అభివృద్ధికి ప్రజలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ప్రజలు సహకరించాలి

Published Thu, Mar 6 2025 1:26 AM | Last Updated on Thu, Mar 6 2025 1:26 AM

అభివృద్ధికి ప్రజలు సహకరించాలి

అభివృద్ధికి ప్రజలు సహకరించాలి

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. 8, 10వ డివిజన్ల పరిధిలోని హనుమకొండ చౌరస్తా, టైలర్‌స్ట్రీట్‌, ఇందిరానగర్‌, రాయపుర ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేస్తానని అన్నారు. చౌరస్తాలో ట్రాఫిక్‌ సమస్య, టైలర్స్‌ స్ట్రీట్‌, ఇందిరానగర్‌లో డ్రెయినేజీ సమస్యల పరిష్కారంతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. రాయపురలో నిర్మాణంలో ఉన్న డ్రెయిన్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement