Former Pakistan Diplomat’s Daughter, 27, Murdered In Islamabad - Sakshi
Sakshi News home page

పాక్‌లో దారుణం: మాజీ దౌత్యవేత్త కుమార్తె హత్య..

Published Thu, Jul 22 2021 12:40 PM | Last Updated on Thu, Jul 22 2021 3:36 PM

Pakistan Ex Diplomats Daughter 27 Murdered In Islamabad - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ సామాన్యులకే కాదూ.. వీవీఐపీలకు అక్కడ రక్షణ లేకుండా పోయింది.  తాజాగా, పాక్‌ మాజీ దౌత్యవేత్తగా కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ వార్త దేశంలో సంచలనంగా మారింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన శౌకత్‌ ముకద్దమ్‌ గతంలో దక్షిణ కొరియా, కజికిస్తాన్‌లకు దౌత్యావేత్తగా పనిచేశారు.

ఈ క్రమంలో కొంత మంది దుండగులు.. ఆయన కుమార్తె నూర్‌ ముకద్దమ్‌ను కిడ్నాప్‌చేసి అతి దారుణంగా చంపేశారు. ఆమె మృతదేహన్ని ఇస్లామాబాద్‌లోని ఎఫ్‌ 4 సెక్టార్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, పాక్‌ పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, కుటుంబ సభ్యులు ఈ హత్య కేసులో ఆమె మిత్రుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జహీర్‌ జఫ్పర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనతో పాకిస్తాన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

కొన్ని రోజుల క్రితమే.. పాక్‌లోని అఫ్గాన్‌ దౌత్యవేత్తగా పనిచేసిన నజిబుల్లా అలిఖిల్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌ను ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైనా సిల్‌సిలా.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఈ చర్యలను పలుదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే దీనివెనుక ఉన్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పాక్‌ మద్దతుతోననే తాలిబన్లు దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని పలుదేశాలు ఆరోపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement