● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
రామకృష్ణాపూర్: ఓటు వేసిన కరీంనగర్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ దామెర్ల ప్రీతిపెద్దపల్లి సెగ్మెంట్లో పోలింగ్ శాతం(రెండు గంటలకోసారి) నియోజకవర్గం ఓటర్లు 9.00 11.00 1.00 3.00 5.00 6.00 చెన్నూరు 1,93,778 9.49 26.35 45.45 58.65 68.00 68.13
బెల్లంపల్లి 1,76,514 12.12 30.52 50.42 63.00 70.53 70.96
మంచిర్యాల 2,78,738 10.49 24.87 41.40 52.97 59.78 59.78
ధర్మపురి 2,30,786 8.70 28.11 47.15 60.23 69.83 73.34
రామగుండం 2,19,723 7.64 21.46 38.78 47.10 55.18 61.59
మంథని 2,39,699 10.17 27.41 48.21 56.2 61.55 69.90
పెద్దపల్లి 2,57,192 9.24 25.57 44.40 55.6 64.80 71.34
మొత్తం 15,96,430 9.69 26.33 45.12 56.25 63.86 68.23దండేపల్లి: వెల్గనూర్లో యువతుల తొలి ఓటుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. చాలాచోట్ల ఐదు నుంచి పది నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. అధికారులు అప్రమత్తమై పరిష్కరించారు. ఎన్నికల సంఘం జిల్లాను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించడంతో సాయంత్రం నాలుగు గంటల వరకే ఓటింగ్కు అవకాశం కల్పించారు. ఆ తర్వాత వచ్చిన వారిని అధికారులు వెనక్కి పంపించారు. అప్పటికే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లకు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాసులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా స్వతంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మందకొడిగా మొదలై..
జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం మొదలైనప్పటికీ పోలింగ్ మందకొడిగా సాగింది. క్రమంగా పుంజుకుంటూ సాయంత్రం 3గంటల వరకు పెరిగింది. నాలుగు గంటల వరకే సమయం ఉండడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన ఓటర్లకు అనుమతి నిరాకరించారు. జిల్లా కేంద్రంతోపాటు చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో కొందరు సమయం ముగిశాక వచ్చి వెనుదిరిగారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పోల్చి చూస్తే ఈసారి తక్కువగానే నమోదైంది.
జిల్లాలో 66.53శాతం
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ముగిసే వరకు 66.53శాతం పోలింగ్ నమోదైంది. చెన్నూర్ నియోజకవర్గంలో 68శాతం, బెల్లంపల్లిలో 70.96, మంచిర్యాలలో 59.78శాతం నమోదయ్యాయి. జిల్లాలో అత్యల్పంగా మంచిర్యాల నియోజకవర్గంలో నమోదైంది. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో 81.19శాతం, చెన్నూరులో 80.07శాతం, మంచిర్యాలలో 69.16 శాతం నమోదు కాగా, ఈసారి పోలింగ్ మరింత తగ్గింది. మోడల్ పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటింగ్ శాతం తక్కువగానే నమోదైంది. ఇక పెద్దపల్లి లోక్సభ పరిఽధిలో 68.23శాతమే పోలింగ్ నమోదైంది.బెల్లంపల్లిలో పోలైన ఓట్లు బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,76,514 మంది ఓటర్లకు గాను 1,25,255 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 87,283 మంది పురుష ఓటర్లకు గాను 63,449 మంది, మహిళా ఓటర్లు 89,219 మందికి గాను 61,801 మంది, ఇతరులు 12మందికి గాను ఐదుగురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 70.96గా నమోదైనట్లు రాత్రి 11గంటల తర్వాత అధికారులు ప్రకటించారు.