ఐటీ ఎగవేత! | - | Sakshi
Sakshi News home page

ఐటీ ఎగవేత!

Published Sat, Feb 22 2025 1:56 AM | Last Updated on Sat, Feb 22 2025 1:51 AM

ఐటీ ఎగవేత!

ఐటీ ఎగవేత!

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

అక్రమార్జనకు అవకాశం..

వేతన స్థిరీకరణ సందర్భంలో, ఇప్పుడు పన్ను మినహాయింపు బిల్లుల సమర్పణకు డీడీఓలకు, ట్రెజరీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆయా బిల్లుల సమర్పణకు వెళ్లిన డీడీఓల నుంచి ట్రెజరీ ఉద్యోగులు కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సాకుతో అసలు విషయం తెలిసిన డీడీఓలు సైతం ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి అందినంత దండుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.

నకిలీ బిల్లులు..

ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ ప న్ను నుంచి మినహాయింపు పొందే ందుకు అనేక రకాల నకిలీ బిల్లులు సమర్పిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలో చెల్లించే వారి పిల్లలు ఫీజులకు అదనంగా రెండింతలు పెంచి, ఎల్‌ఐసీ, ఇతర ఇన్సూరెన్స్‌ పాలసీలు లేకున్నా నకిలీ రశీదులు పెట్టినట్లు సమాచారం. లోన్లు లేకున్నా తీసుకున్నట్లు రశీదులు పెడుతున్నారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement