పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన IMF | IMF 11 New Conditions For Pakistan After Operation Sindoor | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన IMF

May 18 2025 2:00 PM | Updated on May 18 2025 2:44 PM

IMF 11 New Conditions For Pakistan After Operation Sindoor

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. పాకిస్తాన్‌పై కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో, పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను ఐఎంఎఫ్‌ విధించింది. తాజాగా విధించిన షరతులతో ఐఎంఎఫ్‌ విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్‌గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్‌ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తోంది.

కొత్త షరతులు ఇవే.. 
జూన్ 2025 లోగా ఐఎంఎఫ్‌ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించాలి. ఐఎంఎఫ్‌ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇది 2028 నుండి సంస్థాగత మరియు నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తుంది.

అలాగే, జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమం ఇంకా వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది.

ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది. వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్‌ సర్కార్‌ను ఐఎంఎఫ్‌ కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్‌ విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్‌కు టెన్షన్‌ మొదలైనట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement