
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
బుగ్గారం(ధర్మపురి): ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఓపీ సేవలు, ఐపీ సేవలు, ఫార్మసీ, వివిధ రికార్డులు పరిశీలించారు. రూ.రెండు కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆవరణలో పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళా కేంద్రంలో మహిళలకు వైద్యపరీక్షలపై అడిగి తెలుసుకున్నారు. థైరాయిడ్, క్యాన్సర్, ఆస్తమా వంటి పరీక్షలను ఎంతమందికి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ కృష్ణచైతన్య, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, హెల్త్ సూపరింటెండెంట్ రవి ఉన్నారు.