![92 Year Old Indian Woman Visit Her Ancestral Home In Pakistan - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/17/Pakistan.jpg.webp?itok=M_AXpTTY)
ఇస్లామాబాద్: సుహృద్బావన చర్యలో భాగంగా పాకిస్తాన్ హైకమిషన్ రీనా చిబర్ అనే 92 ఏళ్ల భారతీయ మహిళకు మూడు నెలల వీసాను జారీ చేసింది. దీంతో ఆమె తన పూర్వీకులు ఇంటిని సందర్శించడానికి పాకిస్తాన్ పయనమయ్యింది. ఈ మేరకు ఆమె పాకిస్తాన్లోని రావల్పిండిలో ప్రేమ్నివాస్లో ఉన్న తన పూర్వీకుల ఇంటిని చూసేందుకు శనివారం వాఘా అట్టారీ సరిహద్దులను దాటి వెళ్లింది. సదరు మహిళ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో భారత్కి తరలివెళ్లింది.
అప్పుడు ఆమెకు 15 ఏళ్లు. ఆ తర్వాత 1965లో ఆమె పాకిస్తాన్లో ఉంటున్న తన పూర్వీకుల ఇంటిని సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేసింది. ఐతే ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా... తీవ్ర ఉద్రిక్తల నడుమ ఆమెకు వీసా లభించలేదు. ఆ తదనంతరం ఆమె ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆమెకు వీసా లభించలేదు.
ఎన్నో సిఫార్సులు, మరికొద్దిమంది పలుకబడిన వ్యక్తుల సహాయ సహకారాలతో ఆమె పాకిస్తాన్ హై కమిషన్ నుంచి వీసా పొందగలిగింది. ఈ మేరకు ఆమె తనకు ఇరు దేశాల నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా వీసా పరిమితులను సడలించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. తన పూర్వీకులు ఇంటిని, స్నేహితులను కలుసుకున్నాందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment