పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి..ఇరువురికి గాయాలు | - | Sakshi

పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి..ఇరువురికి గాయాలు

Mar 27 2025 6:05 AM | Updated on Mar 27 2025 6:05 AM

పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి..ఇరువురికి గాయాలు

పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి..ఇరువురికి గాయాలు

దూద్‌ బౌలి: పాతబస్తీలోని చారిత్రక కట్టడం పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం రాత్రి వందలాది మంది రంజాన్‌ షాపింగ్‌లో మునిగి ఉండగా..అకస్మాత్తుగా పత్తర్‌గట్టీ భవనంలోని ఓ షాపు కిటికీ పైనుంచి గచ్చు పెచ్చులు ఊడిపడగా షాపు ముందున్న ఓ చిరువ్యాపారి, మరో యువకుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చార్మినార్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పురావస్తు శాఖ అధికారులు చారిత్రాత్మక కట్టడం అయినా పత్తర్‌గట్టి భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement