south korea
-
దక్షిణ కొరియా డీప్సీక్ డౌన్లోడ్ నిలిపివేత
సియోల్: చైనాకు చెందిన కృత్రిమ మేథ అంకుర సంస్థ డీప్సీక్కు చెందిన చాట్బాట్ యాప్ల డౌన్లోడ్ను తమ దేశంలో తాత్కాలికంగా నిలిపేసినట్టు దక్షిణ కొరియా అధికారులు సోమవారం ప్రకటించారు. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి స్థానిక వెర్షన్ల డీప్సీక్ యాప్లను శనివారం సాయంత్రం తొలగించామని వెల్లడించారు.యాప్ను తిరిగి ప్రారంభించే ముందు వినియోగదారుల భద్రతను పెంచడానికి తమతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తాజాగా డీప్సీక్ అంగీకారం తెలిపిందని దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార పరిరక్షణ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే తమ ఫోన్లలో డీప్సీక్ను డౌన్లోడ్ చేసుకున్న లేదా వ్యక్తిగత కంప్యూటర్లలో ఉపయోగించే వినియోగదారులు యథాతథంగా తమ యాప్ను వినియోగించుకోవచ్చు.ఏఐ మోడల్ చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆందోళనల నడుమ అనేక దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు డీప్సీక్ను తమ నెట్వర్క్ల నుంచి తొలగించాయి. ఉద్యోగులు తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఈ చాట్బాట్ సేవలను పొందకూడదని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు జారీచేశారు. అయితే జనవరి నాలుగోవారం నాటికే దక్షిణ కొరియాలో 12 లక్షల మంది మొబైల్ వినియోగదారులు డీప్సీక్ను వినియోగిస్తున్నారు. -
విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం
సియోల్: దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ఎయిర్బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం విమానం హాంకాంగ్కు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10.15 జరిగింది. గాలితో నిండిన స్లయిడ్లను ఉపయోగించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. Fire breaks out on an Air Busan A321 bound for Hong Kong at Gimhae International Airport in Busan, South Korea.At around 10:30 p.m. on Tuesday, a fire broke out in the tail section of the aircraft.All 170 passengers and crew evacuated, and there were no casualties,… pic.twitter.com/GqzIkrUx85— Breaking Aviation News & Videos (@aviationbrk) January 28, 2025ఈ విమానం 17 ఏళ్ల క్రితం నాటి ఎయిర్బస్ ఏ321 సీఈఓ మోడల్ అని దాని టెయిల్ నంబర్ హెచ్ఎల్ 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ మీడియాకు తెలిపింది. గత నెలలో కూడా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2024 డిసెంబర్ 29న మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 181 మందిలో 179 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది. దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది. చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఇటలీదీ అదే వ్యథ... ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది. నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.జపాన్లో అలా.. జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు
సియోల్:దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన భారీ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. జెజు ఎయిర్లైన్స్కు చెందిన విమానం డిసెంబర్ 29న మయూన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతూ రన్వే పక్కనున్న గోడను ఢీకొట్టింది. విమానం బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందు నుంచి విమానంలోని బ్లాక్బాక్స్ పని చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలపై జరుగుతున్న దర్యాప్తులో తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విమానం రెండు ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. విమానాన్ని పక్షి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు బృందం అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తులో అధికారులు యాంత్రిక, నిబంధనల ఉల్లంఘన సమస్యలను గుర్తించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా విమానం థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్బ్రేక్స్ వంటివి పూర్తిస్థాయిలో పని చేయలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేల పైకి దిగడానికి అనుమతించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానం రన్వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో అది బాడీ పైనే బెల్లీ ల్యాండింగ్ చేసిందని ప్రమాద సమయంలో అధికారులు తెలిపారు.అప్పటికే ఒక ఇంజిన్ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిందని అందువల్లే ల్యాండ్ అయ్యాక అదుపుతప్పి గోడను ఢీకొట్టిందని చెప్పారు. ద.కొరియా విమాన ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందే అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కజకిస్తాన్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు 2024 సంవత్సరాంతంలో వరుస విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణికులు కలవరపాటుకు గురయ్యారు. ఇదీ చదవండి: నల్లపెట్టె మౌనరాగం -
ద.కొరియా అధ్యక్షుడి అరెస్ట్
సియోల్: ప్రజాపాలనకు వ్యతిరేకంగా డిసెంబర్లో అత్యయిక స్థితి(మార్షల్ లా) విధించిన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిరోజులుగా యూన్ అరెస్ట్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అధ్యక్ష కార్యాలయం భద్రతా సిబ్బంది నుంచి తొలుత తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైనా సరే దర్యాప్తు అధికారులు చిట్టచివరకు అధ్యక్షభవనం లోపలికి వెళ్లి యూన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తొలుత బుధవారం తెల్లవారుజామున అవినీతినిరోధక దర్యాప్తు అధికారులు, పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెంట్రల్సియోల్లోని అధ్యక్షుడి నివాస భవనానికి చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన అధ్యక్షుడి భద్రతాబలగాలు ముందువైపు బస్సులను, చుట్టూతా బ్యారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటుచేశాయి. తొలుత బస్సులను దర్యాప్తు అధికారులు నిచ్చెనల సాయంతో ఎక్కి వాటిని దాచేశారు. తర్వాత గోడలను ఇలాగే నిచ్చెనల సాయంతో ఎక్కిదిగారు. అడ్డుగా ఉంచిన పెద్ద బ్యారికేడ్లనూ ఇలాగే దాటేశారు. తర్వాత ముళ్ల కంచెలను కత్తిరించి ముందుకుసాగారు. ఇలా దాదాపు 1,000 మందితో కూడిన బృందం ముందుకు దూసుకువచ్చినా భద్రతాబలగాలు అడ్డుపడి ఈ బృందాన్ని ముందుకెళ్లకుండా నిలువరించాయి. దీంతో అధ్యక్షభవన బలగాలకు, దర్యాప్తు బలగాలకు మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. ఎట్టకేలకు దర్యాప్తు బృందం ఎలాగోలా నివాసంలో లోపలికి వెళ్లి అధ్యక్షుడిని అరెస్ట్చేసింది. ముందు జాగ్రత్తగా ఇంకో దర్యాప్తు బృందం అధ్యక్షభవనం వెనుక వైపు ఉన్న ఎత్తయిన ప్రదేశాన్ని ట్రెక్కింగ్త రహాలో ఎక్కి వచ్చింది. మార్షల్లా కారణంగా దేశంలో అస్థిరతకు కార ణమయ్యారంటూ యూన్పై విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టి నెగ్గించుకోవడం తెల్సిందే. అభిశంసన నేపథ్యంలో ఆయన తన అధికారాలను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికైన తాత్కాలిక అధ్యక్షుడినీ విపక్షాలు అభిశంసించాయి. 🇰🇷BREAKING NEWS:South Korea's ousted President Yoon has been arrested on charges of treason. pic.twitter.com/IX3hXCfPJe— Update NEWS (@UpdateNews724) January 15, 2025మార్షల్ లా విధించడానికి గల కారణాలపై సంజాయిషీ ఇచ్చుకునేందుకు దర్యాప్తు అధికారులు యూన్కు అవకాశం ఇవ్వడం ఆయన స్పందించకపోవడంతో అరెస్ట్కు కోర్టు నుంచి గతంలోనే అనుమతి తెచ్చుకున్నారు. ఇటీవల అరెస్ట్కు ప్రయత్నించి విఫలమైన దర్యాప్తు అధికారులు బుధవారం మరోసారి ప్రయత్నించి సఫలమయ్యారు. ‘‘ చట్టబద్ధపాలన దేశంలో కుప్పకూలింది’’ అని అరెస్ట్కు ముందు రికార్డ్ చేసిన ఒక వీడియో సందేశంలో అధ్యక్షుడు యూన్ వ్యాఖ్యానించారు. At 4 a.m., the Corruption Investigation Office and the Special Investigations Unit are attempting to execute a second arrest warrant for the president, mobilizing over 1,000 police officers. In response, citizens in South Korea have gathered in front of the presidential residence… pic.twitter.com/jTGjxkGV9z— 김정현 (Alfred J Kim) (@AJKim38836296) January 14, 2025 పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి దక్షిణకొరియా అధ్యక్షుడిగా యూన్ చరిత్రలో నిలిచిపోయారు. వచ్చే కొన్ని వారాలపాటు ఆయన కస్టడీలనే ఉండిపోనున్నారు. దేశంలో తిరుగుబాటు తెచ్చేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై ఆయనను అరెస్ట్చేయదలిస్తే 48 గంటల్లోపు ఆమేరకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆయనను మళ్లీ విడుదలచేయాల్సి ఉంటుంది. ఒకవేళ సాధారణ అరెస్ట్గా ఆయనను అదుపులోకి తీసుకుని ఉంటే నేరాభియోగాలు మోపేలోపు మరో 20 రోజులపాటు ఆయనను తమ కస్టడీలోనే ఉంచుకోవచ్చు. ఆయన అరెస్ట్ను ఆయన తరఫు లాయర్లు తప్పుబట్టారు. దేశద్రోహం సెక్షన్ల కింద నమోదైన కేసులను అవినీతినిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేయలేరని, అరెస్ట్ అన్యాయమని వాదించారు. BREAKING : Update South KoreaPolice & Officials begin moving barriers in new attempt to arrest President Yoonsupporters of Yoon are gathered to stop them pic.twitter.com/ULsGjZnm3t— Gio DeBatta 🍸 (@GDebatta) January 14, 2025 -
వాన చినుకులలో వడ్డన..!
ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని సియోంగ్ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్ రిపోర్ట్ క్రాయిసెంట్’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు. రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్ను సెటప్ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్ కూడా ఉంది.సౌకర్యవంతమైన కుషన్స్లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే మెన్యూ ఐటమ్స్లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్ రిపోర్ట్ స్టయిల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్ షైన్’, ‘క్లౌడ్’, ‘రెయిన్ డ్రాప్’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్బో మిల్క్’, ‘సెసేమ్ క్లౌడ్’, ‘వెట్ క్లౌడ్’, ‘వైట్ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్ రిపోర్ట్ రెస్టరెంట్కి వెళ్లాల్సిందే మరి. (చదవండి: ఘోస్ట్ కోసం బీస్ట్ పిరమిడ్ వాసం) -
South Korea: బ్లాక్బాక్స్ సైలెన్స్!!
దక్షిణ కొరియా ఘోర విమాన ప్రమాదంపై ఆ దేశ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి సరిగ్గా నాలుగు నిమిషాల ముందే విమానంలో బ్లాక్ బాక్సు పని చేయకుండా పోయిందని ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు విమానం శకలాల నుంచి బాక్ బాక్స్ను సేకరించి అధికారులు విశ్లేషించారు. అయితే అందులో ఎలాంటి సమాచారం లేకపోయేసరికి అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో.. అమెరికాలోని ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ల్యాబోరేటరీకి పంపించారు. యూఎస్ సేఫ్టీ రెగ్యులేటరీ సహకారంతో డాటా రికార్డర్ను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.‘‘రక్షణగోడను ఢీకొట్టి ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే విమానంలో ఉండే బ్లాక్ బాక్సుల్లో ఎలాంటి డేటా రికార్డు కాలేదని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. అసలు ఆ డేటా పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం ’’ అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఇది అత్యంత అరుదైన ఘటన అని మాజీ అధికారి సిమ్ జై డోంగ్ అంటున్నారు. ఇలా బ్లాక్బాక్స్లు మూగబోయిన సందర్భాలు గతంలోనూ నమోదయ్యాయని చెబుతున్నారాయన.ఇటీవల జెజు ఎయిర్ విమానం థాయ్లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా ముయాన్కు బయలుదేరింది. మరో అయిదు నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకుంటుండగా.. విమానం రన్వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణగోడ వైపు దూసుకెళ్లి, గోడను ఢీకొట్టి, పేలిపోయింది. విమాన వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు.Death toll from the crash of a Jeju Air passenger plane during landing in South Korea has risen to 96▪️ The plane failed to deploy its landing gear on the first attempt and crashed during an emergency landing on the second attempt▪️ The aircraft veered off the runway and… pic.twitter.com/8uDMwRcIpn— Anadolu English (@anadoluagency) December 29, 2024అనుమానాలెన్నో..విమానాన్ని పక్షి ఢీ కొట్టిందనే సమాచారాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. అయితే అత్యవసర ల్యాండింగ్కు విమానం ఒకసారి ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలో రెండోసారి సింగిల్ రన్వేపై దిగగా ల్యాండింగ్ గేర్ సమస్యతో దూసుకెళ్లి అక్కడున్న గోడను ఢీ కొట్టింది. అయితే విమాన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవై దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా బాధిత కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే.. లోకలైజర్ను రన్వే చివర.. అదీ అంతటి గట్టి పదార్థంతో నిర్మించాల్సిన అవసరం ఏంటనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. -
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
యూన్కు అరెస్ట్ వారెంట్
సియోల్: దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు సియోల్లోని జిల్లా కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఆఫీసు, నివాసాల్లో సోదాలు చేపట్టాలని ఆదేశించిందని అవినీతి నిరోధక విభాగం వెల్లడించింది.. అయితే, అధికారికంగా యూన్ను పదవి నుంచి తొలగిస్తేనే తప్ప ఆయన నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేపట్టేందుకు అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంటున్నారు. యూన్ ఈ సమన్లను పట్టించుకోరని చెబుతున్నారు.ఇప్పటికే విచారణకు రావాలంటూ అందిన సమన్లను ఆయన పక్కనబెట్టేశారని, అధ్యక్షునికి ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను చూపుతూ భద్రతా సిబ్బంది ఇతర దర్యాప్తు అధికారులెవరినీ ఆయన నివాసంలోకి గానీ ఆఫీసులోకి గానీ రానివ్వడం లేదని సమాచారం. యూన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం తిరుగుబాటు కిందికి వస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అవినీతి వ్యతిరేక విభాగం తెలపడాన్ని ఆయన లాయర్లు తప్పుబడుతున్నారు. ఈ విభాగం సోమవారం జారీ చేసిన సమన్లకు ఎలాంటి చట్టబద్ధతా లేదని కొట్టిపారేస్తున్నారు. అరెస్ట్కు యూన్ అంగీకరిస్తే తప్ప తామేమీ చేయలేమని అవినీతి నిరోధక విభాగం సైతం అంగీకరించింది. అప్పటి వరకు తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది.అయితే, విచారణకు సహకరించేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. గతంలో, అవినీతి ఆరోపణలెదుర్కొన్న 2017లో మాజీ అధ్యక్షుడు పార్క్ గుయెన్ హే కూడా ఇదే విధంగా విచారణ అధికారులకు సహకరించలేదని గుర్తు చేస్తున్నారు. అవినీతి నిరోధక విభాగం తిరుగుబాటు ఆరోపణలను రుజువు చేయగలిగిన పక్షంలో యూన్కు మరణ శిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతర నేరారోపణలైతే ఆయనకు అధ్యక్ష హోదా కారణంగా మినహాయింపులు వర్తిస్తాయి. తిరుగుబాటు, దేశద్రోహం వంటి ఆరోపణలు రుజువైతే మాత్రం అధ్యక్షుడికి ఎలాంటి రక్షణలు, మినహాయింపులు ఉండవు.మార్షల్ లా విధించిన ఆరోపణలపై ప్రతిపక్షం మెజారిటీ ఉన్న పార్లమెంట్ డిసెంబర్ 14వ తేదీన యూన్ను అభిశంసించింది. అయితే, ఉత్తర కొరియాకు ప్రతిపక్షం అనుకూలంగా మారిందని యూన్ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, తరచూ ఉన్నతస్థాయి నేతలపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెడుతూ అడ్డుతగులుతోందని ఆయన విమర్శిస్తున్నారు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకే మార్షల్ లా పెట్టినట్లు యూన్ వాదనలు వినిపిస్తున్నారు. యూన్ అభిశంసన సరైనదా కాదా అనే అంశంపై దేశ రాజ్యాంగ కోర్టు విచారణ జరుపుతోంది. -
ద.కొరియా అధ్యక్షుడికి కోర్టు షాక్
సియోల్:సౌత్కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు తాజాగా కోర్టును కోరారు.పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో యోల్ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యోల్ డిసెంబర్3న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది.ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మార్షల్లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. -
విమానంలో ఏ సీటు భద్రం?
ఆదివారం దక్షిణకొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలొచ్చాయి. దీంతో విమానంలో ముందువైపు లేదంటే వెనుకవైపు అసలు ఏ నంబర్ సీటులో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడొచ్చనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ విమానప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజంగానే వెనుకవైపు సీట్లు భద్రమా? అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలచేస్తోంది. మిగతా ప్రయాణాలతో చూస్తే భద్రమే ఎక్కడ కూర్చుంటే క్షేమంగా ఉంటామనే ప్రశ్న కంటే అసలు విమానంలో ప్రయాణమే అత్యంత భద్రమని మరో వాదన మొదలైంది. నిర్లక్ష్య డ్రైవింగ్, గతుకుల రోడ్డు, ఎత్తుఒంపులు ఉన్న చోట్ల సాంకేతిక ప్రమానాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు, సరైన సూచికల వ్యవస్థ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్ర యాణం ఎంతో క్షేమదాయకమని వారు చెబుతున్నారు. విమానంలో ఎక్కడ కూర్చున్నా భద్ర మేనని, ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి సుశిక్షుతులైన పైలట్ల పర్యవేక్షణలో విమానం ప్రయాణిస్తుందని, అ త్యంత అరుదుగా మాత్రమే, అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే వి మా నం ప్రమాదంబారిన పడుతుంద ని విశ్లేషకులు చెబుతు న్నారు. అమెరికాలో ఎలా? ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా రోడ్లపై ప్రతి 10 కోట్ల వాహన ప్రయాణాల్లో కేవలం 1.18 మరణాలు సంభవిస్తున్నాయి. అదే 10 కోట్ల మైళ్ల రైలు ప్రయాణంలో 0.04 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 10 కోట్ల మైళ్ల విమాన ప్రయాణాల్లో అత్యంత స్వల్పంగా కేవలం 0.003 మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం 2023లో ప్రతి వంద కోట్ల మంది ప్రయాణికులకు కేవలం 17 మంది మాత్రమే విమాన ప్రమాదాల్లో చనిపోయారు. 2022 ఏడాదిలో ఈ సంఖ్య 50గా ఉంది. అత్యాధునిక విమానాల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అత్యల్ప స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తోక క్షేమమే విమానం ద్రవరూప ఇంధనం(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీస్లకు వాడే భారీ పౌరవిమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వచేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వులు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలుకావడం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాదసందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాదరికార్డులు తేటతెల్లంచేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మేగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేíÙస్తూ ఒక నివేదిక సిద్ధంచేసింది. దీని ప్రకారం తోకభాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉంటాయి. ముందు సీట్లతో ముప్పే ప్రమాదంలో ఇంధనం అంటుకుని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒకరకంగా ప్రమాదకరమని నివేదించారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్వే చివరన గోడలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయంలోకి దూసుకెళ్లినా ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రం మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండటం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం వీళ్లకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు వీళ్లకే ఎక్కువ. ఏదేమైనా విమానం ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనుక, పక్క భాగాలు దెబ్బతింటాయి. భారత్లో గంటకొకటి చొప్పున జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇటీవల సర్వసాధారణమైన పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాలతో పోలిస్తే అత్యంత అరుదుగా జరిగే విమాన ప్రమాదాలను భూతద్దంలో చూడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే వాళ్లు ఈ ‘సీటు క్షేమం’చర్చలో పాల్గొన్నారు. బతికే అవకాశాలు 60 శాతం అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డ్ నివేదికను విశ్లేíÙస్తూ బ్రిటన్ పాత్రికేయుడు మ్యాక్స్ ఫాస్టర్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టారు. ‘‘విమానం నేలపై కూలినా, నీటిలో పడినా, గాల్లోనే పేలిపోయినా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు రెక్కల మధ్యభాగంలోని సీట్లలో కూర్చుంటే 59 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. ఇక వెనుకవైపు అంటే తోక సమీప సీట్లలో కూర్చుంటే 69 శాతం బతికే అవకాశాలు ఉన్నాయి’’అని అన్నారు. అయితే ఇక్కడో ఘటనను తప్పక గుర్తుచేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ‘1989లో అమెరికాలో యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు 269 మంది ప్రయాణికుల్లో 184 మంది బతికారు. వీరిలో చాలా మంది ముందు సీట్లలో కూర్చున్నారు’’అని ఆయన గుర్తుచేశారు. ప్రఖ్యాత ‘టైమ్’మేగజైన్ నివేదిక సైతం వెనుక సీట్లు క్షేమమని తెలిపింది. మిగతా సీట్లతో పోలిస్తే వెనుకవైపు సీట్లలో మధ్య వాటిల్లో కూర్చుంటే మరింత క్షేమమని పేర్కొంది. ఇక్కడ కూర్చుంటే మరణించే అవకాశం కేవలం 28 శాతమని, అదే విమానం మధ్యలో కూర్చుంటే ముప్పు శాతం 44 శాతంగా ఉంటుందని వెల్లడించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ద.కొరియా: మరో విమానానికి తప్పిన ప్రమాదం
సియోల్:సౌత్కొరియాలో ఘోర విమాన ప్రమాదం మరువకముందే మరో విమానానికి పెద్ద గండం తప్పింది. ఈ విమానం కూడా ఆదివారం 179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు ఎయిర్లైన్స్కు చెందినదే కావడం గమనార్హం. జెజు ఎయిర్లైన్స్కు చెందిన సోమవారం(డిసెంబర్30) ఉదయం సియోల్లోని గింపో ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించాడు. దీంతో విమానాన్ని తిరిగి గింపో విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. అయితే ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్ సమస్యనే వచ్చినట్లు తెలుస్తోంది.కాగా, ఆదివారం సౌత్కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో విమానం క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 181 మందిలో ఇద్దరు తప్ప అందరూ దుర్మరణం పాలయ్యారు. జెజు ఎయిర్లైన్స్కు సామాన్యులకు అందుబాటు ధరల్లో విమానాలు నడిపే బడ్జెట్ ఎయిర్లైన్ కంపెనీగా పేరుంది.ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
త్వరలో ద.కొరియా అధ్యక్షుడి అరెస్టు..?
సియోల్:ఎమర్జెన్సీ వివాదం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను వెంటాడుతోంది. ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యోల్కు అరెస్టు ముప్పు పొంచి ఉంది. యోల్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టును కోరినట్లు సమాచారం.కోర్టు అంగీకరిస్తే త్వరలోనే యోల్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యోల్ ఇటీవల దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యూన్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.ఇదీ చదవండి: నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్కల్ పినాంగ్కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్వే నుంచి జారి..నేపాన్లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌత్ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి
-
సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం
-
179 ప్రాణాలు బుగ్గిపాలు
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏకంగా 179 మంది ప్రయాణికులు నిస్సహాయంగా మంటల్లో చిక్కి మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఆదివారం ఉదయం 9.03 గంటలకు థాయ్లాండ్లోని బ్యాంకాక్ నుంచి వచ్చిన జెజూ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737–800 విమానం ముయాన్ ఎయిర్పోర్టులో రన్వేపై దిగుతూ అదుపు తప్పింది. విమానాశ్రయ రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఇద్దరు మినహా అంతా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటిదాకా గుర్తించిన మృతుల్లో 85 మంది మహిళలు కాగా 84 మంది పురుషులు. మరో 10 మందిని గుర్తించాల్సి ఉంది. మహిళలో, పురుషులో కూడా గుర్తించలేనంతగా మృతదేహాలు కాలిపోయాయని సహాయక సిబ్బంది చెప్పారు. విమానం మంటల్లో చిక్కగానే సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు లాగారు. వారిని విమాన సిబ్బందిగా గుర్తించారు. మిగతా ప్రయాణికులంతా ప్రమాదంలోనే కన్నుమూశారు. వారిలో అత్యధికులు దక్షిణకొరియా పౌరులే. ఇద్దరు మాత్రం థాయ్లాండ్ జాతీయులని తేలింది. రాజధాని సియోల్కు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం బారిన పడ్డ బోయింగ్ 737–800 విమానం 15 ఏళ్ల నాటిది. ల్యాండింగ్ గేర్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇదొకటి. తెరుచుకోని ల్యాండింగ్ గేర్ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ మూసే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వేగంగా దూసుకొచి్చన విమానం రన్వేపై దిగుతూనే అదుపు తప్పింది. అడ్డంగా దూసుకెళ్లి విమానం ముందుభాగం రక్షణ గోడను ఢీకొంది. అప్పటికీ వేగం పూర్తిగా తగ్గక మరికొంత ముందుకు దూసుకెళ్లింది. ఆ ఒత్తిడికి ఇంధనానికి మంటలు అంటుకుని ఉవ్వెతున ఎగిశాయి. చూస్తుండగానే విమానం పేలిపోయి భారీగా మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి. విమానం పూర్తిగా ధ్వంసమైందని, కేవలం తోక భాగం మాత్రమే గుర్తించగల స్థితిలో ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 32 అగ్నిమాపక యంత్రాలు, హెలికాప్టర్ల సాయంతో 1,570 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోప్ ఫ్రాన్సిస్, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, థాయ్లాండ్ ప్రధాని పెటాంగ్తర్న్ షినవత్ర తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జెజూ ఎయిర్ సంస్థ క్షమాపణ తెలిపింది. పక్షి వల్లే ప్రమాదమా? ల్యాండింగ్కు కాసేపటి ముందు పైలట్కు టవర్ సిబ్బంది బర్డ్ స్ట్రైక్ వార్నింగ్ ఇచ్చారని దక్షిణ కొరియా రవాణా శాఖ వెల్లడించింది. ‘‘ప్రమాదానికి ముందు విమాన పైలట్, ఎయిర్పోర్టు కంట్రోల్ టవర్ మధ్య సంభాషణను విశ్లేషించాం. విమానాన్ని పక్షి ఢీకొట్టేలా ఉండటంతో మరో రన్వేపై దిగడానికి అనుమతిచ్చారు. అక్కడ దిగలేని పరిస్థితి ఉందంటూ పైలట్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం రన్వే చివరి భాగంలో దిగి అదుపు తప్పింది’’ అని తెలియజేసింది. ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ బాక్స్ డేటాను సేకరించి విశ్లేషణకు పంపారు. దర్యాప్తు పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రన్వేను జనవరి 1వ తేదీ దాకా మూసేశారు.త్రుటిలో తప్పిన మరో మూడు ప్రమాదాలు కెనడాలో విమానానికి మంటలు నార్వేలో అదుపు తప్పిన విమానం నేపాల్లో హెలికాప్టర్ను ఢీకొన్న పక్షి ఒట్టావా/ఓస్లో/కఠ్మాండు: దక్షిణ కొరియా ప్రమాదం జరిగిన కాసేపటికే ఆదివారం మరో రెండు భారీ విమాన ప్రమాదాలు త్రుటిలో తప్పాయి. కెనడాలో సెయింట్ జాన్స్ నుంచి వస్తున్న ఎయిర్ కెనడా 2259 విమానం హలిఫాక్స్ విమానాశ్రయంలో రన్వేపై దిగుతూ అదుపు తప్పింది. దాంతో విమానానికి మంటలంటుకున్నాయి! అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. ఒక టైర్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో రన్వేపై దిగగానే విమానం అదుపు తప్పి 20 డిగ్రీల కోణంలో ఎడమకు వాలి అలాగే దూసుకెళ్లింది. దాంతో మంటలు అంటుకుని విమానం ఎడమ భాగం కాలిపోయింది. పెద్ద శబ్దం వినిపించింది. పైలట్ చాకచాక్యంగా విమానాన్ని ఆపగలిగాడు. వెంటనే సహాయక సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన బయటకు తీసుకొచ్చారు. నార్వేలో కూడా ఓ విమానం అత్యవసరంగా ల్యాండవుతూ అదుపు తప్పింది. ఓస్లో నుంచి నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్కు బయల్దేరిన కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737–800 టేకాఫయిన కాసేపటికే హైడ్రాలిక్ విఫలమైంది. దాంతో ఓస్లోకు 110 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్టుకు మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా అదుపు తప్పి రన్వేను తాకి దట్టమైన గడ్డిలోకి వెళ్లి ఆగింది. విమానంలోని 182 మందినీ వెంటనే భద్రంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్లో ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని బేస్ లుక్లా నుంచి ఆదివారం ఐదుగురు అమెరికన్లతో బయల్దేరిన హెలికాప్టర్ను పక్షి ఢీకొంది. దాంతో సురక్షితంగా బనెపాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. -
తాత్కాలిక అధ్యక్షుడికీ తప్పని అభిశంసన
సియోల్: దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్–సూపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రతిపక్షం మెజారిటీ కలిగిన నేషనల్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో అనూహ్యంగా మార్షల్ లా విధించడం, అనంతర పరిణామాల్లో ఆయన్ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించడం తెలిసిందే. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడు హన్ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించిన నేపథ్యంలో ఆయనకు ఇకపై ఎలాంటి అధికారాలు, విధులు ఉండవు. పదవిలో కొనసాగించాలా లేదా దించేయాలా అనే విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం తేల్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. యూన్ అభిశంసన అంశం ఇప్పటికే రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలనలో ఉండటం తెలిసిందే. అధ్యక్షుడు, తాత్కాలిక అధ్యక్షుడి అభిశంసనలు దేశంలో రాజకీయపరమైన అయోమయాన్ని మరింత పెంచాయి. ఆర్థిక అనిశ్చితి ఫలితంగా అంతర్జాతీయంగా దక్షిణ కొరియా ప్రతిష్ట దెబ్బతిననుంది. -
దక్షిణ కొరియా అధ్యక్షుని అభిశంసన
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పర్యవసానాన్ని అనుభవించారు. ఆయనపై విపక్షాలు ప్రవేశపెట్టిన రెండో అభిశంసన తీర్మానం శనివారం పార్లమెంటు అమోదం పొందింది. 300 మంది సభ్యుల్లో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే 200 ఓట్లు రావాల్సి ఉండగా 204 మంది ఓటేశారు. 85 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో యోల్ పదవీచ్యుతుడయ్యారు. ప్రధాని హాన్ డక్ సో తాత్కాలిక దేశాధినేతగా వ్యవహరించనున్నారు. యోల్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా, పూర్తిగా తొలగించాలా అన్నది రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇందుకు ఆర్నెల్లు పట్టవచ్చు. తొలగించే పక్షంలో 60 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. పీపుల్ పవర్ పార్టీ సభ్యుల గైర్హాజరీతో గత శనివారం తొలి అభిశంసన తీర్మానం నుంచి ఆయన గట్టెక్కారు. ఈసారి మాత్రం ఆయన సొంత పార్టీ సభ్యుల్లో పలువురు అభిశంసన తీర్మానం ఆమోదం పొందడానికి సహకరించారు. ఇది దక్షిణ కొరియా ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్క్ చాన్ డే అన్నారు. ఫలితాలపై యోల్ స్పందించలేదు. పాలనపై కోల్పోతున్న పట్టును నిలుపుకునేందుకు ఆయన ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ ప్రకటించడం, గంటల్లోనే పార్లమెంటు దాన్ని ఎత్తేయడం తెలిసిందే. యోల్, ఆయన భార్య, కుటుంబీకులు, సన్నిహితులపై భారీ అవినీతి ఆరోపణలున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాని హాన్ డక్–సో సాంకేతిక నిపుణుడు. పారీ్టలకతీతంగా వైవిధ్యమైన కెరీర్ ఆయనది. పాలనాపరంగా విస్తృతమైన అనుభవముంది. ఐదుగురు వేర్వేరు అధ్యక్షుల ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలకు పైగా నాయకత్వ పదవుల్లో పనిచేశారు. -
దక్షిణ కొరియాలో రోజురోజుకూ ముదురుతున్న సంక్షోభం
-
అండర్వేర్తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం!
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నవేళ.. రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హైయున్ అండర్వేర్తో ఆత్మహత్యాయత్నం చేశారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన.. కారాగారంలోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కిమ్ యోంగ్ హైయున్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు అత్యంత సన్నిహితుడు. సైనిక పాలన విధింపు ప్రకటన వెనుక ఈయన ప్రమేయమే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగంపై ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సరిగ్గా అరెస్ట్కు ముందు బాత్రూంకు వెళ్లిన ఆయన.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అధికారులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు.అండర్వేర్తో ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేయగా.. అధికారులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని న్యాయ శాఖ తాజాగా పార్లమెంట్కు నివేదించింది.South Korean ex-defense minister Kim Yong-hyun Wednesday attempted suicide at detention facility, Yonhap news agency reported, citing a correction official. #SouthKorea https://t.co/QbHxSw64PA https://t.co/3Mat8pNHh2— 贺亮 (@HeLiang74893) December 11, 2024సైనిక పాలనపై నిర్వహించిన ఓటింగ్కు చట్ట సభ్యులు హాజరుకాకుండా వాళ్ల మీదకు భద్రతా బలగాలను ప్రయోగించాడనే అభియోగమూ ఉంది.దక్షిణ కొరియా డిసెంబర్ 3వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హఠాత్తుగా టీవీ ఛానెల్స్ ముందు ప్రత్యక్షమై.. అత్యవసర సైనిక పాలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు దాయాది దేశం ఉత్తర కొరియాతో చేతులు కలిపి కుట్రలకు తెర తీశాయని, అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే దేశంలో అలజడి రేగింది. మరోపక్క.. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని చట్ట సభ్యులూ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంక్షోభం తలెత్తే ప్రమాదంతో.. చేసేది లేక కొన్నిగంటల తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆయన దేశానికి క్షమాపణలు చెప్పారు.అయితే ఈ అంశంపై ప్రత్యేక మండలి విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం చట్ట సభ్యులంతా ఆ కౌన్సిల్కు అనుమతులు జారీ చేశారు. సైనిక పాలన విధింపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది యూన్పై అభియోగం. అది గనుక రుజువైతే.. ఆయనకు మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: తప్పైంది.. నన్ను క్షమించండి -
దక్షిణ కొరియాలో ట్విస్ట్.. అధ్యక్ష ఆఫీసులో పోలీసుల సోదాలు
సియోల్: దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు కొరియన్ టైమ్స్ తెలిపింది.వివరాల ప్రకారం.. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అనంతరం, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు యూన్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు యూన్పై దక్షిణ కొరియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధ్యక్ష కార్యాలయంలో.. నేడు సియోల్ మెట్రోపాలిటన్ పోలీసులు, నేషనల్ అసెంబ్లీ పోలీస్ గార్డ్స్ సోదాలు చేశారు. అయితే, అధ్యక్ష కార్యాలయంపై పోలీసులు సోదాలు చేసిన సమయంలో యూన్ ఆఫీసులో లేరని కొరియన్ టైమ్స్ వెల్లడించింది.ఇక, అంతకుముందు.. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?ఇక, మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్ను నియమించారు. South Korean police raided President Yoon Suk Yeol's office and police headquarters on Wednesday as part of an investigation into the brief imposition of martial law, the Yonhap news agency reported.Raids were also carried out at the offices of the Seoul Metropolitan Police. pic.twitter.com/G5yLytJWJy— VIVERO del bosque (@viverodelbosque) December 11, 2024 -
దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ అంశం.. మాజీ రక్షణ మంత్రి అరెస్ట్
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటూ సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆయన్ను ప్రశ్నించిన అధికారులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కిమ్ తనకుతానుగానే సియోల్ విచారణాధికారి కార్యాలయానికి వెళ్లారని, ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్ట్ చేశారని మీడియా అంటోంది. కిమ్ కార్యాలయంతోపాటు నివాసంలోనూ తనిఖీలు చేపట్టారని చెబుతున్నారు. ఎమర్జెన్సీ విధింపునకు దారి తీసిన పరిస్థితులపై కిమ్పై విచారణ కోసం 62 మంది సభ్యుల దర్యాప్తు బృందం ఏర్పాటైందని సీనియర్ ప్రాసిక్యూటర్ పార్క్ సె–హ్యూన్ వెల్లడించారు. గత వారం స్వల్ప కాల ఎమర్జెన్సీని, ఆ తర్వాత పార్లమెంట్ తొలగించడం తెలిసిందే. ఈ పరిణామానికి సంబంధించిన తొలి అరెస్ట్ ఇది. అధ్యక్షుడు యూన్పై శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అధికార పక్ష సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. అయినప్పటికీ, త్వరలోనే మరోసారి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న కిమ్ మంత్రి పదవికి గురువారమే రాజీనామా చేశారు.ఇదీ చదవండి: దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఉపశమనం -
నన్ను క్షమించండి: సౌత్కొరియా అధ్యక్షుడు
సియోల్:దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. ‘తల వంచి అడుగుతున్నాను. నన్ను క్షమించండి..మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను’అని యూన్ సుక్ యోల్ దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించానని యోల్ తన తప్పు ఒప్పుకున్నారు.ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక నుంచి దేశ భవిష్యత్తు, తన భవిష్యత్తు తన పార్టీ నిర్ణయానికి వదిలేస్తున్నాన్నారు. దేశాన్ని పాలన విషయాన్ని తనపార్టీ, ప్రభుత్వం చూసుకుంటాయని తెలిపారు. ఇలాంటి తప్పు మరోసారి చేయనని యోల్ స్పష్టం చేశారు. యోల్పై మోపిన అభిశంసన తీర్మానంపై శనివారం దక్షిణ కొరియా పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్కు ముందు శనివారం(డిసెంబర్ 7) ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసంగిస్తూ బహిరంగ క్షమాపణ కోరడం గమనార్హం. ఇదీ చదవండి: నియంతకు పరాభవం -
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నియంతకు పరాభవం
‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్జీ, ఎస్కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు. ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు. ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. కనుకనే మొన్న ఏప్రిల్లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు. 1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు. -
పాక్ పరువు తీసిన ‘మార్షల్ లా’కు అంత పవర్ ఉందా?
రాజకీయాలపై ఆసక్తి కలిగినవారికి ప్రపంచ రాజకీయ చిత్రం ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఉన్నట్టుండి ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది. అయితే ఇంతలోనే అక్కడి పార్లమెంట్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో దానిని రద్దు చేయాల్సి వచ్చింది.చర్చనీయాంశంగా మారి..1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లా(సైనిక పాలన) విధించడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో మరోసారి మార్షల్ లా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి, అపఖ్యాతి పాలయ్యింది. ఇంతకీ మార్షల్ లా అంటే ఏమిటి? అ చట్టాన్ని అమలు చేసినప్పుడు దేశంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి?శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు..నిజానికి మార్షల్ లా అంటే దేశ అధికారమంతా సైన్యం చేతుల్లోకి వెళ్లడం. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు దీనిని అమలు చేస్తారు. ఇది దేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశమంతటికీ వర్తించవచ్చు. ఇది అమలైనప్పుడు పౌర పరిపాలన ముగుస్తుంది. శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది. అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి. ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ పర్యవేక్షణలో..ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మార్షల్ లా వర్తిస్తుంది. ఇది యుద్ధం, తిరుగుబాటు లేదా పెద్ద ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సంభవించవచ్చు. మార్షల్ లా అమలైనప్పుడు సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తుంది. ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది.పాక్లో నాలుగు సార్లు మార్షల్ లా పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు. 1958లో మొదటిసారిగా, దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పటినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్ లా విధించారు. అనంతరం మిలటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తదనంతర కాలంలో దేశంలో సైనిక, రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.అడుగంటిన సామాన్యుల స్వేచ్ఛ1977, జూలై 5 న జనరల్ జియా-ఉల్-హక్ పాకిస్తాన్లో మార్షల్ లా విధించి, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు. రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటిపోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది. 1999లో పాకిస్తాన్లో మరోమారు మార్షల్ లా విధించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ను తొలగించి, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు. ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది.జర్మన్, జపాన్లలో..మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మన్, జపాన్లలో సైన్యం పాలనను చేపట్టింది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్లో మార్షల్ లా విధించారు. అయితే పదే పదే మార్షల్ లా అమలు చేస్తూ పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా నిర్వీర్యం చేస్తుందో పదే పదే మార్షల్ లా విధించడం చూస్తే అర్థమవుతుంది. మార్షల్ లా అమలు చేసేముందు పర్యవసానంగా వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల దక్షిణ కొరియా నిర్ణయం ద్వారా స్పష్టమైంది.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
దక్షిణ కొరియాలో పొలిటికల్ ట్విస్ట్.. కీలక మంత్రి రాజీనామా
సియోల్: దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్న ప్రకటించి.. అనంతరం విరమించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇక, దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ తాజాగా రాజీనామా చేశారు. అనంతరం, అధ్యక్షుడు.. కిమ్ రాజీనామాను ఆమోదించారు. వెంటనే.. సౌదీ అరేబియాలోని రాయబారి చోయ్ బ్యూంగ్-హ్యూక్ను కొత్త మంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగానే ఆయన రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్పై ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దక్షిణకొరియా పార్లమెంట్లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోపు ఓటింగ్కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ పేర్కొన్నారు. -
దక్షిణకొరియా మాయమవుతుందా?
ఊరందరిదీ ఒకదారి.. ఉలిపిరి కట్టెది ఇంకోదారి అన్నట్లుగా ఉంది ఈ దేశం పరిస్థితి. అత్యద్భుతంగా సాంకేతికతను అందిపుచ్చుకుని యూరోప్, అమెరికా దేశాలను దాటి ప్రగతిపథంలో సాగుతున్న దక్షిణ కొరియా జనభాపరంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో నానాటికీ జనాభా తగ్గుతూ వస్తున్నందున రానున్న కొన్ని దశాబ్దాల్లో ఆ దేశం జనంలేక నిర్జీవమై అంతరించిపోతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా గురజాడ చెప్పినట్లుగా దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనావంటి దేశాలు జనాభాని పెంచుకుంటూ పట్టణాలు.. పల్లెలు కిక్కిరిసిపోతున్నాయి. కానీ దక్షిణ కొరియా మాత్రం జనాభా కొరతతో అల్లాడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్లలో జనాభా పూర్తిగా తగ్గిపోయి దేశమే అంతర్థానం అయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు అంటున్నారు.పెళ్లి వద్దు.. కెరీర్ ముద్దు దేశంలో యుక్త వయస్సు రాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే సంప్రదాయం తగ్గిపోతూ వస్తోంది. ముఖ్యంగా మహిళలు ముందుగా కెరీర్లో స్థిరపడాలి.. ఉన్నత స్థితికి చేరాలి.. ఇల్లు.. కార్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి.. ఆ తరువాతనే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనే భావనలో ఉండడంతో దేశంలో పెళ్లిళ్లు కూడా లేటుగా అవుతున్నాయి. పెళ్లి.. ఇల్లు పిల్లలు.. సంసారం గురించి పెద్దలు చెబుతున్నా వినే పరిస్థితుల్లో దేశంలోని మహిళలు లేరని సర్వేలు చెబుతున్నాయి. దీంతో శతాబ్ద కాలంలో దేశం 70 శాతం జనాభాను కోల్పోతుందని, జనాభాలో పునరుత్పత్తి సామర్ధ్యం కూడా గణనీయంగా పడిపోతూ వస్తున్నదని, దేశంలో జననాల రేటు ఏటా 5,00,000 కన్నా అతక్కువగా నమోదవుతూ వస్తోంది.ఇదిలా కొనసాగితే దేశ జనాభా కొన్ని దశాబ్దాల్లోనే ఐదున్నర కోట్ల నుంచి కోటిన్నరకు పడిపోతుందని, ఇది ఏకంగా దేశ మనుగడకు ముప్పుగా మారుతుందని పరిశోధకులు అంటున్నారు. దేశం జనాభాతో కళకళలాడుతూ పది కాలాలపాటు పచ్చగా ఉండాలంటే జననాల రేటు 2. 1 శాతంగా ఉండాలి కానీ ప్రస్తుతం అది 0. 72 శాతానికి పడిపోయింది. తద్వారా దేశంలో జననాల రేటుకన్నా మరణాల రేటు ఎక్కువై పల్లెలు, పాట్టణాలు సందడి తగ్గిపోతూ వస్తున్నాయి.ప్రభుత్వ నిర్ణయాలే కారణమా ?1960 కాలంలో దేశం అంతగా అభివృద్ధి చెందలేదు.. ఇంకా వర్థమానదేశంగానే ఉండేది. ఆ తరుణంలో దేశంలో జనాభా పెరిగితే దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకం అవుతుందని దేశంలో కుటుంబ నియంత్రణను అమలు చేశారు . పిల్లలను కనడం తగ్గించాలని, లేకుంటే మున్ముందు బతకడం కష్టం అవుతుందని చేసిన ప్రభుత్వ ప్రచారం ప్రజలమీద గట్టిగా పని చేసింది. దీంతో అప్పట్నుంచి దేశంలో జనాభా నియంత్రణ మొదలైంది. సరే మనం దేశ జనాభా తగ్గిస్తున్నాం అనుకుంటున్న పాలకులు ఆ నియంత్రణ ఏకంగా దేశాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాం అని గుర్తించలేకపోయారు. ఆ తగ్గుదల క్రమంగా అట్టడుగు స్థాయికి దిగిపోయింది. 1980 దశకంలోనే తగ్గుదల కనిపించినా పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి, 52 మిలియన్ల ఉన్న దక్షిణ కొరియా జనాభా 17 మిలియన్లకు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు.దిద్దుబాటు చర్యలున్నా.. ఫలితం నిల్ పరిస్థితిని చక్కదిద్దే యత్నంలో ప్రభుత్వం మళ్ళీ జనాభాను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. పిల్లల సంరక్షణలో సహాయం చేయడానికి విదేశీ ఆయాలను సైతం తెచ్చుకోవచ్చని చెబుతోంది. దీనివల్ల పిల్లల పెంపకం అంటే భయపడుతున్న కొరియా యూత్ కు కాస్త ఉపయుక్తం అవుతుందని ప్రభుత్వం భావించింది. 30 ఏళ్లు నిండకముందే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రయ్యే పురుషులను ఆర్మీ నుంచి పంపేయాలని కూడా భావిస్తోంది. ఇన్ని చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం, వారి సంరక్షణ అనేది తమకు తలకు మించిన భారంగా ఉంటోందని భావించిన మహిళలు అసలు పెళ్లి వద్దనుకుంటున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. దాదాపు 30 శాతం మంది మహిళలు తాము పెళ్లి చేసుకోకూడదని ఆ సర్వేలో అభిప్రాయపడ్డారు.సైన్యానికి యువకుల కొరత దేశంలో జననాలు తగ్గిపోతుండడంతో దక్షిణ కొరియా సైన్యానికి యువకుల కొరత ఎదురవుతోంది. పక్కనే ఉంటూ నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర కొరియాలో 12 లక్షల మంది సైన్యం ఉన్నారు. కానీ దక్షిణ కొరియాకు 2017 లో 6. 2 లక్షలుగా ఉండే సైన్యం నేడు అయిదు లక్షలకు పడిపోయింది,. రానున్న అవసరాలమేరకు ఏటా రెండు లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని దేశం భావిస్తున్నా 1.25 లక్షలమంది యువకులు మాత్రమే అందుబాటులో ఉన్నారట. అదన్నమాట.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనంలేక మొత్తం దేశం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
దక్షిణ కొరియాలో బిగ్ ట్విస్ట్.. ఎమర్జెన్సీ ఉపసంహరణ
సియోల్: దక్షిణ కొరియాలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటల్లో దాన్ని ఉపసంహరించుకున్నట్టు మరో ప్రకటన చేశారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. దీంతో, ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు గంట్లలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.స్థానిక కాలమానం ప్రకారం తెల్లావారుజామున 4:30 గంటలను అధ్యక్షుడు యూన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలని జాతీయ అసెంబ్లీ నుండి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాము. మార్షల్ లా కార్యకలాపాల కోసం జాతీయ అసెంబ్లీ అభ్యర్థనను అంగీకరిస్తాము. కేబినెట్ సమావేశం ద్వారా ఎమర్జెన్సీని ఎత్తివేస్తాము అని ప్రకటించారు.South Korean President Yoon Suk Yeol said he will rescind his martial law decree, giving in to the parliament’s opposition just hours after his dramatic move imposing it that shook markets and surprised other world leaders.Listen to the story or get the full story in the 1st… pic.twitter.com/aKAvMczxqD— Bangkok Post (@BangkokPostNews) December 4, 2024అంతకుముందు.. అధ్యక్షుడి నిర్ణయాన్ని ఖండిస్తూ జాతీయ అసెంబ్లీ అర్ధరాత్రి సెషన్లో దక్షిణ కొరియా ఎంపీలు మార్షల్ లా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఓటు వేశారు. 300 మంది చట్ట సభ్యుల్లో అధికార, ప్రతిపక్ష నేతలు 190 మంది ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో, నాటకీయ పరిణామాల మధ్య ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంటున్నట్టు అధ్యక్షుడు తెలిపారు. ఈ క్రమంలో, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అభిశంసనను ఎదుర్కోవాలని డెమోక్రటిక్ పార్టీ సవాల్ చేసింది. మరోవైపు.. దక్షిణ కొరియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్న అమెరికా పేర్కొంది. ఎమర్జెన్సీ విధించిన అనంతరం.. దకక్షిణ కొరియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేతలను ఆర్మీ.. అరెస్ట్ ప్రయత్నం చేసింది. దీంతో, తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇక, దాదాపు ఐదు దశాబ్దాలలో దక్షిణ కొరియా ఎమర్జన్సీని విధించడం ఇదే మొదటిసారి. కొరియాలో చివరిసారిగా 1980లో ఎమర్జెన్సీ లాను ప్రయోగించారు.🚨BREAKING - The moment South Korean Special Forces stormed the interior of the Parliament building pic.twitter.com/EhGEu2xzPW— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) December 4, 2024 ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ ప్రకటన చేశారు. టీవీ చానెల్ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే పని చేస్తున్నాయవి. గత కొంతకాలంగా పార్లమెంట్ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం అని ప్రకటించారు.SHOCK VIDEO: South Korean Army Blocks National Assembly After Martial Law Declared By Yoon Suk Yeol pic.twitter.com/4krlonyiQ9— Alex Dickerson (@wangzai266687) December 4, 2024పార్లమెంట్ వద్ద ఉద్రిక్తతసైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి. 2022లో పీపుల్ పవర్ పార్టీ తరఫున యూన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. -
దక్షిణ కొరియాలో సైనిక పాలన విధింపు
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. టీవీ చానెల్ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.‘‘ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే పని చేస్తున్నాయవి. గత కొంతకాలంగా పార్లమెంట్ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం’’ అని యూన్ సుక్ యోల్ ప్రకటించారు.BREAKING NEWS:🇰🇷 Korea's President Yoon Suk Yeol declared martial law amid escalating political tensions, citing opposition parties' actions as a threat to national stability.#SouthKorea #MartialLaw #YoonSukYeol #Politics #Democracy #AsiaNews pic.twitter.com/uDysiGBeyd— Shahadat Hossain (@shsajib) December 3, 2024అయితే యూన్ ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించుకుంది. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తతసైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి.South Korean lawmakers and citizens have been barred from entering the parliament building following President Yoon Suk Yeol's declaration of martial law. #SouthKorea pic.twitter.com/NWok44FNfG— Geo View (@theGeoView) December 3, 20242022లో పీపుల్ పవర్ పార్టీ తరఫున యూన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. -
దక్షిణ కొరియాలో మంచు తుఫాను.. మూసుకుపోయిన రహదారులు
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా వందలాది విమానాలు రద్దు అయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ మంచు తుఫాను గత 50 ఏళ్లలో సంభవించిన అత్యంత భారీ విపత్తుగా చెబుతున్నారు. సియోల్ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని దక్షిణ కొరియా వాతావరణశాఖ తెలిపింది. 1972, నవంబర్ 28న సియోల్లో 12 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. ఈ మంచు తుఫాను ప్రభావం దేశంలోని పలు ప్రాంతాలలో కనిపించింది. 눈 대박이다... 버스 40분 남아서 역까지 걸어오고 전철도 지연되서 기다리는중.. 차들이 오르막길 못 올라가 버스도 사고나서 승객들 다.내림... pic.twitter.com/jZ1OnGVsYz— 🇰🇷숼🇰🇷 (@sowol_sy) November 27, 2024దేశంలోని మధ్య, తూర్పు, నైరుతి ప్రాంతాలలో దాదాపు 10 నుండి 23 సెం.మీ. మేరకు హిమపాతం కురిసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 220 విమానాలు రద్దు కాగా, 90 బోట్లను ఓడరేవులోనే ఉంచాలని అధికారులు ఆదేశించారు. సియోల్లోని రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
ట్రంప్తో పోరుకు రెడీ.. నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం!
ప్యాంగ్యాంగ్: అణ్వాయుధాల తయారీలో ఉత్తర కొరియా దూసుకెళ్తోంది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో కిమ్ జోంగ్ ఉన్ అప్రమత్తమయ్యారు. గత ట్రంప్ పాలనలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు కిమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని కిమ్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇటీవల తన అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించారు. జపాన్తో కలిసి ఆసియా నాటో ఏర్పాటుచేయాలన్న ఆలోచనలను ఆయన తప్పుపట్టారు.మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకొంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారుచేస్తోంది. ఇక, ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు రెండు వారాల క్రితం నివేదికలు ఇచ్చాయి.ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జెలెన్ స్కీకి అమెరికా సహాకరించడాన్ని కిమ్ తీవ్రంగా ఖండించారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ప్లాన్ ప్రకారమే తన పలుకుబడి పెంచుకునేందుకు ఉక్రెయిన్కు సహకరిస్తోందన్నారు. 🚨#BREAKING: North Korea's Kim Jong Un Is Calling For A "New Cold War"This comes in response to the Biden Administration's recent actions in the East.Kim Jong Un also calls for UNLIMITED EXPANSION OF HIS NUCLEAR WEAPONS.Thoughts? pic.twitter.com/naRaJLkTs8— Donald J. Trump News (@realDonaldNewsX) November 18, 2024 -
దీపిక డబుల్ ధమాకా
రాజ్గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జోరు కనబరుస్తోంది. తొలి రౌండ్ లీగ్ మ్యాచ్లో మలేసియాను చిత్తు చేసిన భారత జట్టు... రెండో మ్యాచ్లో దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది. హోరాహోరీగా సాగిన పోరులో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలుపొందింది. మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాల ముందు స్ట్రయికర్ దీపిక కుమారి పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మలచడంలో భారత్ ఈ టోరీ్నలో వరసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. మన జట్టు తరఫున దీపిక (20వ, 57వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరవగా... సంగీత కుమారి (3వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. కొరియా తరఫున యూరీ లీ (34వ ని.లో), కెపె్టన్ ఇన్బి చియోన్ (38వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ... దూకుడైన ఆటతో ముందుకు సాగిన భారత్... మూడో నిమిషంలోనే సంగీత కుమారి ఫీల్డ్ గోల్తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండో క్వార్టర్లో దీపిక మరో ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 2–0తో సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. అప్పటి వరకు భారత గోల్ పోస్ట్పై ఒక్కసారి కూడా దాడి చేయలేకపోయిన కొరియా ప్లేయర్లు... మూడో క్వార్టర్స్లో నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరు సమం చేశారు. ఇక అక్కడి నుంచి ఆధిక్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా ప్రయత్నించగా... చివరకు దీపిక గోల్తో భారత్ విజయపతాక ఎగరేసింది. మరోవైపు థాయ్లాండ్, జపాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’ కాగా... చైనా 5–0తో మలేసియాపై విజయం సాధించింది. తమ తదుపరి మ్యాచ్లో గురువారం థాయ్లాండ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత జట్టు 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. -
ట్రంప్ గెలుపుతో ఊపందుకున్న ఫోర్ బీ ఉద్యమం..!భగ్గుమంటున్న మహిళలు
ట్రంప్ గెలుపుతో ఒక్కసారిగా..అమెరికా మహిళా లోకం భగ్గుమంటోంది. చూస్తుండగానే కార్చిచ్చులా మారనుంది. ఎందుకంటే మహిళలంతా ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వినూత్న ఉద్యమానికి తెరలేపారు. అప్పుడే అక్కడ కాపురాల్లో కల్లోలాలు మొదలయ్యాయి. ఈ ఊహించని పరిణమానికి అక్కడి మగవాళ్లంతా తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ గెలుపు మా కాపురాలకు ఎసరుపెట్టిందంటూ లబోదిబోమంటున్నారు. అమెరికాలో కలకలం రేపుతున్నా ఆ ఉద్యమం కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ తరుణంలో అక్కడ మహిళా లోకం ఆయనపై కోపంతో అట్టుడుకిపోతూ.. ఉత్తరకొరియాకి చెందిన ఉద్యమానికి తెరలేపింది. అదికూడా ట్రంప్ గెలిచిన కొద్ది గంటల్లోనే ఇది జరగడం విశేషం. అందుకు ప్రధాన కారణం ట్రంప్ గర్భస్రావాన్ని వ్యతిరేకించే వ్యక్తి కావడమే. గతంలో అయన అధ్యక్ష పదవీ కాలంలో (2017-2021) సుప్రీంకోర్టు గర్భస్రావం(అబార్షన్) చేయించుకోవడం చట్టవిరుద్ధం అంటూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. అదీగాక ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా అబార్షన్లకు వ్యతిరేకంగానే మాట్లాడారు. కానీ డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమాలా హారిస్ మాత్రం ప్రచారంలో మహిళా హక్కులకు రక్షణ కల్పిస్తానన్నారు. అబార్షన్లపై నిర్ణయాధికారాన్ని మహిళలకే ఇస్తానన్నారు. అంతేగాదు ముగిసిన ప్రజాస్వామిక పోల్ను ఒక్కసారి పరిశీలిస్తే.. మెజార్టీ శాతం మహిళా ఓటర్లలో 54% మంది హారిస్కి ఓటు వేయగా ట్రంప్కి మాత్రం 44% మాత్రమే పోలయ్యాయి. కానీ అధ్యక్షుడిగా ట్రంప్నే అత్యధిక మెజార్టీతో గెలిచారు. అక్కడి ప్రజలు ట్రంప్కే పట్టం కట్టడం నచ్చని మహిళలు దక్షిణకొరియాకి సంబంధించిన "ఫోర్బీ ఉద్యమం"కి మద్దుతిచ్చారు. అంతేగాదు ట్రంప్ని గెలిపించిన మగవాళ్లను బాయ్కాట్ చేస్తామంటున్నారు అక్కడి మహిళలు. అంతేగాదు వారితో కలిసి ఉండం, పిల్లల్ని కనం, వారితో శారీరక సంబంధం పెట్టుకోం, అని తెగేసి చెబుతున్నారు మహళలు. ఈ ట్రంప్ గెలుపు మా కాపురాల్లో చిచ్చురేపిందంటూ మగవాళ్లంతా తలలుపట్టుకుంటున్నారు. అమెరికాలో అంతలా హాట్టాపిక్గా మారిన ఫోర్ బీ ఉద్యమం అంటే ఏంటి..?.ఈ ఉద్యమం దక్షిణ కొరియా నుంచి వచ్చింది. 2019లో ప్రారంభమై కొరియన్ పదం "bi"తో ప్రారంభమయ్యే నాలుగు పదాలకు సంబంధించినది.Bihon: పెళ్లి చేసుకోరు లేదా నో డేటింగ్Bichulsan: : పిల్లల్ని కనరుBiyeonae: డేటింగ్ లేదుBisekseu: శారీరక సంబంధం ఉండదుదక్షిణ కొరియాలో లింగ అసమానతలు చాలా ఎక్కువ. అక్కడ కూడా మహిళలు పురుషుల కంటే 31% తక్కవ వేతనమే తీసుకుంటున్నారు. పైగా మహిళల మరణాలు ఎక్కువే. అందులో చాలావరకు భాగస్వామి గృహహింస కారణంగా చనిపోయిన కేసులే ఎక్కువ. ఆ నేపథ్యంలోనే పురుషాధిక్య పాలనపై విసుగుతో వచ్చిన వ్యతిరేకతకు నిదర్శనమే ఈ ఫోర్బీ ఉద్యమం. ప్రస్తుతం ఈ ఉద్యమానికి అమెరికా మహిళలు మద్దతుల ఇస్తున్నారు. ప్రధానంగా అబార్షన్ చట్టంపై ఉన్న వ్యతిరేకతోనే అక్కడ మహిళలు ఈ ఉద్యమానికి తీవ్ర స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. అదీగాక ట్రంప్ గర్భస్రావం వ్యతిరేక అభిప్రాయాలు తోడవ్వడంతో ఇలా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగుతోంది అక్కడ. ఈ ఉద్యమంలో భాగంగా స్త్రీద్వేషపూరిత ఉత్పత్తులను కొనుగోలు చేయరు. అలాగే కొన్ని సాంస్కృతిక పద్దతులను కూడా వారంతా వ్యతిరేకిస్తారు. జపాన్లోని మహిళలు కూడా ఈ ఉద్యమాన్నే ఎంచుకుని అమెరికా బాటనే పడుతోంది. మరీ భారత్లో అంటే..ఈ ఫోర్బీ ఉద్యమం విజయవంతం అవ్వడం అనేది పూర్తిగా మహిళ సాధికారతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా ఇప్పటికీ ఇక్కడ మహిళలు చాలా వరకు పురుషులపై ఆధారపడే జీవిస్తున్నారు. అలాగే కొన్ని కుటుంబ సంప్రదాయాలకు తలంచక తప్పని స్థితి అందువల్ల ఈ ఉద్యమంతో భారతీయ మహిళలు ప్రభావమయ్యే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.american women it's time to learn from the koreans and adopt the 4b movement as a matter of fact women from all over the world should adopt the 4b movementi'm so serious pic.twitter.com/WxfqxouAn1— coleni. (@jungsooyawning) November 6, 2024 (చదవండి: బ్రిటన్ రాణి సైతం చాక్లెట్ టేస్ట్కీ ఫిదా..!) -
రూ.300 కోట్లతో ‘షూఆల్స్’ కర్మాగారం!
సాక్షి, హైదరాబాద్: మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో కర్మాగారం ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. 750 ఎకరాలు కేటాయిస్తే రూ. 300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పిందన్నారు. దక్షిణ కొరియా నుంచి వచి్చన షూఆల్స్ చైర్మన్ చెవోంగ్ లీ, ఆ సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో తనను కలిసినట్లు శ్రీధర్బాబు తెలిపారు. 87 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగల గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారన్నారు.మెడికల్ చిప్తో కూడిన బూట్ల సోల్స్, జీపీఎస్ అమర్చిన బూట్లు, 10 వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే బూట్లతోపాటు మధుమేహం, కీళ్ల నొప్పుల బాధితులకు నడకలో ఉపశమనం కలిగించే పలు రకాల ఉత్పత్తులను తాము తయారు చేస్తామని చెవోంగ్ లీ పేర్కొన్నట్లు శ్రీధర్బాబు వివరించారు. అలాగే 5 వేల ఎకరాలు కేటాయిస్తే ఆసియాలో ఎక్కడాలేని విధంగా స్మార్ట్ హెల్త్సిటీని నెలకొల్పే ప్రతిపాదనను కొరియా బృందం చేసిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రైన్లాండ్ ఆసక్తిరాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీ దేశంలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రైన్లాండ్ రాష్ట్ర ఆర్థిక, రవాణా, వ్యవసాయ మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో సమావేశమైంది. చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కూష్లెర్, హైదరాబాద్ కాన్సుల్ అమితా దేశాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు, బయో టెక్నాలజీ, వ్యా క్సిన్లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. -
మూడు నగరాల ముచ్చట
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్రెడ్డి) ఈశాన్య ఆసియాలో దక్షిణ కొరియాను ఆర్థిక హబ్గా నిలపాలన్న లక్ష్యంతో 2003లో ది ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ (ఐఎఫ్ఈజెడ్)ను ఏర్పాటు చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇక్కడే రూ.5 లక్షల కోట్ల వ్యయంతో మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేశారు. మూసీ పునరుజ్జీవం, ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ బృహత్తర ప్రాజెక్టులపై అధ్యయనానికి రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజైన బుధవారం ఇంచియాన్ నగరంలో అభివృద్ధి చేసిన 3 అంతర్జా తీయ స్మార్ట్ సిటీలను మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. పనిలోపనిగా స్టోర్స్ యూనివర్సిటీని కూడా సందర్శించింది. సాంగ్డో నగరంలో ఐటీ, బయోటెక్నాలజీ (బీటీ), సేవల పరిశ్రమలు, చెయోంగ్నాలో ఫైనాన్స్, హైటెక్ ఇండస్ట్రీలు, యోంగ్జోంగ్లో లాజిస్టిక్, టూరిజం పరిశ్రమలను అభి వృద్ధి చేశారు. ప్రస్తుతం 122.34 చదరపు కిలో మీటర్లు (చ.కి.మీ.) విస్తీర్ణంలో ఉన్న ఈ మూడు నగరాల్లో 5,43,653 జనాభా నివాసం ఉంటోంది. 3 గంటల్లో ఇతర నగరాలకు..ఇంచియాన్ నుంచి షాంఘై, బీజింగ్, హాంగ్కాంగ్ వంటి నగరాలకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. దీంతో ఎగుమతి, దిగుమతి కేంద్రాలకు ఇంచియాన్ నిలయంగా మారింది. పబ్లిక్, మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్లతో పాటు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, ఫెర్రీ టెర్మినల్స్తో మెరుగైన రవాణావ్యవస్థ ఉంది. ఇంచియాన్లోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఉండటంతో పరిశ్రమ అవసరాలకు తగ్గిన నిపుణులు, నైపుణ్యమున్న ఉద్యోగులకు కొరతే లేదు. అన్ని రకాల మౌలిక సదుపాయాలున్న స్థలాలు, దీర్ఘకాలంపాటు లీజు, నిర్మాణ వ్యయంలో రాయితీలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) భద్రత, విదేశీ సంస్థలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు వంటివి అందిస్తున్నారు.స్టార్టప్ పార్క్..ఇప్పటివరకు ఐఎఫ్ఈజెడ్లో 14.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లు వచ్చాయి. ఇందులో 206 గ్లోబల్, 3,481 స్థానిక సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సెమీ కండక్టర్లు, రోబో, డ్రోన్ వంటి పరిశ్రమలకు చెందిన సంస్థలతో పాటు గ్రీన్ క్లైమెట్ ఫండ్ (జీసీఎఫ్) వంటి ఐక్యరాజ్య సమితికి చెందిన 15 కార్యాలయాలు న్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతను ఆకర్షించేందుకు ఇంచియాన్ నగరంలో స్టార్టప్ పార్క్ను కూడా నెలకొల్పారు. ప్రస్తుతం ఇందులో 422 స్టార్టప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సుమారు 208 బిలియన్ వాన్ నిధులను సమీకరించాయి. ఇంచియాన్ గ్లోబల్ క్యాంపస్తో పాటు 6 కొరియన్ వర్సిటీలు, విదేశీ విశ్వ విద్యాలయాలున్నాయి. -
అనుక్షణం భయం..భయం!
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి) ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. అలాంటిది ఇరుదేశాల సరిహద్దులో పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అన్ని దేశాల మధ్య సరిహద్దుల్లా కాకుండా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు కాస్త భిన్నంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. సియోల్ పర్యటనలో ఉన్న మీడియా ప్రతినిధులు సరిహద్దు డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్)ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను నేరుగా పరిశీలించారు. సందర్శన సమయంలోనే అక్కడ బాంబుల మోత మోగింది. ప్రతిక్షణం ఇరు దేశాల సైనికులు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారని, అది సర్వసాధారణమని అక్కడి సైనికాధికారులు పేర్కొంటున్నారు. రెండు దేశాలను వేరు పరిచేదే డీఎంజెడ్..ఇరు దేశాలను సమానంగా ఈ డీఎంజెడ్ వేరుపరుస్తుంది. 4 కిలోమీటర్ల వెడల్పు, 258 కిలోమీటర్ల పొడవుతో ఈ సరిహద్దు ప్రాంతం విస్తరించి ఉంది. ఇరువైపులా భారీస్థాయిలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేశారు. ఈ డీఎంజెడ్కు రెండువైపులా ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ స్థాయిలో సైనికులను మోహరించారు. డీఎంజెడ్లో మాత్రం సైనికులెవరూ ఉండరు. ఎలాంటి సైనిక కార్యకలాపాలు మాత్రం జరగవు. 1953లో ఇక్కడ సైనిక తటస్థ ప్రాంతం (డీఎంజెడ్) ఏర్పాటు చేశారు.ప్రచ్ఛన్నయుద్ధం జరిగిన సమయంలోనే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దుగా ఉండేది. అయితే 1953లో ఇరుదేశాల మధ్య అమెరికా, చైనా కలిసి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నించాయి. రెండుదేశాలు ఇప్పటికీ అంగీకరించలేదు. కానీ డీఎంజెడ్ ప్రాంతంలో మాత్రం ఎలాంటి సైనిక చర్య ఉండదు. ఇదే ప్రదేశంలో 1635 మీటర్ల పొడవు, 1.95 మీటర్ల ఎత్తు, 2.1 మీటర్ల వెడల్పుతో ఓ టన్నెల్ కూడా ఉంది. ఈ సొరంగాన్ని ఉత్తర కొరియా సైనికులు సియోల్పై దాడి చేసేందుకు తవ్వారని చెబుతారు. ఇది పూర్తి కాకముందే ఐక్యరాజ్య సమితి పోలీసు అధికారులు గుర్తించి ఉత్తర కొరియాను హెచ్చరించారట. అయితే తొలుత అసలు ఈ సొరంగాన్ని తవ్వలేదని ఉత్తర కొరియా బుకాయించినా.. చివరకు అది గనుల తవ్వకాల్లో భాగంగా తవ్వామని మాట మార్చిందని అక్కడి పర్యాటకుల సందేశంలో రాసి ఉంది. డీఎంజెడ్తో పాటు ఈ సొరంగాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. హిల్ పాయింట్ వ్యూ నుంచి ఉత్తర కొరియాతోపాటు దక్షిణకొరియా గ్రామాలను వీక్షించొచ్చు. కాకపోతే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న ఫొటో కూడా తీసుకోవడానికి అనుమతివ్వరు. -
రష్యాకు ‘కిమ్’ బలగాలు.. ‘సియోల్’ ఆగ్రహం
సియోల్: ఉత్తర కొరియా తాజాగా మరో పదిహేను వందల మంది తమ సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యులకు ఎన్ఐఎస్ చీఫ్ యంగ్ తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధం కోసమే వారిని పంపిందని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి మరో 10 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని ఉత్తరకొరియా యోచిస్తోందన్నారు.ఇప్పటికే ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మంది సైనికులను పంపినట్లు ఎన్ఐఎస్ తేల్చిచెప్పింది. రష్యా యుద్ధ నౌకల్లో 1500 మందితో కూడిన ఉత్తరకొరియా ప్రత్యేక బలగాలు రష్యాలోని వ్లాదివోస్తోక్ పోర్టుకు చేరుకున్నాయని ఎన్ఐఎస్ తెలిపింది. తాజాగా రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించారు. ఉత్తర కొరియాతో తమ సంబంధాలు దక్షిణ కొరియా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని రష్యా రాయాబారి స్పష్టం చేశారు. అయితే ఉత్తర కొరియా చర్యలు ఇలానే ఉంటే తాము ఉక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలు పంపుతామని సౌత్ కొరియా హెచ్చరిస్తోంది. ఉత్తరకొరియా ఒక క్రిమినల్ దేశమని ఫైర్ అయింది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు రష్యా అధ్యక్షుడు పుతిన్కు మధ్య మంచి సంబంధాలున్నాయి. కిమ్కు ఇటీవల పుతిన్ ఖరీదైన బహుమతులను కూడా ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్ -
హాన్, మూసీ మధ్య పోలికలెన్నో!
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అధిక పట్టణీకరణ, కాలుష్యం కారణంగా ఏదైనా నది ప్రాభవం కోల్పోతే దాని పునరుజ్జీవం ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధిలో భాగమే. దక్షిణ కొరియా వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న హాన్ నదే అందుకు ఉదాహరణ. వరదల నియంత్రణతోపాటు పర్యావరణ సమతౌల్యతను కాపా డుతూ వినోద, పర్యాటక కేంద్రంగా పట్టణ నదులను ఎలా అభివృద్ధి చేయవచ్చో హాన్ నది నిరూపిస్తోంది. మూసీ నది ని పునరుద్ధరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందు లో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని హాన్ నదిని అధ్యయనం కోసం ఎంపిక చేసుకుంది. రెండు నదుల మధ్య చాలా పోలికలు ఉండటమే అందుకు కారణం.విజయవంతమైన హాన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి..సియోల్లో స్థిరమైన పట్టణాభివృద్ధికి విజయవంతమైన నమూనాగా హాన్ రివర్ ఫ్రంట్ నిలుస్తోంది. సియోల్ నగర సామాజిక, సాంస్కృతిక రంగాలను హాన్ నది ప్రతిబింబిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటి నాణ్యతను మెరు గుపరచడంతోపాటు నది ఒడ్డునున్న పర్యావరణ వ్యవస్థ లను పునరుద్ధరించారు. ఫలితంగా సియోల్లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత మెరుగుపడింది. జీవ వైవిధ్యం పునరుద్ధరణ సైతం జరిగింది. హాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విజయం అంత సులువుగా జరగలేదు. స్థిరమైన పట్టణ ప్రణాళిక, నది నిర్వహణ కోసం భారీ ఎత్తున అక్కడి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పాలకుల చిత్తశుద్ధి, సుస్థిరతతో నది సుందరీకరణతోపాటు ప్రజా వినోద కేంద్రంగా హాన్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. హాన్ నదిని సియోల్ నగరంలో వరద నీటి నియంత్రణ, నీటి నిర్వహణ కోసం కూడా వినియోగిస్తున్నారు.మూసీ పునరుజ్జీవం అనివార్యమే..సహజ వనరుల సంరక్షణతోపాటు హైదరాబాద్లో పట్టణ పునరుద్ధరణ, పర్యావరణ పునరావాసానికి మూసీ పునరుజ్జీ వం అనివార్యమే. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగ రాల దాహార్తిని తీర్చిన మూసీ.. కాలక్రమేణా మురికి కూపంగా మారిపోయింది. గృహ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతోపాటు ఆక్రమణలకు సైతం గురైంది. ఫలితంగా మూసీ చుట్టూ ఉన్న సాంస్కృతిక, వారసత్వ సంపద నాటి ప్రాభ వాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది. మూసీ పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం గతంలో ప్రతిపాదనలు సిద్ధమైనా కార్యరూపం మాత్రం దాల్చలేదు.మూసీ–హాన్ నదుల మధ్య భౌగోళిక సారూప్యతలు ఇవీ..హాన్» దక్షిణ కొరియా ఉత్తర భాగంలోని తైబెక్ సన్మేక్ పర్వతాల్లో పుట్టిన హాన్ నది.. గాంగ్వాన్, జియోంగ్లీ, ఉత్తర చుంగ్చియాంగ్ ప్రావిన్సుల ద్వారా సియోల్ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఈ నగరంలో సుమారు 40 కి.మీ. మేర ప్రవహిస్తూ పశ్చిమాన ఉన్న ‘ఎల్లో సీ’లో కలుస్తుంది.» దీని మొత్తం పొడవు 514 కి.మీ.కాగా సియోల్ నగరంలో 40 కి.మీ. మేర ప్రవహిస్తుంది.మూసీ» వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ.. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ గుండా హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. పాత, కొత్త నగరాలను రెండుగా విభజిస్తూ పురా నాపూల్, డబీర్పురా, అంబర్పేట, చాదర్ ఘాట్, ఉప్పల్ మీదుగా నగరం నడిబొడ్డు నుంచి మిర్యాల గూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.» మూసీ నది మొత్తం పొడవు 240 కి.మీ. కాగా హైదరాబాద్లో 57.5 కి.మీ. మేర ప్రవహిస్తుంది. -
‘హాన్’ను ఎలా పునరుద్ధరించారు?
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుద్ధరణపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని సియోల్ వెళ్లిన అధికారుల బృందం రెండో రోజైన మంగళవారం అక్కడ విస్తృతంగా పర్యటించింది. తొలుత హాన్ నదిని సందర్శించి నది పునరుద్ధరణ పనులను పరిశీలించింది. ఒక ప్పుడు మురికి కాలువలా ఉన్న నదికి జీవం పోసిన విధానాన్ని మంత్రులు పొంగులేటి, పొన్నం అక్కడి అధికారులను అడిగి తెలుసుకు న్నారు.సియోల్లో నీటి సరఫరా, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు ఈ నది ఎలా కీలకంగా మారిందో అక్కడి అధికారులు వారికి వివరించారు. అనంతరం మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వస్త్ర తయారీ సంస్థ యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో ‘కీ హాక్ సంగ్’తో సమావేశమైంది. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్ర మలు ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందు కొచ్చిన ఆయన.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటైన ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ గురించి పొంగులేటి, పొన్నం ఆయనకు వివరించారు. ఆ తర్వాత సియోల్ లోని సియోనామ్ వాటర్ రిసోర్స్ రికవరీ ప్లాంట్ను అధికారుల బృందం సందర్శించింది. నీటి శుద్ధీక రణ ఎలా జరుగుతోందో పరిశీలించింది. సియోల్లోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థ జలాలను ఈ కేంద్రాలు శుభ్రపరుస్తాయి. రోజుకు 16.3 లక్షల లీటర్ల మురుగునీటితోపాటు 4 వేల కిలోలీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తాయి. ఈ సామ ర్థ్య ం ప్రపంచంలోనే 9వ అతిపెద్ద ప్లాంటుగా గుర్తింపు పొందింది. ఇదే కేంద్రంలో హాన్ నది నీటి స్వచ్ఛతను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.ప్రతిపక్షాలు సహకరించాలిమూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సియోల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో మూసీని భాగం చేయాలని తమ ప్రభు త్వం భావిస్తోందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి కష్టం రానివ్వబోమని.. పునరావాసంతోపాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పొన్నం హామీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ మరో సియోల్ నగరంగా రూపాంతరం చెందుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
‘చియోంగ్చియాన్’పై అధ్యయనం
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్రెడ్డి): ‘మూసీ’ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ కొరియాలోని సియోల్లో నదులను అభివృద్ధి చేసిన తీరుపై రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. అక్కడి హాన్, చియోంగ్చియాన్ నదుల పునరుజ్జీవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. హాన్, చియోంగ్చియాన్ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, పాటించిన పద్ధతులు, విధానాలను క్షుణ్ణంగా తెలుసుకుని.. అదే తరహాలో రాష్ట్రంలో మూసీ నదికి ప్రాణం పోయాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ల నేతృత్వంలోని రాష్ట్ర బృందం.. సోమవారం సియోల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రులు తొలుత చియోంగ్చియాన్ నది వెంట కలియదిరుగుతూ.. పునరుద్ధరణ ప్రాజెక్టు వివరాలను అక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ‘మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్’ను సందర్శించారు. ఐదు రోజుల దక్షిణకొరియా పర్యటనకు వెళ్లిన ఈ బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్తోపాటు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. రోజూ వెయ్యి టన్నులు రీసైక్లింగ్ మాపో రిసోర్స్ రికవరీ ప్లాంటులో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. ‘వేస్ట్ టు ఎనర్జీ’ సాంకేతికత వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర బృందానికి సియోల్ నగరపాలక సంస్థ అధికారులు వివరించారు. పర్యవరణంపై ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మరో పదేళ్లలో భూఉపరితలం నుంచి ఈ ప్లాంటును తొలగించి, భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. సియోల్ నగరానికి పశి్చమాన ఉన్న ఈ ప్లాంట్ను 2005లో ప్రారంభించారు. ఇందులో ఏటా 2 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి మరో నాలుగు ప్లాంట్లను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మూసీ అభివృద్ధి కోసం.. సియోల్లో నదులకు పునరుజ్జీవం కల్పించినట్టే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సియోల్లోని చియోంగ్చియాన్ నది పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హన్ పరీవాహక ప్రాంతాలను రాష్ట్ర బృందంతో కలిసి పరిశీలించానని తెలిపారు. అక్కడ ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో జీవించలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు నూతన కళను సంతరించుకుందని చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు టూరిస్టు హబ్గా మారాయని.. వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అభివృద్ధి ఫలాలను అందిస్తామన్నారు. -
మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే
ప్యాంగాంగ్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా మిలిటరీ డ్రోన్ అవశేషాలు శనివారం తమ భూభాగంలో కనిపించాయని, మరోసారి కనిపిస్తే యుద్ధ ప్రకటన తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా ఈ నెలలో మూడు సార్లు ప్యాంగ్యాంగ్పై డ్రోన్లను ఎగురవేసిందని ఆరోపించిన ఉత్తర కొరియా, మరోసారి అదే జరిగితే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామంది. -
దక్షిణ కొరియా శత్రు దేశమే, రాజ్యాంగంలో మార్పులు: నార్త్ కొరియా
గత కొద్ది రోజులుగా ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్లు తమ దేశంలోకి వచ్చాయని ఆరోపిస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది.దక్షిణకొరియాను శత్రుదేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో మార్పులు చేపట్టినట్లు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు పాగ్యాంగ్ వెల్లడించింది. దక్షిణ కొరియాను శత్రుదేశంగా పరిగణించడం అనివార్యమైన, న్యాయపరమైన చర్యగా కిమ్ సర్కార్ పేర్కొంది. 1991లో ఉత్తర- దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే రాజ్యాంగ మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.రెండు కొరియా దేశాల మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు కిమ్ సర్కారు నిర్ణయించింది. అంతేగాక ఈ ఏడాది జనవరిలో కిమ్ దక్షిణ కొరియాను తమ దేశానికి ప్రధాన శత్రువుగా నిర్వచించారు. అధ్యక్షుడు పిలుపునిచ్చిన చట్టపరమైన మార్పులను ప్యోంగ్యాంగ్ మొదటిసారిగా గుర్తించింది.కాగా ఇటీవల దక్షిణ కొరియాను అనుసంఘానం చేసే సరిహద్దులోని రోడ్లను, రైల్వేలను కిమ్ సైన్యం బాంబులతో పేల్చివేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమ దేశంలోకి సౌత్ కొరియాకు చెందిన ఏ ఒక్క డ్రోన్ వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని పొరుగు దేశానికి సూచించారు. -
కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు
సియోల్: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. ఒక్క వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరడంతో దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఉత్తర కొరియాలో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. లక్షలాది మంది విద్యార్థులు, యూత్ లీగ్ అధికారులు ఆర్మీలో చేరినట్టు.. మరి కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఒక్క వారంలోనే సైన్యంలో 14 లక్షల మంది యువత సైన్యంలో చేరినట్టు చెప్పుకొచ్చింది. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని వెల్లడించింది. దీంతో, దక్షిణ కొరియాపై దాడులకు నార్త్ కొరియా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా పేల్చేసింది. ఇక, కిమ్ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు కౌంటర్గా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. ఇదే సమయంలో తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది.అయితే, 2000 సంవత్సరం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో రోడ్లను నిర్మించారు. దీంతోపాటు రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేసుకొన్నారు. వీటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్తో కరచాలనం -
పొరలు ఒలిచే రచయిత
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్ కాంగ్ (సరైన ఉచ్చారణ: హన్ గాన్ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్ షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్ మర్నేన్, జపాన్ రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్ రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్ నడిచాయి. కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్ కాంగ్కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్ అకాడెమీ. 2016లో తన కొరియన్ ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్ ’కు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్’ గెలుచుకున్న హాన్ కాంగ్ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్ రచయిత కూడా కావడం విశేషం.దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్ సుయెంగ్–వొన్ కూతురిగా 1970లో జన్మించిన హాన్ కాంగ్ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్ సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్. అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్ దురాక్రమణ (1910–45), కొరియన్ యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్కు వెళ్లిపోయింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్ యాక్ట్స్’ నవల రాసింది కాంగ్. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్ కాంగ్కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్ లెసన్ ్స’ నవల రాసింది కాంగ్. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.హాన్ కాంగ్ ఎంత వేగంగా టైప్ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్ చేసేది. కవయిత్రిగా మొదలైన కాంగ్కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ కోసం ‘డియర్ సన్, మై బిలవ్డ్’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా! -
దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు సాహిత్యంలో 2024 ఏడాదిగాను నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను స్వీడిష్ నోబెల్ కమిటి గురువారం నోబెల్ పురష్కారాన్ని ప్రకటించింది. ఉత్తర కొరియా నుంచి సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కించుకున్న తొలి మహిళ హాన్ కాంగ్.BREAKING NEWSThe 2024 #NobelPrize in Literature is awarded to the South Korean author Han Kang “for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life.” pic.twitter.com/dAQiXnm11z— The Nobel Prize (@NobelPrize) October 10, 2024 హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జన్మించారు. ఆమెకు సాహిత్య నేపథ్యం ఉంది. ఆమె తండ్రి ప్రసిద్ధ నవలా రచయిత. హాన్ కాంగ్ 1993లో మున్హాక్-గ్వా-సాహో (సాహిత్యం, సమాజం) శీతాకాల సంచికలో ‘వింటర్ ఇన్ సియోల్’పేరుతో ఐదు కవితలను ప్రచురించారు. దీని ద్వారా కవయిత్రిగా సాహిత్య రంగ ప్రవేశం చేశారు. అనంతరం నవలా రచయిత్రిగా తన కెరీర్ను ప్రారంభించారామె. -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
అదే చివరి రోజవుతుంది.. జాగ్రత్త: కిమ్కు సౌత్ కొరియా స్ట్రాంగ్ వార్నింగ్
సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలతోపాటు, అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ ఉత్తరకొరియా పాలకుడు కిమ్ తరచూ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలపై దక్షిణ కొరియా దీటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగానికి ప్రయత్నిస్తే అందుకు తగురీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ డేను పురస్కరించుకుని మంగళవారం సియోల్లో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి హ్యున్మూ–5 సహా అధునాతన 340 రకాల ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించింది. పరేడ్కు హాజరైన ప్రముఖులు, వేలాదిమంది జవాన్లను ఉద్దేశించి ఈ సందర్భంగా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మాట్లాడారు. ‘మాపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్రయత్నించిన పక్షంలో మా సైన్యం, ఊహించని రీతిలో దీటైన జవాబిస్తుంది. ఉత్తరకొరియా పాలకులకు అదే చివరి రోజవుతుంది. తమను కాపాడేది అణ్వాయుధాలేనన్న భ్రమలను ఉత్తరకొరియా పాలకులు వదిలేయాలి’అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.చదవండి: ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్పై ఇజ్రాయెల్ నిషేధంబంకర్లను సైతం తుత్తునియలు చేసేలా..హ్యున్మూ–5 క్షిపణి 8 టన్నుల భారీ సంప్రదాయ వార్హెడ్ కలిగి ఉంటుంది. భూమి లోపలి అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం తుత్తునియలు చేసే సత్తా దీని సొంతం. ఈ క్షిపణిని మొట్టమొదటిసారిగా దక్షిణ కొరియా ప్రదర్శించింది. పరేడ్ సమయంలో అమెరికా లాంగ్ రేంజ్ బి–1బీ బాంబర్తోపాటు దక్షిణకొరియా అత్యాధునిక ఫైటర్ జట్లు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. దక్షిణ కొరియా వద్ద అణ్వాయుధాలు లేవు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ కమాండ్’ సెంటర్ను కూడా ప్రారంభించింది. -
కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆ దేశానికి చెందిన ఇద్దరు మహిళల్ని ఉరితీయించారు.ఉత్తర కొరియాకి చెందిన రీ,కాంగ్ అనే ఇద్దరు మహిళలు చైనాలో ఉంటున్నారు. చైనాలో ఉంటూ ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోవాలనుకునే వారికి సహరిస్తున్నారు. అయితే ఈ అంశం కిమ్ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కోపోద్రికుడైన కిమ్.. రీ, కాంగ్ ఇద్దరిని చైనా నుంచి ఉత్తర కొరియాకు రప్పించాడు. అనంతరం ఆ ఇద్దరిని ఉరితీయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.మహిళలకు ఉరిశిక్ష విధించడంపై కిమ్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిమ్ ప్రభుత్వం ఆ ఇద్దరు మహిళలకు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహించిన బహిరంగ విచారణలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు సమర్ధించుకుంది. చదవండి : మీకు అర్థమయ్యిందా? హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ హెచ్చరిక -
కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో
ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు మరోసారి దుమ్ములేపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఏకంగా ఆరోసారి ఫైనల్కు చేరుకుంది. చైనా వేదికగా సోమవారం జరిగిన సెమీస్ మ్యాచ్లో సౌత్ కొరియాను 4-1తో చిత్తు చేసింది. ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ.. గెలుపు జెండా ఎగురవేసింది. భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్ చెరొక గోల్ చేయగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్తో మెరిశాడు. ఆట తొలి క్వార్టర్ చివరలో ఉత్తమ్ భారత్కు తొలి గోల్ అందించగా.. హర్మన్ప్రీత్ రెండో క్వార్టర్ ఆరో నిమిషంలో పెనాల్టీ కార్నర్ కిక్ను గోల్గా మలిచాడు. కొరియా ఒక గోల్ కొట్టిందిఆ తర్వాత జర్మన్ గోల్ సాధించగా.. మూడో క్వార్టర్లో హర్మన్ మరోసారి గోల్తో అదరగొట్టాడు. ఈ మూడూ కూడా ఫీల్డ్ గోల్సే(ప్రత్యర్థి గోల్పోస్టు ముందున్న స్ట్రైకింగ్ సర్కిల్ నుంచి) కావడం విశేషం. అయితే, మూడో క్వార్టర్లోనే కొరియా కూడా గోల్ కొట్టి పుంజుకునేందుకు ప్రయత్నించింది. అయితే, భారత డిఫెన్స్ వారిని కట్టడిచేయడంతో పరాజయం తప్పలేదు. భారత్ అజేయంగా ఫైనల్కుకాగా ఈ ఆసియా చాంపియన్స్ తాజా ఎడిషన్లో భారత్ ఇంత వరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. ఇక లీగ్ దశలో చైనాను 3-0తో, జపాన్ను 5-1తో, మలేషియాను 8-1తో, పాకిస్తాన్ను 2-1తో ఓడించింది. సెమీ ఫైనల్లో కొరియాను 4-1తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో తలపడనుంది.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన చైనా.. తొలిసారి ఫైనల్కుPicture perfect team goal by the #MenInBlue 🤩#TeamIndia sizzle & notch up their 3️⃣rd with the finish from Jarmanpreet Singh 🔥Watch 🇮🇳 🆚 🇰🇷, LIVE NOW on #SonyLIV 📲 pic.twitter.com/Gw3v6A04ZW— Sony LIV (@SonyLIV) September 16, 2024 -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
హులున్బుయిర్ (చైనా): ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలుపొంది అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాకౌట్ దశలోనూ తమ జోరు కొనసాగించాలనే లక్ష్యంతో నేడు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో టీమిండియా తలపడనుంది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు లీగ్ దశలో 21 గోల్స్ సాధించి కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఆతిథ్య చైనా జట్టుపై 3–0తో గెలిచి ఈ టోర్నీలో శుభారంభం చేసిన భారత జట్టు ఆ తర్వాత జపాన్పై 5–1తో, మలేసియాపై 8–1తో గెలిచింది. అనంతరం దక్షిణ కొరియాపై 3–1తో, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 2–1తో విజయం సాధించిన భారత జట్టు ఈ టోర్నీలో అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. ఫార్వర్డ్ శ్రేణిలో, మిడ్ ఫీల్డ్లో, డిఫెన్స్లో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. పారిస్ ఒలింపిక్స్లో నిరాశపరిచిన స్ట్రయికర్లు ఈ టోర్నీలో మాత్రం మెరిశారు. సుఖ్జీత్ సింగ్, అభిషేక్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్, అరిజిత్ సింగ్ అంచనాలకు మించి రాణించారు. యువ మిడ్ ఫీల్డర్ రాజ్కుమార్ పాల్ మలేసియాతో జరిగిన మ్యాచ్లో ‘హ్యాట్రిక్’ సాధించాడు. మాజీ కెపె్టన్ మన్ప్రీత్ సింగ్, వైస్ కెపె్టన్ వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ మిడ్ ఫీల్డ్లో చురుకుగా కదులుతూ ఫార్వర్డ్ శ్రేణి ఆటగాళ్లకు పాస్లు అందించారు. దిగ్గజ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నీలో గోల్ కీపర్లు కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ అడ్డుగోడలా నిలబడ్డారు. కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్ షాట్లతో ఆకట్టుకొని ఐదు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచాడు. అయితే లీగ్ దశలో కొరియాను అలవోకగా ఓడించిన భారత జట్టు నాకౌట్ మ్యాచ్లో కొరియాను తేలిగ్గా తీసుకోకుండా పక్కా వ్యూహంతో ఆడాల్సిన అవసరం ఉంది. కొరియా జట్టుకు ఎక్కువ పెనాల్టీ కార్నర్లు రాకుండా జాగ్రత్త పడాలి. కొరియా డ్రాగ్ ఫ్లికర్ జిహున్ యాంగ్ ఈ టోర్నీలో ఏడు గోల్స్తో టాప్ స్కోరర్గా ఉన్నాడు. యాంగ్ను నిలువరిస్తే కొరియా జోరుకు అడ్డుకట్ట వేసినట్టే. ‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత తక్కువ సమయం విశ్రాంతి తీసుకొని చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు వచ్చాం. భారత జట్టు ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. కొరియా క్లిష్టమైన ప్రత్యర్థి. డిఫెన్స్తోపాటు అటాకింగ్లో కొరియాకు మంచి పేరుంది’ అని హర్మన్ వ్యాఖ్యానించాడు. మరో సెమీఫైనల్లో చైనాతో పాకిస్తాన్ ఆడుతుంది.38 భారత్, దక్షిణ కొరియా జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 61 సార్లు తలపడ్డాయి. 38 సార్లు భారత్ గెలుపొందగా... 11 సార్లు కొరియాను విజయం వరించింది. 12 మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. 7 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు జరిగింది. భారత జట్టు ఏడు సార్లు సెమీఫైనల్ దశకు చేరుకుంది. 2013లో మాత్రం భారత జట్టు లీగ్ దశలోనే ని్రష్కమించింది. -
భారత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. దక్షిణ కొరియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరిగిన మ్యాచ్లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు, స్ట్రయికర్ అరైజీత్ సింగ్ హుండల్ ఓ గోల్ చేశారు. కొరియా చేసిన ఏకైక గోల్ను జిహున్ యంగ్ సాధించాడు. భారత్ తమ తదుపరి లీగ్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. భారత్ ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా.. తమ తొలి మ్యాచ్లో చైనాపై 3-1 గోల్స్ తేడాతో.. రెండో మ్యాచ్లో జపాన్పై 5-1 గోల్స్ తేడాతో.. మూడో మ్యాచ్లో మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ ఈ టోర్నీలో జయకేతనం ఎగురవేసి రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. -
అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుకుంటాం: కిమ్
ప్యాంగ్యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్జోంగ్ఉన్ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు. ఇదీ చదవండి.. ట్రంప్ వర్సెస్ కమల..హోరాహోరీ -
మరోసారి కరోనా పంజా?
న్యూఢిల్లీ: కోవిడ్–19 సృష్టించిన విలయాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రాణాంతక మహమ్మారి కాటుకు లక్షల మంది బలయ్యారు. క్రమంగా వైరస్ వ్యాప్తి నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, కోవిడ్–19 మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అమెరికాలో 25 రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. దక్షిణ కొరియాలో చాలామంది కరోనా బారినపడి, చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలో ఈ ఏడాది జూన్, జూలైలో 908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు బాధితులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో జూన్ 24 నుంచి జూలై 21 మధ్య వారానికి సగటున 17,358 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది. ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఇండియాలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా మనం అన్నింటికీ ఇప్పటి నుంచే సిద్ధపడి ఉండడం మంచిదని నోయిడాలోని శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైరాలజిస్టు దీపక్ సెహగల్ సూచించారు. వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈసారి వైరస్ వ్యాప్తిలో వేగం 11 శాతం పెరిగిందని, బాధితుల్లో 26 శాతం మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసిందని వెల్లడించారు. ఇది నిజంగ ఆందోళకరమైన పరిణామమేనని పేర్కొన్నారు. -
ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోల పోరాటమే 'బాడ్ల్యాండ్ హంటర్స్' రివ్యూ
స్టార్ హీరో డాన్ లీ.. హాలీవుడ్ సినిమా లవర్స్కు అభిమాన నటుడు. సౌత్ కొరియన్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్కు దగ్గరయ్యాడు. ఆయన నటించిన బాడ్ల్యాండ్ హంటర్స్ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. హియో మ్యుంగ్-హేంగ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26, 2024న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది.సౌత్ కొరియాలో ఒక భారీ భూకంపంతో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడి ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. అతికష్టం మీద కొందరు ప్రాణాలతో బయటపడినప్పటికీ వారికి సరైన ఆహారం దొరకదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. ఆకలితో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వారు జీవిస్తుంటారు. సరిగ్గా అదే ప్రాంతంలో నామ్సామ్ (డాన్ లీ) జంతువుల్ని వేటాడుతూ జీవిస్తుంటాడు. అతనితో పాటుగా నామ్సామ్, చోయ్ జీ వాన్ (లీ జున్ యంగ్) ఉంటారు. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు. భూకంపం వల్ల నామ్సామ్ కూతురు చనిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తన కూతురిగా భావిస్తుంటాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయిని చోయ్ జీ వాన్ ప్రేమిస్తుంటాడు.అలా వారి జీవితాల్లోకి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పేరుతో కొందరు ఎంట్రీ ఇస్తారు. దీంతో వారి లైఫ్ ప్రమాదంలో పడుతుంది. వారి నమ్మించి హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తమ వెంట తీసుకెళ్తారు. ఆ సమయంలో ఆమె అమ్మమ్మను క్రూరంగా చంపేస్తారు. యాంగ్ జీ సు (లీ హీ జూన్) అనే డాక్టర్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలపై ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటాడు. మనిషికి మరణం లేకుండా ఉండేందుకు సైన్స్కు పదునుపెడుతాడు. ఈ క్రమంలో అనేకమంది యువతులపై ప్రయోగాలు చేస్తూ ఉండలం వల్ల వారందరూ కూడా భయంకరమైన జాంబీలుగా మారిపోతుంటారు.కూతురుగా భావించిన హన్సునా ప్రమాదంలో చిక్కుకుందని తెలుసుకున్న నామ్సామ్ కాపాడేందుకు ప్లాన్ వేస్తాడు. తన మిత్రుడు అయిన చోయ్ జీ వాన్ను కూడా సాయంగా తీసుకెళ్తాడు. ఆమెను ఆ సైకో డాక్టర్ నుంచి వారిద్దరూ ఎలా కాపాడారు? డాక్టర్తో పాటు పనిచేస్తున్న లీ యూన్ హో ఎలా సాయపడింది? ఆమె వారికి ఎందుకు సాయం చేసింది..? డాక్టర్గా మంచి పేరున్న యాంగ్ జీ సు ఇదంతా ఎవరిని కాపాడేందుకు చేస్తున్నాడు..? ఆ డాక్టర్ బారి నుంచి హన్ సునా ప్రాణాలతో బయటపడిందా..? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న బ్యాడ్లాండ్ హంటర్ మూవీ చూడాల్సిందే.బ్యాడ్లాండ్ హంటర్స్ సినిమా అంతా కూడా భూకంపంతో శిథిలమైన నగరం చూట్టే సాగుతుంది. వాస్తంగా దానిని సెట్ వేసి ప్రేక్షకులకు చూపించారు. అయినా చాలా రియలిస్టిక్గా సినిమాను డైరెక్టర్ మలిచాడు. ఎక్కువగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను భారీగా మెప్పిస్తాయి.డైరెక్టర్ హియో మయాంగ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి పీక్స్లో ఉంటుంది. నామ్ సామ్ పాత్రలో డాన్ లీ అదరగొట్టాడు. కేవలం ఆయన చేస్తున్న స్టంట్స్ కోసం సినిమా చూడొచ్చు. ఇదే సమయంలో లీహీజూన్ విలనిజం కూడా అంతే బలంగా ఉంటుంది. ఇందులో లవ్స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఎవరినీ నిరుత్సాహపరచవని చెప్పవచ్చు. ఒక సైకో డాక్టర్ నుంచి ఒక అమ్మాయిని ఇద్దరు ఎలా కాపాడారు అనేది ఈ సినిమా కథ. -
వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. దేశమంతటికీ విస్తరించిన ఆందోళనలు..
-
సాక్షి కార్టూన్ 02-08-2024
-
0.1 పాయింట్ తేడాతో స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్లో దక్షిణ కొరియాకు చెందిన టీనేజ్ షూటర్ బాన్ హ్యోజిన్ 0.1 పాయింట్ తేడాతో స్వర్ణం కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగం ఫైనల్లో 16 ఏళ్ల బాన్ హ్యోజిన్ చివరి షాట్లో అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి పతకం చేజిక్కించుకుంది. 22 షాట్లు ముగిసేసరికి బాన్ హ్యోజిన్తో పాటు 17 ఏళ్ల చైనా షూటర్ హువాంగ్ యూటింగ్ 251.8 పాయింట్లతో నిలిచారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా.. అందులో బాన్ 10.4 స్కోరు చేయగా.. హువాంగ్ 10.3 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. తద్వారా బాన్ ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన అతిపిన్న వయసు మహిళా షూటర్గా రికార్డుల్లోకెక్కింది. స్విట్జర్లాండ్ షూటర్ ఆడ్రే గొగ్నియాల్ 230.3 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. -
ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు
పారిస్ ఒలింపిక్స్ క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... గురువారం ఈ క్రీడల్లో తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో దక్షిణ కొరియా అమ్మాయి లిమ్ సిహైన్ కొత్త ప్రపంచ రికార్డుతోపాటు ఒలింపిక్ రికార్డును కూడా నెలకొల్పింది. లిమ్ సిహైన్ 694 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్ చాయెంగ్ (దక్షిణ కొరియా; 2019లో) సాధించిన ప్రపంచ రికార్డును లిమ్ బద్దలు కొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కొరియాకే చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును కూడా లిమ్ సిహైన్ తిరగరాసింది. -
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్పైకి ఆదివారం(జులై 21) ఉదయం నార్త్కొరియా మళ్లీ చెత్త బెలూన్లు ప్రయోగించింది. సియోల్పై చెత్త బెలూన్లు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్త బెలూన్లకు ప్రతీకారంగా సరిహద్దులో లౌడ్స్పీకర్లతో ఉత్తరకొరియా నియంత కిమ్కు వ్యతిరేక ప్రసారాలు చేస్తామని సియోల్ హెచ్చరించింది. చెత్త బెలూన్ల ప్రయోగంపై నార్త్ కొరియా స్పందించింది. కొంత మంది సౌత్ కొరియా పౌరులు బెలూన్ల ద్వారా నార్త్ కొరియాపైకి రాజకీయ కరపత్రాలు పంపడం వల్లే తాము చెత్త బెలూన్లు ప్రయోగించామని తెలిపింది. ఇది కొనసాగితే రానున్న రోజుల్లో సౌత్కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నియంత కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. గతంలోనూ సౌత్కొరియాపైకి నార్త్కొరియా చెత్త బెలూన్లను ప్రయోగించింది. -
శాంసంగ్ చరిత్రలో భారీ సమ్మె!!
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం చరిత్రలో ఇది అతిపెద్ద వ్యవస్థీకృత కార్మిక చర్య. వేతన పెంపు, సెలవుల విషయంలో గత నెలలో చర్చలు విఫలం కావడంతో కంపెనీలోని అతిపెద్ద యూనియన్ గత కొన్ని వారాలుగా మూడు రోజుల వాకౌట్ కు సిద్ధమవుతోంది.శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గత జూన్ ఆరంభంలో ఒక్క రోజు సమ్మె జరిగింది. తాజాగా జూలై 8న భారీ సమ్మెను కార్మికులు చేపట్టారు. కంపెనీకి చెందిన అత్యాధునిక చిప్ ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా యాజమాన్యానికి సందేశాన్ని పంపడానికి దీన్ని ఉద్దేశించినట్లుగా యూనియన్ నాయకులు చెబుతున్నారు.సియోల్ కు 38 కిలోమీటర్ల దూరంలోని హ్వాసియోంగ్ లోని శాంసంగ్ సెమీకండక్టర్ ప్లాంట్ల వెలుపల సోమవారం ఉదయం 11 గంటలకు ర్యాలీలకు 5,000 మందిని సమీకరించాలని కార్మిక సంఘం లక్ష్యంగా పెట్టుకుందని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యూన్ కుక్ బ్లూమ్ బర్గ్ న్యూస్ కు తెలిపారు. వాస్తవానికి ఎంత మంది కార్మికులు విధులను పక్కన పెడతారో స్పష్టంగా తెలియదు. ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ వాకౌట్ లక్ష్యమని యూనియన్ నేత సన్ వూ మోక్ తెలిపారు.3% వార్షిక మూలవేతనం పెంపునకు అంగీకరించని సుమారు 855 మంది సిబ్బందికి పెద్ద వేతన పెంపును కోరుతున్నట్లు మొదట చెప్పిన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను మార్చారు. ఇప్పడు మొత్తం 28,000 మందికి పైగా యూనియన్ సభ్యులకు అధిక వేతనాలు, అదనపు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.సెమీకండక్టర్ సిబ్బందికి ప్రథమార్ధం పనితీరు సంబంధిత బోనస్ లను ప్రకటించడం ద్వారా కార్మికుల సమ్మె ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి శాంసంగ్ ప్రయత్నించింది. కాని వారు వాగ్దానం చేసిన నెలవారీ జీతాలలో గరిష్టంగా 75% గతంలో సాధారణమైన పూర్తి నెల చెల్లింపు కంటే తక్కువగా ఉంది.కొరియాలోని అనేక ప్రముఖ కంపెనీలను పీడిస్తున్న గ్రౌండ్ అప్ కల్లోలాన్ని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడో నివారించింది. శాంసంగ్ దివంగత చైర్మన్, ప్రస్తుత అధినేత జే వై లీ తండ్రి లీ కున్ హీ యూనియన్లు ఏర్పడకుండా నిరోధించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పుడు నేషనల్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అనేది సుమారు 28,000 మందికి పైగా కార్మికులతో కంపెనీ యూనియన్లలో కెల్లా అతి పెద్దది. -
రోబో ఆత్మహత్య!?
సియోల్: పరీక్ష సరిగా రాయలేదని, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు తీసుకుంటున్న జనం వార్తలను మనం చూశాం. కానీ మరమనిషి సైతం ఆత్మహత్య చేసుకుంటాడన్న వార్త వింటానికి కొత్తగా ఉన్నా ఇది నిజంగా జరిగిందని దక్షిణకొరియా వార్తాసంస్థలు కోడై కూస్తున్నాయి. రోబో సేవలను విపరీతంగా వాడే దక్షిణ కొరియాలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డాక్యుమెంట్ల డెలివరీ వంటి పనుల్లో తెగ బిజీగా ఉండే ఓ రోబో సూసైడ్ చేసుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. పని ఒత్తిడి వల్లే రోబోట్ ఆత్మహత్య చేసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చక్కర్లు కొట్టి.. మెట్లపై పడి గత గురువారం సాయంత్రం గుమీ నగర సిటీ కౌన్సిల్ భవనంలో ఈ రోబో ‘సూపర్వైజర్’ బాధ్యతల్లో ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయి గుండ్రంగా తిరిగి మెట్లపై నుంచి పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఏకబిగిన పని చేయాల్సి రావడంతో విపరీత పని ఒత్తిడితోనే అది ఇలా చనిపోయిందని వార్తలొచ్చాయి. అమెరికాకు చెందిన బేర్రోబోటిక్స్ సంస్థ ఈ రోబోను తయారు చేసిచి్చంది. గత ఆగస్ట్ నుంచి అది చురుగ్గా పనిచేస్తోందట. ఈ రోబోకు సొంతంగా పౌరసేవల గుర్తింపు కార్డుంది! అంటే ఒకే ఫ్లోర్లోకాకుండా లిఫ్ట్లో తిరుగుతూ వేర్వేరు అంతస్తుల్లో పనులు చక్కబెట్టగలదు. ఇలాంటి రోబోట్ పొరపాటున మెట్ల పై నుంచి పడిందా? లేదంటే సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా సమస్యా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. రోబో శకలాలను స్వా«దీనంచేసుకుని ల్యాబ్కు పంపించారు. అనూహ్య ఘటన తర్వాత ఈ బిల్డింగ్లో మరో రోబోను పనిలో పెట్టుకోబోమని గుమీ సిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే ద.కొరియాలో రోబోట్ సేవలు అత్యధికం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ గణాంకాల ప్రకారం ద.కొరియాలో ప్రతి పది మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక అవసరాల రోబోట్ను వినియోగిస్తున్నారు. -
రోబో ఆత్మహత్య! కారణం అదేనా..
పని ఒత్తిడి ఎక్కువైతే డిఫ్రెషన్లోకి వెళ్లడం.. ఆత్మహత్య చేసుకోవడం వంటివి మనుషులే చేస్తారు. అయితే రోబోట్స్ కూడా ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాయని ఇటీవలే ఓ సంఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. రోబోట్ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అని చాలామందికి అనుమానం రావొచ్చు? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..సౌత్ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్లో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్న రోబోట్.. ఇటీవల 'రోబో సూపర్వైజర్'గా పిలువబడే రోబోట్ కౌన్సిల్ భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉండే మెట్ల మీద నుంచి కిందపడిపోయింది. దీనిని మొట్టమొదటి "రోబోట్ ఆత్మహత్య"గా చెబుతున్నారు.సిటీ కౌన్సిల్ అధికారులు వెంటనే స్పందించారు. పగిలిన రోబోట్ ముక్కలను విశ్లేషణ కోసం సేకరించారు. ఇది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోబోట్ ఎక్కువ పని చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చాలా మంది అనుకుంటున్నారు.రోబోట్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విచిత్రంగా ప్రవర్తించినట్లు, అక్కడే ఏదో వెతుకుతున్నతలు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించిందని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి రోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు రోబోట్ పనిచేస్తుంది. ఇలా విరామం లేకుండా పనిచేయడం వల్లనే రోబోట్ ఆలా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుందని పలువురు భావిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే.. సౌత్ కొరియాలో రోబోట్స్ వినియోగం చాలా ఎక్కువ. ప్రతి పది మంది ఉద్యోగులకు సహాయం చేయడానికి ఒక రోబోట్ ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ వెల్లడించింది. కాగా రోబోట్ నిజంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. -
లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేశరాజధాని సియోల్ దగ్గర్లోని హవాసియాంగ్ సిటీలో ఎరీసెల్ కంపెనీకి చెందిన లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది. సోమవారం ఉదయం 10.30గంటలపుడు 102 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో అక్కడి కొన్ని బ్యాటరీలు పేలాయి. దీంతో రెండో అంతస్తుల్లో మంటలంటుకుని ఫ్యాక్టరీలో దావానంలా వ్యాపించాయి. దీంతో 22 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో 18 మంది చైనా కార్మికులు ఉన్నారు. తయారైన బ్యాటరీలను తనిఖీచేసి ప్యాక్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే పేలుడుకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒకరి జాడ తెలీడంలేదు. ఘటనాస్థలిని ప్రధాని హాన్ డ్యూక్ సో సందర్శించారు. -
సియోల్: బ్యాటరీల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీలో సోమవారం(జూన్24) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. రాజధాని సియోల్ దక్షిణ ప్రాంతంలో ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 35 వేల బ్యాటరీ సెల్స్ను ఉంచిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీల నుంచి వెలువడే మంటలార్పడానికి డ్రైశాండ్ను వినియోగించారు. నీళ్లు ఈ మంటలను ఆర్పలేవు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో 78 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై దేశాధ్యక్షుడు యూన్సుక్ యోల్ స్పందించారు. మంటలను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో సౌత్ కొరియా ముందుంది. -
దక్షిణ కొరియాలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు
దక్షిణ కొరియాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు బువాన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ఈ వివరాలను వాతావరణ శాఖ మీడియాకు తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైనట్లు పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ దక్షిణ కొరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే. అయితే ఈ భూకంపం కారణంగా నష్టం వాటిల్లినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. నార్త్ జియోల్లా ప్రావిన్స్లోని అగ్నిమాపక శాఖ అధికారి జో హే-జిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపానికి సంబంధించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సుమారు 80 కాల్స్ వచ్చాయన్నారు. ఈ భూకంపం కారణంగా బువాన్లో ఓ ఇంటి గోడ కూలిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.భూకంపాలను వాటి తీవ్రత పరంగా వివిధ వర్గాలుగా విభజిస్తారు. 2.5 నుండి 5.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు మైనర్ కేటగిరీలో ఉంటాయి. 5.5 నుండి 6 తీవ్రతతో వచ్చే భూకంపం స్వల్ప స్థాయిలో ప్రమాదకరమైన భూకంపంగా పరిగణిస్తారు. 6 నుండి 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లయితే, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 7 నుండి 7.9 తీవ్రతతో సంభవించే భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. -
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్ కొరియా కిమ్!
ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు. -
తూర్పు ఆసియాలో కొత్త సమీకరణాలు
నాలుగున్నర ఏళ్ళ తర్వాత సియోల్ వేదికగా చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశం ప్రపంచ రాజకీయ నాయకులు, విశ్లేషకుల్లో ఆసక్తిని రేపుతోంది. తూర్పు ఆసియాలో భౌగోళిక రాజకీయాల్లో కొత్త సమీకరణాల దిశగా అడుగులు పడనున్నాయా అన్న చర్చ మొదలయ్యింది. ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలు, ఉద్రిక్తతలు పక్కన పెట్టి స్నేహ సంబంధాల బలోపేతానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని భారత దేశం కూడా నిశితంగా గమనించాల్సిందే. వాస్తవంగా 2008లోనే చైనా, జపాన్, దక్షిణ కొరియా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. చివరిసారిగా 2019లో త్రైపాక్షిక సమావేశం జరిగింది. వాస్తవంగా ఈ మూడు దేశాల మధ్య త్రిముఖ కోణాల్లో సంఘర్షణలు ఉన్నాయి. జపాన్–దక్షిణ కొరియా దేశాల మధ్య శత్రుత్వానికి చారిత్రక నేపథ్యమే ఉంది. 1910 నుంచి 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు జపాన్ వలస పాలనలో దక్షిణ కొరియా మగ్గింది. అందుకే ఆ దేశం ఇప్పటికీ జపాన్ చేసిన గాయాలను మర్చిపోలేదు. అటు చైనా– జపాన్ మధ్య కూడా గత ఏడాది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసి పసిఫిక్ సముద్రంలో జపాన్ విడుదల చేయటాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే జపాన్ నీటిని విడుదల చేస్తోందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసినా చైనా మాత్రం వెనక్కి తగ్గలేదు. జపాన్ నుంచి చేపల దిగుమతిపై చైనా, దక్షిణ కొరియాలు ఆంక్షలు విధించాయి. చైనా–జపాన్ దేశాల మధ్య ఉన్న డియాయు ద్వీపం ప్రాదేశిక జలాల్లో నాలుగు నెలల కిందట చైనా గస్తీ నిర్వహించటంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి. తూర్పు చైనా సముద్రంలోని సెంకాకు ద్వీపాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధ సమయం అంటే 1939–1945 మధ్య కాలంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం జపాన్ అధీనంలోనే ఉండేది. యుద్ధంలో జపాన్ ఓటమితో ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరిగింది. మరోవైపు అమెరికాతో తమ సంబంధాల బలోపేతానికి దక్షిణ కొరియా కృషి చేస్తుండటాన్ని చైనా జీర్ణించుకులేకపోతోంది. ఇక దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్ జలాల్లో చైనా దూకుడు పెంచటంతో జపాన్, దక్షిణ కొరియాల్లో ఆందోళన ఉంది. ఇలా మూడు దేశాల మధ్య వివిధ అంశాల్లో తీవ్ర విభేదాలు, అపనమ్మకాలు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా... ప్రస్తుతం అన్నింటినీ పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావటం ఆసియా ఖండంలో కీలక పరిణామం. చైనా అధ్యక్షుడి తర్వాత నంబర్ టూ గా పరిగణించే ప్రిమీర్... లీ కియాంగ్ అన్నట్లు ఇది మరో శుభారంభం. ఈ సమావేశంలో మూడు దేశాలు పరస్పర సహకారం, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వృద్ధ జనాభా సమస్య వంటి కీలక అంశాలపై చర్చతో పాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా అడుగులు వడిగా వేయటం మరో ప్రధాన విషయం. ఈ మూడు తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంపై కూడా ఉంటుంది అనటానికి వీరి గ్లోబల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వాల్యూమ్ ఒక ప్రామాణికం. గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 25 శాతం వాటా ఈ మూడు దేశాలదే. అంతే కాదు జపాన్, సౌత్ కొరియాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక్కడే మరో ఈక్వేషన్ కూడా ఉంది. ఆసియా ఖండంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారి తనకు సవాలు విసురుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి అమెరికాకు ఆసియాలో బలమైన స్నేహితులు కావాలి. అందుకే దక్షిణ కొరియా, జపాన్లతో కలిసి అగ్రరాజ్యం మిలటరీ డ్రిల్స్ను విస్తరిస్తోంది. అదే సమయంలో ఈ రెండు దేశాలకూ, అమెరికాకు మధ్య దూరం పెరగాలని ఆకాంక్షిస్తోంది చైనా. ఆసియా ఖండంలో శాంతి సామరస్యాలు పెరగటాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే అదే సమయంలో ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు, మరింత బలపడేందుకు డ్రాగన్ చేస్తున్న ప్రయత్నాల పట్ల మన దేశం అప్రమత్తంగా ఉండాలి. రెహానా వ్యాసకర్త ఏపీ సమాచార కమిషనర్, ఆంధ్రప్రదేశ్ -
మామిడి బఫే..ఐస్క్రీం నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అంతా మ్యాంగో మయం..!
మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్ల రాజు మ్యాంగో. అలాంటి మామిడి పండ్లతో మ్యాంగో బఫేని అందిస్తోంది ఓ రెస్టారెంట్. కేక్లు దగ్గర నుంచి ఐస్క్రీమం వరకు అన్నింటిలోనూ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కడ? ఏ రెస్టారెంట్ ఇలా సర్వ్ చేస్తోందంటే..మామిడి అంటే ఇష్టపడే వాళ్ల కోసం దక్షిణ కొరియాలోని ఒక రెస్టారెంట్ మామిడి పండ్లతో వెరైటీ బఫేని పరిచయం చేసింది. సియోల్లోని లోట్టే అనే హోటల్ ఈ వైరైటీ బఫేట్ని కస్టమర్ల్కు సర్వ్ చేస్తోంది. దీని ధర వచ్చేసి రూ. 8,257లు. ఈ వేసవి మొత్తం ఈ బఫెట్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఆ బఫేలో మామిడి పండ్లతో చేసిన కేక్, మ్యాంగో డ్రింక్, మ్యాంగో ఫుడ్డింగ్, మ్యాంగో డెజర్ట్, మ్యాంగో ఐస్క్రీం, స్పైసీ రైస్ కేక్లతో సహ పది రకాల వెరైటీలను ఈ బఫేలో అందిస్తారు.వవెరైటీ భోజనం కావాలనుకునే వాళ్లకు ఇది అద్భతమైన బఫే సెటప్ అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్ చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బఫే కస్టమర్లకు ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే సుందరమైన జలపాతం, కళాత్మక అలంకరణల మధ్య ఈ మ్యాంగో బఫేని అధిక ధరకు వెచ్చించి మరీ తినడం కస్టమర్లకు ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మామిడి ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్ అని ఒకరు, ఇది స్వర్గానికి మించి..! అని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..) View this post on Instagram A post shared by 포토그래퍼의 공간 탐닉 (@space_tamnik) -
గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!వజ్రాలు.. డైమండ్స్.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం ఫ్యాషన్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు ఫ్యాషన్ మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పురానుందని, సరసమైన ధరల్లో డైమండ్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150 నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.అయితే వజ్రాలకోసం కార్బన్ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. ఈ కొత్త పద్ధతి ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్లో ప్రచురించారు. -
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
సౌత్ కొరియా సింగర్ ఆండా రెండేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. అప్పటివరకు ఎంతో యాక్టివ్గా ఉన్న ఈ బ్యూటీ ఉన్నట్లుండి సామాజిక మాధ్యమాలను ఎందుకు దూరం పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా ఇన్స్టాగ్రామ్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఆండా. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర వార్త బయటపెట్టింది.ఓ విషయం చెప్పాలితనకు పెళ్లైందని, ఓ బిడ్డ కూడా పుట్టిందని వెల్లడించింది. ఈమేరకు భర్తతో కలిసున్న వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసింది. 'హలో, నా పేరు ఆండా. చాలాకాలంగా నేను సైలెంట్గా ఉండటంతో నేనెలా ఉన్నానని కంగారుపడుతున్నారేమో! నేను బాగున్నాను.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఇది సాంగ్కు సంబంధించినది కాదు.. ఇదెలా చెప్పాలా? అని చాలాకాలంగా టెన్షన్ పడుతున్నాను. ఇక దాన్ని చెప్పేస్తున్నాను.పెళ్లి - పాపగతేడాది ఓ అద్భుతమైన వ్యక్తిని కలిశాను. మేమిద్దరం శీతాకాలంలో పెళ్లి చేసుకున్నాం. మాకు ఓ పాప పుట్టింది. మీరు ఇకపై ఆండా 2.0ను చూడబోతున్నారు. తల్లిగా, భార్యగా, సింగర్గా అన్ని పనులు నిర్వర్తించనున్నాను. మీ అందరికోసం మరింత కష్టపడతాను. థాంక్యూ' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anda🎈 (@anda_kiss) -
ధీరజ్ బృందం సంచలనం
షాంఘై (చైనా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్లతో కూడిన భారత జట్టు 5–1 (57–57, 57–55, 55–53)తో సంచలన విజయం సాధించింది. తద్వారా 14 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో టీమ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. చివరిసారి భారత్ 2010 ఆగస్టులో షాంఘైలోనే జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో స్వర్ణం సాధించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ధీరజ్ –అంకిత ద్వయం కాంస్య పతకం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్లో ధీరజ్–అంకిత జోడీ 6–0 (35–31, 38–35, 39–37)తో వలెన్సియా–మతియాస్ (మెక్సికో) జంటపై నెగ్గింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో భారత స్టార్ దీపిక కుమారి 0–6 (26–27, 27–29, 27–28)తో ఆసియా క్రీడల చాంపియన్ లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకుంది. -
ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్లో ఫ్యాన్స్
ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ బోరామ్ అనుమానాస్పద మరణం మ్యూజిక్ ప్రపంచాన్ని, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 30 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా గాయని పార్క్ బో రామ్ కన్నుమూసింది. దక్షిణ కొరియాలో గాయనిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పార్క్ బోరామ్ మరణాన్ని అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు. నమ్యాంగ్జు పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటర్లు దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆమె చనిపోయే కొద్ది గంటల ముందు ఒక ప్రైవేట్ ఈవెంట్కు వెళ్లింది. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. ఆ తరువాత రాత్రి 9:55 గంటలకు రెస్ట్రూమ్కి వెళ్లింది. 'సింక్పైకి వంగి’, అపస్మారక స్థితిలో చనిపోయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని పోలీసులు విచారణ చేపట్టారు. Park Boram has passed away at the age of 30. pic.twitter.com/E2PfluIwfc — Kpop Charts (@kchartsmaster) April 11, 2024 దక్షిణ కొరియా సంగీత పరిశ్రమలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. రచయిత కూడా అయిన బో రామ్ తన పదేళ్ల మైలురాయిని చేరుకున్నందుకు గౌరవసూచకంగా ఈ ఏడాది చివర్లో రెండు కొత్త పాటలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆమె మరణంపై పలువురు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కె-పాప్ సింగర్ పార్క్ బో రామ్ పార్క్ బో-రామ్ 2010లో 17 ఏళ్ల వయస్సులో రియాలిటీ సింగింగ్ ఛాలెంజ్ 'సూపర్ స్టార్ K2'లో కనిపించి మెప్పించింది. తరువాత 'బ్యూటిఫుల్' పాటతో కరియర్ ప్రారంభించింది. ‘రీప్లే 1988’ లాంటి ఆల్బమ్స్లో మెలోడియస్ వాయిస్తో బాగా పాపులర్ అయింది. 2014 గావ్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్లో, ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ถ้าเคยดู reply 1988 คงจะจำเพลงนี้ได้ ตอนนี้เจ้าของเพลงไม่อยู่แล้ว 😢 รู้จักพี่โบรัมตั้งแต่เพลง Beautiful เขาเป็นคนที่เป็นแรงบันดาลใจให้ใครหลายคนในการ ลนน และเดินตามความฝันของตัวเอง เขาเก่งมากๆนะ เป็นอีกครั้งที่วงการเกาหลีต้องสูญเสียคนเก่งๆไป #RIP #ParkBoram #พัคโบรัม pic.twitter.com/sBORRZMBp2 — Miànbāo hé nǎichá 🍞 (@Magic_pink00) April 12, 2024 -
దక్షిణకొరియాలో నేడే ఎన్నికలు
సియోల్: దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నాచితక పారీ్టలకు వాటికి లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు పీపుల్ పవర్ పార్టీ నేత, అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రిఫరెండమ్ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయన 2022లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో పీపుల్ పవర్ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే యూన్ సుక్ ఇయోల్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకోవచ్చు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే–మ్యూంగ్ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. సర్వే కూడా అదే అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిక్యం పెరిగితే పరిపాలన పరంగా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. -
అమెరికా, సౌత్కొరియాలకు నార్త్ కొరియా వార్నింగ్
ప్యాంగ్యాంగ్: సౌత్ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న మిలిటరీ విన్యాసాలు తమ దేశంపై దాడి కోసమేనని, ఇందుకు తాము సరైన రీతిలో స్పందిస్తామని ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 11 రోజుల పాటు నిర్వహించే మిలిటరీ డ్రిల్ను సౌత్కొరియా, అమెరికా కలిసి తాజాగా ప్రారంభించాయి. ఈ డ్రిల్లో భాగంగా గత ఏడాది కంటె రెట్టింపు విన్యాసాలను రెండు దేశాలు చేయనున్నాయి.‘ఇవి పూర్తి బాధ్యతా రహితమైన మిలిటరీ విన్యాసాలు, సార్వభౌమ దేశమైన నార్త్కొరియాను ఆక్రమించేందుకు సౌత్కొరియా, అమెరికాలు కలిసి మిలిటరీ డ్రిల్ ముసుగులో ప్రయత్నిస్తున్నాయి’అని నార్త్కొరియా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు..39 మంది మృతి -
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Seoul: సౌత్కొరియాలో డాక్టర్ల పోరుబాట.. పేషెంట్ల విలవిల
సియోల్: సౌత్ కొరియాలో డాక్టర్లు వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ఏడాదికి 2 వేల సీట్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని సియోల్లోని 5 పెద్ద ఆస్పత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దవుతున్నాయి. దీనిపై దేశ వైద్యశాఖ సహాయ మంత్రి పార్క్ మిన్సూ స్పందించారు. డాక్టర్ల ప్రాథమిక కర్తవ్యం పేషెంట్ల ప్రాణాలు కాపాడటమని, నిరసనల కంటే వారు ఈ విషయానికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, ఇందుకే మరింత మంది డాక్టర్లు అవసరమని చెప్పారు. అయితే స్టే ఎట్ వర్క్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచే బదులు వారి వేతనాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిండం కోసమే మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ఏప్రిల్లో జరిగే సాధారణ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్టంట్ ప్లే చేస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఇదీ చదవండి.. అలెక్సీ నావల్ని కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ -
పండంటి బిడ్డకు జన్మ: ఆసుపత్రికి భారీ విరాళమిచ్చిన ముద్దుగుమ్మ
దక్షిణ కొరియా ఒలింపియన్ జిమ్నాస్ట్ సన్ యోన్ జే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె సెవెరెన్స్ హాస్పిటల్ ప్రసూతి విభాగానికి భారీ ఎత్తున (సుమారు 62 లక్షల రూపాయలు) విరాళాన్ని కూడా ప్రకటించడం విశేషంగా నిలిచింది. దీంతో రిథమిక్ జిమ్నాస్ట్ సన్ యోన్ జేకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రసూతి, గైనకాలజీకి చాలా మద్దతు అవసరమని భావించానని, అందుకే ఈ విరాళమని సన్ యోన్ జే ప్రకటించింది.హై-రిస్క్ మెటర్నల్ అండ్ ఫీటల్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ సెంటర్ కోసం ఈ విరాళాన్ని ఉపయోగిస్తామని ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆసుపత్రికి విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమ పెళ్లి సందర్బంగా 37,400డాలర్లను సెవెరెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల జిమ్నాస్ట్ ప్రీ-టీనేజ్లోనే బరిలోకి దిగి సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడలలో ఆల్ రౌండర్ ఛాంపియన్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2010 ఆసియా గేమ్స్ ఆల్రౌండ్ కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకోవడంతోపాటు, వరుసగా మూడుసార్లు ఆసియా గేమ్స్ ఆల్ రౌండర్ ట్రోఫీ దక్కించుకుంది. అలాగే దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్గా నిలిచింది. 2022, ఆగస్టులో సౌత్ కొరియాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది సన్ యోన్ జే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
North korea: ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు
ప్యాంగ్యాంగ్: దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని ప్రకటించిన ఉత్తర కొరియా వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా ఆ దేశం మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. దానిపై నుంచి 240ఎమ్ఎమ్ బాలిస్టిక్ రాకెట్ లాంచర్ షెల్స్ను విజయవంతంగా ప్రయోగించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంటట్రోల్ సిస్టమ్ను అభివృద్ధి చేయడంలో ఈ పరీక్ష కీలకం కానుందని నార్త్ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. జనవరిలోనూ పొరుగు దేశం దక్షిణ కొరియా సరిహద్దులోని ఓ ఐలాండ్లో ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించింది ఉత్తర కొరియా. దక్షిణ కొరియా తమపై దాడికి దిగితే ఆ దేశాన్నే లేకుండా చేస్తామని ఇటీవలే ఉత్తర కొరియా నియంతా కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి.. కాల్చేసే కాంతి పుంజం