-
కల్లు మాఫియా..!
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024వివరాలు 8లో uగద్వాల రూరల్: కల్లుదందాకు గద్వాల పెట్టింది పేరు. అధికారంలో ఎవరుంటే వారు దర్జాగా దందాను కొనసాగిస్తారు. తాజాగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఓ అడుగు ముందుకు వేశారు. తమకున్న అధికార బలంతో ఏకంగా కల్లుదుకాణం స్థానంలో ఎలాంటి అనుమతులు లేకుండా కల్లు డిపోను ఏర్పాటు చేసుకున్నారు. ఈడిపో నుంచి సమీప గ్రామాలకు అక్రమంగా కల్లు తరలిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. తమ అక్రమ సంపాదనకు ఎలాంటి అడ్డు రాకుండా అన్ని సెటిల్మెంట్లు చేసుకున్నారు. కల్లు దందాతో ప్రతినెలా సుమారు రూ.35 లక్షలకు పైగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తమకు సహకరిస్తున్న నియోజకవర్గ ముఖ్యనేత, ఆబ్కారీ శాఖలోని అవినీతి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రహస్యంగా కొనసాగిస్తున్న అక్రమ కల్లుడిపో దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రూ.లక్షలు కొల్లగొట్టేందుకు స్కెచ్.. రూ.6 లక్షలకు లైసెన్స్ ఉన్న కల్లు దుకాణాన్ని దక్కించుకున్న సదరు నాయకులు.. రూ. లక్షలు కొల్లగొట్టేందుకు పెద్ద స్కెచ్ వేశారు. ఆబ్కారీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తమకున్న అధికార పలుకుబడితో ఏకంగా కల్లుడిపోను ఏర్పాటుచేసి, అక్రమ దందాకు తెరలేపారు. ఫిబ్రవరి నుంచి అక్రమ కల్లుదందా నిరాటకంగా కొనసాగుతోంది. నిత్యం 250 కేసుల కల్లు తయారీ.. కల్లుడిపోలో నిత్యం 250 కేసుల కల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. అందులో 100 కేసుల కల్లు స్థానికంగా జమ్మిచేడులోనే విక్రయిస్తుండగా.. మిగిలిన 150 కేసుల కల్లును గద్వాల మండలంలోని చుట్టుపక్కల పల్లెలతో పాటు మల్దకల్ మండలంలోని రెండు, మూడు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్లు కేసులను ఎలాంటి అనుమతులు లేని ఓ బొలేరో వాహనంలో దర్జాగా తరలిస్తున్నారు. రోజుకు రూ. 1.25 లక్షల ఆదాయం.. కల్లుడిపో నుంచి విక్రయించే 250 కేసుల కల్లు ద్వారా రోజు సుమారు రూ. 1.25 లక్షల వరకు సంపాదిస్తున్నారన్నారు. ఈ లెక్కన నెలకు సుమారు రూ. 35 లక్షలకు పైగా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఆబ్కారీ శాఖ అధికారులకు, కల్లుడిపో ఏర్పాటుకు సహకరించిన ముఖ్యనేతకు నెలవారీ మామూళ్ల రూపంలో సుమారు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు అందుతున్నట్లు తెలిసింది. ఈ అక్రమ కల్లుడిపో ఆబ్కారీ శాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండటం విశేషం. న్యూస్రీల్ముఖ్యనాయకుడితోస్థానికుల మొర.. కల్లుడిపో ద్వారా రూ.లక్షలు సంపాదిస్తూ, తమకు ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని జమ్మిచేడుకు చెందిన కొందరు గద్వాల నియోజకవర్గ ముఖ్యనాయకుడితో మొర పెట్టుకోగా.. పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. అయితే నెలరోజులు గడిచినా సదరు ముఖ్యనాయకుడి నుంచి ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో కల్లుసొసైటీ నిర్వాహకుడే మేలని చర్చించుకోవడం కొసమెరుపు. రూ. 6 లక్షలకు సెటిల్మెంట్.. జమ్మిచేడులో రెండు కల్లుదుకాణాలు కొనసాగుతుండటం.. ఆశించిన స్థాయిలో లాభాలు దక్కకపోవడంతో సదరు నాయకులు నిరాశకు గురయ్యారు. దీంతో కల్లుదుకాణాన్ని తమకు అప్పగించాలని లైసెన్స్ ఉన్న కల్లుసొసైటీ నిర్వాహణ దారుడితో బేరసారాలు నెరిపారు. కల్లుదుకాణ సొసైటీ నిర్వాహణ సమయం దసరా పండుగ వరకు ఉందని.. అందుకు సంబంధించిన డబ్బులు కూడా సొసైటీ సభ్యులకు ముందుగానే చెల్లించానని.. మధ్యలో సొసైటీని వదిలేస్తే ఆర్థికంగా నష్టపోతానని సదరు నిర్వాహకుడు పాతపాలెం, గోన్పాడు గ్రామాలకు చెందిన నాయకులతో చెప్పినట్లు సమాచారం. సొసైటీని పూర్తిగా తమకే ఇవ్వాలంటే మీకెంత ఇవ్వాలని ప్రతిపాదించి, పలుమార్లు బేరాలు కొనసాగించగా.. చివరికి రూ.6 లక్షలకు సెటిల్మెంట్ అయినట్లు తెలిసింది. జమ్మిచేడులో కల్లు దుకాణం బదులు డిపో ఏర్పాటు సమీప గ్రామాలకుయథేచ్ఛగా కల్లు సరఫరా దర్జాగా అక్రమ దందాకుతెరలేపిన అధికార పార్టీనాయకులు నియోజకవర్గ ముఖ్యనేత, ఆబ్కారీ శాఖకు పెద్దఎత్తున ముడుపులు? సమాచారం లేదు.. జమ్మిచేడులో కల్లు దుకా ణం నిర్వహించుకునేందుకు మాత్రమే సొసైటీకి అనుమతులు ఇచ్చాం. అక్కడ కల్లు దుకాణం స్థానంలో కల్లుడిపో ఏర్పాటు చేసిన విషయం తెలియదు. దీనిపై విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. కల్లుడిపోను తొలగిస్తాం. మాకు ఎలాంటి ముడుపులు ముట్టడం లేదు. – అరుణ్కుమార్, ఆబ్కారీ శాఖ ఈఎస్ -
ముగిసిన బండారు ఉత్సవం
ధరూరులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బండారు మహోత్సవం సోమవారంతో ముగిసింది. మూడు రాష్ట్రాలకు చెందిన కురువ కులస్తుల్లోని ఆదిగొండ గోత్రం వారు బండారు మహోత్సవానికి పెద్దఎత్తున తరలిరావడంతో స్థానిక పెద్ద చెరువు జనసంద్రంగా మారింది. ముందుగా బీరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవుడి పట్టం కట్టడం, బండారు (పసుపు) చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. – ధరూరు -
ప్రచార హోరు..
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. బిజినేపల్లి మండలకేంద్రంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ నేపథ్యంలో అవసరైన ఏర్పాట్లను పార్టీ నేతలు సిద్ధం చేశారు. ఈ సభకు నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. లక్షమందికి పైగా జనసమీకరణ చేపట్టి సీఎం సభను విజయవంతం చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ఎమ్మెల్యేలు జనసమీకరణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి ఈనెల 25న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ హాజరుకానుండటంతో పార్టీల పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26, 27వ తేదీల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. 26న బస్సుయాత్ర ద్వారా మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చేరుకొని రోడ్షో నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రికి అక్కడే బస చేసి, 27న సాయంత్రం 6 గంటలకు జిల్లాకేంద్రంలో నిర్వహించే భారీ రోడ్షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు కందనూలుకుముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజినేపల్లిలోభారీ బహిరంగసభ 26, 27న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బస్సుయాత్ర -
No Headline
వనపర్తి సంస్థానం చివరి రాజుగా జనుంపల్లి రాజారామేశ్వర్రావు (1944 సంవత్సరం)లో పట్టాభిషిక్తుడయ్యారు. 21 ఏళ్ల వయసులో రాజ్యపాలన చేపట్టిన ఆయన నిజాం ప్రభువుకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించారు. 1947లో స్వాతంత్య్రం రావడంతో.. వనపర్తి సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసేందుకు రామేశ్వర్రావు అప్పటి ప్రధాని నెహ్రూతో ఒప్పందం చేసుకున్నారు. 1949లో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరి, పలు ఆఫ్రికన్ దేశాలలో భారత ప్రభుత్వానికి కమిషనర్గా పనిచేశారు. 1957లో దేశవ్యాప్తంగా జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 1962లో ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు ఏర్పాటు చేశారు. అప్పుడు కొత్తగా ఏర్పడిన నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1967లో తిరిగి మహబూబ్నగర్లో పోటీ చేసి మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. అనంతరం 1972, 1977లో జరిగిన ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 1977లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 42 పార్లమెంట్ స్థానాల్లో 40 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అందులో మహబూబ్నగర్ ఎంపీగా రాజా రామేశ్వర్రావు విజయకేతనం ఎగురవేశారు. 1977లో కేంద్రంలో ఏర్పడిన జనతా ప్రభుత్వం మూడేళ్లకే పడిపోవడంతో 1980లో మద్యంతర ఎన్నికలు వచ్చాయి. నాడు ఇందిరా కాంగ్రెస్గా పార్టీని వేరుచేసిన ఇందిరాగాంధీ మహబూబ్నగర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాగా.. ఐదుసార్లు వరుసగా గెలుస్తున్న రామేశ్వర్రావుపై పోటీచేయడం ఎందుకని మెదక్ సిట్టింగ్ ఎంపీ మల్లికార్జున్గౌడ్ను పాలమూరులో పోటీకి నిలబెట్టి.. ఆమె మెదక్లో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో రామేశ్వర్రావుపై మల్లికార్జున్ సంచలన విజయం సాధించారు. -
వస్తున్నాం.. లింగమయ్యా
అచ్చంపేట/అమ్రాబాద్: తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభయ్యాయి. పున్నమికి ముందురోజు మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల బాటపట్టారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా..’ అంటూ దట్టమైన అడవిలో లోయలు, గుట్టలు దాటుకుంటూ సాహస యాత్రలో ఉత్సాహంగా ముందుకు కదిలారు. గతంతో పోల్చితే సోమవారం భక్తుల తాకిడి పెద్దగా కనిపించలేదు. భగభగమండుతున్న ఎండల్లో పగటి వేళ ప్రయాణం చేయలేకపోవడం ఒకటైతే.. అటవీ శాఖ రాత్రివేళ భక్తులను అనుంతిచకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. మరోవైపు అటవీశాఖ ఐదురోజుల జాతరను మూడురోజులకు కుదించడం, రాత్రి సమయంలో భక్తులను అనుమతించకపోవడంతో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకొనేందుకు భక్తులు పగలే బారులుతీరారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇరుకై న కొండ, కోనల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు ఆచరించి.. లింగమయ్యను దర్శించుకొని తరించారు. బారులుతీరిన వాహనాలు ఫర్హాబాద్ నుంచి రాంపూర్ చెంచుపెంట వరకు వాహనాలు బారులుదీరాయి. మరోమార్గమైన అప్పాయిపల్లి– గిరిజన గుండాల వద్ద జన సందోహం నిండుగా కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లోయలో పైనుంచి జాలువారుతున్న నీటి ధారలో యువకులు కేరింతలు కొడుతూ సేదతీరారు. లింగమయ్యను దర్శించుకునే క్రమంలో అలసిపోయిన భక్తులు పొంచి ఉన్న ప్రమాదాలను లెక్క చేయకుండా చెట్లు, పుట్టలు, గుట్టల నడుమ సేదతీరుతున్నారు. ఆలయం, జలపాతం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా వలంటీర్లు సహకారం అందిస్తున్నారు. అన్నదానం.. తాగునీటి వసతి సలేశ్వరం వచ్చే భక్తుల కోసం మోకాళ్ల కురువ, అప్పాయిపల్లి మార్గంలోని గిరిజన గుండాల వద్ద స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, చలివేంద్రాలు భక్తులను ఆదుకుంటున్నాయి. అల్పాహారం మొదలుకొని మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనాలు, రాగి అంబలి, మజ్జిగ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్ చెక్పోస్టు, పుల్లాయిపల్లి బేస్ క్యాంపు, రాంపూర్ పెంట, మోకాళ్ల కుర్వు (సలేశ్వరం), లింగాల మండలం అప్పాయిపల్లి, గిరిజన గుండాల వద్ద 5 వేల లీటర్ల వాటర్ ట్యాంకులు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతలు ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలతో పాటు 20 ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. మూడు రోజులపాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డీఈ హేమలత తెలిపారు. నిరంతర పర్యవేక్షణ పోలీస్, అటవీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాయి. సీసీ, ట్రాప్ కెమెరాల ద్వారా అడవి మార్గంలో నిరంతర పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్– రాంపూర్– సలేశ్వరం క్షేత్రం వరకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. పుల్లాయిపల్లి వరకే బస్సులు సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అయితే పుల్లాయిపల్లి పెంట వరకు మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. అక్కడి నుంచి మోకాళ్ల కురువ చేరుకునేందుకు 50 ఆటోలు అందుబాటులో ఉంచారు. రాంపూర్ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి, వర్షం పడితే కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుస్తుగా పుల్లాయిపల్లి వరకు బస్సులను అనుమతించారు. 20 నిమిషాలు ఒక బస్సు చొప్పున ప్రయాణికులకు వీలుగా నడిపిస్తున్నారు. సోమవారం అచ్చంపేట డిపో నుంచి 16, నాగర్కర్నూల్ 23, కొల్లాపూర్ 4, కల్వకుర్తి 4 బస్సుల చొప్పున మొదటి రోజు పుల్లాయిపల్లి వరకు బస్సులు నడిపించారు. వైభవంగా ప్రారంభమైన సలేశ్వరం ఉత్సవాలు మొదటిరోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు పగటిపూట అనుమతి, ఎండల తీవ్రతతో అవస్థల పాలు తెలంగాణ అమరనాథ్ సాహస యాత్రకు క్యూకట్టిన జనం నట్టడవిలో మార్మోగుతున్న లింగమయ్యనామస్మరణ -
జమ్మిచేడులో వాస్తవ పరిస్థితి ఇదీ..
జిల్లా కేంద్రానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మిచేడులో ఓ కల్లు దుకాణానికి ఆబ్కారీ శాఖ నుంచి లైసెన్స్ ఉంది. ఈసొసైటీలో సుమారు 180 నుంచి 200 మంది వరకు సభ్యులుగా ఉండగా.. కల్లు దుకాణాన్ని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నిర్వహించేవారు. ఈదుకాణం ద్వారా జమ్మిచేడుతో పాటు, జమ్ములమ్మ జాతరలో కూడా కల్లు విక్రయాలు కొనసాగుతుండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, అధికార పార్టీకి చెందిన కొందరి చూపు కల్లు దుకాణంపై పడింది. కల్లు దుకాణం ఏర్పాటు కోసం పోటీకి దిగారు. జమ్మిచేడులో అప్పటికే లైసెన్స్ ద్వారా కొనసాగుతున్న కల్లు దుకాణానికి పోటీగా ఎలాంటి అనుమతులు లేకుండా మరో కల్లుదుకాణం ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా పాతపాలెం, గోన్పాడ్ గ్రామాలకు చెందిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కీలకపాత్ర పోషించారనే ప్రచారం జోరుగా ఉంది. -
విజయమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలి
ఎర్రవల్లిచౌరస్తా: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే అంతిమ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ ఎంపీ, బీఎస్పీ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మందా జగన్నాథం అన్నారు. బీఎస్పీలో చేరిన సందర్భంగా గురువారం ఎర్రవల్లి మండలంలోని కొండేరులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలంతా ఏకదీక్షతో బాబా సాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ ఆశయాలకు అనుగుణంగా సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలన్నారు. అన్ని రంగాల్లో కూడా బహుజనులు పైకి రావడానికి అంబేద్కర్ చేపట్టిన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లి బీఎస్పీ ఉద్దేశాలను వివరించాలన్నారు. రేపటి నుండే కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి ఎం.జి కృష్ణ, జిల్లా అద్యక్షుడు రాంబాబు, నాయకులు రాజు, సునంద, యేసురాజు, సవరన్న, వెంకట్, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. -
బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు
గద్వాల రూరల్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ పార్టీ గెలుపును ఆపలేరని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ గద్వాల, అలంపూర్, వనపర్తి నియోజకవర్గాల బూత్ ఏజెంట్లు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వారు బీజేపీ పార్టీ గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12స్థానాలలో బీజేపీ పార్టీ గెలవబోతుందని అందులో నాగర్కర్నూల్ ఎంపీ స్థానం ఉందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే గెలుపు ఖాయమన్నారు. భరత్ప్రసాద్కు చిన్నవయసులోనే పార్టీ ఎంపీగా టికెట్ ఇవ్వడం జరిగిందని, 2లక్షల మెజారీటి తగ్గకుండా గెలిపించాలన్నారు. పదేళ్లకాలంలో కేంద్రప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అబయ్పాటిల్, బంగారు శృతి, రాంచంద్రారెడ్డి, డీకే స్నిగ్ధారెడ్డి, అప్సర్పాష, అశోక్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, జక్కా రఘునందన్రెడ్డి, రామాంజనేయులు, పద్మావతి, కృష్ణవేణి, జయశ్రీ, పాండు తదితరులు పాల్గొన్నారు. -
వనపర్తి కాంగ్రెస్లో వర్గపోరు
వనపర్తి: జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. కొత్త, పాత నేతలంటూ రెండు గ్రూపులయ్యాయి. ఆధిపత్యం కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎవరికి వారు సొంత క్యాడర్ను తయారు చేసుకునే ప్రయత్నం.. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తుండటం విభేదాలకు దారితీస్తోంది. ఈ విషయంపై రెండు వర్గాల నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మరికొందరు వ్యక్తిగతంగా తీసుకుని గుడి ఎక్కుదాం.. దేవుళ్లపై ప్రమాణం చేద్దామంటూ సామాజిక మాధ్యమాల వేధికగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొన్నాళ్లకే పార్టీ రెండుగా చీలడం.. సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసుకోవడం ప్రతిపక్ష పార్టీలు, ప్రజల దృష్టిలో పార్టీని చులకన చేశాయి. ఇటీవల పెబ్బేరు మండలం రంగాపూర్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి సమక్షంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధమైతే.. ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుని చిన్నారెడ్డి వేసిన పార్టీ కండువాలను లాగేశారు. వారు చేసిన అఘాయిత్యాలు మీకు తెలియవు.. అధికారం ఎక్కడుంటే అక్కడికి వచ్చే వారిని ప్రోత్సహించొద్దని చెప్పడంతో చిన్నారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా అదే తరహాలో గోపాల్పేట మండలం తాడిపర్తికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు చర్చలు చేసినట్లు సమాచారం తెలుసుకుని అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు గణేష్గౌడ్ వారిని పార్టీలో చేర్చుకోవద్దని.. పదేళ్లుగా తమపై అధికార జులూం చూపి కేసులు పెట్టి వేధించారని చెప్పేందుకు గురువారం స్థానిక తిరుమల హిల్స్లోని ఎమ్మెల్యే ఇంటికి అనుచరులతో కలిసి వచ్చారు. ఎమ్మెల్యేతో మాట్లాడుతూనే.. పక్కనే ఉన్న అదే మండలానికి చెందిన సత్యశీలారెడ్డి తమను ధూషించాడనే కోపంతో గణేష్ వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించాలని అగ్గిపెట్టె తీసి ఎమ్మెల్యే చేతికి ఇవ్వబోయారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన గన్మెన్లు అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గీయులు గణేష్గౌడ్తో పాటు ఆయన అనుచరులను పంపించాలంటూ ఘర్షణకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసి గణేష్గౌడ్ను అక్కడి నుంచి పంపించారు. సమస్య ఇలా మొదలైంది.. గతేడాది డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రసంగిస్తూ.. నవంబర్ 30 వరకు కాంగ్రెస్పార్టీలో ఉన్నవారే కొనసాగుతారని, నాయకులు సిఫారస్ చేస్తే తప్పా.. ఇతర పార్టీల వారిని చేర్చుకోనని బహిరంగంగా ప్రకటించారు. టికెట్ ఆశించి భంగపడిన డా. జి.చిన్నారెడ్డికి కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కేబినేట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవి కట్టబెట్టింది. దీంతో పదవి పొందిన ఆయన ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులను పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చేరికలకు గేట్లు ఎత్తినట్లు సంకేతాలు ఇవ్వడంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, పలువురు నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరడం మొదలెట్టారు. వర్గాన్ని పెంచుకునే ప్రయత్నంలో అప్పట్లో అధికారం ఉందని అడ్డగోలు కేసులు పెట్టించిన వారిని పార్టీలో చేర్చుకోవడం.. ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న వారు వాటిని వ్యతిరేకించడంతో ఘర్షణలు, ఆత్మహత్యయత్నంలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. పథకం ప్రకారమే.. పథకం ప్రకారమే వాళ్లు పెట్రోల్ తీసుకొని వచ్చారని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఒంటిపై పెట్రోల్ చల్లుకునే క్రమంలో తనపై కూడా పడిందని.. తనకు కూడా ప్రమాదం జరిగేది కదా అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరోదారి అన్నట్లుగా మారిన వైనం చేరికల విషయంలో రెండుగా చీలిక నాయకులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట పార్టీ గోపాల్పేట మండల అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం ముదిరిన విభేదాలు కష్టపడి పనిచేసే వారిని పట్టించుకోవడం లేదు.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు, ఇబ్బందులకు గురైన వారి మాట వినకపోవడంతోనే తాను ఒంటిపై పెట్రోల్ పోసుకున్నానని పార్టీ గోపాల్పేట మండల అధ్యక్షుడు గణేష్గౌడ్ అన్నారు. గురువారం గోపాల్పేట మండలం తాడిపర్తిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పదేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేశారని.. పార్టీలో చేర్చుకోవద్దని ఎమ్మెల్యేను కోరానని, అంతలోనే పక్కనున్న వారు తీవ్ర ఇబ్బందికర పదజాలంతో మాట్లాడటంతో మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకుని ఎమ్మెల్యేకు అగ్గిపెట్టె ఇచ్చానని చెప్పారు. భవిష్యత్లో కూడా వారిని పార్టీలో చేర్చుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నా రు. పార్టీలో గణేష్గౌడ్ కూడా కుటుంబ సభ్యుడేనని.. ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తులు పార్టీలో చేరినా భవిష్యత్లో ప్రమాదమేనన్నారు. జరిగిన విషయంపై ఎమ్మెల్యే పునరాలోచించాలని, స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకుని పార్టీలో చేర్చుకోవాలని కోరారు. -
ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా
అలంపూర్: మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం అలంపూర్లోని 1, 7, 9 వార్డుల్లో కలెక్టర్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ భీమేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ సరస్వతి, ఇంజనీర్ మేఘనాథ్గౌడ్ పర్యటించి నీటి సమస్య గురించి ఆరా తీశారు. అలాగే, తుంగభద్ర నదిలో పరిశీలించారు. అనంతరం మున్సిపల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరా చేయాలని, రాబోయే రెండు నెలలు తాగునీటి సరఫరా కీలకంగా ఉంటుందని, ఇందుకోసం రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, చేతి పంపులు, బోరు మోటార్లు, పైపు లైన్ల లీకేజీల మరమ్మతు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. పైప్లైన్ల లీకేజీల కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉండటంతో తక్షణమే మరమ్మతు చేపట్టాలన్నారు. తుంగభద్ర నదిలో నిలువ ఉన్న నీటిని పంపింగ్ చేసి గృహ అవసరాలకు వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల ఆకస్మిక తనిఖీ.. మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల, మన ఊరు మనబడి పథకం కింద ఎంపికై న ఈ పాఠశాలల్లో చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తాగునీరు, ఫ్లోరింగ్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోగా పూర్తి చేయాలని సూచించారు. వీరితోపాటు ఎంపీడీఓ అబ్దుల్ జబ్బార్, ఎంఈఓ అశోక్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రానున్న రెండు నెలల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు అన్ని నీటి వనరులను వినియోగించుకోవాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
నామినేషన్ల జాతర..
మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 16,80,417 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 8,48,293, పురుష ఓటర్లు 8,32,080, ఇతరులు 44 మంది ఉన్నారు. ఈ మేరకు 1,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో సైతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 8,70,694, పురుష ఓటర్లు 8,64,034, ఇతరులు 45 మంది ఉన్నారు. ఈ మేరకు 2,057 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 స్థానాల్లోనూ త్రిముఖమే.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో త్రిముఖ పోరు కొనసాగనుంది. మహబూబ్నగర్ (జనరల్)లో బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి బరిలో ఉన్నారు. నాగర్కర్నూల్ (ఎస్సీ రిజర్వ్డ్)లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోని అలంపూర్కు చెందిన మాజీ ఎంపీ, సీనియర్ నేత మందా జగన్నాథం కాంగ్రెస్ను వీడి బీఎస్పీలో చేరగా.. ఆయన బరిలో నిల్చొన్న పక్షంలో ఈ స్థానంలో చతుర్మఖ పోటీ కొనసాగే అవకాశం ఉంది. ● లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ● 2 పార్లమెంట్ స్థానాల్లో తొలిరోజు 4 దాఖలు ● మహబూబ్నగర్లో బీజేపీ నుంచి డీకే అరుణ, మరో స్వతంత్ర అభ్యర్థి.. ● నాగర్కర్నూల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు భరత్ప్రసాద్, మల్లు రవి.. ● 25 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న స్క్రూటినీ.. మే 13న పోలింగ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి పాలమూరులోని రెండు పార్లమెంట్ స్థానాల్లో (మహబూబ్నగర్, నాగర్కర్నూల్) తొలిరోజు మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండు సెట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్కు సమర్పించారు. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్కుమార్కు అందజేశారు. ఈ నెల 25 వరకు నామినేషన్ పత్రాల స్వీకరణకు తుది గడువు కాగా.. 26న స్క్రూటినీ నిర్వహించనున్నారు. 29న ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ చేపట్టి అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. మహబూబ్నగర్ కాషాయమయం.. మహబూబ్నగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా పట్టణం అంతా కాషాయమయంగా మారింది. నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి బయలు దేరే క్రమంలో ముందుగా ఆమె గోమాతకు పాదపూజ చేశారు. కాటన్ మిల్లు వద్ద వెంకటేశ్వర ఆలయంలో స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు కళాకారుల ఆటపాటల మధ్య రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రవీందర్రెడ్డితో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత అన్నపూర్ణ గార్డెన్స్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా క్లాక్టవర్ వరకు ర్యాలీ సాగింది. నాగర్కర్నూల్లో సందడి లేకుండానే.. నాగర్కర్నూల్లో తొలిరోజు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అభ్యర్థులు మల్లు రవి, భరత్ ప్రసాద్ ఎలాంటి సందడి లేకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీరు ఆయా పార్టీల ముఖ్య నేతల సమక్షంలో మరో సెట్ దాఖలు చేయనున్నారు. అదే రోజున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడంతోపాటు కార్నర్ మీటింగ్లు, బహిరంగసభల ద్వారా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు. 23, 24, 25వ తేదీల్లో.. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఈ నెల 23న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మరోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ 24న నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ 25న మరో సెట్ దాఖలు చేయనుండగా.. ఈ కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరుకానున్నారు. నేడు చల్లా వంశీకి మద్దతుగా సీఎం రాక.. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. క్లాక్టవర్ చౌరస్తాలో నిర్వహించనున్న కార్నర్ మీటింగ్లో ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున శ్రేణులు తరలించేలా ఆయా నియోజకవర్గాల నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి నామినేషన్.. బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి గురువారం హైదరాబాద్లో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫాం అందుకున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ముఖ్యనేతల సమక్షంలో మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేలా ముందుకు సాగుతున్నారు. అదే రోజున భారీ ర్యాలీతో పాటు కార్నర్ మీటింగ్కు సమాయత్తమవుతున్నారు. -
సమన్వయంతో పనిచేయాలి..
గద్వాల రూరల్: వేసవిలో జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మిషన్భగీరథ అధికారులు, జిల్లా పరిషత్, పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు, అయిజ, మానోపాడు, ఇటిక్యాల మండలాల్లోని గ్రామపంచాయతీల వారీగా గత సమీక్షలో చర్చించి చేపట్టిన అవసరమైన పనులకు సంబంధించి వివరాలు అడిగితెలుసుకున్నారు. గ్రామాలలో ప్రజల అవసరాలకు ఎన్ని లీటర్ల నీరు అవసరం ఎంత సరఫరా చేస్తన్నాం అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదన్నారు. అదేవిధంగా అవసరమైన ప్రతిచోట చేతిపంపులు, బోరుమోటర్లు, పైపులైన్ల మర్మమత్తులు చేపట్టి సక్రమంగా తాగునీటి సరఫరా చేయాలన్నారు. వచ్చే రెండునెలల పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో మిషన్భగీరథ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి, ఈఈలు శ్రీధర్రెడ్డి, భీమేశ్వర్రావు, డీఆర్డీవో నర్సింగ్రావు, ఇంచార్జీ డీపీవో వెంకట్రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. -
జాగ్రత్తలు తప్పనిసరి
వేసవిలో మానవపాడు: వేసవి ఎండల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి శశికళ అన్నారు. గురువారం మండలకేంద్రంలో వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసరమైతేనే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు బయటకు రావొద్దని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, సరిపడా నీరు తాగాలని, బయటికి వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కాన్పులు జరగాలని, వేసవికాలం సందర్భంగా బుధవారం, శనివారం ఉదయం 8గంటలలోపు వ్యాక్సిన్ అందిచాలన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది సత్యనారాయణ, చంద్రన్న, ఫార్మాసిస్ట్ తిరుమల్రావు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ రూల్స్ అమలుకు చర్యలు చేపట్టాలి గద్వాల న్యూటౌన్: రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సర్వీస్ రూల్స్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వీస్ రూల్స్ అమలుకు నోచుకోకపోవడం వల్ల విద్యాశాఖలో ఎంఈఓ, డైట్ లెక్చరర్స్, డీఈఓ పోస్టులు 95 శాతం ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దీనివల్ల పర్యవేక్షణ కొరవడి విద్యాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని అన్నారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు, లోకల్క్యాడర్ ఆర్గనైజేషన్ 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వార జరగడం వల్ల సర్వీస్రూల్స్ రూపొందించడం సులభమని, దీని ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్రప్రభుత్వ అధికారి మాణిక్ రాజ్కన్నన్ తమ సంఘం పక్షాన కోరామని తెలిపారు. మల్టీజోన్–2లో జీహెచ్ఎం, ఎస్ఏ విభాగాల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి స్నేహ పూర్వక వాతావరణాన్ని కల్పించడం శుభసూచకమన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని, పదవీ విరమణ బెనిఫిట్స్ను నగదు రూపంలో ఇవ్వాలన్నారు.సంఘం జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, గౌరవ అద్యక్షుడు నర్సింహ్మరెడ్డి, పరమేశ్వర్రెడ్డి, ఏబేలు, శివశంకర్రెడ్డి, ప్రబాకర్, సలాంఖాన్ పాల్గొన్నారు. వేరుశనగ @ 6,526 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 863 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6526, కనిష్టం రూ.2699, సరాసరి రూ.5069 ధరలు పలికాయి. అలాగే, 52 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.5529, కనిష్టం రూ.3016, సరాసరి రూ.5301 ధరలు వచ్చాయి. 18 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.9706, కనిష్టం రూ.8069, సరాసరి రూ. 9666 ధరలు పలికాయి. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
గట్టు: బాల్యవివాహలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి అన్నారు. గురువారం మండలంలోని బల్గెరలో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల సంరక్షణ చట్టాలు, బాల్య వివాహలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. బాల్య వివాహం చేస్తునట్లు తెలిస్తే గ్రామంలో ఉండే బాలల పరిరక్షణ కమీటీకి లేదా 100 లేదా 1098 సమాచారం అందించాలని సూచించారు. బాలల లైంగిక వేధింపుల చట్టం 2012 గురించి ఆమె వివరాలు తెలియజేశారు. సీడీపీఓ కమలాదేవీ మాట్లాడుతూ సామాజిక మాద్యమాల వల్ల పిల్లలు చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశం ఉందని, తల్లిదండ్రులు కేవలం మంచి విషయాల కోసం మాత్రమే పిల్లలు ఫోన్లు ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళా రక్షణ చట్టాలు, 181, 1098 టోల్ఫ్రీ నంబర్లపై ఆమె అవగహన కల్పించారు. అనంతరం బేటీ బచావో–బేటీ పఢావో పై ప్రతిజ్ఞ చేయించారు. డీసీపీఓ నర్సింహులు, జోష్న పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కల్లోలం
గద్వాల రూరల్: నడిగడ్డ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు మరింత ముదిరాయి. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో ఎడముఖం పెడముఖంగా ఉంటూ వర్గాలుగా విడిపోయిన జెడ్పీ చైర్పర్సన్ సరిత, బండ్ల చంద్రశేఖర్రెడ్డి మధ్య మంగళవారం రాత్రి శాంతినగర్లో మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బుధవారం మల్దకల్లో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం సంచలనం రేపుతుంది. ● శాసనసభ ఎన్నికల ముందు జెడ్పీ చైర్పర్సన్ సరిత, బండ్ల చంద్రశేఖర్రెడ్డి ఇద్దరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇరువురు నేతలు ఐక్యంగానే ఉంటూ బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే ఫలితాలు వారి అంచనాలకు భిన్నంగా రావడంతో నాలుగు నెలలుగా ఇరువురి నేతల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు అంతర్గత చర్చలలో విమర్శలు ప్రతి విమర్శలతో ఆధిపత్య ప్రదర్శనకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమాచారాన్ని తమకు ఇవ్వడం లేదని బండ్ల చంద్రశేఖర్రెడ్డి సరితను గట్టిగా ప్రశ్నించడంతో పాటు ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన డబ్బుల వ్యవహారం వంటి అంశాలు కూడా చర్చకు రావడం, ఇది కాస్తా ముదిరి ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. జెడ్పీచైర్పర్సన్ సరితను దురుసు మాటలతో బాధపెట్టారని అక్కడే సరిత వర్గం నాయకులు బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై దాడికి యత్నించగా పక్కనే ఉన్న పార్టీ నాయకులు సర్ది చెప్పారు. ముష్టియుద్ధం.. కాగా.. బుధవారం ఎన్నికల ప్రచారాన్ని గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం నుంచి మొదలుపెట్టారు. ఈ క్రమంలో మల్దకల్లో ప్రచారరథం వాహనాన్ని ఎక్కేందుకు బండ్ల చంద్రశేఖర్రెడ్డి సోదరుడు బండ్ల రాజశేశేఖర్రెడ్డి యత్నించగా వాహనంపై నున్న సరిత వర్గం నాయకుడు పెద్దొడ్డి రామకృష్ణ వాహనాన్ని ఎక్కవద్దని అడ్డుపడ్డాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో అక్కడికి వచ్చిన బండ్ల చంద్రశేఖర్రెడ్డి వాహనం ఎక్కవద్దు అనడానికి నీవెవరూ? అంటూ వాహనంపైనున్న పెద్డొడ్డి రామకృష్ణను చొక్కాపట్టుకొని కిందికి లాగాడు. దీంతో కోపోద్రిక్తుడైన పెద్దొడ్డి రామకృష్ణ వెంటనే బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై దాడికి పాల్పడడంతో అతడు కిందపడిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనగా అక్కడే ఉన్న మరికొందరు పార్టీ కార్యకర్తలు బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై ముష్టిఘాతాలు కురిపించడంతో అతను గాయపడ్డారు. అక్కడే ఉన్న బండ్ల చంద్రశేఖర్రెడ్డి వర్గీయులు ఆయనను చికిత్స నిమిత్తం మల్దకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం..? గద్వాల కాంగ్రెస్లో చోటుచేసుకుంటున్న నేతల మధ్య అనైక్యత, వర్గవిభేదాలు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసేవిగా ఉండనున్నాయని విశ్లేషకులు అభ్రిపాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో విభేదాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై నడవాల్సిన నాయకులు ఇలా ముష్టియుద్దాలకు దిగడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల కాంగ్రెస్లో ముదిరిన విభేదాలు జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్సెస్ బండ్ల చంద్రశేఖర్రెడ్డి నిన్న శాంతినగర్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నేడు మల్దకల్లో ఇరు వర్గాల నేతల పరస్పర భౌతిక దాడులు నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికపై ప్రభావం? -
1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం..
మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ● బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు. చతుర్ముఖ పోటీ.. మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఎస్పీలో చేరడం.. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనుండడంతో పరిణామాలు రసవత్తరంగా మారాయి. మందా జగన్నాథం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరగా.. తాజాగా హస్తం వదిలి బీఎస్పీలోకి చేరారు. దీంతో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దించగా.. చత్రుముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి ఎంపీ రాముడు కుమారుడు భరత్ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, తాజాగా బీఎస్పీ నుంచి మందా జగన్నాథం పోటీ పడనున్నారు. నలుగురు అభ్యర్థుల్లో ఇద్దరు అలంపూర్ నియోజకవర్గానికి చెందినవారు కాగా మరో ఇద్దరు పార్లమెంట్ సెగ్మెంట్కు చెందినవారు కావడం విశేషం. -
ఉద్దేశపూర్వకంగానే దాడి:బండ్ల రాజశేఖర్రెడ్డి
‘తాము అసెంబ్లీ ఎన్నికల్లో సొంత బంధువర్గాన్ని కాదని బీసీ అభ్యర్థి అయిన సరితకు అండగా నిలబడి పార్టీ కోసం పనిచేశాం. అయితే వారు తమను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే పార్టీలో అణచివేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గద్వాలకు వచ్చిన మంత్రి జూపల్లి, ఎంపీ అభ్యర్థి మల్లురవిని మా ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించాం. అనంతరం ప్రచారం నిమిత్తం నేను మా సోదరుడు బండ్ల చంద్రశేఖర్రెడ్డి కలిసి మల్దకల్కు వెళ్లాం. తాను ప్రచార వాహనంలో ఎక్కేందుకు వెళ్లగా అక్కడే సరిత వర్గానికి చెందిన పెద్దొడ్డి రామకృష్ణ అకారణంగా మాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ముందుగా వేసుకున్న ప్లాన్లో భాగంగానే జరిగింది. మళ్లీ బీసీలపై దాడి చేశారని అబద్దపు ప్రచారం చేయడం మంచిది కాదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం’ అని బండ్ల రాజశేఖర్రెడ్డి తెలిపారు. నాపై దాడికి పాల్పడ్డారు:పెద్దొడ్డి రామకృష్ణ ‘తాను ప్రచార వాహనంపై ఉంటే బండ్ల చంద్రశేఖర్రెడ్డి అకారణంగా నాపైకి వచ్చి నన్ను బూతులు తిడుతూ చొక్కా పట్టుకుని కిందకు లాగి దాడికి పాల్పడ్డారు. నాపై జరిగిన దాడి బీసీలపై జరిగిన దాడిగా అభిప్రాయపడుతూ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే ఇలాంటి దాడులు చేశారు’ అని పెద్దొడ్డి రామకృష్ణ అన్నారు. -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
బీఎస్పీ గూటికి మందా
అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం -
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్లు
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఖరారైన ప్రధాన పార్టీ అభ్యర్థుల ముహూర్తాలు ఈ నెల 25 వరకు స్వీకరణ -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం..?
అలంపూర్: మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరుతున్నారనే పోస్టులు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమేరకు బీజేపీ రాష్ట్ర పెద్దలు ఆయనకు ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని మరొకరికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురైన ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి అశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బీజేపీలో చేరుతున్నారనే వార్తలకుతోడు ఎంపీ పోతుగంటి రాములుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై ఆయన సన్నిహితులను ఆరా తీయగా.. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, కావాలని కొందరు పాత ఫోటోలను పోస్టు చేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడనున్న ఈ తరుణంలో పార్టీల మార్పు అంశం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి. అలరించినవసంత కవితోత్సవం స్టేషన్ మహబూబ్నగర్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్ స్కౌట్స్, గైడ్స్ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్గౌడ్, గుముడాల చక్రవర్తి గౌడ్, జగపతిరావు, వెంకటేశ్వర్రావు, కమలేకర్ శ్యాంప్రసాద్రావు, అనురాధ, పులి జమున, సుజాత, రజని, మధుసూదన్ జోషి, మహేష్, రమేశ్, బసవ రాజప్ప, ప్రాణేష్, కృష్ణకుమార్ తదితరులు కవితలు వినిపించి ఆకట్టుకున్నారు. నేటినుంచి యథావిధిగా మార్కెట్ లావాదేవీలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం సెలవు దినం కావడంతో వారానికి ఒక సారి జరిగే ఉల్లి వేలం జరగకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. గురువారం నుంచి మార్కెట్లో యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డికి సన్మానం అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్ సాధించిన పొన్నకల్ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. మహిమూద్, విజయకుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కే ఉంది..
● 60 ఏళ్ల కల సాకారం చేసిన ఘనత పార్టీదే : మంత్రి జూపల్లి ● కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీ అభ్యర్థి మల్లు రవి ధరూరులో ఆందోళన.. ఇదిలాఉండగా, కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై మల్దకల్లో దాడి జరగగా.. ఇతర మండలాలకు చెందిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ సభ నిర్వహించనివ్వమని.. ప్రచార వాహనంలో పాటలు ఆపాలని అడ్డు చెప్పారు. ఈక్రమంలో ఎస్ఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పారు. దీంతో నాయకులు ప్రచార వాహనంపై నుంచి మాట్లాడి వెళ్లిపోయారు. గద్వాల రూరల్/గట్టు/మల్దకల్/ధరూరు: మిగులు రాష్టాన్ని అప్పులకుప్పగా మార్చడంతోపాటు పేదల సంక్షేమాన్ని గాలికొదిలిన కేసీఆర్కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని, రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన నాయకురాలు సోనియాగాంధీ అని, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం గట్టు, మల్దకల్, ధరూరు, గద్వాలలో మల్లురవితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రూ.లక్ష రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, కేజీటూపీజీ ఉచిత విద్య ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిందని, రాముడు అందరి దేవుడని అలాంటి శ్రీరామచంద్రుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రస్తుత ఎంపీ రాములు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు తన కుమారుడిని బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో పెట్టారని వారికి ఓటుహక్కు అడిగే హక్కులేదన్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి.. ఇప్పుడు అదే పార్టీలో చేరి తన నైతికతను పోగొట్టుకున్నారని, ఆయన ఓటు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయని, అలాంటి పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని మరోసారి అండగా నిలబడి రాహుల్గాంధీని ప్రధాని చేయాలని కోరారు. ఇక్కడ మల్లురవిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ● ప్రాజెక్టులు నిర్మించి, బీడు భూములకు సాగునీటిని అందించింది కాంగ్రెస్ పార్టీ అని, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి అన్నారు. చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత, సంపత్కుమార్, బీఎస్ కేశవ్, మధుసూదన్బాబు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా కోదండరామస్వామి వార్షిక ఉత్సవాలు
ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా కొనసాగాయి. పంచాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమాన్ సుదర్శన్ నారాయన్ ఆధ్వర్యంలో శిష్య బృందం మూడో రోజు ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాతసేవ, యాగశాల ఆరాదనలు, మూల మంత్రమూర్తి హోమాలు, ధన్వంతరి యాగం, సీతారాములకు నవకలశ స్నపనం(అహిషేకం) వంటి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నేడు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం.. బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని బుధవారం ఉదయం 10 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని కోరారు. -
గర్వకారణం..
మా కుటుంబానికి చెంది న దోనూరు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉంది. ఆమె తండ్రి సురేష్రెడ్డి తన ఇద్దరు కుమార్తెల చదువుల కోసం గ్రా మాన్ని వదిలి మహబూబ్నగర్లో స్థిరపడ్డా రు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన అనన్యరెడ్డికి శుభాకాంక్షలు. – దోనూరు నాగార్జున్రెడ్డి, ఎంపీపీ, పొన్నకల్ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు యూపీఎస్సీ ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి జా తీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి పొన్నకల్కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. చదువులో రాణించి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పట్టుదలతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని నిరూపించింది. – దోనూరు విజయకుమార్రెడ్డి, పొన్నకల్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement