పలువురు విద్యార్థులకు అస్వస్థత
● బాదంకాయలనుకుని వేరే కాయలు తిన్న జయగిరి వసతి
గృహం విద్యార్థులు
● ఆరుగురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
ఎంజీఎం : హసన్పర్తి మండలం జయగిరి గ్రామంలోని మహాత్మా రావుజ్యోతి పూలే వసతి గృహంలో బాదంకాయల మాదిరిగా ఉన్న వాటిని తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు శుక్రవారం బాదంకాయలు అనుకుని అదేమాదిరిగా ఉన్న వేరేకాయలను తిన్నారు. విషయం తెలుసుకున్న వైద్యార్యోగశాఖాధికారులు అక్కడికి చేరుకుని వారిని పరిశీలించారు. వసతి గృహంలోనే చికిత్స అందించినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఐదవ తరగతి చదువుతున్న సుశాంత్, సచిన్, హరికృష్ణ, సామ్యూల్, చందు, రిషిత్లను మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment