వరంగల్ అర్బన్: నాలా నిర్మాణానికి సహకరిస్తే కాలనీవాసులకు న్యాయం చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. వరంగల్ 42 వ డివిజన్లోని తెలంగాణ కాలనీని టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక ప్రజల సౌకర్యార్థం నాలా నిర్మాణానికి భూ యజమానులు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్చంద్ర, ఇన్చార్జ్ సీపీ రవీంద్రరాడేకర్, ఈఈ శ్రీనివాస్, టీపీఎస్ అనిల్, ఏఈ మోజామిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment