ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఏఈ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఏఈ

Mar 28 2025 6:16 AM | Updated on Mar 28 2025 6:15 AM

దుండిగల్‌: విద్యుత్‌ కేబుల్‌ లైన్‌ మార్చడానికి లంచం డిమాండ్‌ చేసిన విద్యుత్‌ శాఖ ఏఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం దుండిగల్‌ మున్సిపల్‌ పరిధిలోని డీపోచంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న సురేందర్‌రెడ్డి 11కేవీ విద్యుత్‌ లైన్‌ మార్చడానికి, ఓ భవనానికి కేబుల్‌ లైన్‌ వేయడానికి సదరు భవన యజమాని నుంచి రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. ఈ విషయమై సదరు భవన యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించారు. అధికారులు సూచించిన విధంగా గురువారం ఏఈ సుందర్‌రెడ్డికి ఆయన కార్యాలయంలో నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement