మధ్యతరగతి వర్గాలను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వేలం వేయనున్న 44 ప్లాట్లలో 150 గజాల నుంచి 300 గజాల వరకు ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్లు 21 వరకు ఉన్నాయి. మిగతావి మల్టీపర్పస్ ప్లాట్లు ఉన్నాయి. ► గతంలో నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.79 వేలు, కనిష్టంగా రూ.30 వేల వరకు ధర పలికింది. దీంతో ఈసారి వేలంలో కూడా ఎక్కువ మంది రెసిడెన్షియల్ ప్లాట్లపైనే ఆసక్తి చూపుతున్నారు. (చదవండి: వన్నె తగ్గని ఉస్మానియా యూనివర్సిటీ) ► 5 వేల నుంచి 15 వేల గజాల వరకు ఉన్న కొన్ని ప్లాట్లను కూడా ఈసారి వేలానికి సిద్ధంగా ఉంచారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ వంటి భారీ వాణిజ్య భవనాల నిర్మాణం కోసం విశాలమైన ప్లాట్లు ఉన్నాయి. ► గతంలో పెద్ద ప్లాట్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా చిన్న సైజు ప్లాటుగా అభివృద్ధి చేసి విక్రయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ?) నిబంధనలివీ.. ► ఉప్పల్ భగాయత్లోని 44 ప్లాట్లకు వచ్చే నెల 2, 3 తేదీల్లో ఆన్లైన్ బిడ్డింగ్ జరగనుంది. ఇందులో ప్లాట్లను దక్కించుకున్న వారు 90 రోజుల్లో పూర్తి స్థాయి పేమెంట్ చేసినట్లయితే ఆ తర్వాత మరో 15 రోజుల్లో హెచ్ఎండీఏ ప్లాట్లను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తుంది. ► కొనుగోలుదారులు ఫ్లాట్ మొత్తం విలువలో 25 శాతం చెల్లిస్తే మిగతా మొత్తం బ్యాంక్ రుణంగా పొందే అవకాశం ఉంది. ఉప్పల్ భగాయత్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ భవన నిర్మాణ అనుమతులు హెచ్ఎండీఏ మాత్రమే ఇస్తుంది. ► బ్యాంక్ చార్జెస్ కలుపుకొని ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. సందేహాల నివృత్తికి హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించవచ్చు. పౌరులందరూ ఈ బిడ్డింగ్లో పాల్గొనవచ్చు. దేశంలో నివసిస్తున్న ఇతర దేశస్తులకు మాత్రం అనుమతి ఉండబోదు. -
బీపీ తక్కువై భార్య చనిపోయిందంటూ నాటకం.. అంత్యక్రియల సమయంలో...
సాక్షి, ఉప్పల్: పద్దెనిమిది సంవత్సరాలు కాపురం చేసిన భార్యను చిన్న కారణంతో భర్త కడతేర్చిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి, బాధితులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరు శ్రీను(40)కు అదే మండలం ఈటూరు గ్రామానికి చెందిన చిత్తలూరు సురాంభ (35)తో 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు రామంతాపూర్ వెంకటరెడ్డినగర్లో కాపురముంటూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసిన మరో యువకుడు గత నెల 29వ తేదీ రాత్రి ఇంట్లో భార్య భర్తలకు చిన్న విషయమై వివాదం ప్రారంభమై చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో ఆవేశానికి గురైన భర్త శ్రీను భార్యను విచక్షణరహితంగా కొట్టి, హింసించడంతో తట్టుకోలేక ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో అదే రాత్రి తన టాటా ఏస్ వాహనంలో భార్య మృతదేహాన్ని వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా శవంపై కూరగాయల బస్తాలు పేర్చి సొంత ఊరికి బయలుదేరాడు. అనంతరం తన భార్యకు బీపీ ఎక్కువై మృతి చెందిందని ఊరికి తీసుకు వస్తున్నానని గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. చదవండి: Check Dam: ఇద్దరు చిన్నారులను మింగిన చెక్డ్యాం మరుసటిరోజు అంత్యక్రియలకు వచ్చిన వారికి సురాంభ ఒంటిపై దెబ్బలు ఉండటం కనిపించి అనుమానం వచ్చి నాగారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచి్చన నాగారం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. దీంతో నాగారం పోలీసులు కేసును ఉప్పల్ పోలీస్స్టేషన్కు బదిలీ చేయగా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బాబోయ్..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది!
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ నుంచి నారపల్లికి వయా ఉప్పల్ డిపో మీదుగా రోడ్డు ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. గుంతలమయమైన రోడ్లు..దుమ్ము ధూళితో కళ్లల్లో మంటలు, తరుచుగా ప్రమాదాలతో ఈ రహదారి టెర్రర్గా మారింది. వరంగల్ జాతీయ రహదారి కూడా అయిన ఈ మార్గంలో 2018 జులైలో...రూ.717 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 130 పిల్లర్లు మాత్రమే నిర్మించారు. చదవండి: Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ 2020 జూన్లోనే ఫ్లైఓవర్ మొత్తం పనులు పూర్తవ్వాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఇప్పటికి కేవలం 35 శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంతో 6.2 కిలోమీటర్ల మేర ఇరువైపులా రహదారి ప్రమాదభరితంగా మారింది. ఇటీవలి వర్షాలకు పరిస్థితి మరీ దిగజారింది. ఏదైనా భారీ వాహనం వెళ్తుంటే..దాని వెనుక వెళ్లే వాహనదారులకు అసలు రోడ్డే కన్పించడం లేదు. అంతగా దుమ్ము..ధూళితో పొగ కమ్ముకుంటోంది. యాదాద్రి వెళ్లాలన్నా, భువనగిరి, వరంగల్, భూపాలపట్నం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది మంది నరక యాతన అనుభవిస్తున్నారు. చదవండి: మొక్కల కన్నా ముస్లింలు హీనమా? ఉప్పల్ చెరువు కట్ట మీద దుమ్ముకొట్టుకు పోతున్న వరంగల్ జాతీయ రహదారి లేని రోగాలు వస్తాయి.. బీబీనగర్లో వెంచర్ నడుస్తున్నందున నేను ప్రతి రోజు ఉప్పల్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కారు డోరు వేసుకున్నా దుమ్ము వదలడం లేదు. దీంతో దగ్గు వస్తోంది. జబ్బు చేసినట్లుగా ఉంటోంది. వీటికి తోడు పెద్ద పెద్ద గుంతల కారణంగా వాహనాలు పాడవుతున్నాయి. ఈ తిప్పలు ఎన్నాళ్లుంటాయో ఏమో మరి. – మేకల దయాసాగర్ రెడ్డి, వ్యాపారి, ఉప్పల్ గుంతలు..మట్టికుప్పలుబాబోయ్..ఇదేం రోడ్డు? ఉప్పల్ నుంచి నారపల్లి వరకు వెళ్లాలంటేనే దడ పుడుతోంది. ఎక్కడ చూసినా గుంతలు..మట్టికుప్పలు..దుమ్ము ధూళితో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎవ్వరికి ఫిర్యాదు చేసినా తమ పరిధి కానే కాదంటున్నారు. – పూస అశోక్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ
సాక్షి, ఉప్పల్( హైదరాబాద్): ఉప్పల్ సర్కిల్లో మరిన్ని ప్లై ఓవర్లకు జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు. భవిషత్లో రానున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ముందస్తుగా మరో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతి పాదనలను అధికారులు సిద్ధం చేశారు. దాదాపుగా రూ.311 కోట్లతో ఈ ప్రాజెక్టు సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. స్కైవేకు ఇరువైపుల రెండు వంతెనలతో పాటు, మెట్రోరైల్ వంతెనకు రెండు వైపుల మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దాదాపు రూ.658 కోట్లతో.. ► ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న స్కై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) పనులు కొనసాగుతున్న విషయం విధీతమే. ► ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు 6.4 కిలో మీటర్ల పొడవుతో దాదాపు రూ. 658 కోట్లతో నిర్మిస్తున్నారు. ► భవిషత్లో వరంగల్ నుంచి ఇటు సికింద్రాబాద్ మరో పక్క ఎల్బినగర్ వైపు, ఇంకోపక్క రామంతాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కేంద్రీకృతమయ్యే ట్రాఫిక్ను అధిగమించేందుకు ఈ వంతెనలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చక చకా పనులు.. ► ఎలివేటెడ్ కారిడార్ ముగింపు ప్రాంతం నుంచి రామంతాపూర్ క్రికెట్ స్టేడియం రోడ్డు వద్ద తిరిగి ఉప్పల్ పారిశ్రామిక వాడ మోడ్రన్ బేకరీ చౌరస్తా నుంచి ఉప్పల్ వరకు రోడ్డుకు ఇరువైపుల రెండు ప్లై ఓవర్లును నిర్మించనున్నారు. ► మరో వైపు ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల గేటు నుంచి నాగోల్ రోడ్డు ఉప్పల్ మెట్రోస్టేషన్ రాజ్యలక్ష్మి థియేటర్ వరకు అటు నుంచి నాగోల్ రోడ్డు నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్ ఇండియా గేట్ వరకు మొత్తం నాలుగు ప్లైఓవర్లను నిర్మించనున్నారు. ► ఇందుకు సంబంధించిన రోడ్డు వెడల్పు పనులను కూడా ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు చకా చకా ప్రారంభించారు. ► హబ్సిగూడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా నాగోల్ రోడ్డు రాజ్యలక్ష్మి థియేటర్ వరకు 1.5 కిలో మీటర్ల పొడవున ప్రస్తుతం 30 మీటర్ల రోడ్డు ఉండగా దానిని 60 మీటర్ల వరకు పొడగించనున్నారు. ► రోడ్డు వెడల్పులో భాగంగా 25 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతుండగా అందులో 6 ప్రభుత్వ ప్రాపర్టీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రింగ్ రోడ్డుపై భారం తగ్గించడమే లక్ష్యం.. వరంగల్ జాతీయ రహదారి వైపు నుంచి స్కైవే పైగా వచ్చే ట్రాఫిక్ ఉప్పల్ జంక్షన్ వద్దకు రాగానే తిరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తే ప్రమాదముంది. అటు వైపు నుంచి హబ్సిగూడ, రామంతాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ తీవ్రరూపం దాల్చకముందే రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ఉప్పల్ సర్కిల్ ప్రాంతంలో నాలుగు సమాంతర ఫ్లై ఓవర్లను నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. ప్రతిపాదనలు పూర్తవ్వగానే పనులను ప్రారంభిస్తాం. – రవీందర్ రాజు, ఎస్ఈ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం నాగోల్ వైపు 60 మీటర్ల రోడ్డు.. ఉప్పల్ చౌరస్తా మీదుగా నాగోల్ వైపు 60 మీటర్ల రోడ్డును వెడల్పు చేయనున్నాం. మొదటి దశగా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ నుంచి రింగ్ రోడ్డు మీదుగా రాజ్యలక్ష్మి థియేటర్ వరకు అక్కడి నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్ ఇండియా గేటు వరకు రోడ్డుకు ఇరువైపుల రోడ్డు వెడల్పుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రోడ్డు వెడల్పులో నష్టపోయే 25 ఆస్తులను గుర్తించాం. – శ్రావణి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఉప్పల్ -
హైదరాబాద్ మెట్రో రియల్ వెంచర్.. సదుపాయాలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: సర్వ హంగులతో త్వరలో మెట్రో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు కానుంది. మెట్రో ప్రాజెక్టు ప్రజా రవాణా సాధనమే కాదు.. నగర పునర్నిర్మాణ ప్రాజెక్టు అని గతంలో ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రియల్ రంగంలోకి అడుగు పెడుతుండడం విశేషం. మెట్రో నిర్మాణ సమయంలో ఆసియాలో అతిపెద్దదైన ప్రీకాస్ట్ యార్డు (మెట్రో వయాడక్ట్లు తయారు చేసిన ప్రాంతం)ను నెలకొల్పిన విషయం విదితమే. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతో సుమారు 42 ఎకరాల స్థలంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రియల్ వెంచర్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉప్పల్ రింగ్రోడ్డు ప్రాంతంలో ప్రస్తుతం మెట్రో డిపోను సుమారు 104 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో భూములు కోల్పోయిన రైతులకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నెలకొల్పిన మెట్రో సిటీలో ప్లాట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రీకాస్ట్ యార్డును రియల్ వెంచర్గా అభివృద్ధి చేయనున్నారు. ఈ నిధులను ఆర్థిక కష్టాల్లో ఉన్న మెట్రో సంస్థ వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనుంది. నూతన రియల్ వెంచర్లో 200, 300, 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అదే తరహాలో.. రియల్ బూమ్.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోకాపేట్లో భూముల వేలం ద్వారా సుమారు రెండు వేల కోట్లకు పైగా రెవెన్యూ ఆదాయాన్ని రాబట్టిన విషయం విదితమే. భూముల వేలంతో గ్రేటర్ పరిధిలో మళ్లీ రియల్ బూమ్కు రెక్కలొచ్చాయి. ఇదే తరుణంలో ఉప్పల్ ప్రీకాస్ట్ యార్డ్ ప్రాంగణంలో హెచ్ఎంఆర్ సంస్థ ఏ ర్పాటు చేసే రియల్ వెంచర్కు కూడా భారీగా డిమాండ్ ఉంటుందని రియల్టీ వర్గాలు అంచనా వే స్తున్నాయి. ఈ వెంచర్ ఏర్పాటు ద్వారా రూ.600 కో ట్లు రాబట్టాలని మెట్రో వర్గాలు ఆదాయ అంచనాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదుపాయాలు ఇలా.. ► ప్రీకాస్ట్ యార్డు స్థలంలో ఏర్పాటు చేయనున్న వెంచర్లో హెచ్ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం 40, 60, 100 ఫీట్ల వైశాల్యంతో సువిశాలమైన రహదారులు, గ్రీన్ స్పేస్, పబ్లిక్ పార్కులు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ నిబంధనల మేరకు 30 శాతం విస్తీర్ణంలో రహదారులు మరో 10 శాతం విస్తీర్ణంలో ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ► మిగతా 55–60 శాతం విస్తీర్ణంలో రియల్ వెంచర్ ఏర్పాటు కానుంది. ఇందులో మార్కెట్ డిమాండ్ను బట్టి నివాస, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్లాట్ల విస్తీర్ణాన్ని నిర్ణయించనున్నారు. మెట్రో ప్రాజెక్టుకు ప్రయాణికుల ఆదాయం ద్వారా 50 శాతం, రియల్టీ, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా మరో 45 శాతం, వాణిజ్య ప్రకటనల ద్వారా మరో 5 శాతం ఆదాయాన్ని రాబట్టాలని 2011లో కుదిరిన నిర్మాణ ఒప్పందంలో నిర్ణయించిన విషయం విదితమే. -
వారం రోజుల్లో పెళ్లి, ఇంటి నుంచి బయటకు వెళ్లి..
సాక్షి, జవహర్నగర్( హైదరాబాద్): వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడలోని వెంకటరావునగర్కు చెందిన బనావత్ అమృ కుమార్తె శ్వేత(27)కు మే 1న నిర్చితార్థం నిర్వహించారు. ఈ నెల 11న శ్వేతకు వివాహం జరగాల్సి ఉండగా బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకి కోసం బంధువుల ఇళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో స్వేత తండ్రి అమృ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే
సాక్షి, ఉప్పల్ (హైదరాబాద్): ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉప్పల్లోని శ్రీకర్ హెల్త్ కేర్ ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ మందముల్ల పరమేశ్వర్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆస్పత్రిలోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. కొంతదూరం వెళ్లగానే లిఫ్ట్ ఉన్నట్లుండి పెద్ద శబ్ధం చేస్తూ కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, ఎమ్మెల్యే గన్మెన్లు లిఫ్ట్ గ్రిల్స్ను తెరిచి వారిని బయటకు తీసుకొచ్చారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రిలో అకస్మాత్తుగా జరిగిన ఘటనతో పేషెంట్లు, సహాయకులు ఆందోళనకు గురయ్యారు. -
మూసీ సుందరీకరణ మట్టికొట్టుకుపోయింది
సాక్షి, ఉప్పల్: మూసీ సుందరీకరణ మట్టికొట్టుకుపోయింది. ప్రారంభానికి ముందే పనులు ఆనవాళ్లు కోల్పోయాయి. అధికారుల ముందుచూపు లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయలు నీళ్లపాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందుకు రూ.5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు ఉప్పల్ సమీపంలోని మూసీ తీరాన ఐదు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, మొక్కల పెంపకం చేపట్టారు. అందమైన పార్కులు తీర్చిదిద్దారు. కానీ వీటి నిర్వహణ విషయంలో ముందుచూపు ఆలోచన చేయలేదు. వరదలు వస్తే ఇవి ఉంటాయా..లేదా అన్నది పరిగణనలోకి తీసుకోలేదు. అధికారుల పర్యవేక్షణ సరిగాలేక కాంట్రాక్టర్లూ నాసిరకం పనులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలకు సుందరమైన పార్కు, మొక్కలు, వాకింగ్ ట్రాక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. -
పుట్టుమచ్చ, మిస్సింగ్ డేటా ఆధారంగా..
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ మెట్రో హెచ్ఎండీఏ లేఅవుట్లో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి చేయిపై ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా.. వివిధ పోలీస్ స్టేషన్లలోని మిస్సింగ్ డేటా ఆధారంగా బాలానగర్కు చెందిన బాలరాజుగా గుర్తించారు. సెల్ఫోన్ దొంగిలించాడనే అనుమానంతోనే స్నేహితుడిని హత్య చేసినట్లు ధృవీకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఆధునిక టెక్నాలజీకి పనిచెప్పిన పోలీసులు శవాన్ని తీసుకొచ్చిన ఆటోను గుర్తించి దాని ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను ఉప్పల్ పోలీస్స్టేషన్లో బుధవారం మల్కాజిగిరి ఇన్చార్జి డీసీపీ డి.శ్రీనివాస్గుప్త, ఏసీపీలు శ్యాంప్రసాద్, రంగస్వామితో కలిసి వెల్లడించారు. ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో.. ఉప్పల్ చిలుకానగర్లో నివాసముండే వి.మహేష్(33)కు మృతుడు బాలరాజు మిత్రుడు. 20వ తేదీన మహేష్, సాయి, బాలరాజు సనత్నగర్లో మద్యం తాగారు. మహేష్ తన ఆటోలో ఐడీపీఎల్ వద్ద బాలరాజును ఇంటి దగ్గర దించేసి వెళ్లారు. కొంతదూరం వెళ్లగా మహేష్ సెల్ఫోన్ కనిపించలేదు. మళ్లీ ఆటోలో బాలరాజు వద్దకు వెళ్లి ఆరా తీయగా తనకు తెలియదని చెప్పాడు. దీంతో అతడిని ఆటోలో చిలుకానగర్లోని వారి గదికి తీసుకువచ్చారు. మహేష్, సాయి, నాగరాజు ముగ్గురు కలిసి అతడిని తీవ్రంగా కొట్టారు. సాయి, నాగరాజు వెళ్లిపోయారు. అన్నదమ్ములు, భార్య సహకారం.. మహేష్ అన్న నరేష్(32), తమ్ముడు సుధీర్ ముగ్గురు కలసి మళ్లీ కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేని బాలరాజు అదే రోజు మృతి చెందాడు. మృతదేహాన్ని ఆ ముగ్గురితో పాటు మహేష్ భార్య ఆటోలో ఎక్కించారు. ఉప్పల్ హెచ్ఎండీఏ లే అవుట్లోకి తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగలబెట్టి వెళ్లిపోయారు. అనంతరం బండ్లగూడ నాగోల్లో ఉండే మహేష్ బావ కేతావత్ రవి(35) ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. కేసు ఛేదించిన పోలీసులు వి.మహేష్, వి.నరేష్, వి.సుధీర్, మహేష్ భార్య విజయ, ఆశ్రయం కల్పించిన కెతావత్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం వారిని రిమాండ్కు తరలించారు. సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు, ఏసీపీ ఉప్పల్ ఎస్హెచ్వో రంగస్వామి, ఇన్స్పెక్టర్ గోవింద్రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఏఎస్ఐ జయరాం, అంజయ్య, మైబెల్లి, ఏఎస్ఐ హనుమానాయక్ ఉన్నారు. చదవండి: దర్భంగ పేలుడు: హైదరాబాదే.. ఎందుకు? -
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ స్పందన.. చాయ్ బండి ఏర్పాటు
సాక్షి, ఉప్పల్: ట్విట్టర్ మేసేజ్కు స్పందించిన మంత్రి కేటీఆర్ పేదోడి కుటుంబానికి తోడుగా నిలిచారు. ఉప్పల్కు చెందిన శివారెడ్డి ఎన్నో ఏళ్లుగా చాయ్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చాయ్ బండిని తొలగించడంతో జీవనోపాధిని కోల్పోయాడు. దీంతో శివారెడ్డి కుటుంబం రోడ్డున పడింది. చేసేది లేక మంత్రి కేటీఆర్కు శివారెడ్డి ట్విట్టర్ ద్వారా తన బాధను చెప్పుకున్నాడు. దీంతో స్పందించిన మంత్రి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ద్వారా బండిని ఏర్పాటు చేయించారు. ఈ చాయ్ బండిని బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించి శివారెడ్డికి కొత్త జీవితాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చిలుకానగర్ కార్పొరేటర్ గీత, డీసీ అరుణ కుమారి, ఈఈ నాగేందర్ ఉప్పల్ పీఎస్ ఎస్హెచ్ఓ ఏసీపీ రంగస్వామి, సీఐ గోవిందరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఎక్స్ట్రా మసాలా.. లెగ్ పీస్ లేదు.. స్పందించిన కేటీఆర్ సాక్షి, బంజారాహిల్స్: తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు నేరుగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుండగా అదే వేదికగా జనం తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ దృష్టికి నిత్యం 20 నుంచి 25 వరకు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ట్విట్టర్ వేదికగా బాధితులు తమ సమస్యలకు సంబంధించిన ఫొటోలను పంపిస్తున్నారు. మంత్రి స్పందించేదాకా బాధితులు వదలడం లేదు. మంత్రి నుంచి రెస్పాన్స్ వచ్చాకనే సంతృప్తి పడుతున్నారు. సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని బస్తీవాసులు ఆగ్రహం మీద ఉన్నారు. వానాకాలం వస్తుందంటేనే వణుకుపడుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని కాపాడేది మీరేనంటూ మంత్రి కేటీఆర్ను వేడుకుంటున్నారు. అధికారులపై తమకు నమ్మకం లేదని కుండబద్దలుకొడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నంబర్–1లోని తాజ్బంజారా హోటల్ వెనుకాల తాజ్బంజారా లేక్ పూర్తిగా దుర్గంధమయంగా మారిందని.. ఈ లేక్కు దారితీసే సింగాడికుంట నాలా మొత్తం వ్యర్థాలతో నిండిపోయి మురుగు ముందుకు వెళ్లలేని పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ స్థానిక యువకుడు మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశాడు. మంగళవారం సదరు యువకుడు ట్వీట్ చేసిన ఫొటోల్లో తాజ్ బంజారా లేక్, సింగాడికుంట నాలాల్లో దుస్థితిని కళ్లకు కట్టారు. రాబోయే వర్షాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ దుర్గంధం, దుర్వాసనలతో స్థానికులు దోమల బెడదతో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారని ఆరోపించారు. తాజ్బంజారా లేక్లోకి వరదనీరు సాఫీగా వెళ్లకుండా అడుగడుగునా అడ్డంకులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందించడం లేదంటూ నిలదీశారు. సింగాడికుంట నాలా దుస్థితిపై తన మొదటి ట్వీట్ను మార్చి 6వ తేదీన మంత్రి కేటీఆర్కు చేశారు. స్పందించిన మంత్రి.. అప్పటి నుంచి ప్రతిరోజూ ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తుండగా ఎట్టకేలకు బుధవారం మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్యలకు ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా కోరారు. చదవండి: కేటీఆర్ని సోనూ సూద్ ఏమి కోరారో తెలుసా? -
వ్యా క్సినేషన్ పంపిణి సక్రమంగానే జరుగుతుందన్న ఎమ్మెల్యే
-
Bethi Subhas Reddy: భూవివాదంతో నాకు సంబంధం లేదు
హబ్సిగూడ: కాప్రా డివిజన్ పరిధిలోని సర్వే నంబరు 152, 153 లోని 23 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ స్థలం వివాదంలో తాను తలదూర్చి నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుండటంతో కాప్రా తహసీల్దార్ గౌతంకుమార్ సూచనల మేరకు ఆక్రమణలకు గురికాకుండా చూశాం తప్పితే, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై గతంలో తహ సీల్దార్ ఫిర్యాదు మేరకు జవహర్నగర్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. సదరు కేసులున్న వ్యక్తులు కోర్టులో పిటిషన్లు వేసి, మాపై కేసులు పెట్టించడం దారుణ మన్నారు. ఎవరు భూములు ఆక్రమించారో, ఎవరు తప్పులు చేశారో త్వరలో ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాపాడడమే తమ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దేవేందర్రెడ్డి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భూ వివాదం: ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు -
నెల వరకు ఎవ్వరూ ఇతనికి ఫోన్ చేయొద్దు.. కలవద్దు!
సాక్షి, ఉప్పల్: అనుమానాస్పదంగా ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం, గోరి కొత్తపల్లి ప్రాంతానికి చెందిన భాస్కర్(29), ఉప్పల్ విజయపురి కాలనీలో ఉంటూ క్యాటరింగ్ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గత నెల 24 తేదీన అతని ఫోన్తో తల్లికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్చేసి నెల వరకు ఎవ్వరు ఇతనికి ఫోన్ చేయవద్దని అప్పటి వరకు ఎవ్వరూ కలవద్దని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతని రూంమెట్కు ఫోన్ చేయగా రెండు రోజుల క్రితమే ఖాళీ చేసి వెల్లిపోయినట్లు చెప్పాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో సోదరుడు శివకుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశార యువతిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు బంజారాహిల్స్: యువతిని వేధిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఆదిత్యారామ్ స్క్వేర్లో ఉన్న కన్సల్టెన్సీ సంస్థలో అక్షయ్ గనప పని చేసి మానేశాడు. అయితే అందులోనే పని చేస్తున్న ఉద్యోగిని(22)ని కొంత కాలంగా వెంబడిస్తూ వేధిస్తున్నాడు. ఆమె విధులు ముగించుకొని బయటికి రాగానే ఆమెను అనుసరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోకపోగా ఆమె ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆమె ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఆమెను హింసిస్తున్నాడు. బంధుమిత్రుల్లో ఆమె పరువు ప్రతిష్టలను నాశనం చేస్తూ ప్రతిరోజూ వేధింపులకు పాల్పడుతుండటంతో ఇటీవల ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితికి వచ్చానని, అక్షయ్పై చర్యలు తీసుకోకపోతే తనకు చావే గతి అంటూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 509, 354(డి) కింద కేసు నమోదు చేశారు. చదవండి: ఆసుపత్రి నుంచి గర్భిణి అదృశ్యం.. ‘నాకోసం వెతక్కండి’ -
భూ వివాదం: ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు
కాప్రా/జవహర్నగర్: కాప్రా పరిధిలోని ఓ భూవివాదంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డిపై కేసు నమోదైంది. సీఐ మధుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా మండల పరిధిలోని 152,153 సర్వే నంబర్లలో గల స్ధలంలో జూలకంటి నాగరాజు అనే వ్యక్తి ఈ ఏడాది మార్చి 16న ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సుభాష్రెడ్డి అనుచరులతోపాటు కాప్రా తహసీల్దార్ గౌతమ్కుమార్, రెవెన్యూ సిబ్బంది రెండు జేసీబీలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నవారిని అడ్డుకుని జేసీబీల సహాయంతో వాటిని పూర్తిగా కూల్చివేశారు. అంతేకాకుండా నాగరాజును భయభ్రాంతులకు గురిచేసి ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఉప్పల్ ఎమ్మెల్యే, కాప్రా తహీసీల్దార్లపై కేసు నమోదు చేయాలని బాధితుడి తరఫు న్యాయవాది మేకల శ్రీనివాస్యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. æకోర్టు ఆదేశాల మేరకు జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: ఎమ్మెల్యే కాప్రాలోని భూవ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయి స్తానని ఎమ్మెల్యే సుభాష్రెడ్డి తెలిపారు. ‘ప్రభుత్వ భూమిని కాపాడాలని మేం చెప్పాం. అందులో తప్పేముంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. వారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రభుత్వభూమిని కాపాడాలని అధికారులు ఆ స్థలం వద్దకు వెళ్తే, వారిపై కొందరు దాడి చేసే అవకాశం ఉందని తెలపడంతో రక్షణ కల్పించాలని డీసీపీని కోరాం. 20 ఏళ్ల నుంచి ప్రజాజీవితంలో ఉన్నా. నేను ఏంటో ప్రజలందరికీ తెలుసు. నాపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలే’అని ఎమ్మెల్యే సుభాష్రెడ్డి అన్నారు. ఆవి ప్రభుత్వ అధీనంలోనివి.. ‘సర్వే నంబర్లు 152, 153లలో గల 23 ఎకరాల 13 గుంటల భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. మార్చి 16న ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తుండగా అడ్డుకుని కంచెలను తొలగించాం. ఇంతలో అడ్వొకేట్ మేకల శ్రీనివాస్యాదవ్, శరత్చంద్రారెడ్డి అనే వ్యక్తి తమ అనుచరులతో అక్కడికి చేరు కుని రెవెన్యూ సిబ్బంది విధులను అడ్డుకున్నారు. తహసీల్దార్తోపాటు సిబ్బందినీ తీవ్రంగా దూషించారు. బెదిరింపులకు పా ల్పడ్డారు. ఈ మేరకు తాము జవహర్నగర్ పోలీసులకు మార్చి 18న ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది. దీనికి ప్రతిగా.. ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, తహసీల్దార్ గౌత మ్కుమార్ తమను బెదిరిస్తున్నారని ఆవ్యక్తు లు హైకోర్టును ఆశ్రయించారు ’అని కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్ తెలిపారు. చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా? -
కొనసాగుతున్న రెమ్డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్మార్కెట్ దందా
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్డెసివర్ ఇంజక్ష బ్లాక్మార్కెట్ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్డెసివర్ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉప్పల్ నర్సింగ్హోమ్లో హెచ్ఆర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెమ్డెసివర్కు మార్కెట్లో కొరత ఉండడంతో బ్లాక్లో అమ్ముకుంటే డబ్బులు బాగా సంపాదించొచ్చని అనిల్ భావించాడు. ఒక్కో ఇంజక్షన్ను రూ.25 వేలకు కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. అయితే సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అనిల్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాలుగు రెమ్డెసివర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. -
13న పెళ్లి.. ఇంతలోనే విషాదం
ఉప్పల్: కరోనా మహమ్మారి ఆ ఇంట్లో తీరని శోకాన్ని మిగిల్చింది. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో ఏకంగా నిశ్శబ్దం అలుముకుంది. ఈ ఘటన ఉప్పల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ భరత్నగర్కి చెందిన కె.అనంతయ్య కూతురు.కె శ్రీవాణి (22) అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 21న ఎల్బీనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయినా కూడా ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ నెల 13న శ్రీవాణి వివాహం జరగాల్సింది ఉంది. దీంతో అనంతయ్య కుటుంబ విషాదంలో మునిగిపోయింది. అనంతయ్యకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. చదవండి: సెకండ్వేవ్: లాక్డౌన్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు -
Photo Feature: ఊరెళ్లిపోతా మావ..
ఏ క్షణంలో కరోనా మహమ్మారి కబలిస్తుందో తెలియని అనిశ్చితి వాతావరణంలో హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వేచి ఉన్న ప్రయాణికులు. -
హెచ్సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది
-
హెచ్సీఏ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన హెచ్సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రేటరీలు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కాగా అంబుడ్స్మెన్గా దీపక్వర్మను నియమించాలని అజర్ వర్గం పట్టుబడుతుంటే.. వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజర్ను సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారడంతో వీహెచ్ హనుమంతరావు మధ్యలోనే బయటికి వచ్చి మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ మాట్లాడుతూ..'' హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయింది. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదు.ఆంద్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మ ని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? దీనిపై అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదు. ప్రెసిడెంట్ అజర్ కి అధికార పార్టీ అండదండలు వున్నాయి.'' అని మండిపడ్డారు. కాగా తదుపరి హెచ్సీఏ సమావేశం వచ్చే నెల 11న జరిగే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ ఏక్మినార్ మజీద్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మైబెల్లి తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతంలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీగూర శివనాగిరెడ్డి (26) ఉప్పల్ రోడ్డులోని ఎన్ఎస్ఎల్ భవనంలో మూడు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. కార్యాలయంలో ఉన్న ల్యాప్టాప్ కోసం ఇంటి నుంచి తన ద్విచక్ర వాహానం (ఏపి 09 సిఎన్ 3009)పై గురువారం ఉదయం బయలు దేరాడు. ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వద్ద రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ వేగంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. గాయపడిన శివనాగిరెడ్డిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివనాగిరెడ్డి భార్య తీగూర సుశ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట పాపారాయుళ్లు: ప్రతిసారి వాళ్లే ఎలా గెలుస్తున్నారని..
సాక్షి, మేడ్చల్ రూరల్: పోలీసులంటూ పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన ముఠాను మేడ్చల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మేడ్చల్ పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ముథోల్ కు చెందిన అఖిల్ అహ్మద్ (32) మేడ్చల్ పట్టణంలోని చంద్రానగర్లో నివాసం ఉంటున్నాడు. ఇతని మిత్రులు ఇస్లాంపూర్కు చెందిన షేక్ అహ్మద్(21), షేక్ అజీమ్(25) ముగ్గురు తరచూ పేకాట ఆడేవారు. భాదితులు మణికంఠ, శ్రీహరి, సామ్సంగ్లతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పలుమార్లు వారితో కలిసి పేకాట ఆడారు. ఎప్పుడు పేకాట ఆడినా మణికంఠ, శ్రీహరి, సామ్సంగ్లు డబ్బు గెలుచుకునేవారు. అఖిల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ అజీమ్లు సుమారు రూ.7 నుంచి 8 లక్షల వరకు పోగొట్టుకున్నారు. తరుచూ డబ్బు వాళ్లే ఎలా గెలుస్తున్నారు.. ఏదో చేస్తున్నారు అంటూ వీరి నుంచి డబ్బులు ఎలాగైనా రాబట్టాలని ప్లాన్ చేసుకున్న ముగ్గురు మిత్రులు వారి స్నేహితులైన ఇస్లాంపూర్ కు చెందిన షేక్ అక్బర్(32), నిజామాబాద్కు చెందిన గణేశ్(28), షేక్ కైసర్(30) లతో కలిసి నకిలీ పోలీసులమంటూ బెదిరించి డబ్బులు దోచుకోవాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 14న మేడ్చల్లోని ఆర్ఆర్ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. ప్లాన్లో భాగంగా అఖిల్ అహ్మద్ మధ్యాహ్నం మణికంఠ, శ్రీహరి, సామ్సంగ్లకు ఫోన్ చేసి పేకాట ఆడేందుకు లాడ్జికి పిలువగా వారు సాయంత్రం వచ్చి అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్, షేక్ అజీమ్లతో కలిసి ఆరుగురు లాడ్జీలోని ఓ రూమ్లో పేకాట ఆడుతున్నారు. కొంతసేపటికి డోర్ చప్పుడు కావడంతో అఖిల్ అహ్మద్ పోలీసులు వచ్చారంటూ అరుస్తూ అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని బాత్రూమ్లో దాక్కున్నాడు. షేక్ అహ్మద్ వెళ్లి తలుపులు తీసాడు. గణేశ్, షేక్ కైసర్లు పోలీసులమంటూ గదిలోకి చొరబడి గణేశ్ డమ్మీ గన్తో బెదిరించి డబ్బు తీసుకొని వెళ్లిపోయారు. ఆ సమయంలో షేక్ అక్బర్ ఇతరులు ఎవరూ అటు వైపు రాకుండా చూస్తూ లాడ్జ్ వారితో మాటలు కలుపుతూ పని ముగిసాక వెళ్లిపోయాడు. తరువాత అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్లు తమకు భయం అవుతుందంటూ బాదితులకు చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి రూ.2.22లక్షల నగదు, 6 సెల్ఫోన్లు, బైక్, డమ్మీ గన్, ఫైబర్ లాఠీ లను స్వాధీనం చేసుకున్నారు. -
ఉప్పల్లో లారీ బీభత్సం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డుమీదకు వస్తున్న లారీ.. ఆగి ఉన్న బైక్తోపాటు మరికొన్ని వాహనాలకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యియి. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మృత్యువులోనూ వీడని బంధం -
హైదరాబాద్లో రూ. 60కే ‘తిన్నంత బిర్యానీ’
సాక్షి, హైదరాబాద్: నగరంలో బిర్యానీ అంటే తెలియనివారు ఉండరు. వారాంతపు సెలవుల్లో బిర్యానీ సెంటర్లల్లో జనాలు బారులు తీరుతారు. అయితే మంచి బిర్యానీ కోసం భాగ్యనగర వాసులు ఎక్కడినైనా వేళ్లడానికి ఆసక్తి చూపుతారు. చిన్నా, పెద్ద ఇష్టంగా ఆరగించే బిర్యానీ.. పెద్ద హోటళ్లలో లభిస్తున్నప్పటికీ సామాన్యులు తినాలంటే మాత్రం భారంగా మారుతోంది. కానీ, హైదరాబాద్లో ఇప్పుడు వేడివేడి బిర్యానీ కేవలం రూ. 60 లభిస్తోంది. అది ఎక్కడని అశ్చర్యపోకండి. ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్కు వెళ్లే మార్గంలో ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్లో రుచికరమైన బిర్యానీ లభ్యమవుతోంది. వివరాలు.. ఉదయ్, కిరణ్ అన్నదమ్ములిద్దరు కలిసి స్టార్టప్గా ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్ ప్రారంభించారు. బిర్యానీతోపాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ ఇస్తున్నామని తెలిపారు. అయితే ఇది పూర్తిగా శాకాహారంతో కూడిన బిర్యానీ. అయతే తిన్నంత బిర్యానీ పెడతామని పేర్కొన్నారు. ఇటీవలె బిర్యానీ సెంటర్ను ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో ఆదరణ పెరుగుతోందని తెలిపారు. తక్కువ ధర అని నాసిరకం కాకుండా బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రోజు రూ. 1000 నుంచి రూ.1,500 వరకు పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. రోజు ఎంతో రద్దీగా ఉండే ఉప్పల్-రామంతాపూర్ మార్గంలో రూ.60 చెల్లించి ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్లో బిర్యానీ తింటున్నామని, చాలా రుచిగా ఉందని స్థానికులు తెలిపారు. చదవండి: శని, ఆదివారాలు చెక్కులిచ్చినా.. లిక్కర్ ఇస్తాం -
ప్రాణం తీసిన 60 రూపాయల ఆమ్లెట్
సాక్షి, హైదరాబాద్ : ఆమ్లెట్ కోసం తలెత్తిన గొడవ ఓ మనిషి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన హైదరాబాద్లోని ఉప్పల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..హైదరాబాద్లోని లంగర్హౌస్కు చెందిన వికాస్(34)ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి దాటాక తన స్నేహితుడు బబ్లూతో కలిసి మద్యం సేవించడానికి ఉప్పల్లోని మహంకాళి వైన్స్ కు వెళ్లి అక్కడ మద్యం సేవిస్తూ ఆమ్లెట్ను ఆర్డర్ చేశారు. అయితే దానికి 60 రూపాయలు చెల్లించమని సిబ్బంది కోరగా, అందుకు స్నేహితులిద్దరూ అంగీకరించలేదు. మద్యం మత్తులో ఉన్నవారు డబ్బులు ఇవ్వమని సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో షాపు సిబ్బంది వారిపై దాడి చేయగా, వికాస్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో స్నేహితుడు బబ్లూ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఆస్పత్రిలో చేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : (షాకింగ్ : అల్లాకోసం కన్న కొడుకు ‘బలి’) (బేగంపేటలోని పబ్పై కేసు, అదుపులోకి 28 మంది) -
ఉలిక్కిపడిన ఉప్పల్!
ఉప్పల్ : ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని జెన్ప్యాక్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్పై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంతో స్థానికులు, వాహనచోదకులు ఉలిక్కిపడ్డారు. ప్రమాద దృశ్యాలను చూసిన వాళ్లు ఎవరైనా భారీ ప్రాణనష్టమే జరిగి ఉంటుందని భావించారు. ప్రతి ఏడాదీ నూతన సంవత్సరం ప్రారంభ రోజైన జనవరి 1న ఈ దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ దేవాలయానికి ప్రమాదం జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. ఇన్నర్ రింగ్ రోడ్లో సికింద్రాబాద్–ఉప్పల్ రూట్లో ఉండే ఈ గుడి వరకు రోడ్డు విశాలంగా ఉంటుంది. దీని దగ్గర రెండుగా చీలి దేవాలయం దాటిన తర్వాత మళ్లీ కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మితిమీరిన వేగంతో వచ్చిన భారీ వాహనం దేవాలయ ప్రాంగణాన్ని నేరుగా ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇనుప ఆర్చ్తో పాటు ఓ చెట్టు కూలిపోయింది. దీంతో పరిపాలన కమిటీ దేవాలయం ముందు వద్ద ప్రమాదాలకు తావు లేకుండా కొన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈసారి పక్కగా వచ్చిన వాహనాలు గుడి గోడలు, పరిపాలన విభాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కాగా నిత్యం దీన్ని ఉదయం 5.30 నుంచి 6.00 గంటల మధ్యే తెరుస్తారు. అయితే శుక్రవారం అర్చకులు రావడం కాస్త ఆలస్యం కావడంతో ప్రమాదం జరిగే సమయానికి దేవాలయం తెరుచుకోలేదు. అలా కాకుండా యథావిధిగా తెరుచుకుని ఉంటే భక్తులు, అర్చకులు, ఉద్యోగులతో పాటు పరిపాలన కమిటీకి చెందిన వారికీ ముప్పు వాటిల్లేది. భారీగా నిలిచిన ట్రాఫిక్... తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాలు దేవాలయం కుడిపక్క మార్గంలో ఉండిపోవడంతో ఆ రూట్ను బ్లాక్ చేశారు. ఘటనాస్థలి నుంచి వాహనాలను పక్కకు తీసేసరికి ఉదయం 10.30 గంటలు దాటింది. అప్పటి వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి నెమ్మదిగా కదిలింది. ఈ రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఉప్పల్–సికింద్రాబాద్ రోడ్డులోనూ ప్రమాదానికి గురైన వాహనాలు, దేవాలయాన్ని చూడటానికి అనేక మంది ఆగిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. అధికారులు వాహనాలను క్లియర్ చేసినా.. అనేక మంది సాయంత్రం వరకు ఆ స్పాట్లో ఆగి వెళ్తుండటంతో ట్రాఫిక్ నెమ్మదిగానే సాగింది. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సందర్శన ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ రాజ్లు వచ్చి ప్రమాద తీవ్రతను చూసి చలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే వెనక్కి వెళ్లా.. వాచ్మెన్ని కావడంతో రాత్రంతా గుడిలోనే ఉన్నా. తెల్లవారుజామున లేచి దేవాలయం పరిసరాలను శుభ్రం చేశా. స్నానం చేసి వచ్చి అప్పటి వరకు పరిపాలన విభాగం సమీపంలోనే కూర్చున్నా. వస్త్రాలు ఆరేయడానికి వెనక్కు వెళ్లా. వెనుక నుంచి భారీ శబ్ధాలు రావడంతో పాటు డీసీఎం ఆలయ ప్రాంగణంలోకి దూసుకువచ్చింది. మినీ ట్రాన్స్ఫార్మర్తో కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి పరిపాలన విభాగంలోకి వెళ్లింది. కరెంట్ తీగలు తెగి నాపైన పడ్డాయి. అయితే అప్పటికే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రమాదం జరగలేదు. – కృష్ణ, వాచ్మెన్ ఆ స్వామి దయవల్లనే బతికాం ప్రతి రోజు పూజలు చేయడానికి ఉదయం 5.30 గంటల కల్లా ఆలయంలో ఉండే వాళ్లం. నూతన సంవత్సరం కావడంతో శుక్రవారమూ తెల్లవారు జామునే నిద్ర లేచాం. ఆలయానికి రావడానికి సిద్ధమయ్యాం. ఎందుకో కాస్త ఆలస్యమైంది. ఇంతలోనే ప్రమాద విషయాన్ని వాచ్మెన్ ఫోన్ చేసి చెప్పాడు. రోజు పూజలు చేయించుకునే ఆ దేవుడే మమ్మల్ని కాపాడారు. – ప్రధాన అర్చకుడు రవీంద్ర శర్మ -
రాంగ్ రూట్.. ఓవర్ స్పీడ్!
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: రహదారి పక్కగా ఆగి ఉన్న జేసీబీ వాహనం రాంగ్ రూట్లో రోడ్డుపైకి వచి్చంది.. వ్యతిరేక దిశలోనే రోడ్డుకు ఎడమ వైపుగా వెళ్లి యూ టర్న్ తీసుకోవడానికి డ్రైవర్ ప్రయతి్నంచాడు. అదే సమయంలో ఆ రూట్లో మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన ద్విచక్ర వాహనం జేసీబీని ఢీకొంది.. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడ మోడ్రన్ బేకరీ చౌరస్తాలో ఆదివారం సాయంత్రం జరిగింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన జేసీబీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు.. యాదాద్రి– భువనగిరి జిల్లా ఆకుతోట బావి తండా సురెపల్లిరికి చెందిన లకావత్ నరేష్ (22) ఘట్కేసర్ సమీపంలోని జోడిమెట్లలో ఉన్న ఇండూస్వివ కంపెనీలో పని చేస్తున్నాడు. తన సహోద్యోగి అయిన ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన టంగుటూరి శ్రీరాములు కుమారుడు టంగుటూరి గణేష్తో (20) కలిసి ఆదివారం బయటకు వచ్చాడు. వీరిద్దరూ నరేష్కు చెందిన కేటీఎం డ్యూక్ స్పోర్ట్స్ బైక్పై రామంతాపూర్లో ఉన్న డీ మార్టు మాల్కు వచ్చారు. కాసేపు అందులోనే గడిపిన వీరు కొన్ని టీ షర్టులు ఖరీదు చేసుకున్నారు. సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి తిరిగు ప్రయాణమయ్యారు. ♦ వీరి వాహనం రామంతాపూర్ వైపు నుంచి ఉప్పల్ వైపు అతివేగంతో వస్తోంది. ఈ మార్గంలోని మోడ్రన్ బేకరీ చౌరస్తా వద్ద రోడ్డుకు ఎడమ వైపున.. బేకరీకి ఎదురుగా జేసీబీ వాహనం పార్క్ చేసి ఉంది. ఆ వాహనాన్ని దాని డ్రైవర్ రోడ్డు ఇవతల.. బేకరీ వైపు ఉన్న పారిశ్రామిక వాడలోకి తీసుకువెళ్లాలని భావించాడు. సవ్యదిశ అయిన ఉప్పల్ రూట్లో కాస్త ముందుకు వెళ్లి డీఎస్ఎల్ మాల్ వద్ద యూ టర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆ 600 మీటర్ల దూరాన్ని తప్పించుకోవడానికి జేసీబీ డ్రైవర్ రాంగ్ రూట్ను ఆశ్రయించాడు. ♦ మోడ్రన్ బేకరీకి ఎదురుగా ఆగి ఉన్న∙తన వాహనాన్ని అపసవ్య దిశలో ముందుకు తీసుకువచ్చి యూ టర్న్ తీసుకుని బేకరీ పక్కగా ఉన్న రూట్ ద్వారా పారిశ్రామిక వాడలోకి వెళ్ళడానికి ప్రయతి్నంచాడు. సాయంత్రం సమయం కావడంతో ఆ మార్గంలో వాహనాల రద్దీ తక్కువగా ఉంది. దీంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులూ మితిమీరిన వేగంతో రామాంతపూర్ వైపు నుంచి ఉప్పల్ వైపు దూసుకువస్తున్నారు. రోడ్డు మధ్యలోకి వచ్చిన ఈ జేసీబీ వాహనాన్ని యువకులు హఠాత్తుగా గమనించారు. వేగాన్ని నియంత్రించుకునే ఆస్కారం కూడా లేకపోవడంతో అదే స్పీడ్లో జేసీబీ మధ్య భాగాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రభావానికి ద్విచక్ర వాహనం ముందు భాగం జేసీబీ కిందికి దూసుకుపోయింది. ♦ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్న నరేష్ తల బలంగా జేసీబీకి తగిలింది. దీంతో హెల్మెట్ పగిలిపోయి పక్కకు పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే చనిపోయాడు. ఇతడి మృతదేహం కాళ్లు ద్విచక్ర వాహనంపైనే ఉండగా.. తలకిందులుగా రోడ్డుపై వేలాడింది. బైక్ వెనుక కూర్చున్న గణేష్ గాల్లోకి ఎగిరి తలకిందులుగా రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయమై ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలాడు. ♦ నరేష్ తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో అతడి తల్లి బదిలి భువనగిరిలో చాయ్ బండి నడిపిస్తూ ముగ్గురు కుమారుల ఆలనాపాలనా చూసుకుంటోంది. నరేష్ ప్రైవేట్ ఉద్యోగంలో చేరగా.. మిగిలిన ఇద్దరూ విద్యనభ్యసిస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని సైతం నరేష్కు అతడి తల్లే కొనిచ్చింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద కేటిఎం స్పోర్ట్స్ బైక్తో ఇద్దరు యువకులు అతివేగంగా జేసీబీని ఢీకొట్టారు. బైక్పై ప్రయాణిస్తున్న నరేష్ (22), గణేష్(20) అనే యువకులు దుర్మరణం పాలయ్యారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు బైక్పై అతి వేగంగా వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన నరేష్.. భువనగిరి ఆకుతోట తండా సూరేపల్లికి చెందిన వ్యక్తి కాగా, గణేష్.. పోచారం ఘట్కేసర్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం సీఐ!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం టూటౌన్ లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీరామ్ పేరు బయటపడింది. అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ఇటీవల రెండు కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మోహన్ కృష్ణతో పాటు మరో ఇద్దరిని ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీరామ్ పాత్రపై విచారణ జరుపుతున్నామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణతో సీఐకి ఉన్న సంబంధాలపై ఆబ్కారీ ఆరా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణని వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి కోరారు. గతంలో సీఐ, కానిస్టేబుల్ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో.. సీఐ శ్రీరాంపై అనంతపురం రేంజ్ డీజీఐ బదిలీ వేటు వేశారు. -
ఛీ.. ఇదేం పనయ్యా కానిస్టేబుల్!
ఉప్పల్ : క్రికెట్ బెట్టింగ్లు, జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఆర్మ్డ్ కానిస్టేబుల్ డబ్బుల కోసం గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికిపోయాడు. శనివారం ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురానికి చెందిన జె.మోహన కృష్ణ (36) అక్కడే ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. జనగాం జిల్లా వాసి సోమయ్య(36), నల్లగొండజిల్లా వాసి బానోతు యాదగిరి(24), బానోతు రా జుతో కలిసి నర్సీపట్నంలో గంజాయిని కిలో రూ. 2 వేలకు కొనుగోలు చేసి నగరంలో రూ.8 వేలుకు విక్రయిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మోహన కృష్ణ తన కారుకు పోలీస్ అనే స్టిక్కర్ అతికించుకొని దందా సాగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఉప్పల్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తన బృందంతో శుక్రవారం రాత్రి ఉప్ప ల్ నల్ల చెరువు కట్టమీద మాటువేసి మో హన కృష్ణ కారును పట్టుకున్నారు. కారు లో పొట్లాల రూపంలో ఉన్న 200 కిలోల గంజాయి దొరికింది. ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి, కారు, 2 సెల్ఫోన్లు.. మొత్తం రూ. 20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసు కుని ముగ్గురినీ రిమాండ్కు తరలించగా, బానోతు రాజు పరారీలో ఉన్నాడు. -
హైదరాబాద్లో ఆకాశ వంతెనల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : నగరవాసుల ప్రయాణాన్ని సురక్షితం చేయడంతో పాటు పాదచారుల నడక సాఫీగా సాగేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఓవైపు రద్దీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తూనే..మరోవైపు అక్కడి కొద్ది ఖాళీ స్థలంలోనే బస్సుల రాకపోకలకు బస్టాండ్లు నిరి్మంచడంతో పాటు అక్కడే ప్రయాణికులు షాపింగ్ చేసేందుకు వాణిజ్య భవనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు వాహన రద్దీ అధికంగా ఉండే మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద స్కైవాక్ (బోర్డు వాక్)లను నిరి్మంచే దిశగా కార్యచరణ రూపొందించింది. రూ.59.67 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంత రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. భవిష్యత్లో మరిన్ని ప్రాంతాల్లో... వాహనాల సంచారం, జనాల రద్దీ కారణంగా రోడ్డు క్రాస్ దాటే సమయంలో పాదచారులు ప్రమాదాలు బారిన పడుతున్నారు. దీన్ని నివారించేందుకు స్కైవాక్లు నిరి్మంచాలని నిర్ణయించారు. తొలుత మెహిదీపట్నం, ఉప్పల్ జంక్షన్లను ఎంపిక చేశారు. భవిష్యత్లో దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా స్కైవాక్లు నిర్మించే ఆలోచన చేస్తున్నారు. మెహిదీపట్నం ప్రాజెక్టు రూపురేఖలిలా... గుడి మల్కాపూర్కు వెళ్లే చౌరస్తా నుంచి మెహదీపట్నం బస్టాండ్ మీదుగా పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ కింది నుంచి మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్ వరకు ఈ స్కైవాక్ (బోర్డు వాక్) నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఫ్లైఓవర్ పైనుంచి అటు, ఇటు బస్టాండ్లను కలుపుతూ ఓ ఆకృతి సరికొత్తగా ఉండేలా ప్లాన్లు సిద్ధం చేశారు. 380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పు ఉంటుంది. 16 లిఫ్ట్లు ఏర్పాటు చేయనున్నారు. రైతుబజార్ నుంచి మెహిదీపట్నం బస్టాండ్ వరకు మరో స్కైవాక్ను కూడా అనుసంధానం చేస్తారు. అయితే పీవీ ఎక్స్ప్రెస్ వే కింది నుంచి ఉండే స్కైవాక్కు కలుపుతారు. దీంతో గుడి మల్కాపూర్ నుంచి వచి్చన జనాలు, ఇటు రైతు బజార్, ఆసిఫ్నగర్ నుంచి వచి్చన జనాలు అదే స్కైవే మీది నుంచి వెళతారు. బోర్డువాక్ వైపు నిలువు కనెక్టివిటీని ఒక గాజు ఎన్క్లోజర్ (మాడ్యూల్స్) ద్వారా ప్రవేశపెడతారు. ఇందులో మెట్లు, లిఫ్ట్లు ఉంటాయి. ఇరువైపులా ఎత్తు 2.5 మీటర్ల స్టీల్ గ్రిల్స్ ఏర్పాటుచేస్తారు. 12 మి.మీ మందపాటి పటిష్టమైన గ్లాస్ పేట్లను స్పష్టమైన దృష్టి కోసం ఏర్పాటుచేయనున్నారు. రైతు బజార్ పక్కన ఉన్న 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్లో బస్ బే ఉండే విధంగా, పై అంతస్తులో వాణిజ్య సముదాయం నిరి్మంచనున్నారు. ప్రయాణికుల షాపింగ్కు ఇది వేదిక కానుంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.34.28 కోట్లు ఉప్పల్ జంక్షన్లో ఇలా... ఉప్పల్ జంక్షన్లో నాలుగు వైపులా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, స్టెయిర్కేసులు ఆరు ప్రాంతాల వద్ద ఏర్పాటుచేస్తారు. వీటికి అనుసంధానంగా 660 మీటర్ల పొడవు, 6.15 మీటర్ల ఎత్తు, నాలుగు మీటర్ల వెడల్పుతో వాక్వేను నిరి్మంచనున్నారు. దుకాణాలు, కియోస్్కలు కూడా ఏర్పాటుచేస్తారు. అలాగే ఉప్పల్ జంక్షన్లోని మెట్రో స్టేషన్ మొదటి లెవల్ (ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే అంతస్తు)కు అనుసంధానం చేస్తారు. ఉదాహరణకు వరంగల్ బస్సులు ఆగే ప్రాంతం వద్ద ఎస్కలేటర్లు ఎక్కిన వ్యక్తి వాక్వే మీదుగా నేరుగా మెట్రో స్టేషన్లోకి వెళ్లవచ్చు. అలాగే రామాంతపూర్కు వెళ్లే మార్గంలో ఉన్న లిఫ్ట్ల నుంచి పైకి ఎక్కిన వ్యక్తి నేరుగా మెట్రో స్టేషన్కు వెళ్లవచ్చు. లేదంటే ఉప్పల్వైపు నడుచుకుంటూ రావొచ్చు. ప్రాజెక్టు అంచనా వ్యయం–రూ.25.39 కోట్లు. -
ఉప్పల్ రామంతాపూర్లో దారుణం
-
జుట్టు రాలి పోతుందనే మనస్తాపంతో..
సాక్షి, హైదరాబాద్: జుట్టు రాలిపోతుందనే బెంగతో ఓ యువకుడు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. గదిలో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లా ఉప్పల్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. నితిన్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సత్యనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. క్యాటరింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నితిన్ తన ఆదాయంలోనే కొంత తల్లిదండ్రులకు కూడా పంపి. మరికొంత డబ్బు దాచుకునేవాడు. డబ్బు దాచుకోవడానికి కారణం ఉంది. ఇటీవల నితిన్ కు జుట్టు రాలిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గుర య్యేవాడు. ఓవైపు పెళ్లి కూడా కాలేదు. దాంతో పెళ్లికి ముందే జుట్టంతా ఊడిపోతే ఎలా అని భావించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో డబ్బు సంపాదన నిలిచిపోవడం. దానికితోడు సోదరి పెళ్లికి డబ్బు పంపాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో, తీవ్ర మనస్తాపం చెందిన నితిన్, ఈనెల 25న స్నేహితులు గదిలో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, పెళ్లి కాకముందే జుట్టంతా రాలిపోతోందన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ నలుమూలలా ఐటీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్లోని అన్ని మూలలకూ విస్తరించేందుకు త్వరలో గ్రిడ్ విధానాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్కు తూర్పున ఉప్పల్ వైపు ప్రస్తుతమున్న ఐటీ కంపెనీలకు తోడు మరిన్ని ఐటీ, అనుబంధ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పెర్షన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ బుధవారం ఉప్పల్ ఎన్ఎస్ఎల్ ఎరెనాలో ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈస్ట్ హైదరాబాద్లో ఐటీ రంగం స్థితిగతులు, భవిష్యత్తు పెట్టుబడులపై మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. గ్రిడ్ ద్వారా ఐటీ రంగం విస్తరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే గ్రిడ్ వి«ధానం ద్వారా ఐటీ పరిశ్రమలు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు తరలివస్తాయనే ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈస్ట్ హైదరాబాద్లో ఇప్పటికే మెట్రో, శిల్పారామం, మూసీ నది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులు మెరుగవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వైపు, అంబర్ పేట్ రామాంతాపూర్ ఫ్లై ఓవర్ల ద్వారా రోడ్లు, మౌలిక వసతులు మరింత మెరుగవుతాయన్నారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్ వంటి పరిశ్రమలు విస్తరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలు తరలివెళ్తే, వాటి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతినిచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఐదు కంపెనీలకు కన్వర్షన్ పత్రాలు పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను ఐదు ఐటీ కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ బుధవారం అందజేశారు. ఐదు కంపెనీల ద్వారా సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా ఉప్పల్ ప్రాంతంలో మరో 30వేల మంది ఐటీ ఉద్యోగులకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రూపొందించిన సమాచార సంచికను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్, వివిధ ప్రభుత్వ శాఖల అ«ధికారులతో పాటు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ: వెంటాడుతున్న కోవిడ్ భూతం!
పెరుగుతున్న కోవిడ్–19 పాజిటివ్ కేసులతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలను కరోనా భూతం వెంటాడుతోంది. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో 869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 29, మేడ్చల్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా పాజిటివ్ కేసులు ఆగడం లేవు. తాజాగా పరిపాలన విభాగంలోని మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇదే విభాగంలో గత వారం కూడా ఓ ఉద్యోగికి కరోనా సోకిన తెలిసిందే. ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో.. ఉప్పల్ : ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో మంగళవారం ఒక్క రోజే 42 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హబ్సిగూడలో డివిజన్లోని కామాక్షిపురంలో 5, హబ్సిగూడలో ఒకటి, వెంకట్రెడ్డినగర్లో 3, శ్రీరాంనగర్ కాలనీలో 3, రామంతాపూర్ డివిజన్లోని అరవింద్నగర్ కాలనీలో 4, విద్యానగర్లో ఒకటి, ఉప్పల్ డివిజన్లో భరత్నగర్లో 3, గాంధీనగర్లో 2, కురుమానగర్లో 2, విజయపురి కాలనీలో 2, బీరప్పగడ్డలో 2, నాచారంలో 3, నాగోల్లో 5, మల్లాపూర్లో 6 కేసులు నమోదయ్యాయి. రామంతాపూర్ నేతాజీనగర్ చెందిన ఓ వృద్ధుడు (65) మృతిచెందాడు. (ఎన్నారై భర్తలు వేధిస్తే సమాచారమివ్వండి) కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో... దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి. సూరారం కాలనీ వెంకట్రామ్నగర్కు చెందిన వ్యక్తి(39), బాచుపల్లికి చెందిన యువకుడు(28), చింతల్ మారుతీనగర్కు చెందిన వ్యక్తి (55), గణేష్నగర్కు చెందిన మహిళ(33), గాజులరామారానికి చెందిన వ్యక్తి (30), నిజాంపేట్ రాజీవ్ గృహకల్పకు చెందిన వ్యక్తి (33), జీడిమెట్ల గ్రామానికి చెందిన వ్యక్తి (35), మీనా క్షి ఎస్టేట్స్కు చెందిన వ్యక్తి(58), అపురూపా కాలనికి చెందిన వ్యక్తి (48), జీడిమెట్ల శ్రీనివాస్నగర్కు చెందిన వ్యక్తి (45), జగద్గిరిగుట్టకు చెందిన మహిళ (35), చింతల్ సాయినగర్కు చెందిన మహిళ (52), వాణినగర్కు చెందిన వ్యక్తి (42), ప్రగతినగర్కు చెందిన వ్యక్తి (32), యువకుడు (28), యువతి (26), మరో యువకుడు (29), వ్యక్తి(39), హెచ్ఏఎల్ కాలనీకి చెందిన యువకుడు (26), వృద్ధురాలు (69), మరో యువకుడు (21), కొంపల్లి జయభేరి పార్కుకు చెందిన మహిళ (40), కొంపల్లి బొబ్బిలి అంపైర్కు చెందిన యువకుడు (20), కుత్బుల్లాపూర్కు చెందిన వ్యక్తి (42), నిజాంపేట్ వెంకటనగర్కు చెందిన వృద్ధురాలు (68), బాచుపల్లికి చెందిన మహిళ (30)కు కరోనా సోకడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కీసర పీహెచ్సీ పరిధిలో... కీసర : కీసర పీహెచ్సీ పరిధిలో కొత్తగా మరో 3 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్ కాలనీకి చెందిన మహిళకు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు శ్రీలక్ష్మీనగర్కాలనీలో ఓ మహిళాకు, మండల కేంద్రమైన కీసరలో ఓ ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా నిర్ధారణ అయ్యిందని కీసర మండల వైద్యాధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులను హోం క్వారైంటైన్లో ఉంచామన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో... మారేడుపల్లి : కంటోన్మెంట్ నాలుగు, ఐదు వార్డులలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కార్ఖానా అమరావతి కాలనీకి చెందిన తండ్రి, కొడుకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. పికెట్ లక్ష్మీనగర్లో ఒక కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు. ముగ్గురినీ హోమ్ క్వారంటైమ్లో ఉంచినట్లు మెడికల్ ఆఫీసర్ మీనా తెలిపారు. కరోనా పాజిటివ్ నివాసాల వద్ద కంటోన్మెంట్ సానిటేషన్ విభాగం అధికారులు బ్లీచింగ్ పౌడర్తోపాటు సోడియం హైడ్రోఫ్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. కాప్రాలో... కాప్రా : సర్కిల్ పరిధిలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 90కి చేరింది. నాచారం డివిజన్ బాబానగర్, చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ఒక్కో కేసు, కాప్రా డివిజన్ గౌడపురి కాలనీలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ కాగా, 54 యాక్టివ్ కేసులున్నాయి. ఘట్కేసర్ పట్టణంలో... ఘట్కేసర్ : ఘట్కేసర్ పట్టణంలోని సాయినగర్కు చెందిన మహిళ(30), ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన మరో మహిళ(58)కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. స్థానిక కౌన్సిలర్ కొమ్మిడి అనురాధ వైద్యసిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లే దారులను మూసివేయించారు. కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి రెడ్ జోన్ బోర్డులను ఏర్పాటు చేశారు. సాయినగర్లో వృద్ధుడి మృతి నిజాంపేట్ : కరోనా లక్షణాలతో సాయినగర్లో ఓ వ్యక్తి మృతి సోమవారం రాత్రి మృతి చెందాడు. సాయినగర్లో ఉండే షేక్ చాన్బాషా(60) బోరబండలో టైలర్గా జీవనం సాగిస్తున్నాడు. పది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఊపిరి తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందాడు. దీంతో చాన్బాషా అంత్యక్రియలను పీపీఈ కిట్లు ధరించి చేసేలా కార్పొరేటర్ కాసాని శిరీష చర్యలు తీసుకున్నారు. తుకారాంగేట్లో... అడ్డగుట్ట : అడ్డగుట్ట డివిజన్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తుకారాంగేట్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఓ వ్యక్తి(43), ఓ మహిళ(31) కరోనా బారిన పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కిషన్బాగ్ కొండారెడ్డిగూడలో... బహదూర్పురా : కిషన్బాగ్ డివిజన్లోని కొండారెడ్డిగూడలో ఓ వ్యక్తి(45)కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయనను హోమ్ క్వారంటైన్ చేశామని కిషన్బాగ్ నోడల్ అధికారి బాలకృష్ణ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... వెంగళరావునగర్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ ఎ.రమేష్ తెలిపారు. యూసుఫ్గూడ డివిజన్లో నలుగురికి, ఎర్రగడ్డ, రహమత్నగర్ డివిజన్ల పరిధిల్లో ఇద్దరు చొప్పున, బోరబండ డివిజన్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. ఎల్బీనగర్ పరిధిలో... ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ çమూడు సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ను మోగిస్తుది. వారం రోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం కావడంతో 107 మంది మంచానికే పరిమితయ్యారు. మరికొందరు గాంధీ, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. కేవలం మంగళవారం ఒక్కరోజే చంపాపేట, çహయత్నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్లలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అనుమానితులను హోం క్వారంటైన్లలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. -
టిక్టాక్లు చూడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
ఉప్పల్(హైదరాబాద్): టిక్టాక్తోపాటు వీడియో గేమ్లు ఆడవద్దన్నందుకు మనస్తాపం చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రా మంతాపూర్ అరవింద్ కాలనీ వీధి–2లో ఉండే కనుపూర్తి రాజ లింగం ఫుట్వేర్ వర్క్షాపు నిర్వాహకు డు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు దీపిక (17) పాలిటెక్నిక్ మొదటి ఏడాది చదువుతోంది. తరచూ ఫోన్లో టిక్టాక్లు చూస్తూ, వీడి యోగేమ్లు ఆడుతూ సమయం వృథా చేస్తుండటం తో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన దీపిక గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి చూడగా గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, ఉప్పల్ : అత్తింటి వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఉప్పల్ పోలీసు స్టేషన్పరిధిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కల్యాణ్పురి టీచర్స్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి సతీష్ వివాహం ఎనిమిది సంవత్సరాల క్రితం పి. శ్రీలత(33)తో జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు. శ్రీలత ఉప్పల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుంది. (అప్పుడు పెద్ద పండగలా ఉంటుంది) కొంత కాలంగా శ్రీలత భర్త సతీష్ ఉద్యోగం మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను మానసికంగా వేధించాడు. భర్తతో పాటు కుటుంబ సభ్యులు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేక సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు కారణం అత్తింటి వేధింపులేనని ఉప్పల్ పీఎస్లో మృతురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్ మృతి) -
హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితలో ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్వరూప్ నగర్కు చెందిన బాల సుదర్శన్ (38) కింగ్ కోఠి ఆంధ్రా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య, ఇద్దరు కూతుళ్లు నిద్రిస్తుండగా బాల్కానీలోని హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సుదర్శన్ కుటుంబసభ్యులు మాత్రం పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఉప్పల్ హెరిటేజ్: క్వారంటైన్కు 34 మంది
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కరోనా కలకలంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం ఉదయం హెరిటేజ్ మిల్క్ సెంటర్ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న 34మంది సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. మరోవైపు ఉద్యోగులను బెదిరించడంపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరిటేజ్ మిల్క్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. (హెరిటేజ్లో కరోనా కల్లోలం) కాగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, ప్లాంట్ను మూసివేయాలంటూ స్థానికులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న యువకుడి (19)కి తండ్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చినా, ఆ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు.. అతనితో సమీపంగా వ్యవహరించిన 33 మందిని రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. 34మంది అనుమానితులను క్వారంటైన్కు తరలించి, బెదిరింపులకు పాల్పడిన యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు. (ప్రతి ఏడాది కరోనా పలకరింపులు!) -
హెరిటేజ్లో కరోనా కల్లోలం
హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు మరింత మందికి సోకకుండా ప్లాంట్ను మూసి వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడి (19)కి తండ్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చినా, ఆ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారని మండిపడ్డారు. అతనితో సమీపంగా వ్యవహరించిన 33 మందిని రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► హెరిటేజ్ ప్లాంట్లో పనిచేస్తున్న యువకుడి తండ్రి (53) రామంతాపూర్లోని శ్రీరమణపురంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 24న అతడికి పాజిటివ్ రావడంతో గాంధీ ఐసొలేషన్కు తరలించారు. 26వ తేదీన తల్లీ, కుమారుడి(సెక్యూరిటీ గార్డు)కి కూడా పాజిటివ్ అని తేలడంతో వారిని గాంధీ ఐసొలేషన్కు తరలించారు. ► సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో పాటు, వీరితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న మరో 27 మందిని కూడా సదరు ప్లాంట్ నిర్వాహకులు లక్ష్మీనారాయణకాలనీలోని ఓ చిన్న ఇంట్లో క్వారంటైన్లో ఉంచారు. తమ కంపెనీ పేరు బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. అంతేగాకుండా వీరిని విధులకు రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. (ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్) ► అయితే హోం క్వారంటైన్లో ఉన్న వారు ఇష్టానుసారంగా బయట తిరుగుతుండటంతో లక్ష్మీనారాయణ కాలనీ వాసులు గుర్తించి యాజమాన్యాన్ని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే పాల ఉత్పత్తులను నిలిపివేసి కంపెనీ మూసివేయాలని డిమాండ్ చేశారు. ► కంపెనీ హెచ్ఆర్ బుకాయింపు సమాధానం చెప్పడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. తుదకు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, సెక్యూరిటీ గార్డు ద్వారా ఎంత మందికి వైరస్ సోకిందోనని, ప్లాంట్లో అందరికీ టెస్ట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. . (ఆమెతో విడిపోయాక సంతోషంగా ఉన్న: హీరో ) -
ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా..
సాక్షి, హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఉప్పల్ పరిధిలో ఉపాధి లేక తిండి దొరక్క ఆకలితో అవస్థలు పడుతున్న వారిని స్థానికంగా ఉండే మేకల కుటుంబ సభ్యులు ఆదుకుంటున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డ దగ్గర మెట్రోవెనుక వైపున, రోజు వారి కూలీ చేసుకుని నివసిస్తూ దాదాపుగా 200 కుటుంబాలున్నాయి. అందులో కొంత మంది వినాయక ప్రతిమలు చేసుకుంటుండగా, మరికొంత మంది యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ దెబ్బకు ఇప్పుడా కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. అలాంటి దాదాపుగా 200 బుడిగ జంగం కుటుంబాలకు మేకల బాల్రెడ్డి, ఆయన భార్య మేఘమాలతోపాటూ కుటుంబ సభ్యులు అందరు కలిసి వారి ఆకలి తీర్చుతున్నారు. వీరితోపాటూ జీహెచ్ఎంసీ కార్మికులు, రోడ్డు మీద, బస్టాండ్లలో ఉండే బిచ్చగాళ్లకు సైతం ఆకలి, దప్పికల్ని తీర్చుతూ ఆదుకుంటున్నారు. మార్చి 22 నుంచి రోజుకు 500 చొప్పున భోజన ప్యాకెట్లను తయారు చేసి ఇస్తున్నామని ఇపుడు లాక్డౌన్ పెంచిన నేపథ్యంలో మే 7 వరకు కూడా భోజన సదుపాయం కల్పిస్తామని మేకల బాల్ రెడ్డి తెలిపారు. ఇంట్లో కిరాయికిఉండే వారితో కలిసి రోజుకు 500 మందికి వంట చేస్తున్నామని, తాము ఇంట్లో ఏం తింటామో అదే వారికి వండిపెడుతున్నామని అందులో ఆనందం ఉందని మేఘమాల చెపుతున్నారు. -
ఉప్పల్ స్టేడియంను ఉపయోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తాము కూడా భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వెల్లడించింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్గా ఉపయోగించునేందుకు ఇస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు. వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా స్టేడియంలో 40 పెద్ద గదులు ఉన్నాయని, అతి పెద్ద పార్కింగ్ సదుపాయం ఉండటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని హెచ్సీఏ పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో సామాజిక బాధ్యతగా తాము స్టేడియాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసోసియేషన్ స్పష్టం చేసింది. -
వర్షం: గుంతలో పడ్డ మహిళ, పాపాయి
సాక్షి, హైదరాబాద్: ఫిర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన మనవరాలితో సహా డ్రైనేజీ గుంతలో పడిపోయారు. వివరాలు... బుద్ధానగర్లో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రి వద్ద డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తీసిన గుంత నేటి వర్షానికి నిండిపోయింది. ఈ క్రమంలో వైద్యం కోసం అక్కడికి వచ్చిన ఓ మహిళ, రెండు నెలల వయస్సుల గల తన మనవరాలితో కలిసి వెళ్తుండగా.. అకస్మాత్తుగా గుంతలో పడ్డారు. విషయాన్ని గమనించిన స్థానికులు వారిద్దరిని రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా మేయర్, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్షం: గుంతలో పడ్డ బామ్మా, మనవరాలు
-
ఉప్పల్ జంక్షన్లో ‘ఐకానిక్ బోర్డు వాక్’
సాక్షి, సిటీబ్యూరో: వరంగల్ జాతీయరహదారివైపు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ఉప్పల్ జంక్షన్ వద్దరోడ్డు దాటేందుకు నానా కష్టాలు పడుతున్న పాదచారుల కోసం ‘ఐకానిక్ బోర్డు వాక్’ను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏభావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికను వేగిరం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ఇంజనీరింగ్ విభాగాధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు మొదలెట్టారు. ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ డిజైన్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతను ఇప్పటికే ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ ఐకానిక్ బోర్డు వాక్ (స్కైవాక్) డిజైన్లు పూర్తవగానే టెండర్లు పిలిచి సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకితీసుకురావాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. పాదచారుల భద్రత కోసమే... వాహనదారులు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో పాటు సిగ్నల్ జంప్ చేసి వెళ్లడం వల్ల పాదచారులు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్లో భాగంగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం, మెట్రో కూడా అందుబాటులోకి రావడంతో వాహనాలతో పాటు జనాల రద్దీ కూడా పెరిగింది. అటు వాహనదారులు నిర్లక్ష్యంగా ఉన్నా, ఇటు పాదచారుడు గమనించకుండా ఉన్నా...ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉన్నా రోడ్డు ప్రమాదాలు జరిగితే పాదచారులే బలవుతున్నారు. ఇలా ఉప్పల్ జంక్షన్లో 2019లో దాదాపు 15 మంది వరకు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ అధికారులు స్కైవాక్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అంతా సవ్యంగా ఉంటే మరో నెల రోజుల్లోనే టెండర్లు పిలిచి నిర్మాణం దిశగా అడుగులు పడతాయని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఐకానిక్ బోర్డు వాక్ డిజైన్ తయారుచేస్తున్నామని, త్వరలోనే పూర్తవుతుందని ఆయన చెప్పారు. దీని నిర్మాణానికి రూ.ఐదు కోట్లు వ్యయం కావచ్చని తెలిపారు. ఐకానిక్ బోర్డు వాక్ అంటే... ఎక్కువ సంఖ్యలో ప్రజల సంచారం ఉండే ప్రాంతాల్లో సౌలభ్యం కోసం ఐకానిక్ బోర్డు వాక్లు ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన నగరంలో రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపునకు పాదచారులు వెళ్లేలా స్కై వాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. అయితే ఉప్పల్ జంక్షన్లో నిర్మించాలనుకుంటున్న ఐకానిక్ బోర్డు వాక్ మాత్రం దీనికి భిన్నం. ఈ వంతెన నాలుగైదు వైపులా పాదచారులు వారి గమ్యాలకు వెళ్లేలా డిజైన్ ఉంటుంది. ఉదాహరణకు ఉప్పల్ జంక్షన్ నుంచి మెట్రో స్టేషన్కు చేరుకోవాలనుకునే వారి సౌలభ్యం కోసం, అక్కడే ఉన్న పాఠశాలకు విద్యార్థులు వెళ్లేలా, నేరుగా బస్టాండ్కు చేరుకునేలా, రోడ్డు ఓవైపు నుంచి మరో రోడ్డు వైపునకు వెళ్లేలా ఈ ‘ఐకానిక్ బోర్డు వాక్’ను నిర్మిస్తారు. -
ఈస్ట్ లుక్కు ‘మైస్’ టచ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో తూర్పువైపునా అభివృద్ధి పరుగులు పెట్టాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చిన ‘ఈస్ట్ లుక్’కు మరింత ఆకర్షణీయమైన హంగులు సమకూరబోతున్నాయి. ఉప్పల్లో అతిపెద్ద మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించేలా మీటింగ్స్.. ఇన్సెంటివ్స్.. కాన్ఫరెన్సింగ్ అండ్ ఎగ్జిబిషన్ (మైస్) గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఢిల్లీ మైస్కు ధీటుగా ఇప్పటికే హైటెక్స్లో ఉన్న లెవల్–1 స్థాయి మైస్ను మించి ఉప్పల్ భగాయత్లో 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో హైటెక్ మైస్ను నిర్మించాలని హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. గతంలో ఇజ్జత్నగర్లో 16 ఎకరాల విస్తీర్ణంలో మైస్ను నిర్మించాలని నిర్ణయించారు. నగరం నలువైపులా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, ఉప్పల్లో దీనిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీనిని నిర్మించనున్నారు. దీనికనుగుణంగా సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని భావిస్తున్నారు. మైస్లో సౌకర్యాలిలా.. మైస్ను సువిశాల విస్తీర్ణంలో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా సకల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దనున్నారు. కన్వెన్షన్లో మీటింగ్ రూమ్లు, బాల్ రూమ్లు ఉండనున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లు నిర్వహించుకునేలా వసతులు కల్పించడంతో పాటు ఏకకాలంలో 400 కార్లు పార్కింగ్ చేసేలా మైస్ను నిర్మించనున్నారు. రిటైల్, ఎఫ్ అండ్ బీ వసతులు, హోటల్, సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, డార్మిటరీలు, ఎంటర్టైన్మెంట్, బిజినెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. వడివడిగా ఈస్ట్లుక్.. ‘ఈస్ట్ లుక్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్ లే అవుట్ను అభివృద్ధి చేయడంతో పాటు మినీ శిల్పరామాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ను నిర్మిస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొర్రెము ల, ప్రతాపసింగారం గ్రామాల్లో వందల ఎకరాల్లో లే అవుట్ చేసి ప్రణాళికబద్ధ అభివృద్ధికి అడుగులు పడేలా చూస్తోంది. ఇప్పుడు మైస్ రాకతో ఈస్ట్లుక్కు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని హెచ్ ఎండీఏ అధికారులు అంటున్నారు. -
అత్తింట్లో అల్లుడు అనుమానాస్పద మృతి
ఉప్పల్: నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్, ఎన్ఆర్నగర్కు చెందిన కిన్నెరస్వామి (35) డ్రైవర్గా పని చేసేవాడు. పదేళ్ల క్రితం అతడికి రామంతాపూర్ కామాక్షిపురం ప్రాంతానికి చెందిన రమాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. డిసెంబర్ 31న కిన్నెర స్వామి భార్యతో కలిసి అత్తవారింటికి వచ్చాడు. బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లివచ్చిన కొద్ది సేపటికే అతను ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా స్వామి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు శ్రీనివాస్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ విద్యార్థిని చిదిమేసిన లారీ
ఉప్పల్: రోజూలాగే ఆటోలో స్కూల్కు బయలుదేరిన ఆ విద్యార్థుల పాలిట లారీ మృత్యుశకటంలా దూసుకొచ్చింది. అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మరికొందరిని క్షతగాత్రులుగా మార్చింది. ఉప్పల్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడో తరగతి విద్యార్థి అవంత్కుమార్(13) మృతి చెందగా, ఇతని సోదరుడు వేదాంత్కుమార్ (9వ తరగతి)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులైన అన్నాచెల్లెలు అశ్రిత్ రెడ్డి (8వ), నందిని (6వ), రీతూ (10వ), కీర్తి, వైష్ణవి సమీప ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఉప్పల్ న్యూ భరత్నగర్లో ఉంటున్నారు. పది నిమిషాలే ప్రాణాలు తీసిందా... ఫిర్జాదిగూడ ప్రాంతంలో నివసించే ఆటో డ్రైవర్ వనమా శ్రీనివాస్ ఆటో (ఏపీ11వై4940)లో హబ్సిగూడ భాష్యం స్కూల్కు న్యూ భరత్ నగర్ నుంచి 9మంది పిల్లలను ప్రతిరోజూ తీసుకెళతాడు. రోజూలాగే మంగళవారం కూడా స్కూల్కు తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరినీ ఆటోలో ఎక్కించుకుంటున్నాడు. అవంత్కుమార్ ఇంటి వద్దకు రాగానే ఆటో స్టార్ట్ చేసిన సమయంలో పది నిమిషాలు మొరాయించింది. ఆ తర్వాత స్టార్ట్ అవ్వడంతో 8మందిని ఆటోలో ఎక్కించుకొని ఉదయం 7.30 గంటల ప్రాంతంలో న్యూ భరత్ నగర్ నుంచి బయలుదేరాడు. 7.50 నిమిషాలకు ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల వెనక రోడ్డు మీదుగా ఆటో సర్వే ఆఫ్ ఇండియా చౌరస్తాకు చేరుకుంది. సిగ్నల్ క్లియర్గా ఉండటంతో రోడ్డు దాటి హబ్సిగూడ వైపు మళ్లుతున్న సమయంలో తార్నాక వైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఇసుక లారీ (ఏపీ24టీఏ–5469) ఆటోను వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆటో పల్టీ కొట్టింది. లారీడ్రైవర్ మల్లేష్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఆటో పది నిమిషాల పాటు ట్రబుల్ ఇవ్వకపోతే ఈ ప్రమాదం జరిగుండేదే కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీప ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి స్కూల్ యజమాన్యానికి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఉప్పల్ ట్రాఫిక్ సీఐ కాశీ విశ్వనాథ్ మృతిచెందిన విద్యార్థిని పట్టుకుని అంబులెన్స్ ఎక్కించి గాంధీకి తరలించారు. అయితే ఉప్పల్ పోలీసు స్టేషన్కు భారీగా చేరుకున్న మృతుని బంధువులు తమకు న్యాయం జరిగేవరకు వెళ్లేదిలేదని కూర్చున్నారు. అయితే పోలీసులు నచ్చజెప్పి పంపారు. నిర్లక్ష్యంగా లారీ డ్రైవ్ చేసిన కొత్తగూడెం వాసి జి.మల్లేష్పై కేసు నమోదు చేశారు. ఆటోడ్రైవర్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదువుల్లో జీనియస్ అవంత్ సిద్దిపేట జిల్లా మర్మాముల గ్రామానికి చెందిన సుందరగిరి సంతోష్కుమార్ గౌడ్ చెంగిచర్ల డిపోలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం ఉప్పల్కు వచ్చి న్యూభరత్నగర్లో భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు వేదాంత్ (14), అవంత్కుమార్(13)తో కలసి నివాసముంటున్నాడు. అవంత్ చదువుల్లో జీనియస్ అని, అందుకే ఎన్నో కష్టాలకోడ్చి చదివిస్తున్నానని సంతోష్ అన్నారు. కొడుకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ఇంతలోనే దేవుడు ఇలా చేశాడని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రోడ్డు ప్రమాదం బాధాకరమని డీసీపీ దివ్యచరణ్ రావు అన్నారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లారీ డైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వేగంగా వస్తున్న లారీ.. ఆటోని గమనించి బ్రేక్లు వేసినట్లు తమ దర్యాప్తులో తెలిందని చెప్పారు. మంగళవారం ఉదయం ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా.. ఏడుగురు గాయపడిన సంగతి తెలిసిందే. విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి అవంత్ మృతదేహన్ని గాంధీ ఆసుపత్రి తరలించగా బాలుడి తండ్రి ఆసుపత్రి చేరుకున్నారు. ప్రస్తుతం బాలుడి మృతదేహనికి గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అరెస్టు చేశామని, అతనిపై సెక్షన్ 304(ఎ), 337, 279 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే రాచకొండ పరిధిలో రాత్రి 10:30 నుంచి ఉ. 8 గంటల వరకు భారీ వాహనాలకు పర్మిషన్ ఉందని, ప్రమాదం ఉదయం 7.50 గంటల సమయంలో జరిగిందని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపిస్తున్న ఆటో ఫిట్నెస్ వివరాలను పోలీసులను కానీ, ఆర్టీఏ అధికారుల వద్ద కానీ అడిగి తెలుసుకోవాలన్నారు. అయితే తమ దర్యాప్తులో స్కూల్ ఆటో ఫిట్నెస్ సక్రమంగానే ఉందని, లారీ కండిషన్ ఎలా ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే స్కూల్ ఆటో ఆరుగు విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు. సిగ్నల్ క్రాస్ అయ్యే సమయంలో ఆటో డ్రైవర్ సంయమనం పాటించాలని సూచించారు. అలాగే ఉప్పల్ ఎస్సై సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం బాధాకరమైనదని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ప్రయాణించిన ఆటో పర్మిట్ను పరిశీలించామని, ఆటోకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించామన్నారు. లారీకి సంబంధించిన ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు కూడా పరిశీలింస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరి నిర్లక్ష్యమనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది
-
గాయపడిన విద్యార్థులకు ప్రాణాపాయం లేదు!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురు విద్యార్థుల్ని తమ ఆస్పత్రిలో చేర్చారని, అందులో ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ బాలాజీ తెలిపారు. గాయపడిన మిగతా ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి భుజానికి గాయమైందని, అతన్ని రెండురోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మరో విద్యార్థి జనరల్ వార్డులో ఉన్నాడని, సాయంత్రం అతన్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా.. ఏడుగురు గాయపడిన సంగతి తెలిసిందే. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక, ప్రమాదంలో మృతిచెందిన అవంత్కుమార్ తల్లిదండ్రులు, బంధువులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. లారీ ఓనర్ను కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నో పర్మిట్ సమయంలో లారీలు తిరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు మృతితో అవంత్ అవంత్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన కొడుకు చాలా తెలివైనవాడని, ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడని తండ్రి సంతోష్ కన్నీరుమున్నీరవుతూ మీడియాకు తెలిపారు. ఈ దారుణమైన రోడ్డుప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఉప్పల్లో ఇసుక లారీ బీభత్సం