forest
-
అడవులను రక్షించే.. ఫారెస్ట్ గార్డ్ 2.0: ఇదెలా పనిచేస్తుందంటే?
ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్న బాక్స్, అడవుల్లో సంభవించే పెద్ద అగ్నిప్రమాదాలను అరికట్టగలదు. ‘ఫారెస్ట్ గార్డ్ 2.0’ పేరుతో సూట్ బతుహాన్ ఎసిర్గర్, రానా ఇమాన్ అనే ఇద్దరు యువకులు ఈ చిన్న ఫైర్ సెన్సర్ డివైజ్ను రూపొందించారు.ఇది ఐఓటీ బేస్డ్ శాటిలైట్కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇది క్షణాల్లోనే మంటలను గుర్తించి, సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేస్తుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వెంటనే గుర్తించి, మంటలను నివారించి, అడవులను రక్షిస్తుంది.ఈ సెన్సార్ను ఏదైనా చెట్టుకు తగిలిస్తే చాలు, దాదాపు పదహారు హెక్టార్ల దూరం వరకు ఉండే మంటలను గుర్తిస్తుంది. ‘అడవుల్లో సంభవించే ప్రమాదాలను వెంటనే అరికట్టకుంటే పెద్ద నష్టమే వస్తుంది. అందుకే, మేము ఈ ఆలోచన చేశాం’ అని ఆ ఇద్దరూ చెప్పారు. -
తెలంగాణలో రెండేళ్లుగా తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం మళ్లీ తగ్గినట్లు ‘ఫారెస్ట్ సర్వే రిపోర్ట్–2023’లో తేలింది. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన తర్వాత చేపట్టిన హరితహారం, వనమహోత్సవం కార్యక్రమాలతో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే పోడు భూములకు (Podu Lands) పట్టాలు జారీ చేసిన తర్వాత నుంచి అడవులు తగ్గటం మొదలైందని రిపోర్ట్లో వెల్లడైంది.13 జిల్లాల్లో తగ్గుదల హరితహారం (Haritha Haram)తో రాష్ట్రంలో మోస్తరుగా ఉన్న అడవులు (Forests) చిక్కబడడం మొదలైంది. 2015లో 511 చ.కి.మీ.లు ఉన్న దట్టమైన అడవులు.. 2021 నాటికి 1,623 చ.కి.మీ.కు పెరిగాయి. అదే కాలంలో బహిరంగ అడవుల విస్తీర్ణం 7,477 చ.కి.మీ.ల నుంచి 10,471 చ.కి.మీ.కు పెరిగింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు జారీ చేయడంతో వనాల పెరుగుదలకు బ్రేక్ పడినట్లయింది. మొత్తం 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. 20 జిల్లాల్లో పెరుగుదల నమోదైంది. మొత్తంగా 2021 నాటి గణాంకాలతో పోలిస్తే 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 చ.కి.మీ.లు అటవీ విస్తీర్ణం తగ్గింది.అగ్నిప్రమాదాలు, స్మగ్లర్ల నుంచి ముప్పు ఉన్నప్పటికీ అడవులు తగ్గిపోవడానికి పోడు సాగే ప్రధాన కారణమని అటవీశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు గడిచిన పదేళ్లలో హరితహారం, వన మహోత్సవాలతో అడవులు తక్కువగా ఉన్న జిల్లాలో పచ్చదనం పెరిగింది. రోడ్ల పక్కన, ఖాళీ, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, గుట్టలు, చెరువులు, కాల్వల వెంట, ప్రజల ఇళ్ల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం వల్ల ఈ జిల్లాల్లో పచ్చదనం మెరుగైంది. కనుమరగయ్యే దశలో ఉన్న మోస్తరు అడవులు ఉనికిని నిలుపుకోగలిగాయి.చదవండి: స్కూల్ చుట్టూ చీరలు.. సంగతేంటి సారూ! పదేళ్లలో హరితహారం, వన మహోత్సవాలతో అడవులు తక్కువగా ఉన్న జిల్లాలో పచ్చదనం పెరిగింది. రోడ్ల పక్కన, ఖాళీ, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, గుట్టలు, చెరువులు, కాల్వల వెంట, ప్రజల ఇళ్ల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం వల్ల ఈ జిల్లాల్లో పచ్చదనం మెరుగైంది. కనుమరగయ్యే దశలో ఉన్న మోస్తరు అడవులు ఉనికిని నిలుపుకోగలిగాయి. అడవులను కాపాడుకోవాలి మొక్కలే ప్రాణకోటికి మూలాధారం. అడవుల విస్తీర్ణం పెంచేలా ప్రభు త్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. అడవిలో ఒక చెట్టు పోతే 4 చెట్లు నాటాలి. లేదంటే రాబోయే తరాలకు భవిష్యత్తే ఉండదు. – వనజీవి రామయ్య, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రెడ్డిపల్లి, ఖమ్మంజిల్లా పోడుతోనే నష్టం అడవులు విస్తారంగా ఉన్న జిల్లాల్లో రెవెన్యూ స్థలాలు తక్కువ. హరితహారంతో ఈ జిల్లాల్లో మోస్తరు అడవులు దట్టంగా మారాయి. అయితే, ఈ జిల్లాల్లో పోడు కారణంగా ఎక్కువ అటవీ భూభాగం కోల్పోయాం. – కిష్టాగౌడ్, భద్రాద్రి జిల్లా అటవీ శాఖాధికారి -
కాపలా పనిలేదు.. చీడపీడల బాధలేదు
గజ్వేల్: భూములు కలిగివున్నా ఎప్పటికప్పడు చూసుకోలేని, పంటల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో.. వ్యవసాయం చేయలేక బీడుగా ఉంచుతున్న రైతులకు అటవీ వ్యవసాయం చక్కని తరుణోపాయంలా మారుతోంది. ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న భూముల్లో అటవీ మొక్కలను తోటల మాదిరిగా సాగు చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడు వచ్చి చూసుకొని వెళుతున్నారు. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే నామమాత్రపు పెట్టుబడి కావడం అధిక ఆదాయం లభిస్తుండటంతో దీనివైపు మొగ్గుచూపుతున్నారు. నేలలో సారం తగ్గకుండా కాపాడుతున్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు దోహదపడుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ (సీఈసీ) ఈ కొత్త తరహా సాగుకు శ్రీకారం చుట్టి ఈ మేరకు రైతుల్ని ప్రోత్సహిస్తోంది.సాగుకు సర్కారు అనుమతివెదురు, సుబాబుల్, శ్రీగంధం, సరివి చెట్లు గతంలో అక్కడక్కడా రైతుల పొలం గట్లపై మాత్రమే కన్పించేవి. అటవీ ప్రాంతాల్లోనే వెదురు ఎక్కువగా ఉంటుంది. తాజాగా వీటిని తోటల మాదిరిగా విరివిగా పెంచి అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ములుగులోని సీఈసీ గత రెండేళ్లుగా అటవీ మొక్కల్లో మేలైన రకాలను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తోంది. తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల్లోని పలు పరిశోధన కేంద్రాల నుంచి మేలైన వెదురు విత్తనాన్ని తెప్పించి భారీగా మొక్కల ఉత్పత్తి చేపడుతోంది. ప్రధానంగా బీ–స్ట్రిక్టస్, తుల్డా పేరుతో ఉన్న అత్యంత నాణ్యత కలిగిన మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు నామమాత్రపు ధరకు విక్రయిస్తోంది. సిద్దిపేటతో పాటు యాదాద్రి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్నగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులకు సరఫరా చేస్తోంది. వెదురు మాదిరిగానే శ్రీగంధం, సరివి, సుబాబుల్ మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్హౌస్లోనూ..వ్యవసాయంలో వచ్చే మార్పులను నిరంతరం గమనిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి పెట్టే మాజీ సీఎం కేసీఆర్ సైతం అటవీ వ్యవసాయం వైపు మళ్లారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో కూడా వెదురు పెంపకాన్ని చేపట్టారు. జగదేవ్పూర్ మండలంలో ఇటిక్యాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ ఆరు ఎకరాల్లో సాగు చేసిన వెదురు తోటను స్వయంగా పరిశీలించి వివరాలను తెలుసుకున్న కేసీఆర్...ఫామ్హౌస్లో ఇటీవలే వివిధ రకాల మొక్కలను తెప్పించి నాటించారు.మొక్కలు నాటితే చాలు..భూములు ఉన్నప్పటికీ ఇతర వృత్తుల రీత్యా బీజీగా ఉండటం, పంటలు వేసినా వాటిని పరిరక్షించుకోలేని పరిస్థితుల్లో చాలామంది బీళ్లుగా ఉంచేస్తున్నారు. ఇలాంటి వారికి అటవీ వ్యవసాయం చక్కని పరిష్కారంగా మారుతోంది. ఒకసారి మొక్కలు నాటితే చాలు ఈ తరహా మొక్కలు వాటంతట అవే పెరిగిపోతాయి. పైగా వీటిని చీడపీడలు ఆశించవు. ఎరువులు, క్రిమిసంహారకాల అవసరం లేదు. నీటి సదుపాయం కూడా పెద్దగా అవసరం లేదు. బిందు (డ్రిప్) సేద్యం తరహాలో అందిస్తే చాలు. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ఈ మొక్కల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే అటవీ వ్యవసాయంతో భూముల్లో సారం స్థిరంగా ఉంటుందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా ఆక్సిజన్ అత్యధికంగా ఉండే గాలిని వెదురు మొక్కలు అందిస్తాయని సీఈసీ అధికారులు చెబుతున్నారు. ఈ తోటలతో ఇతర పంటల మాదిరిగా వెంటనే ఆదాయం రాకున్నా..రెండు మూడేళ్ల తర్వాత మంచి, మెరుగైన ఆదాయం మొదలవు తుండటంతో భూముల్ని బీళ్లుగా ఉంచడం కంటే ఇది మేలని రైతులు భావిస్తున్నారు. ఎన్ని సానుకూలతలో..ఒక్కసారి మొక్కలు నాటితే చాలు నిరంతర పర్యవేక్షణ అవసరం లేదు నీటి అవసరం అంతగా లేదుభూసారం తగ్గనే తగ్గదుచీడపీడలు సోకుతాయనే చింత లేదుక్రిమిసంహారకాలు, ఎరువులతో పనే లేదువెదురుతో అత్యధిక స్థాయిలో ఆక్సిజన్అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పటికే రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మేం కూడా మేలైన అటవీ మొక్కలను ఉత్పత్తి చేసి నామమాత్రపు ధరకే అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత విరివిగా ఈ ప్రక్రియ చేపట్టనున్నాం. – శ్రీధర్, ఉద్యానవన శాఖ ఏడీ (ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్చార్జి)వెదురుకు విదేశాల్లో మంచి గిరాకీ నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ను. హైదరాబాద్లో ఉంటున్నా. మా స్వగ్రామం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాలకు వచ్చి వ్యవసాయం చేయాలంటే సమయం కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆరు ఎకరాల్లో వెదురు సాగు చేశా. సీఈసీ నుంచి తుల్డా రకం మొక్కలు తెప్పించి వేశా. ఏడాది గడిచింది. మరో రెండేళ్ల తర్వాత నాకు మంచి ఆదాయం వచ్చే అవకాశముంది. గృహాలకు సంబంధించిన ఫర్నిచర్, ఇతర ఉపకరణాల కోసం ఇతర దేశాల నుంచి వెదురు దిగుమతి చేసుకుంటున్నారని తెలుసుకొని ఇది సాగు చేశా. ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉన్నందువల్ల భారీగా లాభాలు రావచ్చని భావిస్తున్నా. – కిరణ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇటిక్యాల, సిద్దిపేట జిల్లా -
హైదరాబాద్లో భూదందా.. 100 గజాల స్థలం రూ. 40 వేలే
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్లో ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.10వేలకే వంద గజాలంటూ ఇద్దరు వ్యక్తులు వందల మందిని నమ్మించారు. వందల కోట్లు సంపాదించారు. అపై నట్టేటా ముంచేశారు. వనస్థలీపురం పీఎస్ పరిధిలోని హరిణి వనస్థలీ నేషనల్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటవీ,పోలీస్ శాఖ ఆధీనంలో ఆటోనగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. అయితే, మన్సూరాబాద్ సర్వే నెంబర్ ఏడులో ఉన్న 682 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లిపేరు మీద ఉందని చెప్పి 50వేల మందికి నోటరీ చేశారు యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి. అతని భార్య తులసమ్మలు. ఈ రోజు నోటరీ చేసిన బాధితులకు ప్లాట్లు ఇస్తానని చెప్పడంతో భారీ సంఖ్యలో బాధితులు చేరుకున్నారు. బాధితుల రాకతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 500 మందికి పైగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే బాధితుల్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ముఠాగా ఏర్పడి 587 ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మారు. 100 గజాలు రూ. 40-50వేల రూపాయలకే ముఠా అమ్మగా.. ఆ భూమిని సుమారు 50 వేల మంది కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. భూదందాను అడ్వకేట్ షేక్ జిలానీ ద్వారా యూసఫ్ ఖాన్ ,తులసమ్మలు తతంగం నడిపించారు. అయితే, ఇవాళ కొన్నవాళ్లకు ఫ్లాట్స్ ఇస్తానని చెప్పి సర్వే నెంబర్ 7 దగ్గరకు రావాలని అడ్వకేట్ జిలానీ కొనుగోలు దారుల్ని నమ్మించారు. ల్యాండ్ మాఫియా మోసంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఫారెస్ట్ భూమి చుట్టూ మోహరించారు.ప్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు సర్వే నెంబర్ ఏడు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో అనుమానం వ్యక్తం చేసిన కొనుగోలు దారులు అసలు విషయం తెలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. బుధవారం నాడు ఈ మంటలు మరింతగా చెలరేగి, భారీ నష్టాలను కలిగించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం లాస్ ఏంజిల్స్ కౌంటీలో మరోసారి అటవీ మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. కాస్టిక్ సరస్సు సమీపంలోని కొండ ప్రాంతంలో ముందుగా మంటలు చెలరేగాయి. ఇప్పుడవి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి.మరోమారు చెలరేగిన ఈ మంటలు కేవలం రెండు గంటల్లోనే 5,000 ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. శాంటా అనాలో వీచే గాలులు మంటలు చెలరేగడానికి కారణంగా నిలిచాయి. మంటల నుండి వచ్చే పొగ కారణంగా పెద్ద నల్లటి మేఘాలు ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ మంటల కారణంగా ఏ ఇల్లు లేదా వ్యాపారం దెబ్బతినలేదు. కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 19 వేల మందిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.ఈ నెల ప్రారంభంలో చెలరేగిన మంటల కారణంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తాజాగా శాన్ డియాగో, ఓషన్సైడ్ సమీపంలో దక్షిణాన మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని అగ్నిమాపక శాఖ అదుపు చేసిందన్నారు. లాస్ ఏంజిల్స్లో వీస్తున్న గాలుల కారణంగా మంటలు పదే పదే ఎగసిపడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అక్కడ గంటకు 20 నుండి 30 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.దీని కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాప దళానికి, వైమానిక దళానికి ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు వారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 22 వేల ఇళ్లు బూడిదయ్యాయి.ఇది కూడా చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి.. -
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది. -
ఛత్తీస్గఢ్ అడవులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
-
అందాల రాచకొండ
సంస్థాన్ నారాయణపురం: ప్రకృతి అందాలు.. ప్రాచీన కట్టడాలు, పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు రాచకొండ ప్రాంతం. ఎత్తయిన కొండలు, ప్రకృతి సోయగాలు, పక్షుల కిలకిలారావాలు, మయూరాల నాట్యం, సెలయేళ్లు, జలపాతాలు.. అంతులేని ఈ ప్రకృతి అందాలకు చిరునామా రాచకొండ. ఆనాడు తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వెలసిన గొప్ప నగరం. ఇప్పటి తెలంగాణ ప్రాంతం అంతటికీ పద్మనాయక వంశీయుల ఏలుబడిలో రాజధానిగా చరిత్ర పుటల్లో నిలిచింది. యాద్రాది భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని సంస్థాన్ నారాయణపురం మండలంలో రాచకొండ అటవీ ప్రాంతం 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉంది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఫిలింసిటీ ఏర్పాటు కోసం ఏరియల్ సర్వే నిర్వహించి, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. రాచకొండలో ఫిలింసిటీ ఏర్పాటు చేస్తానని గత సంవత్సరం జూలైలో సీఎం రేవంత్రెడ్డి కూడా ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద రెండో సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్కు.. గత ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనరేట్గా నామకరణం చేసింది. రాచకొండలో చూడదగ్గ ప్రదేశాలు.. రాచకొండలో కట్టడాలు, నిర్మాణాలతో పాటు గుహలు, వందల సంఖ్యలో దేవాలయాలు, శిల్ప కళాఖండాలు, చిత్రాలు ఉన్నాయి. ప్రధానంగా కచేరి ప్రదర్శన శాల, ఉత్సవ విగ్రహాల మందిరం, సన్యాసుల దొన, సంకెళ్ల బావి, మెట్ల బావులు, కోనేర్లు, కోట చుట్టూ ఉన్న రాతి కట్టడా లు, కొండలు, గుహలు, గొలుసు కట్టు చెరువులు, దేవలమ్మ నాగారంలోని నాగాంబిక శిలాశాసనం, గొలుసు కట్టు చెరువులు, గన్నేర్లలోని జాలువారు సెలయేళ్లు, మొల్కచెర్వు ప్రాంతంలోని ఎత్తయిన జలపాతాలు, అంతకు మించి పచ్చటి కొండలు, చిట్టడవిలో నెమళ్లు కనువిందు చేస్తాయి. నక్షత్ర తాబేళ్లకు ఈప్రాంతం ప్రత్యేకం. ప్రకృతి ప్రేమికులు వర్షాలు కురిసిన తర్వాత జూలై, ఆగస్ట్ నెలల్లో రాచకొండకు ఎక్కువగా వస్తుంటారు. చారిత్రక కట్టాడాలు, దేవాలయ సందర్శనకు రోజూ వస్తుంటారు. దేవాలయాలకు ప్రసిద్ధి రాచకొండలో వందల సంఖ్యలో దేవాలయాలున్నాయి. ఎంతో ప్రాధాన్యమున్న పురాతన రామాలయం ఉంది. ఆ రామాలయంలో సహజ పాండిత్య బమ్మెర పోతన పూజలు చేశాడని చరిత్ర చెబుతోంది. గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడిన స్వయంభూ లింగేశ్వర శివలింగానికి నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఇటీవల పునరి్నరి్మంచిన సరళమైసమ్మ, శ్రీ లక్ష్మీ నర్సింహ దేవాలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. సరళ మైసమ్మ దేవాలయం వద్ద ప్రతి ఆదివారం జాతరలా జరుగుతుండటంతో.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.వీరభద్రస్వామి దేవాలయం, త్రికుటేశ్వర ఆలయం, అమ్మవారి దేవాలయాలు, పురాతన శివాలయంతో పాటు ఆళ్వారుల దేవాలయాలు.. ఇలా రాచకొండ అంతటా విస్తరించి ఉన్నాయి. మహాశివరాత్రికి స్వయంభూ లింగేశ్వర శివలింగం ఉత్సవాలు, గాలిబ్ షాహెద్ హజరత్ ఉర్సు ఒకేరోజు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. చౌటుప్పల్ మండలంలోని ఆదిమహావిష్ణువు దేవాలయల సందర్శనకు భక్తులు వస్తుంటారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల శివాలయంలో ఏకశిల ధ్వజస్తంభంతో పాటు ఇతర శాసనాలు, కట్టడాలు అనేకం ఉన్నాయి. మొల్కచెర్వు ప్రాంతంలో జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా.. రాచకొండ చారిత్రక నేపథ్యం ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందించారు. రాచకొండ అటవీ శాఖ బీట్లో 657 ఎకరాల్లో ఎకో టూరిజం అర్బన్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ రకాల 2500 మొక్కలు నాటారు. పురాతన మెట్ల బావిని అభివృద్ధి చేశారు. రాచకొండ ప్రకృతి అందాలను తిలకించే విధంగా అతి పెద్ద వ్యూ పాయింట్, ప్రధాన ద్వారం అభివృద్ధి. దర్గా నుంచి రాచకొండ కోట వరకు రోడ్డు నిర్మాణం, రోడ్డు వెంట ఉన్న చెరువుల మరమ్మతులు చేశారు. వివిధ రకాల పూల, గడ్డి జాతి మొక్కలతో పాటు విభిన్న రకాల వృక్షాలను పెంచుతున్నారు .ఫిలింసిటీకి అనువైన ప్రాంతం.. హైదరాబాద్కు రాచకొండ అతి సమీపంలోని ప్రాంతం. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించాలని ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. గత సంవత్సరం జూలైలో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కూడా ఫిలింసిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రాచకొండ గుట్టల్లో ఇప్పటికే పలు సినిమాలను చిత్రీకరించారు.మల్కాపురం ఘాట్ కంచె భూ ముల్లో ‘రెబల్’చిత్రం, పవన్కల్యాణ్ నటించిన ‘గబ్బర్సింగ్’సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. మహేశ్బాబు హీరోగా ‘ఆగడు’చిత్రం క్లైమాక్స్ ఫైట్ను కూడా ఇక్క డే చిత్రీకరించారు. రాచకొండలో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘విరోధి’, ‘సీ తారాముల కల్యా ణం’ సినిమాలో సుమన్పై క్లైమాక్స్ ఫైట్లను చిత్రీకరించారు. ‘జానకిరామా’హిందీ సీరియల్ నిర్మాణంతో పాటు అనేక షార్ట్ ఫిల్మ్లు చిత్రీకరించారు. ప్రగతి.. ప్రతిపాదనలకే పరిమితం.. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు రాచకొండ అభివృద్ధి ప్రతిపాదనలపై ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. అభివృద్ధి ప్రతిపాదనల్లో భాగంగా రాచకొండలో ఐటీ పార్కు, కృషి విజ్ఞాన కేంద్రం, నెమళ్ల పార్కు, టెంపుల్ సిటీ, ఫిలింసిటీ, పర్వతారోహణం, రోప్వే, స్పోర్ట్స్సిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్మార్ట్సిటీ, రైలుబోగీల పరిశ్రమ, ఇండ్రస్టియల్ కారిడార్గా అభివృద్ధి తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చాయి. రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి నుంచి నాలుగు లేన్ల రోడ్లను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇవన్నీ ప్రతిపాదనల దశల్లోనే ఉన్నాయి. రాచకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రాచప్ప సమితి సేవలు అమోఘం.. రాచకొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా లన్న ఉద్దేశంతో స్థానిక యువత రాచకొండ చారిత్రక పర్యావరణ పర్యాటక పరిరక్షణ సమితి (రాచప్ప) అనే సంస్థను ఏర్పాటు చేశారు. రాచకొండ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కొన్ని దేవాలయాలను ఎంపిక చేసుకొని, నిత్య దీపారాధన, స్వయంభూ లింగేశ్వర శివలింగం వద్ద సోమవారం అన్నదానం చేస్తున్నారు. రాచకొండ చరిత్రపై ప్రచారం నిర్వహిస్తున్నారు. రాచకొండ పర్యాటక ఉత్సవాలను కూడా రాచప్ప సమితి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పర్యాటకాభివృద్ధి చేయాలి రాచకొండ ప్రాంతాన్ని ఫిలింసిటీతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. టెంపుల్ సిటీగా తీర్చిదిద్దాలి. మౌలిక వసతులు కల్పించాలి. చారిత్రక కట్టడాలను పరిరక్షించి గోల్కొండ ఖిల్లాను అభివృద్ధి చేయాలి. హైదరాబాద్కు అతి సమీపంలోని రాచకొండను అభివృద్ధి చేస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. – సూరపల్లి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి, రాచప్ప సమితి ది కోవ్ రిసార్ట్లో రూంల ధరలు ఇలా..» ఈ రిసార్ట్లో 21 కాటేజీలు ఉన్నాయి. వీటిలో బస చేయాలంటే పర్యాటక శాఖకు చెందిన వెబ్సైట్లో ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. » 21 కాటేజీలను 7 రకాలుగా విభజించి అద్దెలు నిర్ణయించారు. అద్దెకు 18 శాతం టాక్స్ అదనం. శేయాన్స్ రౌండ్ హౌస్: ఇది ఒక రూమ్ మాత్రమే. ఏసీ ఉంటుంది. దీని అద్దె 15 వేలు. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నవారికి (5 ఏళ్ల లోపు) మాత్రమే అవకాశం ఉంటుంది. అదనంగా ఎవరైనా ఉంటే రూ.5 వేలు చెల్లించాలి. పూల్ హెవెన్ కాటేజీలు: మూడు ఏసీ గదులు ఉంటాయి. అద్దె రూ.12 వేలు. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్న వారికి (5 ఏళ్ల లోపు) మా త్రమే అవకా శం ఉంటుంది. అదనంగా ఉండేవారికి రూ.4 వేలు చెల్లించాలి. 5 నుంచి 12 ఏళ్లలోపు వారు అయితే అదనంగా రూ.3 వేలు చెల్లించాలి. గ్లాంప్ విల్లా: రెండు ఏసీ గదులు ఉంటాయి. ధర రూ.13 వేలు. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్న వారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉంటే రూ.2,500. 5 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు ఉన్న వారికి అదనంగా రూ.1500 చెల్లించాలి. ట్విన్ బెడ్ కాటేజేస్: ఒక రూమ్. ఏసీ ఉంటుంది. నలుగురు పెద్దవారు, ఒకరు చిన్నారి ఉండేందుకు రూ.13 వేలు చెల్లించాలి. అదనంగా ఉండే వారికి రూ.2,500. అలాగే 12 ఏళ్ల పిల్లలకు రూ.1,500 అదనంగా చెల్లించాలి. ఫ్లోటింగ్ క్యాబిన్స్: రెండు ఏసీ గదులు ఉంటాయి. రూ.8,500 చెల్లించాలి. ఇద్దరు పెద్ద వారికి, ఒక చిన్నారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉండే వారికి రూ.2 వేలు, టాక్స్ వేస్తారు. 12 ఏళ్లలోపు వారికి రూ.1500, పన్ను అదనం. పై రూంలలో ఉండే సదుపాయాలు టీవీ, ఫ్రిజ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, బ్రేక్ఫాస్ట్. ఫ్లోటింగ్ క్యాబిన్స్: ఒక రూం. నాన్ ఏసీ. రూ.7 వేలు, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ ఉంటుంది. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనం. విల్లా బ్రాంచ్ కాటేజెస్: మూడు ఏసీ రూంలు ఉంటాయి. ధర రూ.7,500, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనం. విల్లా బ్రాంచ్ కాటేజెస్: ఒక రూం, నాన్ ఏసీ. రూ.6 వేలు, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం రూమ్స్: రెండు ఏసీ రూంలు. రూ.7,500, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనం. ప్రీమియం రూమ్స్: నాలుగు రూంలు. నాన్ ఏసీ. రూ.6 వేలు, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. అదనపు చిన్నవారికి 1,500, టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూంలల్లో అడ్వెంచర్ యాక్టివిటీస్తోపాటు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. -
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం
రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023 ప్రకారం ఏపీలో 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి. ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో, ఏపీ రెండోస్థానంలోనూ, తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023 ప్రకారం ఏపీలో 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి. ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలవగా, ఏపీ రెండోస్థానంలోనూ, తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి. 2021లో 30,223.62 చదరపు కిలోమీటర్లు ఉన్న ఏపీ అటవీ విస్తీర్ణం 2023 నాటి లెక్కల ప్రకారం 30,084.96 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. మడ అడవుల్లో ఏపీ ఫస్ట్ఒకవైపు అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండగా..మరోవైపు మడ అడవుల విస్తీర్ణం ఏపీలో భారీగా పెరుగుతున్నట్టు ఫారెస్ట్ రిపోర్టులో వెల్లడైంది. దేశంలో 49,991.68 కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. దీన్లోభాగంగా ఏపీలో 2023లో 13.01 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగి మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో మహారాష్ట్ర ఉంది. కృష్ణా, బాపట్ల, కాకినాడ ప్రాంతాల్లో సహజ పునరుత్పత్తి, తోటల పెంపకం తదితర కార్యకలాపాలతో మడ అడవుల పరిరక్షణ సమర్థంగా జరిగినట్టు నివేదికలో వెల్లడైంది.అగ్నికి ఆహుతవుతున్న అడవులుఏపీలోని అడవుల్లో మేలిమి జాతి వృక్షాలు, ఇతరత్రా అటవీ సంపద ఎక్కువగా అగ్నికి ఆహుతి అవుతున్నట్టు తేలింది. 2023–24లో ఏపీలో 5,286.76 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి అగ్ని ప్రమాదాలకు గురైంది.ఇలా మంటల ధాటికి అడవులను కోల్పోయిన రాష్ట్రాల్లో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోనూ 3,983.28 కిలోమీటర్ల మేర అడవులు మంటలకు గురయ్యాయి. అత్యధిక విస్తీర్ణం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ 101.69 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం కోల్పోవడం విస్మయం కలిగించే అంశం.ఏపీలో అడవుల విస్తీర్ణం ఇలామొత్తం అటవీ విస్తీర్ణం 30,084.96చ.కి.మీగుంటూరులో అత్యల్పంగా 13.34చ.కి.మీరాష్ట్రంలో దట్టమైన అడవులు 1,995.71 చ.కి.మీఅల్లూరి జిల్లాలో అత్యధికంగా 6,917.32 చ.కి.మీఅల్లూరి జిల్లాలో అత్యధికంగా దట్టమైన అడవులు 1,183.18 చ.కి.మీరాష్ట్రంలో మధ్యస్థ అడవులు 13,725.75 చ.కి.మీ -
బయోడైవర్సిటీ లాస్!
పక్షులు, జంతువుల సహజ ఆవాసాల తగ్గుదల... క్షీణిస్తున్న అడవులు, తగ్గుతున్న చెట్ల విస్తీర్ణం, పచ్చదనం... ఇంకా లోతుగా విశ్లేíÙస్తే ప్రపంచవ్యాప్తంగా వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో వన్యప్రాణులు, పక్షి, జంతు, వృక్ష... ఇలా విభిన్న రకాల జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో వివిధరూపాల్లో పర్యావరణంపై, ఇతర రూపాల్లో ప్రభావం చూపేలా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అవసరానికి మించి సహజ వనరుల వినియోగం, గాలి, నీరు కాలుష్య బారినపడడం వంటి వాటి వల్ల జీవవైవిధ్యంపై ప్రభావం చూపడంతో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ రిపోర్ట్– 2024’నివేదిక ప్రకారం చూస్తే... ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగటు సైజ్ అనేది 73 శాతం మేర తగ్గిపోయింది. జూలాజిక్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్) రూపొందించిన ‘ద లివింగ్ ప్లానెట్ ఇండక్స్’ నివేదికను గమనిస్తే...1970–2020 మధ్యలో వివిధ జంతు, పక్షు జాతుల్లో 85 శాతం ఫ్రెష్ వాటర్ పాపులేషన్, టెర్రస్టియల్ పాపులేషన్ 69 శాతం, మెరైన్ పాపులేషన్ 56 శాతం తగ్గినట్టుగా తేలింది. జీవవైవిధ్యమనేది భూమి, విభిన్న రకాల మొక్కలు, వృక్షజాతులు, జంతు, పక్షి జాతులు, వివిధ రకాల సూక్ష్మజీవులు (మైక్రో ఆర్గనిజమ్స్) తదితరాలతో కూడుకుని ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్తెలంగాణలో చూస్తే..వివిధ రూపాల్లో వెల్లడైన వివరాలు, సమాచారం మేరకు చూస్తే తెలంగాణలో జీవవైవిధ్యా నికి వాటిల్లిన నష్టానికి ప్రధానంగా అడవులకు వాటిల్లుతున్న నష్టం, తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం, అంతర్ గ్రహ మొక్కలు (ఇన్వెసివ్ ఎలియన్ స్పీషీస్) విపరీతంగా పెరుగుదల, మత్స్య రంగ అతి వినియోగం, కాలుష్య స్థాయిల పెరుగుదల, వాతావరణ మార్పులతో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటివి కారణమవుతున్నాయి. ⇒ 2023 జూన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2 వేల మొక్కలు, వృక్షాల రకాలు, 5,757 జంతురకాలు ఉన్నట్టుగా తేలింది. సాధారణంగా జెనిటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీల ద్వారా జీవవైవిధ్యాన్ని పరిశీలిస్తారు. ⇒ 2023లో తెలంగాణలో 646 హెక్టార్ల సహజ అటవీ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఇండియన్ పంగోలిన్, మౌస్డీర్స్, మలబార్ పైడ్ హార్న్బిల్, బ్లాక్నెక్డ్ స్టోర్క్, రుడ్డి మంగ్యూస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సంద్కోల్ కార్ప్ వంటి జంతు, పక్షి రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్లోత్బేర్, ఇండియన్ బైసన్, ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీవవైవిధ్యం ఏ స్థాయిలో ఉంది, ఎదురవుతున్న సమస్యలు, అందుకు కారణాలు ఏమిటి? తదితర అంశాలపై పర్యావరణ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తమ అభిప్రాయాలు, విశ్లేషణలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...గ్రీన్కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదుజీవవైవిధ్యం అంటే ఏమిటనేది అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం గ్రీన్కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదు అని గుర్తించాలి. విధాన నిర్ణేతలు, ప్రజాప్రతినిధులు కూడా గడ్డిభూములు, బీడుభూములు వంటివి కూడా పర్యావరణవ్యవస్థల పరిధిలోకి వస్తాయని గుర్తించాలి. చెట్లు అనేవి జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మనమంతా గుర్తించాలి. భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పెద్దసంఖ్యలో చెట్ల తొలగింపు, గ్రీన్కవర్ తగ్గినప్పుడు జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది.నగరాల్లోనూ రోడ్ల విస్తరణ, నిర్మాణపరమైన ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు వెంటనే ట్రీకవర్ తగ్గిపోయిన ప్రభావం తప్పకుండా జీవవైవిధ్యంపై పడుతుంది. పచ్చదనం పెంచేందుకు చేపట్టే కార్యక్రమాల సందర్భంగా గడ్డి మైదానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ విషయంపై తెలంగాణలో పెద్దగా దృష్టి సారిస్తున్న పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో తగినంత స్థాయిలో గడ్డిమైదాన ప్రాంతాలున్నాయి.వాటిని యుద్ధప్రాతిపదికన సంరక్షించాలి. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో మంచిస్థాయిలో జీవవైవిధ్యమనేది అలరారుతోంది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని జాతీయపార్కులు, శాంక్చురీలలోనూ జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో దాదాపు పది, పన్నెండేళ్ల క్రితం నిర్వహించిన కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్యం కొంతమేర మెరుగైంది. రాష్ట్రంలో ఎంత మేర జీవవైవిధ్యాన్ని నష్టం జరిగింది, ఏ ఏ పక్షి, చెట్లు, జంతువుల రకాలు తగ్గిపోయాయనే దానిపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ పరిశీలన, అధ్యయనమేదీ జరగలేదు. అందువల్ల ఎంతమేర నష్టం జరిగింది, ఏఏ జాతులు కనుమరుగు అవుతున్నాయనే దానిపై సాధికారికంగా వ్యాఖ్యానించేందుకు అవకాశం లేదు. –ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్–ఇండియా రాష్ట్రంలో దిగజారుతున్న జీవ వైవిధ్యం కొంతకాలంగా రాష్ట్రంలో జీవవైవిధ్యం అనేది దిగజారుతోంది. అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. కొన్ని చెట్లు, మొక్కల రకాలు కూడా అంతరిస్తున్నాయి. ఊర పిచ్చుకలు, బోరుగ పిచ్చుకలు దాదాపుగా కనబడకుండాపోగా, కాకులు, ఇతర పక్షుల సంఖ్య కూడా క్షీణిస్తోంది. కప్పలు, కొన్నిరకాల చేపలు కూడా తగ్గిపోతున్నాయి. అడవుల తగ్గుదల ప్రభావం, చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల జంతువులు, పక్షుల ఆవాసాలు, నివసించే ప్రదేశాలు కుచించుకుపోతున్నాయి. వాటికి సరైన ఆహారం దొరకడం లేదు. పక్షులు, ఇతర జంతువులు తాగేనీరే తక్కువ కాగా, అది అంతగా లభించడం లేదు. నగరం, పట్టణాల చుట్టుపక్కల పైపులైన్లతోనే ఇళ్లకు నీటి సరఫరా, ఉపరితలంపై ఉన్న నీరు కలుషితం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పక్షులు, జంతువులు వంటి వాటికి నీరు, ఆహారం దొరక్క ఆవాస ప్రాంతాలు, గుడ్లు, సంతానం పెంపొందించుకునే అవకాశం లేకపోవడంతో పక్షి, జంతుజాతులు తగ్గిపోతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా ప్రాజెక్టులు, ఇతర రూపాల్లో నిర్మాణాలు పెరిగిపోవడం, అవసరానికి మించి సహజవనరుల అతి వినియోగం, గణనీయంగా పెరిగిన రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలు పెరగడం, ఆన్రోడ్డు వెహికిల్సే కాకుండా ఇసుక, మైనింగ్, ఇతర అవసరాల కోసం నీరు, ఇతర ప్రదేశాల్లోకి వాహనాల ప్రవేశం నష్టం చేస్తోంది.2012లో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చారు. పిచ్చుకలు, ఇతర తగ్గిపోతున్న పక్షి, జంతుజాతులను ఎలా సంరక్షించాలనే దానిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణరంగ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ -
ఆడపులి కోసం అడవులన్నీ..
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని అడవుల్లో బెంగాల్ టైగర్ సంచారం కొనసాగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసిన పెద్దపులి.. తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకొని అక్కడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో తిష్టవేసింది. ఈ విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించింది. ‘తాడ్వాయి మండలం బందాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయి.వారం క్రితం పంబాపురం, నర్సాపురం అడవుల్లో తిరిగిన పులి.. బందాల అడవుల్లో జంతువులను వేటాడిన ఆనవాళ్లున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య హెచ్చరించారు. దీంతో గిరిజన గూడేల్లో మళ్లీ పులి కలకలం మొదలైంది. తోడు కోసం గాలిస్తూ..: ఇరవై రోజులకుపైగా అటవీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మగ పులి.. ఆడపులి తోడు కోసం అడవులన్నీ తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్నగర్.. చెన్నూరు, భూపాలపల్లి, ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం.. ఇంద్రావతి నుంచి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు అటవీ ప్రాంతం... ఇలా పులి సుమారు 10 జిల్లాల్లో చాలా దూరం నడిచినట్లు పాదముద్రల ద్వారా తెలుస్తోందని అటవీశాఖ ప్రకటించింది.అయితే 2021లో ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి ములుగు అడవులకు మేటింగ్ కోసం వచ్చిన పులే మరోసారి వచ్చి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి నాలుగైదేళ్ల నాటి పులుల సంచార రికార్డులు, కెమెరా ట్రాప్లు, వాటి ఫొటోలు పరిశీలించాల్సి ఉందంటున్నారు. ఆ తర్వాతే ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్నది కచ్చితంగా చెప్పగలమంటున్నారు. మూడేళ్ల కిందట ఇలాగే..: మూడేళ్ల క్రితం పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ములుగు, తాడ్వాయి, మంగపేట, కరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి పర్యటించిందని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో ఒక ఆవును కూడా పులి చంపితిందని, ఆ తర్వాత నుంచి దాని జాడ లేదని.. తిరిగి 10 రోజులుగా పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆదిలాబాద్, కాగజ్నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయిల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు పులి కారిడార్ను ఏర్పాటు చేసుకుందని అధికారులు అంటున్నారు. -
భూమ్మీద అడవుల లెక్క ఇదీ..
⇒ 2022లో ప్రపంచవ్యాప్తంగా నరికివేతకు గురైన అడవులు.. 41 లక్షల హెక్టార్లు (సుమారు కోటి ఎకరాలు). ⇒ అంటే ప్రతి ఒక్క నిమిషానికి నరికివేత జరిగిన విస్తీర్ణం.. 11 ఫుట్బాల్ గ్రౌండ్లతో సమానం ⇒ ఏడాదిలో తగ్గిపోయిన అడవుల వల్ల భూమి వాతావరణంలోకి అదనంగా చేరిన కార్బన్ డయాక్సైడ్.. 2.7 గిగాటన్నులు ⇒ఇది భారతదేశం మొత్తంలో ఒక ఏడాది పాటు బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు వినియోగిస్తే వెలువడే కార్బన్ డయాౖMð్సడ్తో సమానం. ⇒ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) –2021 నివేదిక ప్రకారం మన దేశ విస్తీర్ణంలో అడవుల శాతం.. 21.72% ⇒ దేశంలో 2019తో పోలిస్తే 2021 నాటికి అదనంగా పెరిగిన అడవులు.. 1,540 చదరపు కిలోమీటర్లు.. -
కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..
మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.అడవి ఒక్కలాగా ఉండదుఅడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం. వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.మొదలైన అన్వేషణఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది. ‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.స్మగ్లర్లు అనుకునిఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం. టార్చ్లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్లైట్ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.వారు అడవిని జయించారుగతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట. (చదవండి: -
దామగుండం అడవిలో భారీ అగ్ని ప్రమాదం
పూడూరు: వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయనున్న దామగుండం అటవీ ప్రాంతంలో గురువారంరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 నుంచి 30 ఎకరాల మేర అడవి కాలి బూడిదైంది. ఇది ప్రమాదామా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూడూరు మండల పరిధిలో 2,900 ఎకరాల మేర దామగుండం అటవీ ప్రాంతం ఉంది. ఈ స్థలాన్ని ప్రభుత్వం నేవీ రాడార్ ఏర్పాటుకు కేటాయించగా, ఇటీవల భూమి పూజ చేశారు.అడవి చుట్టూ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా రాత్రి అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. అడవి సరిహద్దులోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే వందూరుతండా సమీపంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో అగి్నమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చేలోపల దాదాపు 20 నుంచి 30 ఎకరాల అడవి కాలిపోయింది. ఈ ప్రాంతంలో చుట్టు పక్కల రైతులు, కాపరులు తమ పశువులను మేపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా కావాలనే అడవికి నిప్పు పెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాడార్ స్టేషన్ కోసం భూమి పూజ చేసిన స్థలానికి ఎదురుగా వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థల సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వీడియోలను స్థానికంగా ఉండే సత్యానందస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎఫ్ఆర్ఓ శ్యాంమ్కుమార్, నేవీ అధికారి మల్లికార్జునరావు, పరిగి సీఐ శ్రీనివాస్రెడ్డి, చన్గోముల్ ఎస్ఐ ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. సత్యానందస్వామి ఉంటున్న ఆశ్రమానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. -
జంగిల్లో జింగిల్స్
మొదట్లో సుధాచంద్రన్కు పక్షులతో కాస్తో కూస్తో పరిచయం కూడా లేదు. అదృష్ట పల్లకి ఆమెను కేరళలోని తట్టెక్కాడ్ అభయారణ్యం వరకు తీసుకెళ్లింది. అది పక్షుల విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో పక్షులకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. పక్షి ప్రేమికురాలుగా మారింది. ‘ఫారెస్ట్ గైడ్’గా పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్య ప్రజలు చేస్తున్న కృషికి ఇచ్చే ‘పీవి థంపీ మెమోరియల్’ అవార్డ్ అందుకుంది...అద్భుతమై సంగీతాన్ని వినడానికి సుధాచంద్రన్ ఏ సంగీత కచేరికి వెళ్లదు. ప్రతిరోజు ఉదయాన పక్షుల కిలకిలారావాలు వింటుంది. అందులో ఆమోఘమైన రాగాలెన్నో వింటుంది. ముఖ్యంగా రాకెట్–బెయిల్డ్ డ్రోంగ్ మేలుకొలుపు జింగిల్స్ వినడం అంటే సుధకు ఎంతో ఇష్టం.మూడు దశాబ్దాలకు పైగా తట్టెక్కాడ్ పక్షుల అభయారణ్యంతో అనుబంధం ఉన్న సుధ 300కి పైగా పక్షి జాతులను గుర్తించగలదు. వాటి పిలుపులు, బ్రీడింగ్ సీజన్, ఫీడింగ్ సీజన్, అలవాట్లు మరియు ఆవాసాలు, వలసలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ‘ఈ అడవి నా కుటుంబం లాంటిది’ అంటున్న సుధ నవ వధువుగా 1971 లో తట్టెక్కాడులోకి అడుగు పెట్టింది.‘ఆ కాలంలో ఇది దట్టమైన అడవి. ఇందులోకి అడుగు పెట్టినప్పుడు మొదట భయం వేసింది. అడవి నుంచి వచ్చే శబ్దాలు నన్ను భయపెట్టేవి’ అంటుంది సుధ. ఆమె భర్తకు తట్టెక్కాడ్లో టీ షాప్ ఉండేది. భర్త అకాల మరణం తరువాత సుధ అనేక సవాళ్లను, కష్టాలనూ ఎదుర్కొంటూనే ఇద్దరు పిల్లల్ని చదివించింది, ఒకవైపు టీ దుకాణం నడుపుతూనే డ్రైవింగ్, పడవ నడపడం నేర్చుకుంది. ఫొటోగ్రాఫీలో మెలకువలు తెలుసుకుంది.సుధ టీ షాప్కు పక్షుల ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలు వచ్చేవాళ్లు. వారితో సంభాషించడం వల్ల తనకు కూడా పక్షుల ప్రపంచంపై ఆసక్తి మొదలైంది. ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ శిష్యుడు ఆర్.సుగతన్ నిర్వహించే సమావేశాలకు హాజరయ్యేది. ‘నేను క్లాసు బయట నిల్చోవడం చూసి సుగతన్ సర్ లోపలికి వచ్చి క్లాసు వినాల్సిందిగా కోరేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సుధ.పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలతో కలిసి అడవిలో పక్షులను చూడడానికి వెళ్లేది. ‘నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలను ఇతరులకు చెబుతుంటాను’ అంటుంది సుధ.ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకున్న సుధ ఎన్నో భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు.ఇష్టమైన పక్షులను చూడడంలో అదృష్టం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతుంది సుధ. ‘ఒకసారి ఈ అభయారణ్యానికి వచ్చిన ఒక పక్షి శాస్త్రవేత్త మలబార్ ట్రోగాన్ను చూడాలనుకున్నారు. అయితే ఆయన ఆ పక్షిని గుర్తించలేకపోయాడు. నిరాశతో ఆయన వెనక్కి వెళ్లిపోదామనుకుంటున్నప్పుడు నేను ఆ పక్షిని చూపిస్తాను అని చె΄్పాను. అదృష్టవశాత్తు ఆ పక్షి మాకు కనిపించింది. అప్పుడు మాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సుధ.లైసెన్స్ పొందిన మొదటి మహిళా ఫారెస్ట్ గైడ్లలో ఒకరైన సుధాచంద్రన్ శాంక్చరి వైల్డ్లైఫ్ సర్వీస్ అవార్డ్(2023)తో సహా ఎన్నో అవార్డులు అందుకుంది. -
ఆదివాసులకు చేయూతనిద్దాం!
ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము. అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ. అటవీ చట్టాలు అమలు చేయాలి!స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్ఆర్ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది. పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.పర్యావరణ హిత ఉపాధి అవకాశాలుసాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్మొబైల్ : pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్లు, ఓవర్ పాస్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సఫారీ విహారానికి కేరాఫ్ సుజన్ జవాయీ
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుజన్ జవాయీ.. రాజస్థాన్లోని జవాయీ అరణ్యంలో కేవలం పది విలాసవంతమైన గుడారాలు, ఒక రాయల్ టెంటెడ్ సూట్లో ఏర్పాటుచేసిన సఫారీ క్యాంప్. కానీ ఇక్కడ అందుబాటులో ఉండే సేవలు, అద్భుతమైన ప్రకృతి అందాల కారణంగా ఇది ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్లో ఇది ఒకటిగా స్థానం సంపాదించింది. జైసల్, అంజలీసింగ్ అనేవారు 2014లో పాలీ జిల్లాలో ఈ జంగిల్ క్యాంప్ను డిజైన్ చేశారు. పెద్ద సంఖ్యలో చిరుతపులులు సంచరించే సుందరమైన గడ్డి మైదానాలు, పచ్చదనం పులుముకున్న పర్వత శ్రేణులు, జవాయీ నది మధ్యలో ఇసుక తిన్నెలు కవర్ చేసేలా ఈ క్యాంపును డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో 60 వరకు చిరుతలు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల ఊసే లేని ఈ ప్రాంతంలో స్థానికులు చిరుతలతో జీవిస్తుంటారు. ఇక్కడ టెంట్ బయట కూర్చొని అధ్బుతమైన పరిసరాలను ఆస్వాదించవచ్చు. అడవుల్లో చేసే సాహసాలు, చిరు™è ల ట్రాకింగ్, పొదల్లో బ్రేక్ఫాస్ట్, రాత్రిపూట ఆరుబయట డిన్నర్ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ఆధునిక కాలంలో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి సుజన్ జవాయీ క్యాంప్ ఒక మంచి అవకాశం. టూర్లో భాగంగా సమీపంలోని గ్రామాలకూ తీసుకువెళ్లి అక్కడి గ్రామీణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, పరిశీలించే అవకాశం కూడా కలి్పస్తారు. చిరుతలను వాటి సహజ ఆవాసాల్లో చూసేందుకు ఉదయం, సాయంత్రం సఫారీ ఉంటుంది. కొండపైన టెంట్ ముందు కూర్చొని జువాయీ సరస్సు అందాలు, చుట్టుపక్కల పొలాలను సాగుచేసుకునే రైతులను చూస్తూ సూర్యాస్తమయాలను ఆస్వాదించవచ్చు. పెరగనున్న విదేశీ పర్యాటకులు ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్ల జాబితాలో సుజన్ జవాయీకి స్థానం లభించడంతో మరింత పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే టూరిస్ట్ డెస్టినీగా ఉన్న రాజస్థాన్కు ఇది మరింత ఊపు తీసుకువస్తుంది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడం ద్వారా దేశ పర్యాటక రంగానికి ఆదాయం పెరుగుతుంది. ఎలా చేరుకోవచ్చు?⇒ ఈ క్యాంప్ ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్లు, జోద్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 172 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ⇒ మోరీ బెరా రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అనుకూల సమయం⇒ అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య సందర్శనకు అత్యంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండి ఉష్ణోగ్రతలు 10 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.⇒ విడిది చేయాల్సిన సమయం: ఇక్కడి అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే కనీసం రెండు రాత్రులు, 3 పగళ్లు విడిది చేయాల్సి ఉంటుంది. 50 అత్యుత్తమ హోటల్స్లో స్థానంప్రపంచ వ్యాప్తంగా ఆరు ఖండాల్లో అత్యుత్తమ వసతులు కలిగిన 50 హోటల్స్లో సుజన్ జవాయీ హోటల్ స్థానం సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్ జాబితాను ‘50 బెస్’ అనే సంస్థ ఇటీవల లండన్లో ప్రకటించింది. ఈ జాబితాలో సుజన్ జవాయీ 43వ స్థానం సంపాదించింది. ట్రావెల్ జర్నలిస్ట్లు, ఆతిథ్యరంగ ప్రముఖులు, ట్రావెల్ స్పెషలిస్ట్లతో కూడిన 600 మంది గ్లోబల్ ఓటర్లు ఈ జాబితాను సెలెక్ట్ చేశారు. ఈ జాబితాలో థాయిలాండ్లోని చావో ఫ్రయా నదికి ఎదురుగా ఉన్న కాపెల్లా బ్యాంకాక్ అనే విలాసవంతమైన హోటల్ ప్రపంచంలో బెస్ట్ హోటల్గా నిలిచింది. ఇటలీలో లేక్ కోమోలోని 18 శతాబ్ధానికి చెందిన విల్లా పసలాక్వా రెండో స్థానంలో నిలిచింది. హాంకాంగ్కు చెందిన విలాసవంతమైన హోటల్ రోజ్వుడ్ హాంకాంగ్ మూడో స్థానంలో నిలిచింది. -
మన్యంలో మంచుతెరలు
సాక్షి, పాడేరు:మన్యంలో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందస్తు చలిగాలుల వ్యాప్తితో మన్యం వాసులు ఉదయం, సాయంత్రం చలిబారిన పడుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శీతాకాలం రాకముందే మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం 16.5 డిగ్రీలు, గురువారం 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 18 డిగ్రీలు, అరకులోయ కాఫీ బోర్డులో 18.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దట్టంగా పొగమంచుఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేకువజామున ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. పొగమంచు తీవ్రతతో వాహన చోదకులు పగటిపూట కూడా హెడ్లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడుపుతున్నారు. తుపాను ప్రభావంతోనే..తుపాను కారణంగా ఏజెన్సీలో చలిగాలులు అధికమయ్యాయి. నవంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా చలితీవ్రత అధికంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు పడిపోయే అవకాశం ఉంది. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం -
అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం
చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దుర్భరంగా బతుకులు..మహబూబ్నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.ఫలాల సేకరణకు హద్దులు..చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకం అంతంతే..అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.అటవీ ఉత్పత్తులు ఇవే..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఉప్పుకైనా అప్పాపూరే..చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.బీమా కల్పించాలిప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్ చెంచుపెంటపక్కా ఇళ్లు లేవులోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. – నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక ఉపాధి కల్పనకు చర్యలుచెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్«మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్రెడ్డి, ఇన్చార్జి ఐటీడీఏ పీవో -
అడవిలో ఆతిథ్యం
సాక్షి, అమరావతి: దట్టమైన అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చెట్లపై ఆవాసాలు... వాటిలో కూర్చుని పక్షుల కిలకిలా రావాలు వింటూ.... స్వచ్ఛమైన గాలి పీలుస్తూ... ఒక కప్పు కమ్మటి కాఫీ తాగితే ఎలా ఉంటుంది... ఒక్కసారి ఊహించుకుంటేనే మనసు పరవశించిపోతుంది కదా...! కచ్ఛితంగా అటువంటి అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు... ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తూ అడవినే నమ్ముకున్న గిరిజనులకు జీవనోపాధి కల్పించేందుకు రెండేళ్ల కిందట వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘అడవిలో ఆతిథ్యం’ పేరిట ఒక గొప్ప ప్రాజెక్ట్కు రూపకల్పన చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో రూ.5.50కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు ఇప్పుడు ‘కూటమి’ గ్రహణం పట్టింది. సాంకేతిక సమస్య సాకుతో గత మూడు నెలలుగా పనులు నిలిపివేసింది. విశాఖ–అరకు రహదారి చెంతనే ‘అడవిలో ఆతిథ్యం’ విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో చెంతనే అనంతగిరి మండలం మర్ధగుడ గ్రామానికి సమీపంలోని అడవిలో ఆతిథ్యం ఇచ్చేలా గత ప్రభుత్వం 2022లో ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సింహాద్రి ఎన్టీపీసీ సహకారం అందిస్తోంది. అటవీ శాఖ పర్యవేక్షణలో ఆర్అండ్బీ శాఖకు పనులు అప్పగించారు. కాఫీ తోటల మధ్య కాఫీ తాగేలా రూ.80 లక్షలతో కాఫీ హౌస్, రోడ్డు, మంచినీటి ట్యాంక్ నిర్మాణం పూర్తిచేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు వచ్చాక సాంకేతిక కారణాల పేరుతో మిగిలిన పనులు నిలిపివేశారు. ఇంకా రూ.4.70కోట్లతో పర్యాటకుల కోసం రెస్టారెంట్, కిచెన్, 16 కాటేజీలు, రిసెప్షన్, ఫర్నిచర్, విద్యుత్ కనెక్షన్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టేట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా మళ్లీ డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ విశేషాలు ఇవీ.. » ప్రకృతితో మమేకమయ్యే పర్యాటకులకు ‘జీవ వైవిధ్యం’ గురించి అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేక స్టడీ సెంటర్, సీతాకోక చిలుకల పార్క్, ఔషధ మొక్కల వనం, వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని కార్యాచరణ చేపట్టింది. » చెట్లపైనే హట్స్(నివాసాలు) వేసి వాటిలోనే పర్యాటకులు బస చేసేలా ఏర్పాటు చేయడం ద్వారా వారికి గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ను రూపొందించారు. » ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, ఆదాయాన్ని మర్ధగుడ వన సంరక్షణ సమితి(వీఎస్ఎస్)లో 80 మంది సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. » ఏజెన్సీలో లభించే పనస, చింతపండు తదితర అటవీ ఫల సాయంతోపాటు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయించేలా ప్రతిపాదించారు. కూటమి సర్కారు స్పందించి ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. -
నేపాల్ నుంచి ఏనుగుల గుంపు.. బీహర్ గ్రామాల్లో ఆందోళన
పశ్చిమ చంపారణ్: బీహార్లోని వాల్మీకి పులుల అభయారణ్యానికి సమప గ్రామాల్లో మళ్లీ అడవి ఏనుగుల సంచారం మొదలైంది. తాజాగా బిసాహా గ్రామ సమీపంలో ఆరు అడవి ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేపాల్లోని చిత్వాన్ నుంచి వస్తున్న అడవి ఏనుగులు పొలాల్లోకి చొరబడి వరి, చెరకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ఏనుగుల గుంపును చూసిన గ్రామస్తులు వాటిని తరిమికొట్టేందుకు టార్చ్లు వెలిగించి సందడి చేసి, వాటిని తరిమికొట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగులు సుమారు 10 ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన చెరకు, వరి పంటలు కళ్ల ముందే పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఏనుగుల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకినగర్ రేంజర్ రాజ్కుమార్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలపై సర్వే చేస్తున్నామని, నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. నేపాల్లోని చిత్వాన్ నుంచి ఏనుగులు ఇటువైపు తరలివస్తున్న మాట వాస్తవమేనని నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్లైఫ్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్ పేర్కొన్నారు. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి చొరబడకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా.. -
హైదరాబాద్కు ఆక్సిజన్ ఆగనున్నదా?
దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు. దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి. దీనితో పాటు ఈ రాడార్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమ స్యలు పొంచివున్నాయి. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే! ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.– మోతె రవికాంత్ ‘ సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అధ్యక్షులు -
ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాస భక్షక తోడేళ్లనన్నింటినీ పట్టుకున్నామని అటవీశాఖ అధికారులు చేసిన ప్రకటన మరువకముందే మరో తోడేలు ఓ చిన్నారిపై దాడి చేసింది. మహసీ ప్రాంతంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు ఇంకా ఆగడంలేదు. ఇంటి వరండాలోని గదిలో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారి అంజుపై తోడేలు దాడి చేసింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తోడేలు దాడికి దిగిన వెంటనే అంజు కేకలు వేయడంతో అది ఆ చిన్నారిని వదిలి పారిపోయింది. బాధితురాలిని ప్రథమ చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించాక ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం బహ్రాయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.రాత్రి 11.30 గంటల సమయంలో తోడేలు చిన్నారి అంజు మెడ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. అంజు కేకలు వేయడంతో తోడేలు బాలికను వదిలి పారిపోయింది. కాగా ఆ చిన్నారికి అయిన గాయాన్ని పరిశీలించిన బహ్రాయిచ్ డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ చిన్నారిపై తోడేలు దాడి చేసిందన్న కుటుంబ ఆరోపణను ఆయన ఖండించారు. ఇది కుక్క దాడిలా కనిపిస్తున్నదన్నారు.బహ్రాయిచ్ ప్రాంతంలో తోడేళ్లు ఇప్పటివరకూ పదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. తోడేళ్ల దాడుల్లో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహ్రాయిచ్కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రభుత్వ సహాయం అందించారు. నరమాంస భక్షక తోడేళ్లు కనిపించగానే చంపేయాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బహ్రాయిచ్ మహసీ ప్రాంతంలో ఆరు తోడేళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందులో ఐదింటిని తొలుత పట్టుకున్నారు. మిగిలిన ఆరో తోడేలును కూడా పట్టుకున్నామని అటవీ శాఖ ప్రకటించినంతలోనే మరో తోడేలు దాడి చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా -
గిరిజనుల ఆరోగ్యంపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారు లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసి స్తున్న ప్రజలు అరగంట లోపలే చేరుకునేలా ఐటీ డీఏల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్ ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీ ఏల పరిధిలో ఉన్న ఆసుపత్రులు, వైద్య సౌకర్యా లు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హైదరా బాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ప్రత్యేక వార్డులు.. బర్త్ వెయిటింగ్ రూంలు..ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ను మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, రోడ్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గర్భిణి, ఆమెతోపాటు వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం, మంచినీరు ఇతర వసతులు కల్పించాలన్నారు. 108 అంబులెన్స్లు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న ప్రిమిటివ్ ట్రైబ్స్ కోసం ఆదిలాబాద్ రిమ్స్ వంటి పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వారి భాషలో మాట్లాడగలిగే వైద్య సిబ్బందిని ఆ వార్డుల్లో నియమించాలని సూచించారు. -
అడవిని మింగిన సుడిగాలి
పచ్చని అడవులు సుడిగాలి బీభత్సానికి అతలాకుతలం అయ్యాయి. మహావృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి, నేలకొరిగాయి. ఇదివరకు ఎన్నడూ కనివిని ఎరుగని ఈ బీభత్సం ములుగు జిల్లా తాడ్వాయి– మేడారం అభయారణ్యంలో జరిగింది. దాదాపు టోర్నడోను తలపించే ఈ ఉత్పాతం ఎందుకు జరిగిందనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాస్త్రవేత్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ బీభత్సానికి కారణాలు కనుగొనేందుకు అధ్యయనం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఆగస్టు 31న సాయంత్రం సుమారు 4.30 నుంచి 7 గంటల సమయంలో మేడారం అటవీ ప్రాంతం ఈ ఆకస్మిక ఉపద్రవానికి గురైంది. హఠాత్తుగా సుడిగాలులు పెనువేగంతో చుట్టుముట్టాయి. సుడిగాలుల తాకిడికి దాదాపు 78 వేలకు పైగా భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకూలాయి. తాడ్వాయి–మేడారం అభయారణ్యంలోని 204.30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విధ్వంసం జరిగింది. నేలకొరిగిన వృక్షాల్లో మద్ది, పెద్దేగి, జిట్రేగి, నల్లమద్ది, ఎజిత, నారవేప, రావి, గుంపెన, పచ్చగంధం వంటి భారీ వృక్షాలు ఉన్నాయి. మరెన్నో ఔషధ వృక్షాలు ఉన్నాయి. ఇదివరకు ఎన్నోసార్లు భారీ వర్షాలు కురిసినా, ఇలాంటి సుడిగాలి బీభత్సం మాత్రం ఎన్నడూ సంభవించలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఈ అడవి చరిత్రలోనే కనివిని ఎరుగని బీభత్సమని వారంటున్నారు.కారణాలపై అన్వేషణఆకస్మిక సుడిగాలి బీభత్సానికి గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు జాతీయ స్థాయి సంస్థలైన ఐఎండీ, ఎన్ఆర్ఎస్సీ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెట్రియలాజికల్ డేటా వచ్చిన తర్వాత మరింత అధ్యయనం చేసేందుకు వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రకృతి విలయం ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త. ఇదివరకు 1996లో మధ్యప్రదేశ్లోని నౌరదేవి అభయారణ్యంలో చెలరేగిన గాలిదుమారానికి చెట్లు నేలకూలాయి. అయితే, తాడ్వాయి–మేడారం అభయారణ్యంలో జరిగినంత తీవ్రనష్టం ఇప్పటి వరకు ఇంకెక్కడా చోటు చేసుకోలేదని పర్యావరణవేత్త పురుషోత్తం చెబుతున్నారు. టోర్నడో తరహా బీభత్సంఒకేసారి వేలాది మహావృక్షాలను నేలకూల్చేసిన సుడిగాలిని టోర్నడో తరహా బీభత్సంగా అటవీ శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుడిగాలి బీభత్సాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షానికి తోడు దట్టమైన మేఘాలు, గాలి దగ్గరగా రావడంతో సుడిగాలి చెలరేగి ఇంతటి విధ్వంసానికి దారితీసి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, భారతదేశంలో టోర్నడోలు చెలరేగే అవకాశమే లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలోని హిమాలయాలు సహా పర్వతాలు, కొండలు సుడిగాలులు చెలరేగకుండా అడ్డుకుంటున్నాయని, అందువల్ల టోర్నడోలు రావని చెబుతున్నారు. పైగా, మన దేశంలోని వేడి, ఉక్కపోత వాతావరణంలో టోర్నడోలకు అవకాశమే ఉండదని అంటున్నారు. విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకునే ప్రదేశాల్లో టోర్నడోలు చెలరేగుతుంటాయి. ఉత్తర అమెరికా, అగ్నేయ–దక్షిణ అమెరికా, యూరోప్లోని పలు దేశాలు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో టోర్నడోలు అప్పుడప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయి. గడ్డం రాజిరెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్అడవి పునరుజ్జీవానికి మరో పదేళ్లుభారీ విధ్వంసానికి గురైన ఈ అడవి పునరుజ్జీవనానికి కనీసం మరో పదేళ్లు పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు చెబుతున్నారు. అడవిలో ఎలాంటి మొక్కలు నాటవద్దని, దానంతట అదే పునరుజ్జీవనం పొందుతుందని అంటున్నారు. కూలిన చెట్ల కొమ్మలను నరికివేసేందుకు, నిప్పు పెట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చని, అలాంటి చర్యలను నివారించాలని చెబుతున్నారు. ఏటూరునాగారం లేదా ములుగు ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఒక వాతావరణ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేంద్రమేదీ లేకపోవడం వల్లనే జరిగిన విధ్వంసాన్ని అటవీశాఖ ముందుగా తెలుసుకునేందుకు వీలు లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.అధ్యయనం తప్పనిసరిప్రకృతి కన్నెర్రచేస్తే దేవుడు కూడా కాపాడలేడనడానికి నిదర్శనం ఈ బీభత్సమని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ కె.వెంకట్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆకస్మిక ప్రకృతి బీభత్సాలపై తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెరిపిలేని వర్షం, ఈదురు గాలుల వల్ల టోర్నడో స్థాయి విధ్వంసం ఇక్కడి అడవిలో జరిగిందని, దేశంలో ఎక్కడా ఇదివరకు ఇలాంటి విధ్వంసం జరగలేదని అన్నారు. దాదాపు 78 వేల మహావృక్షాలు నేలకూలిపోయాయంటే, ఆ ప్రభావం పర్యావరణంపై చాలానే ఉంటుందని, ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ప్రత్యేక అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు.∙కె.వెంకట్రెడ్డి,ప్రొఫెసర్, ఎన్ఐటీ, వరంగల్ఇది టోర్నడో కాదుములుగు జిల్లా అటవీప్రాంతంలో వచ్చినది టోర్నడో కాదని పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కె.పురుషోత్తం అంటున్నారు. ఇక్కడ ఒకేసారి దట్టమైన మేఘాలు కమ్ముకుని, ఒకేసారి వర్షించడంతో కొమ్మలు బాగా తడిసిపోయి, విరిగిపోయాయని, గురుత్వాకర్షణ మూలంగా ఒకేచోట గాలి అంతా కేంద్రీకృతం కావడంతో ఈ అటవీ ప్రాంతం భారీ విధ్వంసాన్ని ఎదుర్కొందని ఆయన వివరించారు. దీనిని టోర్నడోగా కాదు, డౌన్బరస్ట్గా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సుడిగాలి చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించి ఉంటే, భారీ స్థాయిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించి ఉండేదని అన్నారు. ఈ బీభత్సాన్ని వాతావరణ మార్పుల కారణంగా తలెత్తిన ప్రకృతి ప్రకోపంగానే భావించాల్సి ఉంటుందని పురుషోత్తం అన్నారు. దట్టమైన అడవి కారణంగానే ఈ సుడిగాలి బీభత్సం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా ఉందని, విధ్వంసం తాకిడి మొత్తాన్ని అడవి భరించిందని తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలోనిది ఇసుక నేల కావడంతో భారీవృక్షాల వేళ్లు కూడా ఎక్కువ లోతుకు వెళ్లలేదని, అందుకే అవి కూలిపోయాయని వివరించారు. ∙కె.పురుషోత్తం, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక -
National Forest Martyrs Day: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈరోజు ప్రత్యక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబరు 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణముంది. 1730, సెప్టెంబర్ 11న రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. అప్పటి జోధ్పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దాని కోసం అతనికి ఖేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్లోని థార్ జిల్లాలోని ఖేజ్రీ గ్రామంలోని ఖేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను విష్ణోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.ఖేజ్రీ చెట్లు బిష్ణోయిల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్ణోయ్ మహిళ అమృతా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు ఖేజ్రీ చెట్లను కావలించుకుని వాటిని నరకకుండా అడ్డుకున్నారు.అమృతా దేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికేవారిని అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో బిష్ణోయిలు- మహారాజు సైనికుల మధ్య కొట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్ణోయిలు కన్నుమూశారు. -
బహ్రయిచ్లో పట్టుబడిన ఐదో తోడేలు
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్లో తోడేళ్ల భీభత్సం కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఐదో తోడేలును కూడా పట్టుకున్నారు. ఆ తోడేలును రెస్క్యూ షెల్టర్కు తరలిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ మొత్తం ఐదు నరమాంసభక్షక తోడేళ్లను పట్టుకోగా, ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది. అటవీశాఖ అధికారులు గాలిస్తున్న తోడేళ్లలో ఇదొకటని తెలుస్తోంది.గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు. #WATCH | Bahraich, Uttar Pradesh: The Forest Department captured the fifth wolf and is now taking it to a rescue shelter of the Forest Department.So far 5 wolves have been caught. One more wolf remains to be caught. pic.twitter.com/euCm2tKaAr— ANI (@ANI) September 10, 2024 -
ఏ చెట్లు.. ఎన్ని కూలాయి?
సాక్షి, హైదరాబాద్/ఎస్ఎస్తాడ్వాయి: ములుగు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడంపై అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా.. రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (204కుపైగా హెక్టార్లు)లో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్టుగా ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇందులో నల్లమద్ది, ఏరుమద్ది, తెల్లమద్ది, గుప్పెన, తునికి, టేకు, ఎగిశా, నేరేడు, మారేడు. గుంపెన, బొజ్జ, బూరుగ తదితర 50, 60 రకాల చెట్లు ఉన్నట్టుగా వెల్లడించినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో అంచనా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్టు తెలిసింది. కూలిపోయిన వాటిలో 50 నుంచి 70 ఏళ్లపైబడినవి భారీ వృక్షాల నుంచి ఐదు, పదేళ్ల వయసున్న చిన్న చెట్ల దాకా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో చెట్ల లెక్కలు తీస్తూ.. ములుగు జిల్లా మేడారం అడవుల్లో కూలిన చెట్ల లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. 30 హెక్టార్లకు ఒక బృందం చొప్పున పది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. వారు పూర్తిగా నేలకూలిన, సగానికి విరిగిన, కొమ్మలు విరిగిన చెట్లతోపాటు బాగున్నవాటిని కూడా గుర్తించి.. వాటి కొలతలు నమోదు చేస్తున్నారు. ఏయే రకాల చెట్లు ఎన్ని ఉన్నాయి, కూలినవి ఎన్ని అనేదీ లెక్కతీస్తున్నారు. రెండు రోజుల్లో సవివర నివేదికను సిద్ధం చేసి అటవీశాఖకు అందించనున్నట్టు తెలిసింది. కారణమేమిటనే దానిపై ఆరా.. కేవలం గంట, అరగంటలోనే అంత పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడానికి కారణాలపై.. వాతావరణశాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ)లను అటవీశాఖ సంప్రదించింది. మెట్రోలాజికల్, శాటిలైట్ డేటాలను విశ్లేషించి.. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది గుర్తించేందుకు ప్రయత్నించనున్నారు. మరోవైపు గురువారం అరణ్యభవన్ నుంచి జిల్లా అటవీ అధికారులతో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు తరహాలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా చెట్లకు నష్టం జరిగిందా అన్నది పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నాం..సుడిగాలుల కారణంగా అటవీ ప్రాంతానికి, చెట్లకు జరిగిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. దెబ్బతిన్న చోట అటవీ పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. ములుగులో అంత బీభత్సం జరగడానికి కారణాలు, ఇతర అంశాలపై లోతైన అధ్యయనం నిర్వహిస్తాం. – ఏలూసింగ్ మేరూ, పీసీసీఎఫ్ (వైల్డ్లైఫ్) -
నేలకొరిగిన లక్ష చెట్లు..
-
ఏటూరునాగారంలో నేలకొరిగిన దట్టమైన అడవి
-
ఒక హంతకుడి బాధితులు!
పదిహేనేళ్ల క్రితం మేము మా ఫార్మ్ హౌస్ లోకి మారే సమయానికి అక్కడే ఉన్న ఒక తాటి చెట్టుని గమనించాము. అది తన పక్కనే ఉన్నపెద్ద మర్రి చెట్టుతో సూర్యరశ్మి కోసం పోటీ పడుతూండటం చూసాము. పగటి పూట ఒక నల్లంచి పక్షి ఆ తాటి ఆకుల మధ్య కట్టుకున్న తన గూటిలోకి వెళ్ళివస్తూ కనిపించేది. సాయంత్రం ఎండిన తాటి ఆకుల మధ్య విశ్రమించిన గబ్బిలాలు ఆహారం కోసం బయటకు వస్తూ కనిపించేవి.తాటి కాయలు బాగా పండి, నలుపు రంగులోకి మారి మంచి వాసన వచ్చే సమయానికి పునుగు పిల్లులు వస్తుండేవి. అవి రాత్రి సమయాల్లో పండిన తాటి కాయలను తినడం కోసం చెట్లు ఎక్కి, ఎండిన తాటి ఆకులపైకి దూకుతూ శబ్దం చేసేవి. ఒకసారి తాటి కాయలను తిన్న తరువాత క్రింద పడేస్తుంటే, ఆ కాయలు నేలపై ఉండే ఎండుటాకులకు తగిలి రాత్రి నిశబ్దానికి భంగం కలిగించేవి. ఒక్కోసారి రెండు మూడు పునుగు పిల్లులు బిగ్గరగా అరుస్తూ పోట్లాడుకుంటుంటే ఆ శబ్దానికి నిద్రాభంగం అయిన నా భర్త రోమ్ నిద్రలేచి “నోర్మూసుకో” అని నా మీద అరిసి అటు తిరిగి చక్కగా గురకపెట్టేవాడు!మంచి ఎండాకాలంలో రాత్రి వేళలో వీచే గాలి, ఆ తాటి చెట్ల ఆకులను కదిలిస్తూ భయపెట్టే శబ్దాన్ని చేసేది. కొంతమంది ఈ శబ్దాలు దెయ్యాలు చేసేవని భ్రమపడుతుండేవారు. ఉదాహరణకు ఎప్పుడైనా అర్ధరాత్రి వేళల్లో మమ్మల్ని ఇంటి వద్ద దించటానికి వచ్చే టాక్సీ డ్రైవర్లు ఆ పరిసరాలను గమనించి "ఇలాంటి చోట్ల ఉండటానికి మీకు భయంగా లేదా!" అని ఎవరికి వినపడనంత మెల్లగా మమ్మల్నిఅడిగేవారు!కొన్నిదశాబ్దాల క్రితం కొన్ని తాటి చెట్లు వరుసగా మొలకెత్తి పెద్ద చెట్లు అయ్యాయి. కొన్నాళ్లకు ఒక మర్రి చెట్టు వాటిల్లోని ఒక తాటి చెట్టుపై మొలకెత్తి పరాన్నజీవిలా బ్రతకటం మొదలుపెట్టింది. తాటి చెట్లు ఎత్తుగా ఏపుగా పెరుగుతుంటే, వాటితో పాటు మర్రి చెట్టుకూడా తన కొమ్మలను వేర్లను విస్తరిస్తూ దారిలో అడ్డు ఉన్నవాటిని తినేసేడట్లు బలంగా ఎదగడం మొదలుపెట్టింది. కొన్నేళ్ళకు ఆ మర్రి చెట్టు ధాటికి దాదాపుగా అన్ని తాటి చెట్లు చనిపోగా ఒకే ఒక్క తాటి చెట్టు మిగిలింది!కొన్నేళ్లకు ఆ మిగిలిన ఒక్క తాటి చెట్టు కూడా తన తల భాగం వంగిపోయేసరికి, పాపం ఈ చెట్టు కూడా మర్రి చెట్టుతో చేసిన పోరాటంలో ఓడిపోయింది అని మాకు అర్ధమయింది! ఆఖరికి దాని తల భాగం రాలిపోయి కేవలం కాండం మాత్రం ఒకప్పటి చెట్టుకి గుర్తుగా మిగిలిపోయింది.ఇది జరిగిన కొద్ది నెలల్లోనే రెండు బంగారు వర్ణపు వడ్రంగి పిట్టలు చనిపోయిన తాటి చెట్టు మిగిలి ఉన్న కాండాన్ని గుర్తించి వాటిపై రంధ్రాలు చెయ్యడం మొదలుపెట్టాయి. చివరికి ఆ కాండం పైభాగాన ఒక రంధ్రం చేసి గూడు కట్టాయి. కొన్ని వారాలకు ఒక రోజు మాకు తొర్ర వద్ద తల్లితండ్రి తెచ్చే ఆహారం కోసం అసహనంతో ఎదురుచూస్తున్న రెండు వడ్రంగి పిట్టల పిల్లలు కనిపించాయి!పిల్లలు పెద్దవై ఎగిరిపోయాక ఆ వడ్రంగి పిట్టల కుటుంబం ఆ తొర్రను ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పుడప్పుడు కనిపిస్తుండేవి. ఒక రెండేళ్లకు మరికొన్ని పక్షులు ఆ తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్నాయి. కొన్ని రామచిలుకలు ఆ గూటి యజమానులైన వండ్రంగి పిట్టలను తరిమేసి ఆ తొర్రను పెద్దది చేసి, దానిని నివాసానికి అనుగుణంగా చేసుకునే సమయానికి రెండు గుడ్లగూబలు వచ్చి చేరాయి. ఆ రామ చిలుకలు కొన్నిరోజులపాటు ఆ తొర్ర వద్ద ఎంత గోల చేసినప్పటికీ ఆ గుడ్లగూబలు తొణకకుండా, బెణకకుండా ఆ తొర్రను ఆక్రమించేశాయి. చిలుకలు ఎంత కష్టపడ్డప్పటికీ ఆ గుడ్లగూబలను ఏమీ చేయలేకపోయాయి. ఆ గుడ్లగూబలు కాస్త సర్దుకునే సమయానికి ఒక నల్లంచి వచ్చి ఆ గుడ్లగూబలను ఎదో చేసి మొత్తానికి ఆ తొర్ర నుంచి తరిమేసింది. “హమ్మయ్య చివరికి ఒక పక్షి ఈ తొర్రను తన ఇల్లుగా చేసుకుంటుంది” అని మేము సంబరపడేలోపలే ఒక జత గోరింకలు వచ్చి ఆ నల్లంచిని తరిమేసి ఆ గూటిలో స్థిరపడిపోయాయి!ఆ గోరింకలు కొన్నేళ్లపాటు ఆ తాటి చెట్టు తొర్రలో నివసించాయి. పక్షులే కాకుండా ఆ చనిపోయిన చెట్టు కాండం మీద కొన్నిరకాల బల్లులు, కాళ్ళ జెర్రెలు నివసించేవి. కానీ ఒక రోజు ఆ చెట్టు కాండం పడిపోవడంతో ఆ జీవులన్నీ గూడు లేనివి అయిపోయాయి! అయినప్పటికీ ఆ క్రింద పడిపోయిన కాండం మట్టిలో కలిసిపోయే లోపల కొన్ని కప్పలకు, నీటి పాములకు, పెంకు పురుగులకు, చెద పురుగులకు, బల్లి గుడ్లకు ఆశ్రయమిచ్చింది. ఇదంతా జరిగేలోపల మన మర్రి చెట్టు మా వంటింటి వ్యర్ధాల నీటి వలన బలపడి ఐదారు రెట్లు పెరిగి మహా వృక్షమైపోయింది!--జానకి లెనిన్కృష్ణమూర్తి(ఫోటోలు)(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
అలా జైలుకు..ఇలా బెయిల్పై
బంజారాహిల్స్: పోలీసు ఆఫీసర్నని..ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నని..తనకు డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి రూ లక్షలు వసూలు చేయడమే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రెస్లో ఏకంగా సైఫాబాద్లోని అరణ్యభవన్ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్)లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్న నకిలీ అధికారిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్కు చెందిన కొనకంచి కిరణ్కుమార్ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. శ్రీనగర్కాలనీలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసే మహిళను పరిచయం చేసుకుని తాను పోలీసు ఇన్స్పెక్టర్నని, డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు తన తమ్ముడు గణేష్ కు ఉద్యోగం ఇప్పించాలని అతడికి రూ.11.50 లక్షలు ఇచి్చంది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా అతను అంతకముందే జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి అవతారమెత్తిన కిరణ్ గత గురువారం సైఫాబాద్లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీఐగా పని చేస్తున్నానని చెప్పుకుంటూ హల్చల్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డులు అతడిని నిలదీయగా గుట్టురట్టయ్యింది. డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏకంగా అరణ్యభవన్లోనే తిష్టవేసిన అతను బాధితులను అక్కడికే రమ్మని చెప్పినట్లు తేలింది.అధికారుల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం సైఫాబాద్ పోలీసులు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు పోలీసు, ఫారెస్ట్ శాఖ పేర్లు చెప్పుకుంటూ ఖాకీ డ్రెస్లో తిరుగుతూ ఆయా శాకల్లో ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైఫాబాద్, చర్లపల్లి, ఖమ్మం పోలీస్స్టేషన్ల పరిధిలోనూ అతడిపై ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా అలా జైలుకు వెళ్లడం..ఇలా బెయిల్పై రావడం..తిరిగి ఖాకీ డ్రెస్ చేసుకుని అవే డిపార్ట్మెంట్ల పేర్లు చెప్పి అమాయకులను మోసం చేయడం జరుగుతుంది. -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
కలెక్టర్, పీవో అడవిబాట
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. సమస్య ఏంటంటే...భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వహ్.. జగన్ స్కీమ్లు కాస్త స్కామ్లుగా!
అమరావతి, సాక్షి: అబద్దాలు, ఆరోపణలతో ఏపీలో మరో శ్వేతపత్రం విడుదలయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో భూములు, గనులు, అటవీ సంపద దోపిడీ జరిగిందంటూ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఒకపక్క.. వాస్తవాలు అన్నీ ఎస్టాబ్లిష్ చేయలేమంటూ, మరోపక్క.. గత పాలనపై బురద చల్లారు. ఇంతకాలం ఎల్లో పేపర్లో వచ్చిన వార్తలనే వైట్పేపర్గా ప్రొజెక్ట్ చేసి చూపించారాయన. కోర్టుకు వెళ్లి మరీ పేదల ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూసిన టీడీపీ.. ఏ కోర్టులోను అవినీతి అని నిరూపించలేకపోయింది. ఇప్పుడేమో అధికారం ఉందని పేదల ఇళ్ల పట్టాల భూములపై అవినీతి ముద్ర వేస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది. జగన్ హయాంలో పేదలకు భూములను పంచడం.. 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు సెంట్ భూమి కూడా పంచని చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు పెద్ద స్కామ్ అయ్యింది. పేదల ఇళ్ల పట్టాలకు భూములను సేకరించడం, రైతులకు పరిహారం చెల్లించడం, దళితులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది. దళితులకు భూములపై హక్కులు కల్పించడం, వాళ్లను యజమానులుగా చేయడం అది చంద్రబాబుకి స్వతహాగానే నచ్చనట్లుంది. అందుకే ఇందులోనూ స్కామ్ అంటూ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు ఇవాళ. ఇక.. గతంలో చంద్రబాబు ఇచ్చిన జీవో 340 ఆధారంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు జరిగింది. అయితే.. టీడీపీ ఆఫీస్ లకు స్థలాలు కేటాయిస్తే ఒప్పు అయ్యిందేమో. అదే వైఎస్సార్ సీపీ ఆఫీస్ లకు స్థలాలు ఇస్తే అవినీతంటూ సీఎం చంద్రబాబు బురద జల్లారు. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు భరత్కి చెందిన గీతం ఆక్రమణల్ని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా స్వాధీనం చేసుకుంది. అది మాత్రం ఇవాళ్టి శ్వేతపత్రంలోకి మాత్రం ఎక్కలేదు.పైగా 10 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాగేసుకున్నారంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఎక్కడి అసైన్డ్ భూములో మాత్రం శ్వేతపత్రంలో చెప్పలేదు. కొసమెరుపు: గతంలో చంద్రబాబు పాలనలో రైతుల భూములను చుక్కల భూముల జాబితాలో చేర్చేసింది. అయితే జగన్ పాలనలో నిజమైన యాజమానులకు వాటిని తిరిగి అప్పగించారు. అయితే ఆ చుక్కల భూములను నిజమైన యజమానులకు ఇవ్వడం పెద్ద స్కామ్ అంటూ సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతప్రతం విడుదల సందర్భంగా గగ్గోలు పెట్టారు. -
చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్
కొండలు ఎక్కడం, పెద్ద పెద్ద బండరాళ్లపై సేదదీరడం, క్యాంప్ ఫైర్, నైట్ ట్రెకింగ్తో అడవిలో తిరిగిన అనుభూతి కలగాలంటే నేచర్ క్యాంప్కు వెళ్లాల్సిందే. ప్రకృతి ఒడిలో ఓ రోజంతా సేదదీరి పరవసించిపోవచ్చు. ఇది ఎక్కడో దూరప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం కాదు. నగరానికి ఆనుకొని ఉన్న చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ఉండటంతో నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి బస నుంచి మరుసటి రోజు పార్క్ నుంచి బయటకు వచ్చే వరకూ ఎన్నో మరపురాని అనుభూతులను వెంటతీసుకెళ్లవచ్చు. రచ్చబండలో ముచ్చట్లు, ఫన్నీ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, బర్డ్స్ వాచింగ్ వంటివి ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తాయనడంలో సందేహం లేదు. – గచ్చిబౌలి చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) ఏర్పాటు చేసిన నేచర్ క్యాంపులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. గుట్టలపై వివిధ ఆకారాల్లో సహజ సిద్ధమైన రాక్ ఫార్మేషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీపం, బేబీ ఏనుగు, ఓల్డ్ మ్యాన్, తాబేలు, పిట్ట పక్కకు చూస్తున్నట్లు ఏర్పాడిన రాళ్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా ఈ రాళ్లపై జంతువుల పెయింటింగ్స్ ఔరా అనిపిస్తాయి. అడవి రారాజు సింహం, కుందేలు, ఏనుగు, ఖడ్గ మృగం, ఉడత, ఎలుగుబంటి బొమ్మలు సందర్శకుల మదిని దోచేస్తున్నాయి.బర్డ్స్ వాచ్టూర్.. మెయిన్ ట్రెక్ రోడ్డు నుంచి వెళుతూ సందర్శకులు బర్డ్స్ వాచ్ చేస్తారు. 45 రకాల పక్షులు అక్కడ ఉంటాయి. కనీసం 20 రకాలు సందర్శకులకు కనిపిస్తాయి. అరుదైన పక్షుల గురించి గైడ్ వివరిస్తారు.ట్రెకింగ్ రోడ్లు.. సముద్ర మట్టానికంటే ఎత్తులో నాలుగు ట్రెక్ రోడ్లు మూడున్నర కిలో మీటర్లు ఉన్నాయి. ట్రెక్ రోడ్డు–1 సముద్ర మట్టానికి 458 మీటర్లు, ట్రెక్ రోడ్డు–2 మట్టానికి 596 మీటర్లు, ట్రెక్ రోడ్డు–3 సముద్ర మట్టానికి 802 మీటర్లు, ట్రెక్ రోడ్డు–4 సముద్ర మట్టానికి 231 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుట్టలపై నడుస్తూ అక్కడక్కడ సేద దీరేందుకు పెద్ద పెద్ద బండరాళ్లు ఉంటాయి. కొద్ది సేపు ఫొటోలు దిగడం, పిచ్చాపాటి ముచ్చట్లు పెట్టుకుంటూ గడపవచ్చు.వీకెండ్ క్యాంప్ ఇలా..వీకెండ్లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు నేచర్ క్యాంప్కు చేరుకోవాలి. 4 గంటలకు సందర్శకులంతా మర్రి చెట్టు ర్చబండ వద్దకు చేరతారు. నేచర్క్యాంప్ యాక్టివిటీ, టైమింగ్, పార్క్ మ్యాప్పై బ్రీఫింగ్ చేస్తారు. విజిటర్స్ను రెండు గ్రూపులుగా విభజిస్తారు. స్నాక్స్ అందజేస్తారు.ఫన్నీ గేమ్స్..రెండు గ్రూపులు ఫన్నీ గేమ్స్తో పోటీ పడతాయి. నెంబర్ స్టాంపింగ్, రోలర్ కోస్టర్, మార్బుల్ గేమ్, ట్రాన్స్పోర్ట్ వాటర్, మిషన్ ఇంపాజిబుల్, డ్రామాటిక్స్, పేపర్ కప్, ట్రాన్స్పోర్ట్ తదితర గేమ్స్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి బస చేసేందుకు కపుల్ టెంట్, స్లీపింగ్ బెడ్స్, లాంతర్ వంటివి అందిస్తారు. టెంట్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తారు. టెంట్లో స్వచ్ఛమైన ప్రకృతి గాలిని ఆస్వాదించాల్సిందే. రాత్రిళ్లు వాష్రూమ్స్కు వెళ్లాలంటే గార్డ్స్ సహాయంతో వెళ్లాల్సి ఉంటుంది. ఒంటరిగా ఎవరినీ బయటకు వెళ్లవద్దని సూచిస్తారు. రాత్రి 8.30 గంటలకు వెజ్ తాలి(భోజనం) అందజేస్తారు.టికెట్ వివరాలు...నేచర్ క్యాంప్కు వెళ్లేవారు పెద్దలకు రూ.1800, 12 సంవత్సరాల పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాల కోసం 94935 49399, 93463 64583 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.నైట్ ట్రెకింగ్..సందర్శకులంతా కలిసి గైడ్ సమక్షంలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నైట్ ట్రెకింగ్ నిర్వహిస్తారు. లాంతర్లు పట్టుకొని దీపం రాక్ మీదుగా వెళతారు. రాత్రి సమయంలో ప్రకృతి ఒడిలో నడవడం, అడవి ఎలా ఉంటుందో చూడటం మరపురాని అనుభూతి. గంట తరువాత తిరిగొస్తారు. బస చోట క్యాంప్ ఫైర్ ఉంటుంది. అంత్యాక్షరి, రోల్ ప్లే, మ్యూజికల్ చైర్స్తో సరదాగా గడుపుతారు. ఆదివారం ఉదయం 5.45కు మళ్లీ ట్రెక్ రూట్–4లో పెద్ద చెరువు వరకూ ట్రెకింగ్కు వెళ్లి ఉదయం 7.30 గంటలకు తిరిగొస్తారు. మర్రిచెట్టు రచ్చబండకు చేరుకుంటారు. టిఫిన్ చేసిన తరువాత అడ్వెంచర్ గేమ్స్ అడతారు. వ్యాలీ క్రాసింగ్, బర్మా బ్రిడ్జి, వైన్ ట్రావెల్స్ తదితర ఆటలతో సేదదీరుతారు. ఉదయం 10 గంటలకు క్యాంప్ ముగుస్తుంది. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. కుటుంబమంతా రాత్రి అడవిలోనే..
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకానికి భయపడి ఓ కుటుంబం రాత్రంతా అడవిలో తలదాచుకుంది. రాత్రివేళలో క్రూర మృగాలు, పాములు, ఇతర విష పురుగుల మధ్య అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రజాస్వామ్య దేశ చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడైనా కన్నామా? విన్నామా?.. కానీ ఇది పచ్చి నిజం. సోమల మండలం కమ్మపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం దీనగాథ ఇది. శుక్రవారం టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటిపై దాడి చేశారు. సుబ్రమణ్యంరెడ్డిని బయటకు ఈడ్చుకు వచ్చి తీవ్రంగా కొట్టారు. రకరకాలుగా హింసించారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలన్నింటినీ తరలించుకుపోయారు. బట్టీ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సుబ్రమణ్యంరెడ్డి పొలంలో పండించిన టమాటా కోతకొచ్చింది. ఈ పంటను మార్కెట్కు తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయన పశువులకు గడ్డి కూడా వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు తెలిపినా స్పందన లేకపోవడంతో సుబ్రమణ్యం రెడ్డి కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీపంలోని అడవిలోకి పారిపోయింది. శుక్రవారం రాత్రంతా అడవిలోనే గడిపింది. శనివారం కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి వేరే ప్రాంతంలో ఉంచారు. ఆయన తమను శరణుకోరి.. టీడీపీలో చేరితే క్షమించి వదిలేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. లేదంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. టీడీపీ నేతల తీరుపై పుంగనూరు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు పనిచేసే వారని, ఇటువంటి అరాచకం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాడులుటీడీపీ నేతలు వారిపై కేసులు రాకుండా బెంగళూరు నుంచి గూండాలను తెచ్చి దాడులు చేయిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో ఎవరెవరు వైఎస్సార్సీపీకి పనిచేశారో గుర్తించి మరీ దాడులు చేయిస్తున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారి గూండాల దౌర్జన్యాలు, దాడులతో చిత్తూరు జిల్లా అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఊర్లొదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. ఇప్పటివరకు 55 కుటుంబాలు స్వగ్రామాలను వీడి వెళ్లాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురం గ్రామాల నుంచి 75 కుటుంబాలను టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. వీరంతా తమను శరణు కోరి, టీడీపీలో చేరితేనే వారిని, వారి ఆస్తులను వదిలేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.రక్షణ కోరినా స్పందించని పోలీసులుటీడీపీ కూటమి దాడులు, దౌర్జన్యాలపై అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన సమయంలో ఇరువురి మధ్య సంభాషణలను బాధితులు రికార్డు చేసుకున్నారు. ఆ రికార్డులను వింటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులేనా అలా మాట్లాడేది అనిపించకమానదు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల దౌర్జన్యాలు, దాడులు ఆగకపోవడం, పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. -
అక్కడ దహనమైంది ఏమిటో!
యడ్లపాడు: కొండవీడు రిజర్వు ఫారెస్టు కొండల సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారన్న వార్త మండలంలో కలకలం రేపింది. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేట గ్రామంలోని సచివాలయం వెనుకవైపు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని శుక్రవారం పోలీసులకు గొర్రెల కాపరులు సమాచారం ఇచ్చారు. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ పి శ్రీనివాసరెడ్డి, యడ్లపాడు ఎస్ఐ జె శామ్యూల్ రాజీవ్కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గ్రామ సచివాలయం వెనుక అటవీ ప్రాంతంలోని పూలలొద్ది ఆంజనేయస్వామి గుడి కొండవీడు కొండల నడుమ అనుమానాస్పదంగా కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి. సుమారు 4 అడుగుల వైశాల్యంలో కాల్చిన బూడిద, అందులో బొగిలిపోయిన ఎముకలు, ఘటనా స్థలికి కొద్దిదూరంలో ఓ పుర్రె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లా అధికారులకు సమాచారం అందించి క్లూస్ టీంను పిలిపించారు. సంఘటనా స్థలంలోని పలు ఆధారాలను క్లూస్టీం అధికారులు సేకరించారు. వీఆర్వోల ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. సీఐ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెంఘీజ్ఖాన్పేటకు చెందిన గొర్రెలకాపరులు ఇచ్చిన సమాచారం మేరకు తాము శుక్రవారం సంఘటనా స్థలాన్ని చేరుకున్నామన్నారు. సంఘటనా స్థలంలో బాగా కాల్చడంతో కనీస ఆనవాళ్లను గుర్తించ లేకపోతున్నామన్నారు. దగ్ధమైన సంఘటన మాత్రం కనీసం మూడు రోజులు కిందట జరిగి ఉంటుందని భావిస్తున్నామని వివరించారు. అలాగే ఎముకలు చిన్నవిగా అందులోనూ నల్లగా మారిపోయి ఉండటంతో ఇవి మనిíÙవా లేక ఏదైన వన్య ప్రాణిదా అన్న విషయాన్ని తేల్చలేకపోతున్నామన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆ స్థాయిలో దగ్ధం చేయడానికి కారణాలు ఏమిటో తెలియాలంటే ముందుగా క్లూస్ టీం సేకరించిన ఫొరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఇచ్చిన ఆధారాలతో కేసు దర్యాప్తు ముందుకు పోతుందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమన్నారు. -
కీకారణ్యంలో.. మాయన్ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే?
దట్టమైన కీకారణ్యంలో పురాతన నగరం బయటపడింది. మెక్సికోలోని బాలంకు అభయారణ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రపాలజీ అండ్ హిస్టరీ శాస్త్రవేత్తలు అన్వేషణ జరుపుతుండగా, ఈ పురాతన మాయన్ నాగరికతకు చెందిన నగర శిథిలాలు బయటపడ్డాయి.ఇక్కడ ‘ఓకోమ్టున్’ అనే పురాతన శిలా స్థూపాలు, భారీ రాతి భవంతులు కనిపించాయి. చుట్టూ దట్టంగా భారీ వృక్షాలతో కూడిన అడవి ఉండటంతో ఈ నగరం ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించలేదు. ఇది క్రీస్తుశకం 250–800 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ నగరం 123 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 50 అడుగుల ఎత్తున పిరమిడ్ నిర్మాణాలు, నివాస భవనాలు, బహిరంగ వేదికలు వంటివి ఉన్నాయి. ఈ వేదికలను మతపరమైన వేడుకల కోసం నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇవి చదవండి: వానల్లో వార్మ్గా, బ్రైట్గా.. ఉండాలంటే ఇలా చేయండి.. -
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
-
కౌండిన్య.. గజరాజ్యం
ఎటుచూసినా ఆకాశాన్నంటే పచ్చదనం.. జలజలపారే సెలయేళ్లు.. అడుగడుగునా నీటిగుంటలు.. జీవాలకు సమృద్ధిగా ఆహారం.. ఇది కౌండిన్య. 353 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన దట్టమైన అడవి. అపారమైన జంతుసంపదకు ఆవాస కేంద్రం. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం మల్లప్పకొండ దగ్గర నుంచి పలమనేరులో కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్న ఈ కౌండిన్య అటవీ ప్రాంతం గజరాజుల సామ్రాజ్యం.సాక్షి, చిత్తూరు: కౌండిన్య అటవీప్రాంతం వివిధ రకాల జంతుసంపదకు నిలయం. ఈ అడవిలో చిరుతపులి, తోడేలు, నక్క, అడవి రేసుకుక్క, దేవాంగపిల్లి, నక్షత్ర తాబేలు, అడవిపిల్లి, ఎలుగుబంటి, హైనా, జింక, దుప్పి, తోడేలు, ఎద్దు, కుందేళ్లు ఎక్కువగా ఉన్నాయి. పక్షి జాతుల్లో కోకిల, రామచిలుక, నెమలి, పావురాలు, పిచ్చుకలు, కొంగలు ఉన్నాయి. సర్పాల్లో కొండచిలువ, కట్లపాము, నల్లత్రాచు, రక్తపింజరిలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం ఏనుగుల సంఖ్య ఎక్కువ. దట్టమైన ఈ అడవిలో ఏనుగుల సంతతి ఏటేటా వృద్ధిచెందుతోంది. గుంపులుగుంపులుగా అడవిలో సంచరించే ఇవి అడపాదడపా గ్రామాల్లోను స్వైరవిహారం చేస్తున్నాయి. మూడురోజులు ఏనుగుల గణనఏటా మాదిరే ఈ సంవత్సరం మే నెలలో కూడా దక్షిణ భారతదేశంలో ఏనుగులను లెక్కించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకేసారి మూడురోజులు ఈ గణన నిర్వహించారు. మన రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల్ని లెక్కించారు. జిల్లా అటవీప్రాంతంలోని 66 బీట్లలో ఏనుగుల్ని అటవీ సిబ్బంది లెక్కపెట్టారు. తొలిరోజు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్జాగ్ విధానంలో లెక్కించారు.రెండోరోజు కూడా అదే పద్ధతి కొనసాగించారు. చివరిరోజున నీటికుంటలు, చెరువుల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిఘా వేసి ఏనుగుల్ని లెక్కపెట్టారు. అడుగుజాడలు, మలమూత్ర విసర్జన, చెట్లను తోసివేయడం, సమూహం, పరిణామం ఆధారంగా వాటిసంఖ్యను లెక్కించారు. కనిపించిన ఏనుగుల ఫొటోలు తీసి, లింగనిర్ధారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు ఏనుగులు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.అందులో కౌండిన్య అటవీప్రాంతంలోనే 100 నుంచి 110 వరకు ఉంటాయని అంచనా. జిల్లాలో చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో సర్వే జరుగుతోంది. గత సంవత్సరం కంటే 10 నుంచి 20 వరకు ఏనుగులు పెరిగి ఉంటాయని భావిస్తున్నారు. కౌండిన్యలో 15 వరకు పిల్ల ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. పిల్ల ఏనుగులు ఉన్నాయంటే వాటి సంతతి బాగా పెరుగుతోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు ఈ లెక్కల వివరాలను కేంద్ర అటవీశాఖకు నివేదిస్తారు. కేంద్ర అటవీశాఖ ఏనుగుల సంఖ్యను ప్రకటిస్తుంది.ఏనుగుల సంచారం ఎక్కువ ఏటా ఏనుగుల సంఖ్యపై సర్వే చేస్తున్నాం. ఈ ఏడాది టెక్నికల్గా సర్వే నిర్వహించాం. ఫ్లగ్ మార్క్స్ ఆధారంగా బ్లాగ్ సర్వే చేశాం. వివరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేశారు. తుది నివేదికను కేంద్ర అటవీశాఖకు అందజేశాం. కుప్పం, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. – చైతన్యకుమార్రెడ్డి, డీఎఫ్వో -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
హిమాచల్ అడవుల్లోనూ కార్చిచ్చు
ఉత్తరాఖండ్లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్లోని అడవుల్లోనూ కార్చిర్చు కనిపిస్తోంది. సోలన్, మండి, కాంగ్రాలో కోట్లాది రూపాయల విలువైన అటవీ సంపద బూడిదగా మారింది. తాజాగా హిమాచల్లోని మండీ జిల్లా ధరంపూర్ మండప్ గ్రామ అడవుల్లోకి మంటలు వ్యాపించాయి. సోలన్ సమీపంలోని అడవిని కూడా మంటలు చుట్టుముట్టాయి. ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం సోలన్ సమీపంలోని కాలాఘాట్లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. అడవుల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు స్థానికులను సహాయం కోసం అభ్యర్థించారు. ఎనిమిది గంటలపాటు ఎదురు చూసినా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోలేదు.అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ చాలాసేపటి నుంచి తాము మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని, స్థానికుల సహాయం కూడా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పుతున్నారన్నారు. -
ఉత్తరాఖండ్ నిర్లక్ష్యం
నిర్లక్ష్యం మంటల్లో నిత్యం దహించుకుపోతున్న ఉత్తరాఖండ్ అడవులపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టిసారించటం, సంజాయిషీ కోరడం హర్షించదగిన పరిణామం. ఈ మంటల్లో చిక్కుకుని ఇంతవరకూ అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర జీవరాశులకు కలిగిన నష్టమెంతో తెలియదు. హిమాలయ సానువుల్లో కొలువుదీరి పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ అడవులపై అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణపరంగా ఉత్తరాఖండ్లో, పొరుగునున్న హిమాచల్ప్రదేశ్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ రెండుచోట్లా శీతాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన గాలులు వీస్తాయి. అంతకుముందు విపరీతంగా మంచుకురుస్తుంది. దేవదారు వృక్షాలనుంచి రాలిపడిన ఆకులతో కొండ ప్రాంతాలన్నీ నిండిపోతాయి. ఈ ఆకులు మామూలుగా అయితే చిన్న నిప్పురవ్వ తగిలినా భగ్గునమండుతాయి. కానీ ఆ సమయంలో పడే వర్షాలతో అటవీప్రాంతమంతా చిత్తడిగా మారిపోతుంది. వేసవిలో కూడా ఇదే స్థితి కొనసాగుతుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇదంతా తారుమారైంది. నవంబర్ నుంచే అడవుల్లో అగ్నికీలలు కనబడ్డాయి. ఈ పరిణామాన్ని అంచనా వేయటం పెద్ద కష్టం కాదు. కొండ ప్రాంతమంతా రాలిన ఆకులతో నిండినప్పుడు, ఎండలు మండుతున్నప్పుడు ఏం జరుగుతుందో గత అనుభవాలే చెబుతున్నాయి. దీనికితోడు పొగరాయుళ్లు నిర్లక్ష్యంగా పడేసే చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి కూడా ప్రమాదాలు తెస్తున్నాయి. మాఫియాల బెడద సరేసరి. అటవీ భూములు అందుబాటులోకొస్తే కోట్లు గడించవచ్చని ఉద్దేశపూర్వకంగా అడవుల్ని తగలబెడుతుంటారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉంటాయి. ఇక కొండప్రాంతాలకు సమీపంలో పంట వ్యర్థాలను కళ్లాల్లోనే తగలబెట్టే అలవాటు అధికం. ఇది కూడా అడవులు అంటుకోవటానికి కారణమవుతోంది. ఇలాంటివారినుంచి అడవుల్ని కాపాడటానికీ, నిప్పు జాడ కనుక్కుని వెనువెంటనే ఆర్పడానికీ కొండలపై గార్డులు గస్తీ కాస్తుంటారు. కానీ వారంతా ఎన్నికల విధులు నిర్వర్తించటానికి తరలిపోయారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దాఖలా లేదు. అందువల్లే ఈ దఫా ఇంతవరకూ 1,400 హెక్టార్ల అడవి తగలబడిందని ఒక అంచనా. గత నెలనుంచి చూసుకున్నా అడవులు అంటుకున్న ఉదంతాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లతో పోలిస్తే ఉత్తరాఖండ్లోనే అధికమని ఈమధ్య ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) డేటా తెలిపింది. ఉత్తరాఖండ్లో దాదాపు 24,305 చదరపు కిలోమీటర్లమేర అడవులున్నాయి. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇది 44.5 శాతం. ఇంత విస్తారంగా అడవులున్న రాష్ట్రం వాటిని ప్రాణప్రదంగా చూసుకోవద్దా? కొండలపై రాలిపడే ఆకుల్ని ఏరేందుకూ, తామరతంపరగా పెరిగే గడ్డి మొక్కల్ని తొలగించటానికీ, అగ్ని ప్రమాదాల నివారణకూ మనుషుల్ని నియమించాలి. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 9 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ చిత్రమేమంటే ప్రభుత్వం కేవలం రూ. 3.15 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. మంటల జాడ లేకుండా చూడాలే తప్ప, ఒకసారి అంటుకుంటే అదుపు చేయటం అంత సులభం కాదు. ఈ నెల మొదట్లో అడవులు తగలబడుతున్నప్పుడు వైమానిక దళ హెలికాప్టర్లు రంగంలోకి దిగి వేలాది లీటర్ల నీటిని వెదజల్లాయి.ఈ చర్య కొంతమేర ఉపయోగపడినా అనుకోకుండా కురిసిన భారీ వర్షంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే అంతా తలకిందులవుతుంది. తమకున్న అడవుల్లో కేవలం 0.1 శాతం ప్రాంతంలో మాత్రమే మంటల బెడద ఉన్నదని ఉత్తరాఖండ్ దాఖలుచేసిన అఫిడవిట్ తెలిపింది. ఎంత శాతమని కాక, ఏమేరకు ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామో, వాటి లోటుపాట్లేమిటో అధ్యయనం చేస్తున్న దాఖలా లేదు. ఎంత ప్రాంతంలో వృక్షాలు దెబ్బతిన్నాయో లెక్కలు చెబుతున్నారు. కానీ పర్యావరణానికి కలిగే నష్టం ఎవరూ గమనించటం లేదు. అగ్ని ప్రమాదాలవల్ల వాతావరణంలో కార్బన్డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. నేలల్లో తేమ తగ్గిపోతుంది. పోషకాలు కూడా కనుమరుగవుతాయి. వీటికి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందో లేదో తెలియదు. నిజానికి ఇలాంటి డేటాతో స్థానిక ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే, అడవులు తగలబడటంవల్ల భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఏర్పడే అవకాశమున్నదో చెబితే వారే స్వచ్ఛంద సైనికుల్లా ముందుకొస్తారు. అడవులను కాపాడతారు. మాఫియాలను కట్టడి చేసేందుకు సైతం సంసిద్ధులవుతారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైన చొరవేది?ఉత్తరాఖండ్ అడవులు విశిష్ఠమైనవి. అక్కడ రెండు టైగర్ రిజర్వ్లున్నాయి. పక్షుల సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇక్కడి గాలులు మోసుకెళ్లే ఆక్సిజన్ కారణంగానే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరం ఆ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఇక్కడి వృక్షాలవల్ల హిమాలయాల్లోని మంచుపర్వతాలు ఒక క్రమపద్ధతిలో కరిగి జీవనదులు పారుతున్నాయి. ఇంతటి అపురూపమైన అడవులు మానవ నిర్లక్ష్యం కారణంగా నాశనం కావటం అత్యంత విషాదకరం.ఎంత ప్రాంతమని కాదు...అడవిలోని ఒక్క వృక్షమైనా మన నిర్లక్ష్యంవల్ల, తప్పిదాలవల్ల నేలకొరగరాదన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తే, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటే అడవులు కళకళలాడతాయి. మనుషులు మాత్రమే కాదు...సకల జీవరాశులూ సురక్షితంగా ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంవల్ల ఇదంతా నెరవేరితే అంతకన్నా కావాల్సిందేముంది? -
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అల్మోరా, బాగేశ్వర్ సహా పలు జిల్లాల్లో అడవులు తగలబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు లేఖ రాశారు. అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు నిరంతం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో కోరారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ఇప్పటివరకూ ఉత్తరాఖండ్ అడవులలో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్ల అటవీప్రాంతం ప్రభావితమైంది. రాష్ట్రంలో అడవుల్లోని కార్చిర్చు అదుపు చేయడం గురించి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అడవుల్లో చెలరేగున్న మంటల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. అలాగే అడవుల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బరాహత్ శ్రేణి అడవుల్లో గురువారం సాయంత్రం వ్యాపించిన మంటలు ఇప్పటి వరకూ పూర్తిగా అదుపులోకి రాలేదు. తాజాగా ముఖెంరేంజ్లోని డాంగ్, పోఖ్రీ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవితో పాటు దుండా రేంజ్లోని చామ్కోట్, దిల్సౌద్ ప్రాంతంలోని అడవులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ధరాసు పరిధిలోని ఫేడీ, సిల్క్యారాకు ఆనుకుని ఉన్న అడవులు కూడా తగడలబడుతున్నాయి. అటవీ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఉత్తరకాశీ అటవీ డివిజన్లో 19.5 హెక్టార్ల అడవి మంటల కారణంగా కాలి బూడిదైంది. -
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
ఉత్తరాఖండ్లోని కుమావోన్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.బాంబీ బకెట్ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్తో మెటల్ ఫ్రేమ్తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
అగ్గి రాజుకుంటోంది
సాక్షి, హైదరాబాద్ : అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 1,500లకు పైగా అగ్నిప్రమాదాలు రిపోర్ట్ కాగా నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మూడోవంతు దాకా అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు /ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో (ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా) మూడో వంతు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అగ్ని ప్రమాదా లకు సంబంధించి పదిహేను ఏళ్లుగా సేకరించిన సమాచారం, డేటా ఆధారంగా చేసిన విశ్లేషణల్లో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. ♦ తెలంగాణవ్యాప్తంగా మూడువేలకు పైగా ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ప్రతీ ఫారెస్ట్ బీట్లో ఫైర్బ్లోయర్లు, రేక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్లు వంటివి అందుబాటులో ఉండాలి. అయితే ప్రస్తుతం 550 ఫైర్బ్లోయర్లు ఉండగా వాటిలో పదిశాతం వరకు మరమ్మతులు చేయాల్సి ఉందని సమచారం. ♦ వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశమున్న రోజులలో (పీక్ సీజన్లో) కేవలం 95 ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిని బట్టి అడవుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు సంబంధించి అధికా రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అటవీశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. ♦ ములుగు, అమ్రాబాద్, ఇతర అటవీ ప్రాంతాల్లో కావాలనే అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్న వారిని గురించి వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వాటికి పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు అత్యధికంగా మానవ తప్పిదాలతోనే ఈ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అయితే ఇవి చిన్న చిన్నవే కావడంతో ఎక్కువ నష్టం జరగకుండా ఆర్పేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ‘ఫారెస్ట్ఫైర్స్’ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోందని, ఈ మంటల అదుపునకు వెంటనే చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21,739 కి.మీ పరిధిలో ఫైర్లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకుని 11వేల కి.మీలలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరణ్యభవన్లో రాష్ట్రస్థాయిలో ఫైర్ మానిటరింగ్, కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షిస్తూ ,ఫైర్ అలర్ట్స్ కోసం టోల్ఫ్రీ నంబరు, వాట్సాప్నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అగ్గి ప్రమాదాలకు అవకాశం ఇలా.. ♦ రాష్ట్రంలో మొత్తం 53 అటవీ డివజన్లు ఉండగా, వాటిలో 23 దాకా హై–ఫైర్ ప్రోన్గా గుర్తించారు ♦ 1,208 ఫారెస్ట్ రేంజ్లకు గాను 45 రేంజ్లలో హై–ప్రోన్ రేంజేస్గా ఉన్నాయి ♦ పదివేల ఫారెస్ట్ కంపార్ట్ మెంట్లు (ఒక్కోటి 250 నుంచి 500 హెక్టార్లు కవర్ చేస్తుంది) ఉన్నాయి ♦ వీటిలో 1,120 కంపార్ట్మెంట్ల (హై–ఫైర్ ప్రోన్) దాకా పెద్ద అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 1,700లదాకా మధ్యంతరంగా (మీడియం–ఫైర్ప్రోన్) అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 4,260 దాకా అటవీ సమీప గ్రామాల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ♦ వీటిలో 1,250లకుపైగానివాస ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చాన్స్. -
ఎండల ఎఫెక్ట్.. నీటి కోసం వచ్చి గుంటలో పడ్డ ఏనుగు
చెన్నై: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల గొంతులు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎండల దెబ్బకు అడవుల్లో ఉండే సహజ నీటి వనరులన్నీ ఎండిపోయి అక్కడ నివసించే వన్యప్రాణులు దాహంతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని సత్యమంగళం అడవులపై కూడా ఎండల ఎఫెక్ట్ పడింది. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్న పళనిచామి గుడి వద్దకు వచ్చింది. నీటి కోసం వెతుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న గుంటలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించారు. ఏనుగు వద్దకు ఒక వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలో మెడికల్ టీమ్ను పంపించారు. ఏనుగును గుంటలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదీ చదవండి.. దోమలు బాబోయ్ దోమలు -
అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం
సాక్షి, నాగర్కర్నూల్: అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చెంచులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న తాము బయటకు వెళ్లి బతకలేమని, తాము అడవిలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అడవుల్లో పులులకు ఆటంకం లేకుండా జనసంచారాన్ని తగ్గించడంతోపాటు మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే పేరిట నట్టడవిలోని చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న సార్లపల్లి చెంచుపెంట వాసులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లా డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ నుంచి రీలొకేషన్కు అనుమతి రావడంతో ఈ నెల 5న గ్రామస్తుల నుంచి ఒప్పందాలపై సంతకాల సేకరణ ప్రారంభించింది. రీలొకేషన్లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, లబ్ధిదారుల మధ్య ఎంఓయూ కోసం అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2–3 నెలల్లోనే సార్లపల్లి వాసుల రీలొకేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సార్లపల్లి తర్వాత విడతల వారీగా కుడిచింతలబైల్, కొల్లంపెంట, కొమ్మెనపెంట వాసులను సైతం అడవి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను చెంచులు వ్యతిరేకిస్తున్నారు. తమను అడవి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మల్లాపూర్ పెంటలోని చెంచుల ఆవాసాలు ఎనీ్టసీఏ ద్వారా పునరావాస ప్యాకేజీ.. అయినా చెంచులు విముఖం అడవి లోపల నివసిస్తున్న వారిని బయటకు తరలిస్తే ఒక్కో కుటుంబానికి ఎన్టీసీఏ ద్వారా రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనుంది. వీరి పునరావాసం కోసం నాగర్కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద అటవీశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. రూ.15 లక్షల ప్యాకేజీ వద్దనుకుంటే బాచారం వద్ద 220 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం, జీవనోపాధి కోసం 5 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేస్తారు. సార్లపల్లిలో 269 కుటుంబాలు ఉండగా, వాటిలో 83 కుటుంబాలే చెంచులు. మిగతా కుటుంబాల్లో ఇతర వర్గాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎనీ్టసీఏ ప్యాకేజీకి ఇప్పటివరకు 186 కుటుంబాలు ఒప్పుకోగా వాటిలో చెంచు కుటుంబాలు ఆరే ఉన్నాయి. అడవి నుంచి బయటకు తరలింపునకు మెజార్టీ శాతం చెంచు కుటుంబాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలకు దూరం.. నల్లమల అటవీప్రాంతంలో మొత్తం 88 ఆవాసాల్లో చెంచులు నివసిస్తున్నారు. వీటిలో 20 ఆవాసాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్నాయి. అడవిలో అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడి చెంచులు కనీస మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదు. అడవిలో ఉన్న అప్పాపూర్ గ్రామ పంచాయతీ మినహా మరెక్కడా చెంచుపెంటల్లో కనీసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల లేవు. మేం అడవిలోనే ఉంటాం.. బయటకు పోలేం ఏళ్లుగా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మేం బయటకు పోయి జీవించలేం. మా వల్ల వన్యప్రాణులు, పులులకు ఎలాంటి హాని లేదు. ఇప్పుడు కూడా ఉండదు. దయచేసి మమ్మల్ని అడవి నుంచి విడదీయద్దు. మేమంతా అడవిలోనే ఉంటాం. –చిగుర్ల లింగమ్మ, చెంచు మహిళ, సార్లపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా మమ్మల్ని ఆగం చేయొద్దు.. అడవిలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఆగం చేయద్దు. మేం బయటి ప్రపంచంలో బతకలేం. బాచారం లాంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఏజెన్సీ నియమాలు, హక్కులు వర్తించవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచులు మాకంటే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. – కుడుముల మల్లేశ్, చెంచు యువకుడు, సార్లపల్లి స్వచ్ఛందంగా ముందుకొస్తేనే.. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసమే స్థానికులకు మరోచోట పునరావాసం కలి్పస్తున్నాం. రీ లొకేషన్లో ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే తరలింపు ఏర్పాట్లు చేస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ జిల్లా -
పశ్చిమ కనుమలలో ప్రాణదాతలు
‘ప్రాణదాత’ అనే మాట మనుషులకు సంబంధించే ఎక్కువగా వినబడుతుంది. ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు మాత్రం పశ్చిమ కనుమల అరణ్యాలలోని మొక్కల ప్రాణదాతలు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కలు, చెట్లను కాపాడడానికి ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ ద్వారా మొక్కవోని కృషి చేస్తున్నారు. పచ్చటి అడవి పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా కష్టపడుతున్నారు... పశ్చిమ కనుమల అడవులు అపూర్వమైన చెట్లజాతులు, జంతుజాలం, పక్షి, చేప జాతులకు ప్రసిద్ధి పొందాయి. అయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) పశ్చిమ కనుమల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల మన దేశంలోని పశ్చిమ కనుమలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలోని అడవులను రక్షించుకోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కేరⶠలోని పెరియాలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటైన ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ లోని ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ కృషి చేస్తోంది. 27 మంది మహిళలు ఉన్న ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లో అరుదైన మొక్కలను సంరక్షిస్తోంది. ‘మొక్కలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ప్రమాదంలో ఉన్న మొక్కలకు ఈ గురుకులం శరణార్థి శిబిరంలాంటిది. ఆస్పత్రి కూడా అనుకోవచ్చు. మొక్కలకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మట్టిపాత్రలతో ఉంటుంది’ అంటుంది ఎకోసిస్టమ్ గార్డెనర్ సుప్రభా శేషన్. తొంభై శాతం అడవులు మాయమైన పరిస్థితిని ‘పర్యావరణ మారణహోమం’గా అభివర్ణిస్తుంది సుప్రభా శేషన్. అడవులనే ఇల్లుగా భావిస్తున్న సుప్రభ శేషన్ ‘గ్రీన్ ఆస్కార్’గా గుర్తింపు పొందిన యూకేలోని టాప్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ‘విట్లీ’కి ఎంపికైంది. గురుకుల బొటానికల్ శాంక్చువరీ (జీబిఎస్) అరుదైన మొక్కల ‘స్వర్గధామం’గా పేరు తెచ్చుకుంది పశ్చిమ కనుమల ప్రాంతాలలో 50 లక్షల మందికి పైగా నివసిస్తున్నందున అడవులు ప్రమాదం అంచున ఉన్నాయి. 28 ఏళ్లుగా ‘జీబిఎస్’లో పనిచేస్తున్న సుప్రభా శేషన్ అరణ్యాలకు సంబంధించిన పరిస్థితులు విషమించడాన్ని ప్రత్యక్షంగా చూసింది. ‘అరుదైన మొక్కలను కాపాడడంలోని ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది సీనియర్ గార్డెనర్ లాలీ జోసెఫ్. పాతిక సంవత్సరాలుగా ఈ అభయారణ్యంలో పనిచేస్తున్న జోసెఫ్ ‘మొక్కలు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం’ అంటోంది. ‘నేను చూస్తుండగా అడవిలో ఒక చెట్టు నేల కూలిపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు’ అంటుంది లాలీ జోసెఫ్. కీటకాలు, పాముల నుంచి రక్షణగా పెద్ద బూట్లు ధరించిన ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు అడవులలో తిరుగుతుంటారు. ప్రమాదంలో ఉన్న మొక్కలు, చెట్లను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. సహజ పదార్థాల నుంచి పురుగు మందులను తయారుచేస్తుంటారు. అడవి గుండె చప్పుడు విని... దిల్లీలో పెరిగిన సుప్రభా శేషన్... కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రోక్వుడ్ పార్క్ సెంటర్ (యూకే)లో చదువుకుంది. అక్కడ ఉన్నప్పుడు తొలిసారిగా కేరళలోని ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ గురించి విన్నది. ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, పార్క్ ల్యాండ్ల చరిత్రపై ప్రాజెక్ట్ చేస్తున్న సుప్రభ శేషన్ని కేరళలోని ‘గురుకుల’ ఆకర్షించింది. అమెరికాలోని ల్యాండ్ ఇనిస్టిట్యూట్లో ఒక సంవత్సరం పాటు అధ్యయన కార్యక్రమాల్లో భాగం అయిన సుప్రభ ఆ తరువాత మన దేశంలోని ఆదివాసీ గూడేలలో మకాం వేసి అడవుల గుండె చప్పుడు విన్నది. తన ప్రయాణంలో భాగంగా ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ (జీబిఎస్) వ్యవస్థాపకుడు వోల్ఫ్ గాంగ్ను కలిసింది. ‘జీబీఎస్’ ద్వారా అడవులను రక్షించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకుంది. అలా లాలీ జోసెఫ్, సుమ కెలోత్లాంటి ఇతర ‘జీబియస్’ సభ్యులతో కలిసి అడవిబాట పట్టింది. పశ్చిమ కనుమలలోని పర్వతాలను అధిరోహించింది. అంతరించిపోతున్న మొక్కల జాతుల గురించి తెలుసుకోవడమే కాదు వాటి పరిరక్షణలో భాగంగా ‘జీబియస్’గా గార్డెనర్గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నల్లని రాళ్లలో.. ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లోని సీనియర్ గార్డెనర్ అయిన లాలీ జోసెఫ్, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కల కోసం అన్వేషిస్తుంటుంది. గురుకులంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ద్వారా వాటిని బతికించే ప్రయత్నం చేస్తుంది. కొండ, కోనలు తిరుగుతూ మొక్కల యోగక్షేమాలు తెలుసుకుంటుంది. -
అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం
యాదాద్రి: నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్లోని నాగార్జునపేట తండా ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు లేచి అడవిని చుట్టుముట్టడంతో అటవీశాఖ సిబ్బంది ఆప్రాంతానికి వెళ్లి ఫైర్బ్లోయర్ల సహాయంతో ఆర్పారు. కిలోమీటరు మేరమంటలు అంటుకోవడంతో అష్టకష్టాలు పడి మంటలను అదుపులోకి తెచ్చారు. నాగార్జునపేట ప్రాంతంలో రైతులు పత్తికట్టెతో పాటు చెలకలలో ఉన్న చెత్తచెదారాలను తగుల బెట్టి వాటిని ఆర్పకుండానే రావడంతో గాలికి సమీపంలోగల అటవీ ప్రాంతం అంటుకుంది. మంటలు చెలరేగడంతో రైతులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన వెళ్లి మంటలను ఆర్పారు. -
పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!'
'మన జీవితంలో మనం ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు చూసుంటాం. ఎన్నో అద్భుతాలను చూసుంటాం. అవి మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి పాతాళవనాన్ని కాదు కాదు, ఉద్యానవనాన్ని మీరెప్పుడైనా చూశారా! చూడాలంటే.. పాతాళంలోకి దిగాల్సిందే.., దిగాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే..! ఆశ్చర్యం, అద్భుతం రెండూ కలిస్తేనే ఈ వనం. మరి అదేంటో కాస్త ముందే తెలుసుకుందామా..!' ఈ పాతాళవనం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో ఉన్న ఈ ఉద్యానవనం వెనుక కొంత చరిత్ర ఉంది. ఇటలీలోని సిసిలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన బాల్డసరె ఫారెస్టీరె ఫ్రెస్నోలో 1904లో పది ఎకరాల భూమి కొన్నాడు. ఇక్కడి మట్టి నిమ్మ, నారింజ వంటి పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా లేకపోవడమే కాదు, ఇక్కడి వాతావరణం కూడా వేసవిలో విపరీతమైన వేడిగా ఉండేది. వేసవి తాపాన్ని తట్టుకునే విశ్రాంతి మందిరం కోసం బాల్డసరె ఈ భూమిలో ఇరవైమూడు అడుగుల లోతున నేలమాళిగను తవ్వించాడు. నేలమాళిగలోనే గదులు గదులుగా నిర్మాణం చేపట్టి, లోపలకు గాలి వెలుతురు సోకేలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ తవ్వకాన్ని విస్తరించి, చిన్న చిన్న మొక్కలతో ఉద్యానవనాన్ని పెంచాడు. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో ఈ నేలమాళిగలో మొక్కలు ఏపుగా పెరిగాయి. బాల్డసరె 1946లో మరణించాడు. అమెరికా ప్రభుత్వం 1977లో దీనిని చారిత్రక ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నేలమాళిగలో పెరిగిన ఈ ఉద్యానవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇవి చదవండి: చిపి చిపీ చాపా... డుబిడుబిడు -
అమెరికాలో కార్చిచ్చు
కనాడియన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అడవికి నిప్పంటుకుని లక్షల ఎకరాల్లో పచ్చదనం మటుమాయమైంది. చెట్లు కాలిబూడిదయ్యాయి. సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 2,00,000 ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతాన్ని కాల్చేసిన కార్చిచ్చు మరింత పెద్దదవుతూ అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దీంతో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ దాదాపు 60 గ్రామాల్లో విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరంచేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అణ్వాయుధాల కేంద్రం బంద్ ఈ ప్రాంతంలో సంభవించే అతి పెద్ద కార్చిచ్చులకు ది స్మోక్హౌజ్ క్రీక్ఫైర్గా పిలుస్తుంటారు. భయంకరమైన ఎండ, వేడి, పొడి వాతావరణం కారణంగా ఉత్తర టెక్సాస్ అడవిలో కార్చిచ్చు అంటుకుంది. సోమవారం మొదలైన ఈ కార్చిచ్చు టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఘటనల్లో ఐదోది కావడం గమనార్హం. ఈ కార్చిచ్చు దెబ్బకు ఆమరిల్లో పట్టణంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న అమెరికా అణ్వాయుధాల కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్యాన్టెక్స్ సంస్థ వెల్లడించింది. జాతీయ రహదారుల వెంట చెట్లకు సైతం మంటలు అంటుకోవడంతో ఆయా హైవేలపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఓక్లహామా రాష్ట్ర సరిహద్దుల్లోని హెమ్ఫిల్, హచిన్సన్ కౌంటీల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. మియామీ, కనాడియన్ పట్టణాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సెనేటర్ కెవిన్ స్పార్క్స్ స్థానికులకు విజ్ఞప్తిచేశారు. కనాడియన్ పట్టణాన్ని కార్చిచ్చు దాదాపు చుట్టేసింది. స్కెలీటౌన్, వీలర్, అలీసన్, బ్రిస్కో పట్టణాల నుంచీ స్థానికులు వేరే చోట్లకు వెళ్లిపోయారు. కార్చిచ్చు ఘటనల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో మొత్తంగా కోటి 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా అమెరికాను కార్చిచ్చులు నిత్యం వణికిస్తున్నాయి. -
ఇదేం అడవి? రాళ్లు మొలవడం ఏంటీ..?
ఎక్కడైన పచ్చదనం పరుచుకున్న అందమైన అడవులే ఉంటాయి. అక్కడ ఉండే చెట్ల రకాల్లో తేడాలు ఉంటాయోమో గానీ పచ్చదనం అనేది కామన్. మహా అయితే కొన్ని చోట్ల నదులతో కూడిన అడవులు ఉంటాయి. అలా ఇలా కాకుండా రాళ్లు ఉండే అడవి గురించి విన్నారా?. పైగా అక్కడ చెట్లకు బదులు రాళ్లు మొలుస్తాయట. దగ్గరకెళ్తే చెట్లలా ఉండే శిలాజాల్లా కనిపిస్తాయట. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే చైనాలోని కున్మింగ్ నగరానికి వచ్చేయండి. ఆ వింత అడవిని చూసేయండి. ఎక్కడుందంటే..సాధారణంగా అడవుల్లో చెట్లు మొలుస్తాయి. అక్కడ మాత్రం రాళ్లు మొలిచాయి. అందుకే ‘స్టోన్ ఫారెస్ట్’గా పేరు పొందింది. ఈ శిలారణ్యం చైనా దక్షిణ ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నగరానికి తొంబై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దాదాపు నాలుగువందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎటుచూసినా, కొండల్లా బారులు తీరిన శిలలే కనిపిస్తాయి. ఇవన్నీ సున్నపురాతి శిలలు. ఇవి నేల నుంచి మొలుచుకొచ్చినట్లు ఉంటాయి. దగ్గరగా చూస్తే, ఇవి శిలాజాల్లా మారిన చెట్లలా కనిపిస్తాయి. చైనాలోని ఈ శిలారణ్యాన్ని చూడటానికి విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ శిలారణ్యాన్ని యునెస్కో 2007లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..
మన ఊహకే అందని విచిత్రాలు ఈ ప్రకృతి సొంతం. ఎంతలా ఏఐ వంటి మహత్తర టెక్నాలజీల వచ్చినా కొన్ని విచిత్రాలు ఇప్పటకీ ఓ పట్టాన అర్థం కావు. ఎందువల్ల ఇలా జరిగిందనేది మేధావుల మెదడుకు అందదు. కానీ అవి ఓ మనిషి నువ్వు ఎన్ని కనిపెట్టిన మమ్మల్ని అందుకోలేవు అన్నట్లు ప్రకృతి తన వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని ఎప్పటికప్పుడూ చెంపదెబ్బ కొట్టినట్లు చెబుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నా అధీనుడవే అంటుంది. అహం చూపించావో అంతం చేసేస్తా అన్నట్లు కన్నెర జేస్తుంది ప్రకృతి. ఎప్పటికీ నీ శక్తికి, వైవిధ్యానికి దాసోహం అంటే అన్ని అర్థమయ్యేలా అమ్మలా వివరిస్తుంది. 'దటీజ్ నేచర్' అని చెప్పకనే చెబుతుంది. ఈ నాటి ఆసక్తికర విశేషాలేంటో చూద్దామా! ►నాట్య భంగిమల్లా కనిపించే ఈ నిలువెత్తు వృక్షాలు ఇండోనేసియాలోని సుంబా దీవి మడ అడవుల్లోనివి. ఉప్పునీరు పుష్కలంగా ఉండే చోట ఈ చెట్లు పెరుగుతాయి. సుంబా దీవిలోని వలాకిరి బీచ్లో ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించాలనుకునే ఫొటోగ్రాఫర్లు తరచుగా ఇక్కడకు వస్తుంటారు. సూర్యోదయ, సూర్యాస్తమ వేళల్లో ఈ చెట్ల ఫొటోలు తీస్తుంటారు. ►మనుషులు మొట్టమొదటగా మచ్చిక చేసుకున్న జంతువులు మేకలు. మనుషులు మేకలను పదివేల ఏళ్ల కిందటే మచ్చిక చేసుకుని, పెంపుడు జంతువులుగా మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ►కొందరికి ఎలుకలంటే చచ్చేంత భయం. ఎలుకల పట్ల ఉండే ఈ భయాన్ని వైద్య పరిభాషలో ‘మ్యూరోఫోబియా’ అంటారు. ►ఏదో మాట వరసకు గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం గాని, దాని చేత నీళ్లు తాగించలేం అంటుంటారు. అదంతా అపోహ మాత్రమే! గుర్రాలకు నీళ్లు తాగడం బాగా ఇష్టం. ఒక గుర్రం రోజుకు సగటున ముప్పయి నుంచి అరవై లీటర్ల వరకు నీటిని అవలీలగా తాగేయగలదు. (చదవండి: పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!) -
నేవీ రాడార్ స్టేషన్ కోసం అటవీ భూములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికారాబాద్ మండలం పూ డూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ (రాడార్) స్టేషన్ ఏ ర్పాటు ఖరారయ్యింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని తూర్పు నౌకాదళ కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ కలి శారు. వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు కోసం అట వీ భూముల బదిలీ ఒప్పందంపై వికారాబాద్ డీఎఫ్వో, నా వల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు సంతకాలు చేశారు. దామ గూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దేశంలోనే రెండోది భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేష న్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే స్టేష న్ దేశంలో రెండోది కాగా.. తమిళ నాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావ రణ అనుమతులు, క్లియరెన్స్లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. వాస్తవానికి 2014లోనే నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లు కూడా నేవీ చెల్లించింది. అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు నేవీ అంగీకరించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ దిశగా ముందడుగు పడింది. 2027లో పూర్తి దామగూడెంలో నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ప్రాజెక్టులో భాగంగా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటు పూర్తి కానుంది. -
TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్!
కొమురం భీం, సాక్షి: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల విస్తృత గాలింపు తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6 తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15 పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ. దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీంను 72 కు పెంచింది. దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులిదాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది. 73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది. 62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది. వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది. -
ఈ వారం పిల్లల కథ - ‘దత్తత’
బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న మాజాలీ ద్వీపంలోని మంజీరా అడవికి రాజు కృపి. ఆ అడవిలోని జంతువులన్నిటికీ కృపి అంటే ఎంతో గౌరవం. ఉన్న లోటల్లా కృపికి పిల్లలు లేకపోవడమే. ‘నా తరువాత ఈ అడవిని పాలించే రాజు లేకపోతే జంతువుల పరిస్థితి ఏమిటీ?’ అంటూ దిగులుచెందుతూ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేది. ఒకరోజు.. ఆ అడవిలోనే ఉండే కరటం అనే కాకి ‘మృగరాజా.. ఆహార వేట కోసం నేను వెళ్లే పల్లెల్లో.. పిల్లలు లేనివాళ్ళు మరొకరి పిల్లలను తెచ్చి పెంచుకుంటుంటారు. దాన్ని దత్తత అంటారట. అలాగే మీరు కూడా ఎవరినైనా పెంచుకుంటే ఈ సమస్య తీరుతుంది’ అంది. అక్కడే ఉన్న ఎలుగుబంటి ‘ఓ కరటం.. నీకు మతి పోయిందా? పక్కవాళ్ల పిల్లలను తెచ్చి పెంచుకోవడానికి మానవులంతా ఒకేలా ఉంటారు కాబట్టి సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ మనం వేరు వేరు జంతువులం. పిల్లి పిల్లను తెచ్చి మృగరాజు పెంచుకుంటుందా ?’ అంది. ‘మరైతే ఎలా ఈ సమస్య తీరేది?’ అంటూ కలతచెందింది కరటం. అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద ‘మహారాజా.. దిగులుపడకండి. నేను అనేక అడవులు తిరుగుతాను. ఎక్కడైనా సింహం పిల్లలుంటే మీకు చెబుతాను. అప్పడు దత్తత గురించి ఆలోచించవచ్చు’ అంది. ‘ఈ ఆలోచన బాగుంది. అయితే ఈ రోజు నుండే వెతకడం మొదలుపెట్టు’ అంది ఎలుగుబంటి. అలా వెళ్ళిన గద్ద పక్కనున్న అడవులన్నిటినీ గాలించడం మొదలుపెట్టింది. నదీ తీరంలో దానికి ఓ పావురం కలసింది. ‘నిన్నటి నుండి చూస్తున్నా .. ఆహారం కోసం కాకుండా నువ్వు దేనికోసమో వెతుకుతున్నట్టున్నావ్?’ అని అడిగింది. ‘అవును’ అంటూ తన రాజు గురించి, ఆయన బాధ గురించి చెప్పింది గద్ద. ‘ఉయ్యాల్లో పిల్లను పెట్టుకుని ఊరంతా వెదికినట్టుంది. మన పక్కనున్న కంజీరా అడవి రాణికి రెండు మగ పిల్లలు పుట్టాయి. జాగ్రత్తగా ప్రయత్నిస్తే మీ రాజు ఆశ ఫలించవచ్చు’ అంది పావురం. వెంటనే గద్ద కంజీరా అడవి వైపు ఎగిరి అక్కడి రాణి బిడ్డలను చూసింది. ముద్దుగా ఉన్నాయి. దయతలచి ఒక పిల్లనిస్తే భవిష్యత్తులో తమకు రాజు లేడనే లోటుండదు అనుకుంది. ఆ ఆలోచనతోనే తన అడవికి వెళ్లి రాజు సహా అక్కడి జంతువులన్నిటికీ తను చూసిన విషయాన్ని చెప్పింది. ‘మహారాజా .. ఒక తల్లి నుండి పిల్లను తేవడం చిన్న విషయం కాదు. చాకచక్యంగా వ్యవహరించి సాధించాలి’ అంది కరటం. ‘అవును.. మహారాజా! నానొక ఆవకాశం ఇవ్వండి. యువరాజును తీసుకొస్తా!’ అంది ప్రవాళం అనే కుందేలు. ‘అది నీవల్ల అయ్యే పనికాదు’ అని కుందేలును విదిలించి ‘మహారాజా.. ఆ అవకాశం నాకు ఇవ్వండి. నేను తీసుకొస్తా’ అంది త్రిశిర అనే నక్క. ‘అవును.. మహారాజా! త్రిశిర తెలివైనది. అవసరమైతే తన దొంగ తెలివితేటలనూ ఉపయోగించి పని పూర్తి చేయగలదు కూడా!’ అంది ఎలుగుబంటి. అలా మృగరాజు దగ్గర అనుమతి తీసుకుని కంజీరా అడవికి బయలుదేరింది త్రిశిర. కొంత దూరంలో దానికి ఓ తోడేలు జత కూడింది. రెండూ కలసి కంజీరా అడవికి చేరుకున్నాయి. రెంటికీ ఆకలి దంచేయసాగింది. ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుండు అనుకున్నాయి. కొద్దిదూరంలోనే బాగా బలిసిన అడవి కోడి కనిపించింది. పొట్టికాళ్ళు.. మెలితిరిగిన పంచరంగుల తోక.. నెత్తిమీద ఎర్రని జుట్టు.. దాన్ని చూడగానే నోట్లో నీళ్లూరాయి తోడేలుకు. ‘రాజు సంగతి తరువాత.. ముందు దీన్నో పట్టుపడదాం’ అంది త్రిశిరతో. ‘తొందరపడకు. ఇది మన అడవి కాదు. పైగా మనం ఓ ముఖ్యమైన పని మీద వచ్చాం’ హెచ్చరించింది త్రిశిర. ‘నిజమే పని చేయాలంటే ఓపిక కావాలి. నీరసంతో పని చేయలేం కదా! అయినా కోడిని కొడితే ఎవరూ పట్టించుకోరు!’ అంది తోడేలు. ఆ కోడి మీదకు దూకుదాం అని ఆ రెండూ అనుకునేలోపు చాలా జంతువులు నక్కను, తోడేలును చుట్టుముట్టాయి. ‘మా మృగరాజును నిద్రలేపే కోడి పుంజునే చంపుదామని వచ్చారంటే.. మీ కెంత ధైర్యం?’ అని బెదిరించాయ్. భయపడిపోయిన త్రిశిర ‘అమ్మబాబోయ్’ అంటూ పరుగు తీసింది. తోడేలూ దాన్ని అనుసరించింది. అలా బెదిరిపోయి వచ్చిన త్రిశిరను చడామడా తిట్టాయి జంతువులన్నీ! ‘మహారాజా.. ఈసారి నాకిచ్చి చూడండి అవకాశం’ అని మళ్లీ అడిగింది ప్రవాళం. ‘ఏ పుట్టలో ఏ పాముందో.. సరే’ అంటూ అనుమతిచ్చింది మృగరాజు. వెంటనే ప్రవాళం.. వైద్యుడు కోతి బావను కలసి సువాసన తైలం తీసుకుంది. దాన్ని ఆనప బుర్రలో పోసుకుని.. భుజాన వేసుకుని కంజీరా అడవికి బయలుదేరింది ప్రవాళం. కంజీరా రాజును కలసింది. చాలా వినయంగా ‘రాజా .. మీరు చాలా మంచివారని.. జంతువుల పట్ల స్నేహభావంతో మెలగుతారని తెలిసింది. మా మంజీరా మహారాజు మీ కోసం ఈ సువాసన తైలం పంపారు. దీన్ని మీ మెరుస్తున్న జూలుకు రాసుకుంటే మీ వయస్సే కనపడదు’ అంటూ మాటల్లో పెట్టింది. ‘భలే మాట్లాడుతున్నావే’ అంది కంజీరా మృగరాజు. కొంత స్థిమితపడ్డాక మెల్లగా ‘రాజా.. మీకిద్దరు బిడ్డలని తెలిసింది. ఒకరు ఈ అడవికి రాజయితే మరొకరు పక్కనున్న మంజీరా అడవికి రాజు కావచ్చు’ అన్నది ప్రవాళం. ‘పక్క అడవికి రాజా? అదెలా?’ అని ఆశ్చర్యపోయింది మృగరాజు. అప్పుడు ప్రవాళం తమ మృగరాజుకు పిల్లల్లేని విషయం చెప్పి, దత్తత గురించీ చెవిన వేసింది. అది విని ఆలోచనలో పడింది కంజీరా మృగరాజు. ‘ఈ కుందేలు చెప్పింది బావుంది. పక్క అడవినీ నా బిడ్డే ఏలుతాడంటే అంతకంటే ఇంకేం కావాలి! ఇక్కడుంటే రెండిటిలో ఒకటే రాజవుతుంది. రెండోది మంత్రో ఇంకేదో అధికారి కాగలదు అంతే. ఈ భేదం వల్ల భవిష్యత్తులో రెండిటి మధ్య విరోధమూ తలెత్తొచ్చు. కాబట్టి బిడ్డను దత్తతకు పంపడమే సరి. పైగా ఆ రాజుకు మంచి పేరే ఉంది. కనుక ఆ రాజు మాట మన్నించి చిన్న కొడుకును దత్తతకు పంపాలి’ అనుకుంది. ఆ విషయాన్ని రాణితోనూ చెప్పింది. రాణీ సరే అంది. ఆ రెండూ కలసి తమ చిన్న కొడుకును ప్రవాళంతో మంజీరా అడవికి సాగనంపాయి. అక్కడ మంజీరాలోని జంతువులన్నీ తమ చిన్న రాజుకు ఘన స్వాగతం పలికాయి. తెలివితో రాజు సమస్యను తీర్చిన ప్రవాళాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. అలా తనకు వారసుడు దొరికినందుకు మంజీరా మృగరాజూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. -కూచిమంచి నాగేంద్ర -
మందపాలుడి కథ
పూర్వం మందపాలుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు లపిత అనే భార్య ఉండేది. అయితే, వారికి సంతానం లేదు. మందపాలుడికి తపస్సు చేయాలనే కోరిక కలిగింది. వెంటనే బ్రహ్మచర్య దీక్ష వహించి, ఒక కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ వెయ్యేళ్లు ఘోర తపస్సు చేశాడు. తర్వాత యోగమార్గంలో ప్రాణత్యాగం చేశాడు. ప్రాణాలు వదిలిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు పయనమయ్యాడు. పుణ్యలోకాల్లోకి ప్రవేశించకుండా దేవదూతలు అతడిని అడ్డుకున్నారు. ‘నన్నెందుకు అడ్డుకుంటున్నారు? వెయ్యేళ్లు తపస్సు చేసిన నాలాంటి తపస్సంపన్నుడైన మహర్షికి పుణ్యలోకాల్లో ప్రవేశం లేకపోవడానికి కారణం ఏమిటి? నేనే పాపం చేశాను?’ అని మందపాలుడు దేవదూతలను నిలదీశాడు. ‘ఎంత తపస్సు చేసినా ఏం ప్రయోజనం? సంతానం లేనిదే సద్గతులు సంప్రాప్తించవు. నువ్వు తిరిగి భూలోకానికి వెళ్లి, సంతానం పొంది వస్తే, అప్పుడు పుణ్యలోకాల్లోకి ప్రవేశించగలవు’ అని బదులిచ్చారు దేవదూతలు. మందపాలుడు మళ్లీ భూలోకానికి వచ్చేశాడు. త్వరితగతిన సంతానం పొందడం భూమ్మీద పక్షులకే సాధ్యమని, పక్షుల్లో లావుక పిట్టలు మరింత త్వరితగతిన సంతానం పొందగలవని గుర్తించి, లావుక పిట్టగా మారాడు. జరిత అనే లావుక పిట్టతో కాపురం చేసి, సంతానం పొందాడు. పక్షుల రూపంలో పుట్టినా, మందపాలుడి నలుగురు కుమారులూ బ్రహ్మజ్ఞానులు. సంతానం కలిగిన తర్వాత మందపాలుడు జరితకు, ఆమె నలుగురు కుమారులకు ఖాండవవనంలో ఒక గూడును ఏర్పరచాడు. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తన మొదటి భార్య లపిత దగ్గరకు బయలుదేరాడు.ఒకరోజు అతడికి మార్గమధ్యంలో ఖాండవవనం వైపు వస్తున్న అగ్నిదేవుడు ఎదురయ్యాడు. అగ్నిని చూడగానే, అతడు ఖాండవవనాన్ని దహించడానికే వస్తున్నాడని మందపాలుడికి అర్థమైపోయింది. అగ్నికీలల్లో తన భార్యకు, సంతానానికి ప్రాణగండం తప్పదని గ్రహించి, అగ్నిసూక్తాలు పఠిస్తూ ఎదురేగి, అగ్నికి నమస్కరించాడు. మందపాలుడి స్తోత్రాలకు అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యాడు. ‘మహర్షీ! ఏమి కోరిక?’ అని అడిగాడు. ‘అగ్నిదేవా! ఈ ఖాండవవనంలోనే నా భార్య, నా నలుగురు కొడుకులు లావుక పిట్టల రూపంలో ఉన్నారు. ఖండవవనాన్ని దహించేటప్పుడు వాళ్ల మీద దయచూపు. వాళ్లకు ప్రాణహాని లేకుండా కాపాడు’ అని ప్రార్థించాడు. ఈ సంగతి జరితకు, ఆమె పిల్లలకు తెలియదు. సరేనంటూ అగ్నిదేవుడు మందపాలుడికి అభయమిచ్చాడు. కృష్ణార్జునుల అండతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం ప్రారంభించాడు. అగ్నిని నిలువరించడానికి వచ్చిన దేవేంద్రుడితో కృష్ణార్జులు యుద్ధం సాగించారు. వనాన్నంతటినీ అగ్నికీలలు దహించివేస్తూ దూసుకొస్తుండటంతో జరిత భయపడింది. రెక్కలు రాని కూనలను ఎలా రక్షించుకోగలననుకుని ఆమె దుఃఖించసాగింది. కూనలను వదిలేసి, తన మానాన తాను ఎగిరిపోవడానికి ఆమెకు మనసు రాలేదు. అందుకని ఆమె తన కొడుకులకు ఒక ఉపాయం చెప్పింది.‘బిడ్డలారా! ఈ చెట్టు కిందనే నేల మీద ఎలుకలు చేసిన బొరియ కనిపిస్తోంది. మీరు నెమ్మదిగా వెళ్లి అందులో దాక్కోండి. నేను బొరియ ప్రవేశమార్గాన్ని మట్టితో కప్పేస్తాను. అప్పడు మీకు అగ్ని వేడి సోకదు. అగ్ని చల్లారిన తర్వాత మనం మళ్లీ కలుసుకుందాం’ అంది.జరిత కూనలలో పెద్దవాడు జరితారి ‘అమ్మా! ఎలుకల బిలంలోకి వెళితే, అక్కడ మమ్మల్ని ఎలుకలు చంపి తినేస్తాయి. ఎలుకలకు ఆహారం కావడం కంటే, అగ్నికి ఆహుతైపోవడమే పుణ్యం. గాలితో పాటు అగ్ని మరోవైపు మళ్లితే, ఇక్కడే మేం బతికే అవకాశం ఉంటుంది. కనుక మేం ఇక్కడే ఉంటాం. నువ్వు ఎగిరి పారిపో! కనీసం నీకైనా ప్రాణాపాయం తప్పుతుంది. మేం కాలిపోయినా, నీకు మళ్లీ సంతానం కలుగుతుంది. ప్రాప్తముంటే మళ్లీ మేమే నీకు సంతానంగా కలగవచ్చు. నీ పుణ్యం వల్ల మేం బతికి బయటపడ్డామంటే మనం మళ్లీ కలుసుకోవచ్చు’ అని చెప్పాడు. ఇలా రకరకాలుగా నచ్చచెప్పి, నాలుగు కూనలూ తల్లిని సాగనంపాయి. ఇంతలో వనమంతా దహించేస్తూ ఉన్న అగ్ని పక్షికూనలు వైపు వచ్చాడు. మందపాలుడి కుమారులైన నలుగురూ వేదమంత్రాలతో అగ్నిదేవుడిని స్తుతించారు. అగ్ని వారికి అభయమిచ్చి, వారికి ఏ అపాయం లేకుండా కాపాడాడు.ఖాండవ దహనం పూర్తయి, అగ్ని చల్లారిన తర్వాత జరిత తిరిగి వచ్చింది. తన గూడు, పిల్లలూ క్షేమంగా ఉండటం చూసి సంతోషించింది. -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక..
అది 2023, జూలై 6.. 70 ఏళ్ల వృద్ధుడు దట్టమైన అడవిలో దారి తప్పాడు. అతనితోపాటు వచ్చినవారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు రంగంలోకి దిగి 48 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మనదేశంలోని గుజరాత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర వివరాలు.. గుజరాత్లోని గిర్నార్ అడవుల ఎంతో దట్టంగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా దారి తప్పారంటే ఇక అంతే సంగతులు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా పూప్ తాలూకాలోని కుప్రాలా గ్రామానికి చెందిన మదన్మోహన్ మురళీధర్ జైన్(72) ఈ ఏడాది జూలై 6వ తేదీన 20 మంది సభ్యుల బృందంతో పాటు జునాగఢ్లోని గిర్నార్కు విహారయాత్రకు వచ్చాడు. వారంతా గిర్నార్లోని అంబాజీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారంతా అక్కడి జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ సమయంలోనే మురళీధర్.. బృంద సభ్యుల నుంచి వినిపోయాడు. ఆ సమయంలో అతనికి దాహం వేయడంతో నీటి కోసం వెదుకుతూ వెళ్లాడు. ఒకచోట ఊట నీరు తాగుతుండగా అతని కాలు జారింది. ఆ నీటిలో కొంతదూరం కొట్టుకుపోయాడు. కాస్త తేరుకుని లేచి నిలబడే సమయానికి అడవి మధ్యలోకి వచ్చేశాడు. నీటిలో కొట్టుకుపోయిన సందర్భంలో అతని పాదాలకు, తలకు ముళ్లు గుచ్చుకుని గాయాలయ్యాయి. అటువంటి దుర్భర పరిస్థితిలో మురళీధర్ తనను కాపాడమంటూ ఎనిమిది గంటల పాటు కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అతని ఆరుపులు అరణ్యరోదనగా మారాయి. కొద్దిసేపటికి మురళీధర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి అడవి పందుల గుంపు అతనికి అతి సమీపం నుంచి వెళుతోంది. వాటిని చూసినంతనే అతనికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. అయితే అవి అతనిని ఏమీ చేయకుండా విడిచిపెట్టడం విశేషం. మరోవైపు మురళీధర్ బృంద సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 33 మంది సభ్యులు గల ఎస్డిఆర్ఎఫ్, పోలీసు, అటవీ శాఖ హోంగార్డుల బృందం అడవిలో గాలింపు చేపట్టింది. ఎట్టకేలకు 48 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం వారు మురళీధర్ను గుర్తించి కాపాడారు. ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్బాబు, ప్రభాస్, మోహన్లాల్, శివరాజ్కుమార్, శరత్కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే?
సోషల్ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్గా మారింది. వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటే సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోను షూట్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీడియోలోని వివరాల ప్రకారం అడవిలోని నీటిలో నిలుచుకున్న ఫారెస్ట్ గాలంటే మాట్లాడుతూ ‘మాకు అద్భుతమైన షాట్లు వస్తున్నాయి. ఇది అందమైన రోజు. ఇక్కడి నీరు నిలకడగా ఉంది. షూటింగ్ అద్భుతంగా జరుగుతోంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉంది. వర్షం పడడం మొదలవుతోంది. ఇది ఫ్లోరిడా. ఇక్కడ తరచూ వర్షాలు కురుస్తుంటాయి. అన్ని వేళలా మెరుపులు, ఉరుములు కనిపిస్తాయి’ అని చెప్పాడు. ఇంతలో అతని పక్కనే పిడుగుపడింది. దీంతో అతను నీటిలోకి కొద్దిగా ఒరిగాడు. ఈ ఘటన తర్వాత అతను మాట్లాడుతూ ‘ఆ సమయంలో కాంతిని చూడలేకపోయాను. ఆకస్మిక పిడుగు దాడితో నా మైండ్ మొద్దుబారిపోయింది. విపరీతమైన వెలుగు రావడంతో నేను ఏమీ చూడలేకపోయాను. ఈ ఘటనలో నాకు, నా బృందానికి పెద్దగా గాయాలు కాలేదని, అయితే తనకు శరీరమంతా నొప్పిగా ఉందని, తన గొంతు ఎండిపోయినట్లుందని’ గాలంటే తెలిపారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది? How close have you come to being hit by lightning? This is insane. The host of Discovery Plus and Animal Planet, @ForrestGalante, was actually hit by lightning while recording. In the video, you can see he was discussing the importance of having a GPS device, when a huge bolt… pic.twitter.com/lseyEzgNUZ — Ed Krassenstein (@EdKrassen) October 2, 2023 -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
బ్రెజిల్లో విమానం కూలి..14 మంది మృతి
రియో డి జనిరో: బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో చిన్న ప్యాసింజర్ విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్ సమీపంలో కూలిందన్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా చెప్పారు. -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..
ఇది ఒక విచిత్ర కుటుంబానికి చెందిన కథ. వారు బాహ్యప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా బతికారు. ప్రపంచంలో ఏమి జరుగుతోందో వారికి ఏమాత్రం తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఈ విషయం కూడా ఆ కుటుంబానికి తెలియదు. ఈ కుటుంబంలోని వారు సెర్బియాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుడిసె వేసుకుని జీవించారు. వారిని ఒక శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇది 1978 నాటి ఉదంతం. ఖనిజ సంపదను అన్వేషించే ప్రయత్నంలో.. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం హెలికాప్టర్ ద్వారా సెర్బియాలోని దట్టమైన అడవులతో కూడిన ఒక ప్రాంతానికి వెళ్లింది. ఖనిజ సంపదను అన్వేషించే ఉద్దేశంతో వారి ప్రయాణం సాగింది. అనుకోని రీతిలో హెలికాప్టర్ పైలెట్ ఏదో నగరానికి 155 మైళ్ల దూరంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక ప్రాంతాన్ని గమనించాడు. అది మనుషులు ఉంటున్న ప్రాంతంగా అతనికి అనిపించింది. 6 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై.. దీంతో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ వారికి ఈ విచిత్ర కుటుంబం కనిపించింది. కార్ప్ అనే వృద్దుడు, అతని నలుగురు పిల్లలు అక్కడ ఉన్నారు. ఆ వృద్ధుని భార్య అకులిన్ 1961లో విపరీతమైన చలి, ఆకలి కారణంగా మృతి చెందింది. ఈ కుటుంబం దట్టమైన అడవిలో 6 వేల అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపై శాస్త్రవేత్తలకు కనిపించింది. ఇంత ఎత్తులో కేవలం ఎలుగుబంట్లు, తోడేళ్లు మొదలైన జంతువులు మాత్రమే జీవించగలవు. ఇది కూడా చదవండి: నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ.. రెండవ ప్రపంచ యుద్ధం గురించి.. ఆ కుటుంబం ప్రపంచంతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. రెండవ ప్రపంచయుద్ధం, టీవీ, ఆధునిక వైద్యం మొదలైనవాటి గురించి వారికి ఏమాత్రం తెలియదు. జియాలజిస్ట్ గలీనా పిస్మెన్స్కాయ ఇక్కడకు ఖనిజ పరిశోధన నిమిత్తం వచ్చారు. ఆయన ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ కుటుంబం గురించి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ‘వారు ఎంతో భయస్తులుగా కనిపించారు. మేము ఆ వృద్దునికి నమస్కారం పెట్టాం. వెంటనే ఆ వృద్ధుడు ఏమీ స్పందించలేదు. తరువాత మెల్లగా మీరు ఇంత దూరం వచ్చారు. మీకు స్వాగతం అని అన్నాడు. తాత్కాలిక గృహాన్ని నిర్మించుకుని.. ఆ వృద్దుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్టాలిన్ పాలనా కాలంలో 1936లో కమ్యూనిస్టులు అతని తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం కార్ప్ లైకోవ్ తన భార్య 9 ఏళ్ల కుమారుడు సావిన్, రెండేళ్ల కుమార్తె నటాలియాలతో పాటు ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చాడు. వారు ఇక్కడ తాత్కాలిక గృహాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడే కార్ప్ దంపతులకు 1940, 1943లలో మరో ఇద్దరు పిల్లలు కలిగారు. ఆ పిల్లలకు ఈ ప్రాంతానికి బయట మరోప్రాంతం ఉందని కూడా తెలియదు. బయటకు రావాలని కోరినా.. శాస్త్రవేత్తలు ఆ కుటుంబ సభ్యులను తమతో పాటు తమ క్యాంపునకు తీసుకువెళ్లారు. అక్కడ వారి దగ్గరున్న పలు ఆధునిక పరికరాలను చూసి, ఆ కుటుంబ సభ్యులు తెగ ఆశ్చర్యపోయారు. 1981లో సావిన్, నటాలియాలు ఆహార సమస్యతో కిడ్నీలు ఫెయిలై మృతిచెందారు. మరో కుమార్తె నిమోనియాతో మృతి చెందింది. ఇలా ముగ్గురు సభ్యులు మరణించిన నేపధ్యంలో శాస్త్రవేత్తలు కార్ప్ను, అతని మరో కుమార్తెను ఆ అడవిని విడిచిపెట్టి బయటకు రావాలని కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. 1988, ఫిబ్రవరి 16న కార్ప్ మృతి చెందాడు. ఈ ఏడాది మార్చి వరకూ అందిన సమాచారం ప్రకారం అతని కుమార్తె ఇంకా ఆ దట్టమైన అడవిలో ఒంటరిగానే ఉంటోంది. ఇది కూడా చదవండి: నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు! -
చీకటి సొరంగమా?.. దట్టమైన అడవా?.. అబ్బురపరుస్తున్న వీడియో!
ఆప్టికల్ ఇల్యూజన్(దృష్టి భ్రాంతి) అనేది ఒక్కోసారి మనల్ని గందరగోళానికి గురిచేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియో ఇటువంటివి చూడాలనే ఆసక్తి కలిగినవారిని ఎంతగానో అలరిస్తోంది. వీడియో ప్రారంభంలో ఒక అంథకారమయమైన గుహ కనిపిస్తుంది. క్లిప్ ముందుకు వెళుతున్న కొద్దీ మరో విధంగా మారిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @Rainmaker1973 హ్యాండిల్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఏదో కారు లోపలి నుంచి రికార్డు చేశారు. వీడియోలో కారు ఒక చీకటి సొరంగం గుండా వెళుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ వాహనం ఆ కనిపించే సొరంగం దగ్గరకు చేరుకోగానే అది భ్రమ అని తేలిపోతుంది. అటునిటు దట్టంగా ఉన్న చెట్లు కనిపిస్తాయి. ఈ పోస్టు క్యాప్షన్లో @Rainmaker1973 ఇలా రాశారు..‘థాయ్ల్యాండ్ పాహిలి ప్రాంతంలో చెట్లతో కూడిన ఈ సొరంగం విచిత్రమైన భ్రాంతిని కలుగజేస్తుంది. దూరం నుంచి ఎంతో చీకటిగా కనిపిస్తుంది. అయితే ముందుకు సాగగానే వెలుతురు ప్రవేశించి, ప్రకృతి సహజ సౌందర్యం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఆగస్టు 10న షేర్ చేయగా, ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోను చూసిన చాలామంది లైక్స్ చేయడంతోపాటు, పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ప్రకృతి ఒక్కోసారి ఎంతో ఆసక్తిగొలుపుతుంది’ అని రాశారు. మరో యూజర్ ‘ఇది ఎంతో బాగుంది. ఒక సినిమా సీన్ను తలపిస్తోంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘రాత్రివేళ దీని గుండా ప్రయాణించడాన్ని ఊహించండి’ అని రాశారు. ఇది కూడా చూడండి: నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు! This tree tunnel in Pahili, Thailand, has a peculiar optical illusion. It appears extremely dark from the distance, but once you're in the lightning level is naturally adjusted [video: https://t.co/PE0MReEqRG]pic.twitter.com/CGEOHMUa9x — Massimo (@Rainmaker1973) August 10, 2023 -
అనంతగిరి అడవుల్లో రేసింగ్పై స్పందించిన పోలీసులు
సాక్షి, వికారాబాద్: అనంతగిరి అడవుల్లో రేసింగ్పై పోలీసులు స్పందించారు. రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం బందోబస్తులో ఉండటంతో రేసింగ్కు పాల్పడ్డారని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. అనంతగిరి అడవుల్లో జరిగిన కార్, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు ఒక కారు నంబర్ ను గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతగిరి అడవుల్లోకి వీరిని ఎవరు తీసుకొచ్చారు. ఎవరు సహకరించారనే విషయాలపై విచారణ చేపట్టారు. రేసింగ్లో పాల్గొన్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
అడవులను సరిగ్గానే పెంచుతున్నామా?
దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించే వివిధ విధానాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. అందుకే గత తప్పిదాలు పునరావృతం కాకుండా అటవీశాఖాధికారులు చూసుకోవాలి. చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించినట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే కూడా దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది. అడవులను తమకు తాముగా పునరుత్పత్తి చేసుకునేలా చేయడం అనేది, వాతావరణంలో భూమిని వేడెక్కించే కార్బన్ ను తగ్గించడం కోసం చేసే ఒక వ్యూహంగా ఉంటోంది. అదే సమయంలో జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు అందించే ప్రయోజనాలతోపాటు జీవనోపాధికి చెందిన ఫలవంతమైనదాన్ని కూడా అవి పెంచుతూ వచ్చాయి. కానీ వాతావరణ మార్పును పరిమితం చేసే ఉద్దేశంతో చెట్ల విస్తృతిని పెంచే ప్రయత్నాలు చివరకు వేగంగా పెరిగే ఉద్యానవనాలను నిర్మించడం వైపు మొగ్గు చూపాయి. పొలాలు, బంజరు భూముల్లో తోటలను పెంచితే అవి కలపను, వంటచెరుకును అందించగలవు. ఇవి సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించి, వాటి పునరుత్పత్తికి సహాయపడతాయి. కానీ సరైన రీతిలో జరగని చెట్ల పెంపకం తొలగించలేని జాతులను పెంచుతుంది. అవి ప్రజలను తమ భూమికి దూరమయ్యేట్టు చేస్తాయి. దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించడంలో వివిధ విధా నాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, ఈ అరుదైన దీర్ఘకాలిక దృక్పథాన్ని నేడు అటవీశాఖాధికారులు గమనించాలి. దురాక్రమణ చెట్లు 18వ శతాబ్దం మధ్యకాలం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి చెందిన అనేక వ్యవహారాలను బ్రిటన్ నియంత్రించింది. 1857 నుండి 1947 మధ్య బ్రిటిష్ రాణి నేరుగా దేశాన్ని పాలించింది. భారతదేశం నుండి కొల్లగొట్టిన పత్తి, రబ్బరు, తేయాకును రవాణా చేయడం కోసం, బ్రిటన్ కు రైల్వే స్లీపర్లను వేయడానికి, ఓడ లను నిర్మించడానికి పెద్ద మొత్తంలో కలప అవసరమైంది. 1865 భారత అటవీ చట్టం ద్వారా, టేకు, సాల్, దేవదారు వంటి అధిక దిగుబడినిచ్చే కలప చెట్లతో కూడిన అడవులను ప్రభుత్వం ఆస్తిగా మార్చుకొంది. ఈ అడవుల్లో ఈ కలప దిగుబడిని అధికం చేసేందుకు బ్రిటిష్ వలసపాలనాధికారులు గడ్డి, వెదురు కంటే మించిన రకాలను వేయకుండా స్థానిక ప్రజల హక్కులపై పరిమితులను విధించారు. ఆఖరికి పశువుల మేతపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో భార తీయ సమాజాలు కొన్నిసార్లు అడవులను తగలబెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈలోగా వేడి, తేమతో కూడిన భారతదేశ వాతావరణానికి బాగా అలవాటుపడిన, మన్నికైన, ఆకర్షణీయమైన కలపకు మూలమైన టేకు తోటలు (టెక్టోనా గ్రాండిస్) దూకుడుగా వ్యాపించాయి. దాంతో సహజమైన గడ్డి భూములు, పొదలతో కూడిన అడవులు ఏకరూప టేకు పంటలకు దారితీశాయి. భారతదేశంలో లేని యూకలిప్టస్, ఇతర అన్యదేశ చెట్లను సుమారు 1790 నుండి బ్రిటిష్వాళ్లు పరిచయం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా నుండి తెచ్చిన దేవదారు చెట్లను హిమాలయ ప్రాంతంలో జిగురు కోసం; ఆస్ట్రేలియా నుండి తెచ్చిన అకేసియా చెట్లను కలప, మేత కోసం నాటారు. ఈ జాతులలో ఒకటైన, ‘వాటిల్’ (అకే సియా మియర్న్సి– ఒక తుమ్మ రకం)ని 1861లో కొన్ని లక్షల మొక్కలతో పశ్చిమ కనుమలలోని నీలగిరి జిల్లాలో ప్రవేశపెట్టారు. వాటిల్ అప్పటి నుండి ఆక్రమించే మొక్కగా మారి, ఈ ప్రాంతంలోని గడ్డి భూములను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా, దేవదారు హిమాలయాలలో చాలావరకు వ్యాపించి, స్థానిక ఓక్(సిందూర) చెట్లను స్థానభ్రంశం చేసింది. మధ్య భారతదేశంలోని స్థానిక గట్టి చెక్క అయిన సాల్ స్థానంలోకి టేకు వచ్చింది. ఓక్, సాల్ రెండూ ఇంధనం, మేత, ఎరువులు, ఔషధం, నూనె కోసం విలువైనవి. వీటినీ, మేత భూమినీ కోల్పోవడం చాలా మందిని పేదలుగా మార్చింది. ఏవి పనికొస్తాయి? ‘బాన్ ఛాలెంజ్’ కింద 2030 నాటికి సుమారు 2.1 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. భారత ప్రభుత్వం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) 2018లో విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టులో దాదాపు ఒక కోటి హెక్టార్ల మేరకు అడవులు పునరుద్ధరణలో ఉన్నాయని పేర్కొన్నారు. చెట్లతో కప్పబడిన భూమి విస్తీర్ణాన్ని పెంచడంపై పెడుతున్న ఈ దృష్టి, భారత జాతీయ అటవీ విధానంలో ప్రతిఫలిస్తోంది. ఇది దేశంలోని 33 శాతం విస్తీర్ణంలో చెట్లను పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ విధానంలోని పథకాలలో యూకలిప్టస్ లేదా వెదురు వంటి ఒకే జాతితో కూడిన తోటలు ఉంటాయి. ఇవి వేగంగా పెరుగుతాయి, చెట్లు కప్పే స్థలాన్ని త్వరగా పెంచుతాయి. కొన్నిసార్లు ఈ చెట్లను గడ్డి భూములు, చెట్ల వ్యాప్తి సహజంగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో నాటారు. ఫలితంగా మేతకోసం, ఇతర ఉత్పత్తుల కోసం ఈ పర్యావ రణ వ్యవస్థలపై ఆధారపడిన గ్రామీణ, స్థానిక ప్రజలకు హాని కలుగు తోంది. అన్యదేశ చెట్లను నిరంతరం నాటడం వల్ల 200 ఏళ్ల క్రితం వాటిల్ మాదిరిగానే కొత్త ఆక్రమణ జాతులు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి సానుకూల కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం ఒకప్పుడు సాంప్రదాయ వినియోగంలో ఉన్న అటవీ ప్రాంతాలను నిర్వహించేందుకు గ్రామసభలకు అధికారం ఇచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అనేక గ్రామసభలు క్షీణించిన అడవులను పునరుద్ధరించాయి. పైగా వాటిని బీడీలు చుట్టడానికి ఉపయోగించే తునికి ఆకులకు స్థిరమైన వనరుగా మార్చాయి. అలాగే గుజరాత్ కbŒ∙గడ్డి భూముల్లో, 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ‘పిచ్చి చెట్లను’ తొలగించడం ద్వారా అక్కడి సమాజాలు గడ్డి భూములను పునరుద్ధరించగలిగాయి. ప్రయోజనాలూ ముఖ్యమే! అటవీ పునరుద్ధరణ ప్రయత్నాల విజయాన్ని చెట్ల విస్తృతితో మాత్రమే కొలవలేము. ‘అడవి’ గురించిన భారత ప్రభుత్వ నిర్వచనం ఇప్పటికీ ఏకరూప చెట్టు జాతులు, çపళ్ల తోటలు, ఆఖరికి వెదురు (నిజానికి ఇది గడ్డి కుటుంబానికి చెందినది) లాంటిదానికి మాత్రమే పరిమితమై ఉంది. దీనర్థం ద్వైవార్షిక అటవీ సర్వేలు ఎంత సహజ అడవులను పునరుద్ధరించారో లెక్కించలేవు; స్థానిక చెట్లను పోటీ జాతులతో స్థానభ్రంశం చేయడం వల్ల కలిగిన పరిణామాలను తెలియజేయలేవు; అన్యదేశ చెట్లు మన సహజమైన గడ్డి భూములను ఎంత ఆక్రమించాయో గుర్తించలేవు. పైగా అవి పునరుద్ధరించిన అడ వులుగా తప్పుగా నమోదు అవుతాయి. సహజ అటవీ పునరుత్పత్తిని, అలాగే కలప, ఇంధనం కోసం చెట్ల పెంపకాన్ని రెండింటినీ ప్రోత్సహించాలి. అయితే ఇతర పర్యావరణ వ్యవస్థలు, ప్రజల మీద వీటి ప్రభావాన్ని తప్పక పరిశీలించాలి. నాటు తున్న రకాలు దురాక్రమించేవిగా మారకుండా జాగ్రత్తగా ఎంచు కోవడం దీంట్లో భాగం. అటవీ హక్కులు, స్థానిక జీవనోపాధి, జీవ వైవిధ్యం, కర్బన నిల్వలపై దాని ప్రభావాల పరంగా చెట్ల కవరేజిని పెంచడానికి సంబంధించిన లక్ష్యాన్ని అంచనా వేయాలి. చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించి నట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పున రుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగు తున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది. ధనపాల్ గోవిందరాజులు వ్యాసకర్త పరిశోధకుడు, మాంచెస్టర్ యూనివర్సిటీ (‘ది కాన్వర్జేషన్’ సౌజన్యంతో) -
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023 -
అడవుల్లో బతికేస్తున్న పాపులర్ టిక్టాకర్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్టాక్’లో షేర్ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్. ‘టిక్టాక్’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Überleben® (@uberleben.co) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust)