breaking news
Shahbaz Sharif
-
పాకిస్తాన్ సర్కార్కు బిగ్ షాక్.. పీవోకేలో ఆందోళనలు.. ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK) ఉద్రికత్త చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలను కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee (AAC)) నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో భారీ నిరసనలు చేపట్టారు. కాగా, అవామీ యాక్షన్ కమిటీ.. 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను డిమాండ్లను పాక్ ప్రభుత్వానికి ఇచ్చింది. పీఓకేలో మౌలిక సంస్కరణలు (Structural Reforms) తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ‘‘షటర్-డౌన్.. వీల్-జామ్’’ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో ముఖ్యంగా.. పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వు చేయబడిన పీవోకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలని, ఇది ప్రాతినిధ్య పాలనను దెబ్బతీస్తుందని తెలిపింది.#BREAKING: Thousands of civilians to launch massive protests in Pakistan Occupied Kashmir (PoK) tomorrow against Pakistani Govt under leadership of Awami Action Committee. Pak forces bring thousands of troops from Punjab to crush protest. Internet shutdown from midnight in PoK. pic.twitter.com/nfeSviJHsC— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025ఈ సందర్బంగా అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్లో మాట్లాడుతూ..‘మా ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదు. గత 70 సంవత్సరాలుగా మా ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే పోరాటం. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. ఈ క్రమంలో పీవోకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ (Protests In PoK) రోడ్ల పైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకురావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాక్ సైనికులు అక్కడికి చేరుకున్నట్టు పౌరులు తెలిపారు. ఇక, ఆందోళనల నేపథ్యంలో పీవీకే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. చెక్ పోస్టులు, ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. Pakistani occupational forces are committing genocide in Pakistan-occupied Kashmir. @UNHumanRights remains silent. @BBCWorld @AJEnglish ignore it because it doesn’t suit their agendas. #POK #Kashmir #HumanRights pic.twitter.com/MxC1VCG6O1— Sabharwal (@GulshanKum6415) September 28, 2025 -
భారత్-పాక్ యుద్ధం, సింధూ జలాలపై షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ఆపరేషన్ సిందూర్, సింధూ నదీ జలాలపై పాకిస్తాన్(Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif) సంచలన ఆరోపణలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని షరీఫ్ ఐక్యరాజ్య సమితి(UN) వేదికగా ఆరోపించారు. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని.. ఇది యుద్ధ చర్యకు సమానం అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) చొరవ ప్రశంసనీయం అంటూ మెచ్చుకున్నారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేత నాయకత్వ చొరవ ప్రశంసనీయం. ట్రంప్ చర్యలు, నిర్ణయాలతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు ట్రంప్ నిజాయతీగా కృషి చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నారు. బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ట్రంప్ దూరదృష్టి గల నాయకత్వంలో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది. ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే భారత్-పాక్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగేది. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన విశేష కృషికి గాను పాక్.. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది’ అని చెప్పుకొచ్చారు. Pakistani Prime Minister Shehbaz Sharif about Trump: 🇵🇰❤️🇺🇸“Pakistan has nominated Trump for the Nobel Peace Prize, and this is the least we can do for his love of peace. He is truly a man of peace.”pic.twitter.com/xYPcXvmX6O— S.Haidar Hashmi (@HaidarHashmi0) September 27, 2025అనంతరం, సింధూ జలాలు, కశ్మీర్ అంశంపై షరీఫ్ స్పందిస్తూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసింది. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇది యుద్ధ చర్యతో సమానం. కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం ఐరాస ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలి. ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీటీపీ, బీఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం’ అని తెలిపారు.షరీఫ్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్.. మరోవైపు షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ..‘పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఐరాసలో బాధిత దేశంగా నటించే పాక్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది. పాక్లోని ఉగ్ర స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని డిమాండ్ చేసింది. Breaking:Pakistan must shut down terror camps, hand over terrorists to India, Indian Diplomat @petal_gahlot's right of reply to Pakistan PM Shehbaz Sharif at UNGAFull address pic.twitter.com/WoxZM93cBl— Sidhant Sibal (@sidhant) September 27, 2025 -
కశ్మీర్ ప్రజలకు మా మద్దతు
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ భారత ప్రభుత్వమే కారణ మని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ విమర్శించారు. నిష్పక్షపాతంగా ప్రజాభి ప్రాయ సేకరణ జరగాలని జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నా రని, వారికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. స్వయం పాలన వారి ప్రాథమిక హక్కు అని తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా అది తమపై యుద్ధంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. నాలుగు రోజులపాటు ఘర్షణ జరిగిందని, పాక్ వైమానిక దళం దాడుల్లో భారత్కు చెందిన ఏడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అన్ని కీలక అంశాలపై భారత్తో సమగ్ర చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అన్ని రకాల వివాదాలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్నది తమ విధానమని పేర్కొన్నారు. భారత్తో సంప్రదింపులకు నిజాయితీతో కృషి చేస్తున్నామని చెప్పారు. నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదిస్తున్నాం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై షెహబాజ్ షరీఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాసియాలో భారీ యుద్ధం ఆగిందంటే అదంతా ట్రంప్ చలవేనని తేల్చిచెప్పారు. భారత్, పాక్ల మధ్య శాంతికోసం ట్రంప్ ఎంతగానో చొరవ తీసుకున్నారని వెల్లడించారు. ఆయన వల్లే యుద్ధం ఆగిపోయిందన్నారు. ట్రంప్ సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా ట్రంప్ పేరును నామినేట్ చేస్తోందని తెలియజేశారు. -
ట్రంప్ శాంతి దూత: షరీఫ్
న్యూయార్క్/ఇస్లామాబాద్: అమెరికా–పాకిస్తాన్ల మధ్య బంధం నానాటికీ బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్పై కన్నెర్ర చేస్తూ, మరోవైపు పాక్ పాలకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పరస్పరం సహకారంతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించారు. గత ఆరేళ్లలో వైట్హౌస్లో అడుగుపెట్టిన మొట్టమొదటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ట్రంప్ను శాంతిదూతగా షరీఫ్ అభివరి్ణంచారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు నిలిపివేయడానికి ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ట్రంప్ సాహసోపేత, నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ఉద్ఘాటించారు. దక్షిణాసియాలో అతిపెద్ద యుద్ధం జరగకుండా ట్రంప్ నివారించారని పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా–పాక్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం షెహబాజ్ షరీఫ్ వ్యక్తంచేశారు. వీలును బట్టి పాకిస్తాన్లో పర్యటించాలంటూ ట్రంప్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీ కంటే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప నాయకుడు వైట్హౌస్కు రాబోతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: ‘ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి..’మారిన ట్రంప్ వైఖరి 2019 జూలైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఇమ్రాన్ ఖాన్కు అతికష్టంమీద ట్రంప్ అపాయింట్మెంట్ దొరికింది. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, అమెరికాకు దగా చేస్తూ సహాయం రూపంలో బిలియన్ల డాలర్ల నిధులు పొందుతోందని ట్రంప్ ఆ సమయంలో ఆరోపించారు. పాక్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా పాకిస్తాన్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించారు. పాక్ ప్రధానమంత్రులతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు బైడెన్ ఇష్టపడలేదు. వారిని ఏనాడూ వైట్హౌస్కు ఆహ్వానించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిపోయింది. పాక్ పట్ల పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పట్ల ట్రంప్ అంతులేని అనురాగం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. Just Now 🇵🇰🇺🇸🚨 Pakistan PM Shahbaz Sharif, Field Marshal Asif Munir with US President Donald Trump, and Secretary of State Marco Rubio at The White House.Photos 📷#America #MAGA #Pak #USA pic.twitter.com/VKOXTecLpx— Mayank (@mayankcdp) September 26, 2025 -
భారత్ టార్గెట్గా పాక్ చర్యలు.. ఆ దేశంతో సంచలన ఒప్పందం
ఇస్లామాబాద్: భారత్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్తో యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. సౌదీ తప్పకుండా పాక్కు అండగా పోరాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. పాకిస్తాన్ అణ్వాయుధ తనిఖీలకు ఎప్పుడూ సహకరిస్తుందని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడదని పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని పేర్కొన్నారు.Pakistan Defence Minister Khawaja Asif claims that Saudi Arabian troops will get involved if there is a military confrontation between India and Pakistan as part of new Pakistan-Saudi Military pact even though no countries have been named in the pact as aggressors. pic.twitter.com/AxPwHTNOef— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 19, 2025చాలా ఏళ్లుగా తాము సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దానికి పొడిగింపుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. ఇరు దేశాల్లో దేనిపై దాడి జరిగినా.. సమష్టిగా ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. అలాగే, అఫ్గానిస్థాన్ను తమ ప్రత్యర్థి దేశంగా అభివర్ణించారు. ఇదే సమయంలో అరబ్ దేశాలు కూడా ఈ డీల్ భాగం అవుతాయా అని ప్రశ్నించగా.. ముందస్తుగా దీనికి నేనేమీ సమాధానం చెప్పలేను అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మూడో దేశం చేరకుండా.. లేదా మరో దేశంతో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోకూడదని ఎటువంటి క్లాజు లేదని చెప్పారు. పాకిస్తాన్కు బలహీనతలు ఉండటంతో.. నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెబుతున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, దేశాలు ఉన్నచోట సమష్టిగా దేశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.🇵🇰🇸🇦 Saudis are under defense by nuclear missiles now!Pakistani Defense Minister Khawaja Asif said Pakistan’s nuclear capabilities would be available under the new Pakistan-Saudi mutual defence pact“What we have, our capabilities, will absolutely be available under this pact” pic.twitter.com/V5MJrnKtDw— Unbiased, Unreported News (@Kiraguri254) September 20, 2025ఇక, కొన్ని నెలల క్రితం భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి బదులుగా మన బలగాలు పాక్లోని ఉగ్రమూకలను మట్టుపెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్నిరోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా మరోసారి భారత్తో యుద్ధం విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. -
భారత్-రష్యా బంధం.. పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
బీజింగ్: చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్, రష్యా బంధంపై దాయాది దేశం పాకిస్తాన్ స్పందించింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్తో రష్యాకు ఉన్న అనుబంధాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఇదే సమయంలో ఇస్లామాబాద్తోనూ మాస్కో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.అయితే, చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాక్ ప్రధాని షరీఫ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం, షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..‘గత కొన్నేళ్లలో పాక్-రష్యా సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. అనేక రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. పాక్ పట్ల రష్యా చూపిస్తున్న ఆసక్తి, నిబద్ధతకు ధన్యవాదాలు. ఇంధనం, వ్యవసాయం, రక్షణ, కృత్రిమ మేధ, విద్య వంటి రంగాల్లో మేం రష్యాతో అత్యంత బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం. ప్రాంతీయ పురోగతికి అది మంచి చేస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ డైనమిక్ లీడర్. రష్యా-పాకిస్తాన్ సరైన దిశలో వెళ్తున్నాయి. ఇది పాకిస్తాన్కు ఎంతో ఉపయోగకరం’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు ముగిసిన వెంటనే భారత్కు రష్యా బంపరాఫర్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే, ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం. మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
భారత్, పాక్ శత్రుత్వం.. కశ్మీర్ ప్రధాన కారణం: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: జమ్ము కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 రద్దు విషయమై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ ప్రధాన కారణం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును షరీఫ్ తప్పుబడుతూ కేంద్రం నిర్ణయంపై మండిపడ్డారు.పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీరే ప్రధాన కారణం. భారత ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం సరైన నిర్ణయం కాదు. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీరీ ప్రజల సంకల్పం, ఆకాంక్షలు మాత్రమే ముందుకు సాగడానికి ఏకైక మార్గం. కశ్మీరీల స్వేచ్చను భారత ప్రభుత్వం హరించింది. కశ్మీర్ ప్రజలను మోదీ ప్రభుత్వం అణిచివేసింది. కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం పాకిస్తాన్ విదేశాంగ విధానంలో కీలకమైంది. ఆర్టికల్ 370 రద్దు వంటి ఏకపక్ష చర్యలను తిప్పికొట్టడంలో అంతర్జాతీయ సమాజం పాత్ర పోషించాలి’ అని కామెంట్స్ చేశారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా భారతదేశం చర్యకు నిరసనగా పాకిస్తాన్ ఈ రోజును యూమ్-ఇ-ఇస్తేసల్గా పాటిస్తోందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. Prime Minister Shehbaz Sharif reaffirmed that lasting peace in the region is impossible without resolving the Kashmir issue. He stated that India cannot strip Kashmiris of their right to freedom, the era of oppression will end, and justice will prevail. pic.twitter.com/WjXezNPmgl— Fizza Butt (@fizzaabutt12) August 5, 2025మరోవైపు.. పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఎల్లప్పుడు తమ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుంది. పొరుగు దేశాలతో ఘర్షణల కంటే సంభాషణ, దౌత్యాన్ని ఎంచుకుంటుంది. పాకిస్తాన్ ప్రజలు, సాయుధ దళాలు ఏదైనా దురాక్రమణ చర్యకు ధృఢమైన ప్రతిస్పందన అందించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. కశ్మీర్ విషయంలో పాక్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేసి మంగళవారానికి ఆరేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ సహా మరికొన్ని పార్టీలు మంగళవారం బ్లాక్ డేగా పాటించాయి. అలాగే మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పిలుపు మేరకు మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 15 నిమిషాల పాటు కశ్మీర్ వ్యాప్తంగా లైట్లను బంద్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యాంగ విలువలపై దాడిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ మంగళవారం స్థానికంగా నిరసన చేపట్టింది. ఇదిలా ఉండగా జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను ఎప్పుడిస్తారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక, ఆగస్టు 5వ తేదీన జమ్ము కశ్మీర్లో శాంతి, వికాసం, సమాన హక్కులకు బాటలు వేసిన గొప్ప రోజని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ థోకర్ తెలిపారు. దీన్ని ఇతర రాజకీయ పార్టీలు బ్లాక్డేగా పాటించడం సరికాదని హితవు పలికారు. -
అడుక్కునే స్థితిలో ఉన్నామంటే.. ఆదుకునే పరిస్థితుల్లేవ్: పాక్ ప్రధాని ఆవేదన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దేశ నోట ఆర్థిక దుస్థితికి అద్దం పట్టే వ్యాఖ్యలు వెలువడ్డాయి. నిత్యం చిప్ప పట్టుకుని దేహీ అంటూ అర్థించడాన్ని మిత్రదేశాలు కూడా హర్షించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తమ దేశ ప్రజలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం క్వెట్టాలో ఆయన సైనికాధికారులను ఉద్దేశించి పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్.. ‘చైనా, సౌదీ అరేబియా, తుర్కియే వంటివి పాక్కు విశ్వసనీయమైన మిత్రులు. కానీ చీటికీమాటికీ అప్పులివ్వాలని కోరుతుంటే అవి కూడా చిరాకు పడుతున్నాయి. విద్యా, వర్తకం, ఆరోగ్యం, పరిశోధనల వంటి రంగాల్లో మనం కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాయి. ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్తోపాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని అన్నారు. దేశంలో సహజ వనరులతోపాటు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థమంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. 🚨Utterly Humilating!!Pakistan PM Shehbaz Sharif's another SHOCKING admission after admitting BrahMos strikes:“Even trusted allies like China, Saudi Arabia, Turkey, Qatar & UAE don’t want Pakistan constantly begging with a bowl in hand.” pic.twitter.com/pyrYwRXhmD— Megh Updates 🚨™ (@MeghUpdates) May 31, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాయం కోసం ప్రపంచదేశాలను అభ్యర్థిస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం అనేక షరతులను విధించిన ఐఎంఎఫ్.. భారత్తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్కే ఎక్కువ సమస్యలు వస్తాయని, దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని చురకలు అంటించింది. ఈ క్రమంలో కొన్ని షరతులను సైతం విధించింది. -
సింధూ నీళ్లు చుక్క కూడా ఇవ్వం.. పాక్కు భారత్ కౌంటర్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ ఎప్పటికప్పుడు వరుస షాక్లు ఇస్తూనే ఉంది. పహల్గాం ఘటన తర్వాత పాక్కు చుక్కలు చూపిస్తోంది. ఇటు దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా సింధూ జలాల విషయంలో మరోసారి పాక్కు భారత్ ఝలక్ ఇచ్చింది. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అనేది సింధూ నదీ జలాల ఒప్పందం అమలులో జోక్యంతో సమానమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలు విషయంలో తమ దేశాన్ని నిందించడం మానేయాలని పాక్కు హితవు పలికింది.కాగా, తజికిస్తాన్లోని దుషాన్బే నగరం వేదికగా హిమానీ నదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్లీనరీ సెషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్, పాకిస్తాన్కు సహా పలు దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేయడాన్ని మేం అంగీకరించం. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇదంతా చేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. భారతదేశం రెడ్ లైన్ను దాటడాన్ని మేం సహించం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.అనంతరం, పాకిస్తాన్కు భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా కీర్తి వర్థన్ ప్రసంగిస్తూ.. సింధూ నదీ జలాల ఒప్పందంపై భారత్, పాక్ సంతకం చేసిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పాకిస్తానే ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తానే తప్పు చేస్తూ భారత్ను పాక్ నిందించడం సరికాదు. ఈ సదస్సు వేదికను దుర్వినియోగం చేయడానికి, దీని పరిధిలోకి రాని అంశాలను ప్రస్తావించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను. సింధూ నదీ ఒప్పందపు నియమ నిబంధనలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సాంకేతిక, జనాభా, పర్యావరణపరమైన అంశాల్లో మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నాను. పాక్ సీమాంతర ఉగ్రవాదంపైనా చర్చ జరగాలన్నారు. సద్భావన, స్నేహ స్ఫూర్తితో కుదిరిన ఈ ఒప్పందం అమలుకు ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఆటంకం కలిగిస్తోంది.హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. హిమానీనదాలు కరిగిపోతుండటం అనేది ఒక హెచ్చరిక మాత్రమే కాదు. ఈ వైపరీత్యం వల్ల జల భద్రత, జీవవైవిధ్యం, వందల కోట్ల ప్రజల జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారుతాయి. పర్యావరణ పరిరక్షణతో భూతాపాన్ని తగ్గించడంపై కుదిరిన పారిస్ ఒప్పందంలో భారత్ అంగీకరించిన నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ (NDCs)ను సాధించే దిశగా మోదీ సర్కారు గణనీయమైన పురోగతిని సాధించామం’ అని వెల్లడించారు. -
దౌత్య యుద్ధం దెబ్బకు దిగొచ్చిన పాక్!
టెహ్రాన్: దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్(Shehbaz Sharif) సోమవారం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ వేదికగా ప్రకటించారాయన. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత్తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం(Peace Talks). కశ్మీర్, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటనను పాక్ పత్రిక ది డాన్ ప్రముఖంగా ప్రచురించింది. మరోవైపు.. టెహ్రాన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీతో చర్చలు జరిపారు. ఈ భేటీకి పాక్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగానూ భారత్తో ఉద్రిక్తతలు, గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు డాన్ కథనం పేర్కొంది. పాక్ శాంతి ప్రతిపాదనను ప్రశంసించిన ఇరాన్.. ఇరు దేశాలు(భారత్-పాక్) మధ్య త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై పాక్పై దౌత్యపరమైన యుద్ధం చేస్తోంది. ఆ దేశ దౌత్యవేత్తలను వెనక్కి పంపించేసింది. ఉగ్రవాదాన్ని పాక్ ఎలా పెంచి పోషిస్తూ ప్రోత్సహిస్తోందనే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అగ్రదేశాలు సహా పలు దేశాలు భారత్కు మద్ధతు ప్రకటించాయి. ఈ క్రమంలో పాక్కు నిధులు సమకూర్చకూడదని ఐఎంఎఫ్కి కూడా విజ్ఞప్తి చేసింది కూడా. అయితే తాజాగా ఇస్లామాబాద్ వర్గాలు దీర్ఘకాలికంగా కొనేసాగుతున్న వివాదాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీకి కబురు పంపాయి. భారత ప్రధాని మోదీ మాత్రం ఆ చర్చలు పరిమితంగానే ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్తో చర్చలు గనుక జరగాల్సి వస్తే.. అది పీవోకే, ఉగ్రవాద అంశాలపై మాత్రమేనని కుండబద్ధలు కొట్టారు.ఇదీ చదవండి: ఒట్టు.. నా భార్యను నన్ను కొట్టలే! -
పాకిస్తాన్కు ఊహించని షాక్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన IMF
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్తాన్పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఫుల్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్పై కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో, పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను ఐఎంఎఫ్ విధించింది. తాజాగా విధించిన షరతులతో ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను రూ.2.414 ట్రిలియన్గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తోంది.కొత్త షరతులు ఇవే.. జూన్ 2025 లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను పార్లమెంటు ఆమోదించాలి. ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇది 2028 నుండి సంస్థాగత మరియు నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తుంది.🚨BREAKING: IMF imposes 11 new conditions on Pak, warns it against risks to bailout programme: Report#IndiaPakistanWar #IndiaPakistanTensions pic.twitter.com/CqBS9vF6eF— 8bit Market (@8bit_market) May 18, 2025అలాగే, జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమం ఇంకా వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది.ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది. వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కార్ను ఐఎంఎఫ్ కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్కు టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. -
అవును.. భారత్ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘భారత్కు దీటుగా జవాబిచ్చి’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్ చేశారు. మరోవైపు.. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు. -
పాక్ ప్రధాని సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: భారత్ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్తో చర్చలకు పాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ వెల్లడించారు.పాక్లోని పంజాబ్ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ షరీఫ్ సందర్శించారు. అనంతరం, షరీఫ్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్తో చర్యలకు సిద్ధం. భారత్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాక్ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత.. పాక్ ప్రధాని షరీఫ్ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.Peace and Pakistan, Biggest Joke of the decade 😆“Pakistan's prime minister, Shehbaz Sharif, said on Thursday he was ready to engage in peace talks with India. Prime Minister Shehbaz Sharif extended an offer of talks to India, saying Pakistan is ready to engage "for peace". pic.twitter.com/NHvt1DNqsB— Vaibhav Rathi 🇮🇳 (@Vaibhavrathi05) May 16, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్ను ప్రారంభించడానికి ముందే పాక్కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు. This video explains the extent of damage caused by @IAF_MCC in Pakistan. Pak PM took a dusty road to reach the PAF base. You know why? Watch this. 👇pic.twitter.com/XYQLEWWB0P— Pramod Kumar Singh (@SinghPramod2784) May 15, 2025 -
భారత్, పాక్పై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్.. ఈసారి కశ్మీర్ అంటూ..
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్-పాక్ అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్రుత్తో స్పందిస్తూ..‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్, పాకిస్తాన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్.. భారత్పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది. -
భారత్ అంటే వణుకు నిజం ఒప్పుకున్న పాక్ ఎంపీ
-
ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇక, ఆపరేషన్ సిందూర్పై పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. పాకిస్తాన్ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్..తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్ ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్) అనుకుంటోంది. కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేశాయి. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులే ఉన్నారు. మసూద్ అజార్ సోదరి - ఆమె భర్త, మసూద్ మేనల్లుడు - అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.Shehbaz Sharif says Pakistan will Retaliate & Avenge the blood🤣~ He is stammering. Unable to read the script given by Pakistan Army. Multiple CUTS just in 30 seconds. This is not Shehbaz. This is Asif Munir. This is Pakistan Army. P*gets have gone mad. pic.twitter.com/WbwQz83KPw— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 7, 2025మరోవైపు, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది. -
యుద్దానికి రెడీ.. పాక్లో అఖిలపక్ష భేటీలో ఆర్మీ అధికార ప్రతినిధి
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ దాడులు చేస్తుందనే కారణంగా పాక్కు భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా యుద్ధ సన్నద్దతపై వివరణ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. భారత్ యుద్ధ సన్నద్దత వేళ పాకిస్తాన్ అలర్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్తో నెలకొన్న పరిస్థితులను సివిల్, మిలిటరీ నాయకత్వం.. అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు సమాచారం. భారత్ దాడి చేస్తే తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలకు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం పీటీఐ హాజరు కాలేదని సమాచారం.ఇదిలా ఉండగా.. భారత్ పర్యటనకు ముందు పాక్లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాక్లో దిగిన వెంటనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని వ్యాఖ్యాలు చేశారు. ఇక, అంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్లకు మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమని అబ్బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్(72) రెండోసారి ప్రమాణం చేశారు. అధ్యక్షభవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనతో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాతోపాటు ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. గతంలో, 2022 ఏప్రిల్–2023 ఆగస్ట్ వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆదివారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో షహబాజ్ సునాయాసంగా మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. -
పాకిస్తాన్లో సంకీర్ణమే
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఎట్టకేలకు తుది ఒప్పందానికి వచ్చాయి. నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్–నేత షహబాజ్ షరీఫ్(72), అధ్యక్షుడిగా పీపీపీ సీనియర్ నాయకుడు అసిఫ్ అలీ జర్దారీ(68) బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు పార్టిల మధ్య మంగళవారం అర్ధరాత్రి కీలక చర్చలు జరిగాయి. అనంతరం పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడి పదవికి తమ ఉమ్మడి అభ్యరి్థగా అసిఫ్ అలీ జర్దారీ పేర్లను ఖరారు చేసినట్లు ప్రకటించారు. తమ కూటమికి పార్లమెంట్లో తమకు సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. అయితే, ఎంతమంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు. ఒప్పందం ప్రకారం.. జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పదవికి పీఎంఎల్–ఎన్ పార్టికి, డిప్యూటీ స్పీకర్ పదవి పీపీపీకి, సెనేట్లో చైర్మెన్ పదవి పీపీపీకి లభించనుంది. చర్చలు సానుకూలంగా ముగించినందుకు పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలకు షహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పదవుల విషయంలో పీపీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. అసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోసారి అదే పదవికి చేపట్టబోతున్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడైన షషబాజ్ షరీఫ్ సైతం గతంలో ప్రధానమంత్రిగా సేవలందించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఈ ఎన్నిలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించారంటూ మాజీ సైనికాధికారి అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టేసింది. -
పాక్లో వేతనాలు, బిల్లుల చెల్లింపులు బంద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక కష్టాలతో షహబాజ్ షరీఫ్ సర్కారు అతలాకుతలమవుతోంది. ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది వేతనాలు సహా అన్ని బిల్లుల చెల్లింపుల్ని నిలిపేసింది. తదుపరి ఉత్తర్వుల దాకా శాఖలు, డివిజన్లు అనుబంధ విభాగాల బిల్లులను క్లియర్ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు అత్యవసరమైన మందులు కూడా దొరక్క రోగులు నరకం చూస్తున్నారు. అత్యవసర ఆపరేషన్లు కూడా ఆగిపోతున్నాయి! -
ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులకు పాక్ ప్రభుత్వం షాక్! భారీగా కోత?
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమి ట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల్లో 10 శాతం కోత పెట్టాలని యోచిస్తోందట! మంత్రుల ఖర్చులను 15 శాతం తగ్గించాలని, స్వతంత్ర మంత్రులు, సహాయక మంత్రులు, సలహాదారులను 78 నుంచి 30కి కుదించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏర్పాటుచేసిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రధానికి తుది నివేదిక ఇవ్వనుందని జియో న్యూస్ కథనం పేర్కొంది. -
పీవోకేలో ఆమె పర్యటన.. భగ్గుమన్న భారత్
అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడంపై భారత్ భగ్గుమంది. సంకుచిత మనస్తత్వ రాజకీయాలకు ఇది నిదర్శనమని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమాలియాలో పుట్టిపెరిగి, అమెరికా చట్టసభ్యురాలైన ఇల్హాన్ ఒమర్(39) మొదటి నుంచి భారత వ్యతిరేకి. నాలుగు రోజుల పాక్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య పాక్లో పర్యటించనుంది. ఈ తరుణంలో ఇల్హాన్ ఒమర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఇంటికెళ్లి మరీ కలిసింది. ఆపై ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యి కశ్మీర్ అంశంపైనా చర్చించింది కూడా. ఈ తరుణంలో ఆమె పీవోకే పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాఘ్ఛి స్పందించారు. ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కశ్మీర్లోని భారత కేంద్రపాలిత అంతర్భాగాన్ని ఆమె పర్యటించాలనుకోవడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి రాజకీయ నాయకురాలు.. తమ సంకుచిత రాజకీయాలను ఆచరించాలని కోరుకుంటే, అది ఆమె ఇష్టం. కానీ, అలాంటి ఆమె ఇంట చేసుకోవాలి. అంతేగానీ ఆ ముసుగులో భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా. కశ్మీర్ అంశంపై ఒమర్తో జరిగిన భేటీ గురించి.. స్వయంగా ప్రధాని షెహబాజ్ మీడియాకు వివరించారు. లాహోర్తో పాటు ‘‘ఆజాద్ జమ్ము కశ్మీర్’’ల గురించి ఆమెకు తెలుసని, ఆ ప్రాంతాల్లో ఆమె సందర్శిస్తుందని పాక్ ప్రధాని తెలిపారు. చదవండి: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు -
పాక్ దౌత్య దూకుడు ఇకనైనా తగ్గేనా?
పాకిస్తాన్ రాజకీయ సుస్థిరతకు సంబంధించిన ప్రధాన అవరోధం ఏమిటంటే కశ్మీర్కి సంబంధించినంతవరకు వ్యవస్థీకృతమైన ముట్టడిలో అన్ని పార్టీలూ ఇరుక్కోవడమే. అయితే భారత్, పాక్ దేశాల మధ్య ఆర్థిక పొత్తును మెరుగుపర్చుకోవడంపై ఆ దేశ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ స్పష్టమైన వైఖరితో ముందుకొస్తారని భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అవలంబించిన దుస్సాహసిక విదేశీ విధానం సైన్యంతో సహా దేశంలోని పలు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో నూతనంగా ఏర్పడిన పాకిస్తానీ ప్రభుత్వం కాస్త సంయమనంతో కూడిన, నష్టభయానికి వీలివ్వని తరహాలో తక్కిన ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఎంపికైన షెబాజ్ షరీఫ్ 2009 ఫిబ్రవరి 25న ఒక సాహసోపేతమైన ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా తననూ తన సోదరుడు నవాజ్ షరీఫ్నూ అనర్హులను చేస్తూ పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా సుప్రసిద్ధ పాక్ కవి హబీబ్ జాలిబ్ కవిత దస్తూర్ని షెబాజ్ చదివి వినిపించారు. నిరంకుశత్వ పునాదిపై నిలిచిన రాజకీయ వ్యవస్థపై మోగించిన శంఖారావం ఆ కవిత. విషాదం ఏమిటంటే ఆ పాకిస్తాన్ కవి, సుప్రసిద్ధ వామపక్ష కవి జాలిబ్ అదే వేదనతోనే మరణించారు. షరీఫ్లు నివసించే లాహోర్ నగరంలోనే ఆయనా జీవించారు. తమ వ్యాపార సామ్రాజ్యంతో పాకిస్తాన్లోనే అత్యంత సంపన్న కుటుం బాల్లో ఒకటిగా నిలిచిన షరీఫ్ సోదరులు జనరల్ జియా ఉల్ హక్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. జలంధర్లో జన్మించిన జనరల్ జియా 1977లో మార్షల్ లా ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడై పోయారు. ఈయన హయాంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టోను ఉరితీశారు. వర్గ, జాతి, భౌగోళికమైన తప్పుడు గీతల ప్రభావంతో నిత్యం ఘర్షించుకుంటున్న వలస పాలనానంతర దేశాలకులాగే, అణ్వా యుధాలు కలిగి ఉన్న పాకిస్తాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. 22 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం అనేక ప్రహసనాల మధ్యే ఉనికి సాగి స్తోంది. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నాలుగేళ్ల పాలన కూడా ఈ క్రమానికి మినహాయింపు కాదు. మొదటిది. పాకిస్తాన్ సైన్యం మద్దతుతోనే ఇమ్రాన్ రాజకీయ ప్రాభవం మొదలైందని చెప్పవచ్చు. పాకిస్తాన్లో అత్యంత కీలకమైన సంస్థాగత శక్తి సైన్యం. కానీ ప్రధాని అయ్యాక సైన్యం మద్దతును ఇమ్రాన్ ఎంతో కాలం నిలుపుకోలేకపోయారు. మొదట్లోనే విభేదాలు వచ్చి ఉండవచ్చు కానీ ఐఎస్ఐ చీఫ్ నియామకం విషయంలో ప్రధానిగా ఇమ్రాన్ నేరుగా జోక్యం చేసుకోవడంతో సైన్యానికీ తనకూ మధ్య విభేదాలు బహిరంగమైపోయాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో పౌర ప్రభుత్వ ఆధిక్యత ఎవరి చలవతో కొనసాగుతుందనేది ఇమ్రాన్ పాలన సాక్షిగా మరోసారి రుజువైపోయింది. రెండోది. ఇమ్రాన్ నిష్క్రమణ అనేక సవాళ్లను విసురుతోంది. ఇస్లామిక్ ప్రపంచ నేతల్లో ఒకరిగా తనను తాను ప్రదర్శించుకోవడా నికి ఇమ్రాన్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉక్రెయిన్పై సైనిక దాడి నేపథ్యంలోనే ఇమ్రాన్ రష్యాను సందర్శించి వచ్చారు. కానీ పాకిస్తాన్ విదేశీ ప్రాధాన్యతలు మధ్యప్రాచ్యం, చైనా, యూరప్, అమెరికా, భారత్తోనే ఉంటూవచ్చాయి. మధ్యప్రాచ్యంలోనూ ఇమ్రాన్ సౌదీ అరేబియా రాజరిక వ్యవస్థకు ఆగ్రహం తెప్పించారు. వాస్తవానికి పాకి స్తాన్కు అత్యధికంగా రుణ సహాయం చేసింది సౌదీనే. 57 దేశాలతో కూడిన ఇస్లామిక్ సహకార సంస్థ సమావేశాన్ని ఏర్పర్చకుండా సౌదీ రాజరికం అడ్డు తగులుతోందని 2020లో పాక్ విదేశీ మంత్రి షా మహమ్మద్ ఖురేషి బహిరంగ విమర్శ చేసి షాక్ కలి గించారు. భారత్, పాక్ దేశాల మధ్య ఘర్షణ విషయంలో సౌదీ రాజరికం తొలినుంచీ సమాన దూరం పాటిస్తోంది. ఈ సందర్భంగా పాక్ వ్యవహారం సౌదీకి కోపాన్ని తెప్పించింది. ఇమ్రాన్ విదేశీ విధానం సౌదీ, టర్కీల మధ్య వైరాన్ని మరింతగా పెంచింది. వాస్తవానికి షరీఫ్ కుటుంబానికి సౌదీ రాజరికం ఎంతో కీలక మయింది. సౌదీ రాజు జోక్యంవల్లే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ని పాక్ నుంచి వెళ్లిపోవడానికి నాటి సైనిక పాలకుడు ముషారఫ్ అనుమతిం చారు. ముషారఫ్ ఎనిమిదేళ్ల పాలనలో తొలి సంవత్సరాలలో నవాజ్ షరీఫ్ కుటుంబం సౌదీలోనే గడిపింది. కాబట్టి పాక్ ప్రస్తుత ప్రధాని నోట రాజకీయ మార్పు అనే ప్రకటన వెలువడిన ఉద్దేశం... సౌదీతో సంబంధాల పునరుద్ధరణే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇమ్రాన్ చేసిన మరో తప్పు ఏమిటంటే... అంత పెద్ద అమెరికా తోనే నేరుగా మాటల యుద్ధానికి దిగటం. పాక్లో రాజకీయ మార్పు లను ఎగదోసింది ప్రధానంగా అమెరికానే అని ఇమ్రాన్ ఆరోపిం చారు. కానీ పాకిస్తాన్ సైనిక సంపత్తిలో అధిక భాగం అమెరికా నుంచి వచ్చిందే అన్నది ఇమ్రాన్ మర్చిపోయారేమో కానీ పాక్ సైన్యం విస్మరించలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖ్వామర్ జావేద్ బజ్వా బహి రంగంగానే ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు కూడా. ఇమ్రాన్ దూకుడుగా చేపట్టిన అమెరికా వ్యతిరేక వైఖరిని పాక్ సైన్యం ఏమాత్రం సహించలేకపోయింది. దీంతో పాకిస్తాన్ పౌర సైనిక వ్యవస్థ అమెరికాతో సంబంధాల స్థిరీకరణకు పూనుకుంది. భౌగోళిక ప్రాధా న్యత కారణగా చైనాతో ఆరు దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగించిన పాకిస్తాన్ అదే సమయంలో అమెరికా, చైనా మధ్య సమతౌల్యాన్ని పాటించడంలో కూడా అసాధారణమైన నేర్పును ప్రదర్శించగలిగింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ రష్యాను సందర్శించి రావడం యూరోపియన్ యూనియన్కి కోపకారణం అయ్యింది. ఐక్యరాజ్యసమితిలో రష్యన్ దాడిని ఖండించాలని ఈయూ చెప్పినా ఇమ్రాన్ ఖాతరు చేయలేదు. పైగా యూరోపియన్ల కపట ధోరణులను బహిరంగంగా ఇమ్రాన్ దుయ్యబట్టారు. యూరోపియన్ దిగుమతుల విషయంలో పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలను త్యాగం చేశారని నూతన ప్రధాని షెబాజ్ దుయ్యబట్టారు. పాకిస్తాన్ వస్త్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 50 శాతం యూరప్ దేశాలే దిగుమతి చేసుకుంటు న్నాయి మరి. పాకిస్తాన్ రాజకీయ సుస్థిరతకు సంబంధించిన ప్రధాన అవ రోధం ఏమిటంటే కశ్మీర్కి సంబంధించినంతవరకూ వ్యవస్థీకృతమైన ముట్టడిలో అన్ని పార్టీలూ ఇరుక్కోవడమే. ఇది ఎలాంటి పరిస్థితిని సృష్టించిందంటే కశ్మీర్ సమస్యపై ఏ పాకిస్తాన్ రాజకీయ పార్టీ కూడా తన నిబద్ధతను ఎన్నడూ పలుచన చేసుకోలేదు. అయితే తన సోద రుడు నవాజ్ షరీఫ్తో పోలిస్తే యువ షెబాజ్ షరీఫ్ మాత్రం పాకి స్తాన్ సైన్యం గీచిన గీటు దాటకుండా తననుతాను చాలా తెలివిగా మల్చుకున్నట్లు కనబడుతోంది. భారత్, పాక్ దేశాల మధ్య ఆర్థిక పొత్తును మెరుగుపర్చుకోవడంపై కూడా షెబాజ్ స్పష్టమైన వైఖరితో ముందుకొస్తారని భావిస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ రెండూ ఇప్పుడు షెబాజ్ ప్రధానగా సంకీర్ణ భాగస్వాములుగా ఉన్నాయి. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు భారత్కు సన్నిహితం కావడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశాయి. కానీ పాకిస్తాన్ కేంద్రంగా పలు ఉగ్రవాద సంస్థలు భారత్పై దాడులు తలపెట్టడం, కార్గిల్ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ సైనిక యంత్రాంగం అవలంబించిన దుస్సాహసిక విధానాల కారణంగా ఈ రెండు పార్టీల ప్రయత్నాలు పట్టాలు తప్పాయనే చెప్పాలి. 2021 ఫిబ్రవరి 25న ఆధీన రేఖ పొడవునా కాల్పుల విరమణకు భారత్, చైనా సైన్య బలగాలు అంగీకారానికి వచ్చాక ఇంతవరకు ఆ ఒప్పందం సజావుగా కొనసాగుతోంది. సోదరుడు నవాజ్ షరీఫ్లాగే పాకిస్తాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ కూడా భారత్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి మధ్యేవాద విధానాలను అవలంబిస్తారని, సానుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే జాతీయ అసెంబ్లీకి ఎన్ని కలు వచ్చే సంవత్సరమే జరగనున్నందున ఇంత స్వల్ప కాలంలో నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ పాలనాపరంగా, సంస్కరణల పరంగా, పొరుగునున్న భారత్ పరంగా సంబంధాల పునరుద్ధరణలో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకటి మాత్రం నిజం. ఇమ్రాన్ ఖాన్ అవలంబించిన దుస్సాహ సిక విదేశీ విధానం సైన్యంతో సహా దేశంలోని పలు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాస్త సంయమనంతో కూడిన, నష్టభయానికి వీలివ్వని తరహాలో తక్కిన ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. లవ్ పురి, వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కశ్మీర్పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్తో పాక్కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్లోని భారత హైకమిషనర్ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
పాక్ పీఠం షాబాజ్కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ (70) ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన, తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరఫున షా మహ్మద్ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు. అయితే పలు కేసులున్న షాబాజ్ నామినేషన్ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్ను సభాపతి తోసిపుచ్చారు. దాంతో సోమవారం తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని పీటీఐ సీనియర్ నేత బాబర్ అవాన్ ప్రకటించారు. ఇమ్రాన్ నివాసంలో జరిగిన పీటీఐ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు చెప్పారు. ప్రధానిగా షాబాజ్ను అంగీకరించేది లేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెర తీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు. ‘‘కొత్తగా కొలువుదీరేది విదేశీ ప్రభుత్వమే. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి’’ అని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. 342 మంది సభ్యులున్న సభలో ప్రధానిగా ఎన్నికవాలంటే 172 మంది మద్దతు అవసరం. ప్రస్తుత సభ కాల పరిమితి 2023 ఆగస్టుతో ముగియనుంది. షాబాజ్కు సవాలే పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షాబాజ్ మూడుసార్లు పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా కూడా పని చేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో షాబాజ్, ఆయన కుమారుడు హంజా 2019లో అరెస్టయ్యారు. పీఠమెక్కాక కలగూర గంపలాంటి విపక్షాలను ఏడాదికి పైగా ఒక్కతాటిపై నడపడం ఆయనకు సవాలేనంటున్నారు. ఇమ్రాన్ను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో, ‘‘ప్రతీకార రాజకీయాలుండబోవు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అంటూ షాబాజ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్, మాజీ మంత్రులు తదితరులు దేశం విడిచి పోకుండా ఆదేశించాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉన్నతాధికారులెవరూ దేశం వదలొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఇమ్రాన్ అవుట్! పాకిస్తాన్ కొత్త ప్రధాని ఆయనేనా.. ఎవరీ షాబాజ్ షరీఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకుంది. ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ, మిత్రపక్షం నుంచి కూడా ఇమ్రాన్కు వ్యతిరేకంగా మద్దతివ్వడంతో ఆయన గద్దె దిగిపోవడం దాదాపు ఖరారు అయిపోయింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పాక్ జాతీయ అసెంబ్లీలో ఏప్రిల్ మూడో తేదీన చర్చ జరుగనుంది. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇమ్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇతర పార్టీల నుంచి కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పాక్ నేషనల్ అసెంబ్లీకి ఆగస్టు 2023 వరకు గడువు ఉండటంతో అప్పటి వరకు కొత్త ప్రధాని పాలించవచ్చు. లేదా తాజాగా ఎన్నికలను నిర్వహించాలని కూడా కోరవచ్చు. మరి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నుంచి దిగిపోతే.. తదుపరి ప్రధాని ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్, నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు ప్రధాని ఇమ్రాన్ఖాన్. చివరి బంతి వరకూ పోరాడతానని సవాల్ చేస్తున్నారు. చదవండి: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన ఎవరీ షాబాజ్ షరీఫ్? పాకిస్థానీ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షాబాజ్ షరీఫ్. 1988లో రాజకీయల్లోకి వచ్చిన ఆయన పంజాబ్ సీఎంగా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తిచేయడంలో దిట్టగా పేరుంది. చైనా, టర్కీలతో విదేశీ వ్యవహారాలను నడపడంలో షాబాజ్కు మంచి పేరుంది. 1997లో మొదటిసారిగా పంజాబ్ ప్రావిన్స్కి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటు జరిగిన సమయంలో ఎనిమిదేళ్ల పాటు సౌదీ అరేబియాలో ప్రవాసం జీవితం గడిపారు. 2007లో తిరిగి పాకిస్థాన్కు వచ్చారు. 2008 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించడంతో మళ్లీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో పీఎంఎల్(ఎన్) ఓడిపోయింది. తర్వాత నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నామినేట్ అయ్యారు. 2019లో పాక్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ఏబీ) షాబాజ్కు చెందిన 28 ఆస్తులను జప్తు జేసింది. ఇదే కేసులో 2020, సెప్టెంబర్లో ఆయనను ఎన్ఏబీ అరెస్ట్ చేసింది. ఏడు నెలల తర్వాత లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2021, ఏప్రిల్లో జైలు నుంచి విడుదలయ్యారు. ఇమ్రాన్ఖాన్పై అవిశ్వాసంతో ప్రధాని పదవి రేసులోకి దూసుకొచ్చారు. -
పాక్ మాజీ ప్రధాని షాబాజ్ అరెస్టు
లాహోర్: పాక్ మాజీ ప్రధాని, విపక్షనేత షాబాజ్ షరీఫ్ (67) అవినీతి కేసులో అరెస్టయ్యారు. రూ.1,400 కోట్ల (పాక్ కరెన్సీ) హౌజింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడిగా ఉన్నారు. ‘లాహోర్లోని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ముందు విచారణకు షాబాజ్ హాజరయ్యారు. ఆషియానా హౌజింగ్ స్కీమ్, పంజాబ్ సాఫ్ పానీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇచ్చారంటూ ఈయనపై ఆరోపణలు వచ్చాయి. -
పాకిస్తాన్ కొత్త ప్రధాని ఎవరో తెలుసా?
ఇస్లామాబాద్: జడలు విప్పిన ఉగ్రవాదం, ఆర్థిక సహాయంపై అమెరికా వెనకడుగు.. అంతలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా! అసలే రాజకీయ అస్థిరతకు మారుపేరుగా ఉన్న పాకిస్తాన్.. తక్షణ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఆ దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు నియమితులవుతారు?.. సగటు పాకిస్తానీలనే కాదు ప్రపంచమంతటా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి! దీనికి సంబంధించి పాక్ మీడియాలో ఒక పేరు బలంగా వినబడుతోంది. పంజాబ్ ఫ్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్.. పాక్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్తాన్ ముస్లీం లీగ్(నవాజ్) పార్టీకే చెందిన ఈ నాయకుడు మరెవరోకాదు.. పదవీచ్యుతుడైన నవాజ్కు సొంత తమ్ముడే! పనామా లీక్స్లో షరీఫ్తోపాటు ఆయన కుమార్తెలు, కుమారుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో రాజకీయ వారసత్వం సోదరుడు షెహబాజ్కు దక్కినట్లవుతుంది. కాగా, ప్రధానిగా షెహబాజ్ పేరు ఖరారుకు సంబంధించి ఎలాంటి అధికార ప్రకటనా వెలువడలేదు. పదవి పోయినా పవర్ ఆయనదే! ’పనామా’ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో పదవి కోల్పోయిన నవాజ్ షరీఫ్.. ప్రభుత్వంపై పెత్తనాన్ని మాత్రం కోల్పోలేదు. మొత్తం 342 స్థానాలున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లీం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీనే అతిపెద్ద పార్టీ. 2013 ఎన్నికల్లో 189 సీట్లు సాధించిన నవాజ్ పార్టీ జయూఐ-ఎఫ్(13 సీట్లు), పీఎంఎల్-ఎఫ్(5 సీట్లు), ఎన్పీపీ(2సీట్ల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శుక్రవారం నాటి తీర్పు విపక్షాల విజయమే అయినప్పటికీ నవాజ్ పార్టీ ప్రభుత్వం మాత్రం కూలిపోయే అవకాశాలు లేవు. పార్టీపై గట్టిపట్టున్న నవాజ్.. కొత్త ప్రధానిగా ఎవరిని నియమించినా పార్టీ సభ్యులు అడ్డుచెప్పలేని పరిస్థితి. ముందస్తు ఎన్నికలు? భారత్లో లాగే పాకిస్తాన్లోనూ ప్రతి 5ఏళ్లకు ఒకసారి జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. చివరిగా(2013లో) జరిగిన ఎన్నికల్లో నవాజ్షరీఫ్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దాని పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. 2018 జూన్ 5 తర్వాత ఎన్నికల నగారా మోగనుంది. అయితే, శుక్రవారంనాటి సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే వార్తలు వచ్చాయి. ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షరీఫ్.. ఎంతకాలం పాటు పదవికి దూరంగా ఉండాలనే దానిపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, తినిగి గద్దెనెక్కాలని నవాజ్ భావిస్తున్నారని, కానీ బ్యాడ్టైమ్లో అలాంటి(ముందస్తు) నిర్ణయం వద్దని పార్టీ నేతలు నవాజ్ను వారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. (తమ్ముడు షెహబాజ్ షరీఫ్, కూతురు మర్యామ్ నవాజ్లతో మాజీ ప్రధాని నవాజ్షరీఫ్(ఫైల్ ఫొటో)) -
పాక్ ప్రధానిగా షరీఫ్ సోదరుడు?
లాహోర్/ఇస్లామాబాద్: పనామా పత్రాల కేసులో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారిస్తే ఆయన సోదరుడు, పంజాబ్ సీఎం షహబాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని అయ్యే వీలుంది. షహబాజ్ పార్లమెంట్కు ఎన్నికయ్యే దాకా రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టొచ్చని అధికార పీఎంఎల్ఎన్ నాయకుడు తెలిపారు. ఆలోగా షరీఫ్ సోదరుడు షహబాజ్ లేదా ఆయన భార్య కల్సూమ్లలో ఒకరు జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే మిగిలిన పదవీ కాలానికి వారే ప్రధానిగా ఉంటారని వెల్లడించారు. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచాక షరీఫ్ తన న్యాయ సలహాదారులతో విస్తృతంగా చర్చించారని తెలిపారు.