
కొత్త రూట్లలో ఏసీ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా రెండు రూట్లలో గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఈ నెల 3వ తేదీ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు లింగంపల్లి నుంచి మెహిదీపట్నం (216 డబ్ల్యూ) రూట్లో ప్రతిరోజూ 4 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి నుంచి మొదటి బస్సు ఉదయం 6.50 గంటలకు బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 10.10 గంటలకు బయలుదేరుతుంది. అలాగే.. మెహిదీపట్నం నుంచి మొదటి బస్సు ఉదయం 8 గంటలకు, చివరి బస్సు రాత్రి 11 గంటలకు మెహిదీపట్నం నుంచి లింగంపల్లికి బయలుదేరనుంది. ఈ రూట్లో నల్లగండ్ల, గోపన్పల్లి, విప్రో, ఖాజాగూడ, నానల్నగర్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. అలాగే లింగంపల్లి– లక్ష్మీనగర్ జీఏఆర్ (216జీ) రూట్లో రెండు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. లింగంపల్లిలో మొదటి బస్సు ఉదయం 6.15 గంటలకు చివరి బస్సు రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతాయి. లక్ష్మీనగర్ జీఏఆర్ నుంచి మొదటి బస్సు ఉదయం 7.05 గంటలకు చివరి బస్సు రాత్రి 9.55 గంటలకు బయలుదేరుతాయి.
Comments
Please login to add a commentAdd a comment