ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 35 మంది ఫిర్యాదులు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు
గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 8 ఫిర్యాదులు అందాయి. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై వివరించారన్నారు. ఇందుల్లో భూ సంబంధ, సైబర్ మోసాలు, వేధింపులపై ఫిర్యాదులు అందాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment