
రహదారి మీద, రైలు పట్టాల మీద దూసుకెళ్లే వాహనమిది. ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడల్ వెహికల్(డీఎంవీ) ఇదేనని జపాన్ చెబుతోంది. టొకుషిమా పరిధిలోని కయో ప్రాంతంలో ఇది శనివారం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనం రహదారిపై వెళ్లేపుడు రబ్బరు టైర్లను, పట్టాలపై ప్రయాణించేటపుడు ఇనుప చక్రాలను వాడుతుంది. ఒకేసారి 21 మంది ప్రయాణించవచ్చు.