
24 మంది మృతి
12 మంది విషమం
సియోల్: దక్షిణ కొరియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైందిగా చెబుతున్న కార్చిచ్చు ధాటికి ఇప్పటికే 44,000 ఎకరాల పైచిలుకు అడవి కాలిపోయింది. 24 మంది మంటలకు బలవగా 26 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే. నలుగురు సివిల్ సర్వెంట్లు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 28 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉయిసాంగ్ నగరంలో క్రీ.శ 618 నాటి పురాతన గౌన్సా బౌద్ధాలయాన్ని కూడా కార్చిచ్చు దగ్ధం చేసింది.
ప్రావిన్స్లోని అతిపెద్ద దేవాలయాలలో ఇదొకటి. జోసన్ రాజవంశానికి చెందిన జాతీ య సంపదగా భావించే ఈ బౌద్ధ నిర్మాణ నిర్మాణం ఉత్సవ గంటతో పాటుగా నేలమట్టమైంది. ప్రభుత్వ నిధిగా గుర్తించిన రాతి బుద్ధుడితో సహా ఇక్కడి పలు కళాఖండాలను ముందే ఇతర ఆలయాలకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం సాంచియాంగ్ కౌంటీలో మొ దలైన మంటలు ఉయి సాంగ్కు వ్యాపించాయి. బలమైన, పొడి గాలుల కా రణంగా పొరుగు కౌంటీలైన అండాంగ్, చి యోంగ్సాంగ్, యోంగ్యాంగ్, యోంగ్డియో క్లకు మంటలు వ్యాపిస్తున్నాయి.
జపాన్లోనూ: జపాన్లోనూ కార్చిచ్చు కొనసాగుతోంది. బలమైన గాలుల వల్ల మంటల్లో పశ్చిమ జపాన్ ప్రావిన్స్లోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకాయామా, తమోనోలో వందల ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి.