Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Minister Satya Kumar Yadav On CBN Wealth creation
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’

న్యూఢిల్లీ, సాక్షి: నారా చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన హయాంలో ఏ ఒక్కసారి కూడా రెవెన్యూ మిగులు లేదు. ప్రతి ఏడాదీ రెవెన్యూ లోటుతోనే పాలన సాగడం విశేషం. అలాంటిది మరోసారి సంపద సృష్టించి పేదలకు పంచుతానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన మంత్రివర్గంలోని ఒకరు చంద్రబాబు సంపద సృష్టిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారిప్పుడు. సంపద సృష్టించడానికి మా వద్ద అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పిన మాట ఇది. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. పైగా ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు, భత్యాల కోసం అప్పులు తప్పట్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు తోడు.. కేవలం సంపద సృష్టి కోసమే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, మౌలిక వసతులు నిర్మిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. చంద్రబాబు ఎన్నికల హామీలపై ప్రచార సమయంలోనే.. వైఎస్‌ జగన్‌ జనాలను అప్రమత్తం చేసే యత్నం చేశారు. అవి మోసపూరిత ప్రకటనలన్నారు. సంపద సృష్టి అనేది చంద్రబాబు మోసాల్లో ఓ భాగమని చెప్పారు. అలాగే కూటమి హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1,50,718 కోట్లు కావాలని లెక్కలతో సహా వివరించారు. అయితే.. అధికారంలోకి వచ్చాక ‘వీటన్నింటికీ డబ్బులెక్కడినుంచి తెస్తారు’? అని ప్రశ్నిస్తే మాత్రం అరిగిపోయిన రికార్డులాగా.. సంపద సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు. ఆర్థిక క్రమశిక్షణ లేని సీఎంగా పేరున్న చంద్రబాబు గత మూడు టర్మ్‌లు ఎంత సంపద సృష్టించారు? ఎంతమందికి పంచిపెట్టారు..? అనే విశ్లేషణలు తరచూ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు స్వయానా ఆయన కేబినెట్‌లోని మంత్రి తాజా ప్రకటనతో.. ఆ సంపద సృష్టి కూడా మోసం అనేది తేటతెల్లమయ్యింది.

Joe Biden Says Kamala Harris Could Be President Of US
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్‌.. హింట్‌ ఇచ్చిన బైడెన్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్‌ తప్పుకోవాలనే డిమాండ్‌ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌.. అ‍ధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్‌ కామెంట్స్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్డ్‌ పీపుల్స్‌(NAACP) అన్వాల్‌ కన్వేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. కమలా హారీస్‌ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్‌ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్‌ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్‌ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్‌ పార్టీకి భవిష్యత్‌ అని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్‌.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్‌ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ను ఓ‍డిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో భేటీ సందర్భంగా బైడెన్‌ తేలిపోయాలి. దీంతో, బైడెన్‌ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్‌ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్‌ చేశారు. బైడెన్‌ స్థానంలో కమలా హారీస్‌కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీస్‌ బెటర్‌ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్‌ఎన్‌ సర్వేల్లో కమలా హారీస్‌కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు మాత్రం 47 శాతం ఓటింగ్‌ వచ్చింది.

TPCC Key Meeting At Praja Bhavan Live Updates
రుణమాఫీ చేస్తున్నాం.. హరీష్‌ రాజీనామాకు సిద్ధమా?: సీఎం రేవంత్‌

Updates..టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌..👉ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పిన దాని కంటే ముందే చేస్తున్నాం. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలామంది మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించాం. 👉60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలి. దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదు.👉వ్యవసాయం దండుగ కాదు పండుగ. రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో‌ ముడిపడి ఉంది. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుంది. ఆగస్టు 15వ తేదీ లోపల మరో లక్ష రూపాయలు వేస్తాం అని చెప్పుకొచ్చారు. 👉రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలి. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలి. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ మోదీ హామీ కాదు. ఇది రాహుల్ గాంధీ హామీ. దివంగత మహానేత వైఎస్సార్‌ ఉచిత కరెంట్‌, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అలాగే, రుణమాఫీ గురించి కూడా 20 ఏళ్లపాటు చెప్పుకోవాలి.👉విజయ్‌ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు, వేల కోట్ల అప్పులు ఉన్నవాళ్లకి కూడా ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనిపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలి. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌.. 👉‘ఆగస్టు దాటకుండానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అమలుకు నిద్రలేని రాత్రులు గడిపాం. అర్హులైన అందరికీ రైతు రుణమాఫీ చేస్తాం. రూ.7లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టినప్పటికీ రూ.2లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాం. రేషన్‌కార్డులు లేని ఆరు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాం. అయితే, అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. 👉 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. 👉 కాగా, రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ‍ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొం‍దిస్తున్నారు. 👉 కాసేపట్లో ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది.👉పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. 👉ఇక, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.👉ప్రజాభవన్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ గాంధీభవన్‌ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.👉మరోవైపు ఈరోజు భేటీలో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయ​ంపై చర్చ జరుగనుంది. అలాగే, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌పై పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేయనున్నారు.👉ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారు.👉అలాగే, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.👉ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్‌ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్‌ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

HYLENR world first cold fusion technology to generate clean energy
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి

కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్‌!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్‌ ఫ్యూజన్‌ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సిద్ధార్థ దొరై రాజన్‌! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్‌ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్‌ రియాక‌్షన్‌’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్‌ రియాక‌్షన్స్‌లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక‌్షన్స్‌ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్‌ బుధవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్‌ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్‌! టి-హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్‌ రియాక‌్షన్‌ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్‌ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్‌ ఫైష్‌మాన్‌, స్టాన్లీ పాన్స్‌ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్‌ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్‌ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్‌ ఇన్నొవేటింగ్‌ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్‌ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్‌ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక‌్షన్‌ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్‌ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్‌ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!!

Naveen Polishetty About His Injuries And Shooting Updates
కుడి కాలు, చేయి ఫ్రాక్చర్‌.. కోలువకోడం కష్టంగా ఉంది: నవీన్‌ పొలిశెట్టి

టాలీవుడ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్‌ అయినట్లు మార్చి నెలలో ప్రచారం జరిగింది. బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్‌ అయి కిందపడిపోయాడని, చేతికి బలమైన గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి తప్పనిసరని వైద్యులు సూచించినట్లు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు తనకు యాక్సిడెంట్‌ జరిగిన విషయం నిజమేనని ధ్రువీకరించాడు నవీన్‌ పొలిశెట్టి.కష్టకాలం..ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. 'ఇటీవలే జరిగిన ఓ ప్రమాదంలో కుడి చేయి, కుడి కాలు ఫ్రాక్చర్‌ అయింది. దీనినవల్ల ఎంతో ఇబ్బందిపడుతున్నాను. ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌ కూడా చేయలేకపోతున్నాను. ఈ గాయం వల్ల సినిమాలు ఆలస్యమయ్యేట్లున్నాయి. ఇది నాకు కష్టమైన, బాధాకరమైన సమయం. పూర్తి రికవరీ కోసం వైద్యుల సలహాతో మెడిసిన్ తీసుకుంటున్నాను. పూర్తిగా కోలుకునేందుకు..కోలుకోవడానికి మరికొన్ని నెలలు పట్టేటట్లు ఉంది. ఈసారి మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. గుడ్‌న్యూస్‌ ఏంటంటే.. నా అప్‌కమింగ్‌ ప్రాజెక్టుల స్క్రిప్ట్స్‌ అద్భుతంగా, మీకు నచ్చేవిధంగా రూపు దిద్దుకుంటున్నాయి. వాటి కోసం చాలా ఎగ్జయిట్‌ అవుతున్నా. కోలుకున్న వెంటనే షూటింగ్‌ మొదలుపెడతాను. ఏదైనా అప్‌డేట్స్‌ ఉంటే నేనే చెప్తాను. మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అందిస్తున్న సపోర్ట్‌కు థాంక్యూ.. మీ జానెజిగర్‌' అంటూ ఎక్స్‌లో ఓ నోట్‌ రిలీజ్‌ చేశాడు. Life update. Have unfortunately suffered severe multiple fractures in my hand 💔 and injured my leg too :( It’s been very tough but working towards full recovery so I can perform at my energetic best for you. Your support, patience and love is the only medicine I need ❤️… pic.twitter.com/IY0cYiAuDU— Naveen Polishetty (@NaveenPolishety) July 17, 2024 చదవండి: సినిమాకు అవార్డులు.. కానీ ఏం లాభం? రూ.22 కోట్ల నష్టం!

Karnataka CM Siddaramaiah Posts On 100% Quota Bill, Deletes Later
‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్‌ చేసిన సీఎం

ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్‌ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్‌ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్‌ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్‌ సీ, డీ గ్రేడ్‌ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్‌ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్‌ చేశారు.ರಾಜ್ಯದ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳು ಹಾಗೂ ಇತರೆ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಆಡಳಿತಾತ್ಮಕ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.50 ಹಾಗೂ ಆಡಳಿತಾತ್ಮಕವಲ್ಲದ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.75 ಮೀಸಲಾತಿ ನಿಗದಿಪಡಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ಸೋಮವಾರ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ… pic.twitter.com/Rz6a0vNCBz— Siddaramaiah (@siddaramaiah) July 17, 2024 తాజాగా దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లోని నాన్‌ మెనేజ్‌మెంట్‌ ఉద్యోగాల్లో స్థానికులకు (కన్నడిగులకు) 70 శాతం.. మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ లాడ్‌ పేర్కొన్నారు. అయితే బిల్లులో గ్రూప్‌ సీ, డీ పోస్టుల్లో మొత్తం 100 శాతం స్థానికులకే కేటాయిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.అదే విధంగా ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యం ఉన్న స్థానికులు లేకపోతే.. కంపెనీలు.. ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చిని పేర్కొన్నారు. ‘ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు కలిగిన కన్నడిగులలో లేకపోతే వాటిని అవుట్‌సోర్సింగ్ ఇవ్వవచ్చు. నైపుణ్యం కలిగిన కార్మికులలను వెలికి తీసీ..స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని మంత్రి వెల్లడించారు. "కర్ణాటకలో తగినంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉందని.. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. కన్నడిగులకు 70 శాతం పని ఇవ్వాలని తాము కంపెనీలను అడుగుతున్నామని ఒకవేళ ఇక్కడ తగిన ప్రతిభ లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చని అన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లు వల్ల అనేకమంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఈ బిల్లు వివక్షాపూరితమైనది, తిరోగమనపూరితమైనది, ఫాసిస్ట్ బిల్లు అంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఎక్స్‌లో అన్నారు. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని ఇతరులను ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరు స్థానికులు?కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్‌ఎ్‌ససీ సర్టిఫికెట్‌ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది.

Gambhir Discussed Squad For Sri Lanka Series With Selectors
హార్దిక్‌ టీ20లకు మాత్రమే.. రాహుల్‌, అయ్యర్‌ రీఎంట్రీ ఖరారు..!

బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమిండియా కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ నిన్న (జులై 16) సెలెక్షన్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా శ్రీలంక పర్యటన కోసం​ ఎంపిక చేయబోయే భారత జట్టుపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. లంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉంటాడని సమాచారం​. తొలుత ఈ సిరీస్‌లో రోహిత్‌ ఆడడని ప్రచారం జరిగింది. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 దృష్ట్యా రోహిత్‌ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు లంకతో వన్డేలకు కోహ్లి, బుమ్రా అందుబాటులో ఉండడం లేదన్న విషయం కన్ఫర్మ్‌ అయ్యింది. వీరిద్దరికి బీసీసీఐ విశ్రాంతి కల్పించినట్లు సమాచారం. నిన్నటి సమావేశంలో ముఖ్య అంశాలు..రోహిత్‌ అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్‌తో కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వడం ఖరారైంది. హార్దిక్‌ పాండ్యా కేవలం టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. భారత టీ20 కెప్టెన్సీ రేసులో పాండ్యాతో పాటు సూర్యకుమార్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.కాగా, శ్రీలంక పర్యటనలో భారత్‌ తొలుత టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌లో వన్డే సిరీస్‌ జరుగనుంది. ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్‌ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్‌ కొలొంబోలో జరుగనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత జట్టును ఇవాళో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.

Deepika Padukone Reveals She Eats Well, Hates Fad Diet; Check Details
డైట్‌ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్‌ సీక్రెట్స్‌

తన తొలి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతున్న స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణే తన డైట్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను బాగా తింటానని, ఫ్యాడ్ డైట్‌పై తనకస్సలు నమ్మకం లేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ డైట్‌లో భాగమైన కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఫ్యాడ్ డైట్‌ని ఫాలో అయ్యే కంటే బాగా తినడానికేతాను ఇష్టపడతానని వెల్లడించింది. (ఫాడ్ డైట్: తొందరగా,సులువుగా, అనూహ్యంగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక).నిండు గర్భిణి దీపికా పదుకొణె మాతృత్వ అనుభవం కోసం రోజులు లెక్కిస్తోంది. తన ప్రెగ్నెన్సీ జర్నీ, అనుభవాలు, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌పై తన ఫ్యాన్స్‌తో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన డైట్‌కు సంబంధించి పిక్స్‌ షేర్‌ చేసింది. తన బాలెన్స్‌డ్‌ డైట్‌ వెనుక రహస్యాన్ని దీపిక బుధవారం వెల్లడించింది. రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన మూడు చిత్రాలను షేర్ చేసింది. దీంతో పాటు ఒక సుదీర్ఘ నోట్‌ కూడా పెట్టింది. ఇందులో డైట్‌ అంటే ఏంటో ఇలా వివరించింది."నా ఫీడ్‌లో దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను బాగా తింటాను! నాకు తెలిసిన ఎవరినైనా అడగండి. బాగా తింటా. కాబట్టి మీరు విన్న లేదా చదివిన దాన్ని నమ్మవద్దు. 'డైట్' అనే పదం చుట్టూ చాలా అపార్థాలున్నట్లు అనిపిస్తుంది, 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం లేదా మనకు నచ్చని వస్తువులన్నింటినీ తినడం అని అనుకుంటాం. బాలెన్స్‌, క్రమం తప్పకుండా తింటూ, మన బాడీ మాట వినడమే ఇదే అసలైన ట్రిక్‌.’’ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) డైట్ నిజమైన అర్థం ఒక వ్యక్తి పూర్తిగా తినే ఆహారం, లేదా పానీయం అని దీపిక పేర్కొంది.. 'డైట్' అనే పదం గ్రీకు పదం 'డైటా' నుండి వచ్చింది. అంటే జీవిన విధానం అని అర్థంని, తానెపుడు విపరీతమైన ఆహారపు అలవాట్లకు బదులు సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తానని వెల్లడించింది.కాగా రిలయన్స్‌ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లిలో దీపికా తన బేబీ బంప్‌తో అందంగా కనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా చక్కటి అనార్కలీ, దుప్పట్టాతో స్టయిలిష్‌గా కనిపించింది. సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మ నివ్వబోతున్నా మని దీపికా, ఆమె భర్త నటుడు రణవీర్‌ సింగ్‌ గతంలో ప్రకటించారు.

Paris Olympics 2024: IOA Releases List of 117 Athletes 140 Support Staff Members
విశ్వ క్రీడలకు భారత్‌ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడాకారుల జాబితాలో షాట్‌ పుట్టర్‌ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.అభా పేరు మాయంవరల్డ్‌ ర్యాంకింగ్‌ కోటాలో ఆమె ప్యారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ , ఒలింపిక్‌ పార్టిసిపెంట్స్‌ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.కాగా ప్యారిస్‌ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్‌ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్‌ టీమ్‌లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.ఇక టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్‌, ఆర్చరీ, బాక్సింగ్‌ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్‌ క్రీడాకారులు, ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు, సెయిలింగ్‌, స్విమ్మింగ్‌ నుంచి ఇద్దరు చొప్పున..నాటి పసిడి ప్రత్యేకంఅదే విధంగా.. ఈక్వెస్ట్రియన్‌, జూడో, రోయింగ్‌ , వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్‌ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత్‌ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్‌.. ఆడుదాం ఒలింపిక్స్‌

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
title
అగ్నివీర్‌లకు పోలీస్‌, మైనింగ్‌ గార్డు ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

title
ఎన్నికల్లో ఓటమి.. బీజేపీ నేత కొత్త నినాదం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికా

title
‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్‌ చేసిన సీఎం

ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్‌ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది.

title
ధోతీ ధరించాడని.. మాల్‌లోకి అనుమతి నిరాకరణ!

బెంగళూరు: ధోతీని ధరించినందుకు ఓ వృద్ధరైతుకు షాపింగ్‌మాల్‌లోక

title
యూపీ బీజేపీలో బిగ్‌ ట్విస్ట్‌.. సీఎం యోగిపై కేశవ్‌ మౌర్య ప్లానేంటి?

లక్నో: ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.

NRI View all
title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

title
టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర

title
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all