కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష | North Korea Executes Women Ri And Kang Who Helped People Escape To South Korea | Sakshi
Sakshi News home page

కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష

Published Sun, Sep 22 2024 9:34 PM | Last Updated on Sun, Sep 22 2024 9:34 PM

 North Korea Executes Women Ri And Kang Who Helped People Escape To South Korea

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆ దేశానికి చెందిన ఇద్దరు మహిళల్ని ఉరితీయించారు.

ఉత్తర కొరియాకి చెందిన రీ,కాంగ్‌ అనే ఇద్దరు మహిళలు చైనాలో ఉంటున్నారు. చైనాలో ఉంటూ ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోవాలనుకునే వారికి సహరిస్తున్నారు. అయితే ఈ అంశం కిమ్‌ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కోపోద్రికుడైన కిమ్‌.. రీ, కాంగ్‌ ఇద్దరిని చైనా నుంచి ఉత్తర కొరియాకు రప్పించాడు. అనంతరం ఆ ఇ‍ద్దరిని ఉరితీయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

మహిళలకు ఉరిశిక్ష విధించడంపై కిమ్‌ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిమ్‌ ప్రభుత్వం ఆ ఇద్దరు మహిళలకు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహించిన బహిరంగ విచారణలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు సమర్ధించుకుంది. 

చదవండి :  మీకు అర్థమయ్యిందా? హిజ్బుల్లాకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement