నాలుగో రోజూ గాజాపై ఇజ్రాయెల్‌ దాడి.. 27 మంది మృతి | Israel Attacks Gaza On Fourth Consecutive Day | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ గాజాపై ఇజ్రాయెల్‌ దాడి.. 27 మంది మృతి

Published Wed, Jul 10 2024 9:56 AM | Last Updated on Wed, Jul 10 2024 10:04 AM

Israel Attacks Gaza On Fourth Consecutive Day

ఇజ్రాయెల్‌ తన దాడులతో గాజాపై మరోమారు విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోగల ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఈ దాడులలో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు పాలస్తీనియన్లు ఈ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.

నాలుగు రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌కు సమీపంలోని అబాసన్‌లోని అల్-అవ్దా పాఠశాల గేట్ వద్ద ఈ దాడి జరిగింది. గతంలో జరిగిన మూడు దాడులకు తామే బాధ్యులమంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. పాఠశాలలో దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మూడు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే సైనిక అవసరాల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు ఇతర పౌర సౌకర్యాలను ఉపయోగిస్తున్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement