కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో తెలు గు విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరి జ్యోతి ఈఏడాది జనవరి 9న మృతి చెందిన విషయం వి ధితమే. అయితే ఆ విభాగంలో రెగ్యులర్ ప్రొఫెస ర్లు లేరు. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస ర్లు మామిడి లింగయ్య, మంథిని శంకర్, చిర్రరాజు , కర్రె సదాశివ్ ఉన్నారు. ఆ నలుగురిలో సీనియార్టీ ప్రాతిపదికన ఒకరిని విభాగం అధిపతిగా, మరొకరిని బోర్డు ఆఫ్స్టడీస్ చైర్మన్గా నియమించాల్సింటుంది. అయితే ఆ నలుగురు కూడా ఆ పదవులు ఆశిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ వీసీ కె. ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీరిలో ఎవరిని విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్స్టడీస్ చైర్మన్గా నియమించడానికి సీనియార్టీ తేల్చాలని వీసీ ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది జనవరి నెలాఖరులో అ ప్పటి రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి ఈ కమిటీని నియమి స్తూ వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కమిటీని నియమించి రెండు వారాలు గడిచినా ఇప్పటివరకూ రిపోర్టు ఇవ్వలేదు. దీంతో ఈ కమిటీని నియమించింది కాలయాపనకేనా? ఇంకెప్పుడు సీనియార్టీని తేలుస్తారని ఆ నలు గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నా రు. జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటీని యూ నివర్సిటీలో చర్చ సాగుతోంది. అయితే కమిటీ మాత్రం ఆరోపణలు పట్టించుకోదని, తాము ఆ నలుగురిలో సీనియార్టీని మాత్రమే పరిశీలించి త్వరలోనే రిపోర్టు అందజేస్తామని కమిటీలో ఉన్న ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 17న కమిటీ సమావేశమై సీనియార్టీని తేల్చి రిపోర్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఆ నలుగురిలో ఎవరు విభాగం అధిపతి, బీఓఎస్గా నియామకం అవుతారనే అంశం యూనివర్సిటీలో ఆసక్తికరంగా మారింది.
కమిటీని నియమించి రెండువారాలు
ఇంకా సమర్పించని నివేదిక
తెలుగు అధిపతి, బీఓఎస్
నియామకమెప్పుడు?
నేడు కమిటీ సమావేశమయ్యే అవకాశం!
Comments
Please login to add a commentAdd a comment