Jogulamba District News
-
డామిట్.. కథ అడ్డంతిరిగింది!
అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మకై ్క వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. -
శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసుల విచారణలో వేగం పెంచాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జాకు పాల్పడినట్లు వచ్చే ఫిర్యాదులపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. పోలీసు సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తప్పవన్నారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషిట్ దాఖలు చేసి.. న్యాయస్థానంలో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్ల్లో నమోదైన కేసుల విచారణ వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి ఉన్నారు. -
జోగుళాంబ క్షేత్రం అభివృద్ధికి చర్యలు
గద్వాల: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జోగుళాంబ దేవస్థానం అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ పునరుద్ధరణ ప్రణాళికను ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏకై క శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దేవాలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆలయ పరిసరాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రసాద్ స్కీం భవనానికి నీటి సరఫరాకు సంబంధించి మున్సిపల్ కమిషనర్, ఇంట్రా ఈఈ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు నది నీటి శుద్ధి విషయంలో ఫీల్డ్ విజిట్ నిర్వహించి.. 15 రోజుల్లో వ్యయ అంచనాలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసాద్ స్కీం భవనాన్ని టూరిజం శాఖ అధికారులు వెంటనే దేవాదాయశాఖకు అప్పగించాలన్నారు. దేవాలయానికి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, గాంధీ జంక్షన్ నుంచి ఆలయం వరకు రహదారి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. హైదరాబాద్, కర్నూలు నుంచి అలంపూర్ మార్గాల్లో దిశానిర్దేశిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రాంతంలో మొక్కలు పెంచాలని, టాయిలెట్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి అన్నిశాఖల అఽధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాలయం వద్ద చేపట్టే అభివృద్ధి పనులపై శాఖల వారీగా వారం రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు, అసిస్టెంట్ స్థాపతి గణేశ్, టెంపుల్ డిజైనర్ గోవిందహరి, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈఓ పురేందర్, డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ వనజారెడ్డి తదితరులు ఉన్నారు. -
సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..
అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు. – మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.. ఎల్ఆర్ఎస్పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం. – వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ● -
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
గద్వాల క్రైం: ‘‘రానున్నది 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రత సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. జిల్లాలో ప్రస్తుతం ఎండల తీవ్రత 43 డిగ్రీలు దాటుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగడంతో పాటు ఉదయం 10 గంటల నుంచే వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలే రక్షణ గొడుగుగా నిలుస్తాయి.’’ అని జిల్లా ఇన్చార్జి వైద్యారోగ్యశాఖ అధికారి సిద్దప్ప వెల్లడించారు. వేసవిలో మండే ఎండలతో ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు వైద్యారోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రి, పల్లె దవాఖానల్లో వడదెబ్బకు గురైన వారికి అవసరమైన మందులు, లక్షకు పైగా ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఇన్చార్జి డీఎంహెచ్ఓ చెప్పారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రశ్న: ఉదయం నుంచే ఎండలు పెరుగుతున్నాయి. స్కూల్ నుంచి వచ్చిన చిన్నారులు ఉక్కపోతకు గురై ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీకాంత్, పాత హౌసింగ్ బోర్డు, గద్వాల వైద్యాధికారి: సాధారణంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు వేడిని తట్టుకునే సామర్థ్యం కోల్పోతారు. యూనిఫాం ధరించడం వల్ల వారికి అవసరమయ్యే గాలి చేకూరాదు. పైగా సిల్క్ దుస్తులు కావడం, షూ ధరించడం సమస్యగా ఉంటుంది. అవసరమైన పోషకాహారం, నీరు తీసుకోరు. బయట చిరుతిండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. వేడి గాలుల వల్ల ఉక్కపోతకు గురవుతారు. సిల్క్ దుస్తులు, షూ లాంటి వాటికి విరామం ఇవ్వాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి. ప్రశ్న: ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – రాముడు, ఉండవెల్లి వైద్యాధికారి: ప్రతి ఒక్కరూ తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు నిమ్మ, చెరుకు, పండ్ల రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే క్రమంలో చలువ అద్దాలు, గొడుగు, తలపాగ, టోపీ ధరించాలి. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్ధాలనే తీసుకోవాలి. అందులో మసాలాలు, నూనె వంటివి తక్కువగా ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, కల్తీ ఐస్తో తయారు చేసిన పండ్ల రసాలు తీసుకోవద్దు. శరీరంలో మార్పులు వచ్చినట్లు గమనిస్తే సమీపంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలోని వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే ఓఆర్ఎస్, ఐవీ ప్లూయిడ్స్, మందులు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటించాలి. ప్రశ్న: వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రసాద్, రెండవ రైల్వేగేట్, గద్వాల వైద్యాధికారి: ఎండల తీవ్రత పెరిగినందున ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి. చిన్నారులు, వృద్ధులను చల్లని ప్రదేశాల్లో ఉండాలి. బయటకు వచ్చే క్రమంలో కాటన్ దుస్తులు, గొడుగు లేదా తలపాగ, టోపీ ధరించాలి. బయట మాసాల ఫుడ్, బేకరి ఫుడ్, నూనె వంటి వంటకాల జోలికి వెళ్లరాదు. తేలికపాటి ఆహారం రాగిజావ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేని వారు పిడికెడు చక్కెర, చిటికెడు ఉప్పు కలిపిన నీటిని గంటకోసారి తాగాలి. ప్రశ్న: వ్యవసాయ, కూలీ పనులు చేసే వారు వడదెబ్బ బారిన పడకుండా ఏ జాగ్రత్తలు పాటించాలి? – పరశురాముడు లైఫ్ చేంజ్ సంస్థ నిర్వాహకుడు, గద్వాల ౖవెద్యాధికారి: కూలీలు, రైతులు వీలైనంత వరకు ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి పనులు చేసుకోవాలి. ఎక్కువగా చెట్ల నీడలో ఉండాలి. ఎండలో ప నులు చేయడం వల్ల శరీరంలో వేడి ఉష్ణోగ్రత లు పెరిగిపోయి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలి. ఉపాఽధి హామీ పనులు చేసే కూలీలకు కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యసిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. అవసరమైతే స మీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి. రానున్న రోజుల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అత్యవసరమైతేనే బయటకు రావాలి బయటి ఆహారానికి దూరంగా ఉండాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలకు ప్రత్యేక చర్యలు ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సిద్దప్ప -
ఉపాధి హామీ కూలీలకు మేలు చేకూర్చండి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు మేలు చేకూర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం ఇటిక్యాల నుంచి పెద్దదిన్నె రోడ్డు వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, రైతుల పొలాలకు వెళ్లే నక్ష దారి గురించి కొందరు అభ్యంతరం తెలుపగా.. అదనపు కలెక్టర్ వారితో నేరుగా మాట్లాడి నచ్చజెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఎం శివజ్యోతి, ఆర్ఐ భీంసేన్రావు, సర్వేయర్ దౌలమ్మ, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఏ పురేందర్ పాల్గొన్నారు. కోర్టు భవనానికి రూ. 81కోట్లు మంజూరు గద్వాల: జిల్లా కేంద్రంలో కోర్టు భవన సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తూ జీఓ జారీ చేసినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంగళవారం తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోర్టు భవన సముదాయం నిర్మాణానికి రూ. 81కోట్లను మంజూరు చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు హుండీ లెక్కింపు అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో బుధవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలతో పాటు అన్నదాన సత్రంలోని హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,150 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డుకు మంగళవారం 1242 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,150, కనిష్టంగా రూ. 3,011, సరాసరి రూ. 4,589 ధరలు వచ్చాయి. 18 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,513, కనిష్టంగా రూ. 3,819, సరాసరి రూ. 6,296 ధరలు లభించాయి. 46 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 3,361, సరాసరి రూ. 6,091 ధరలు వచ్చాయి. హైవేలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అలంపూర్: ఉండవెల్లి మండలం పుల్లూరు శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం అదికారులు తొలగించారు. పుల్లూరు టోల్ప్లాజా వద్ద నేషనల్ హైవే అథారిటీ కార్యాలయానికి సమీపంలోని 448 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోర్టు ద్వారా మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఎలాంటి స్పందన లేకపోవడంతో, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉండవెల్లి తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ శ్రీవాణి, సర్వేయర్ రాఘవేంద్ర, ఏఎస్ఐ సుబ్బారెడ్డి, రెవెన్యూ, పోలీసు, నేషనల్ హైవే ఆధికారులు మంగళవారం అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. నవోదయ ఫలితాలు విడుదల బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
గద్వాల: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి గంటాకవితాదేవి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ణాన సదస్సులో ముఖ్యఅథితిగా ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ఎదగాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలన్నారు. పొదుపు సంఘాల మహిళలు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, సంగీత పాల్గొన్నారు. ట్రాన్స్కో ఎస్ఈగా శ్రీనివాస్రెడ్డి గద్వాల: ట్రాన్స్కో ఎస్ఈగా శ్రీనివాస్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు ఎస్ఈని విద్యుత్ శాఖ ఉద్యోగులు మర్యాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. ఉత్తమ సేవలందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు అందాయని ఎస్పీ శ్రీనివాస్రావు తెలిపారు. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు వివరించారు. బీచుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివుడికి అభిషేకాలు చేశారు. సోమవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని శివాలయంతోపాటు అభయాంజనేయస్వామి, జ్ఞానసరస్వతి, సీతారాముల వారిని దర్శించుకున్నారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. -
నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
గద్వాల క్రైం: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్ధప్పతో మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. సిద్ధప్ప, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ ఫోన్ చేయాల్సిన నంబర్లు : 7013959920, 9985878931 సమయం : మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు -
సకాలంలో పన్నులు చెల్లించాలి
కలెక్టర్కు తమ సమస్య విన్నవిస్తున్న రైతులు అలంపూర్ : మున్సిపాలిటీలో పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ చంద్రశేఖర్ రావు అన్నారు. అలంపూర్లో వార్డు అధికారులతో కలిసి కమిషనర్ సోమవారం దుకాణదారుల వద్ద పన్ను వసూలు చేశారు. నివాసగృహ యజమానులు, దుకాణదారులు పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారికి నోటీసులు అందించనున్నట్లు, పెండింగ్లో ఉన్న వారందరూ వెంటనే పన్నులు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 38 ఫిర్యాదులు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
అరకొరగానే.. చిరుధాన్యాలు
గద్వాల వ్యవసాయం: ఈ ఏడాది కూడా చిరుధాన్యాల సాగు జిల్లాలో అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉంది. అయినా వీటి సాగుపై రైతులు ఆసక్తి కనబర్చడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు వీటి సాగుపై రైతులకు అవగాహన కల్పిండంలో విఫలమవుతున్నారు. మరో ముఖ్య ఆహార పంటలైన అయిన జొన్న, సజ్జ సాగు విస్తీర్ణం గతంతో పోల్చితే కాస్తంత పెరిగింది. ఇంకా పెరగాలిసన అవసరం ఉంది. చిరుధాన్యాలతో రోగాలు దూరం దైనందిన జీవితంలో చాలామంది అనేక రకాలుగా ఒత్తిళ్లకు లోనవుతుండటంతో పాటు, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో పలు రకాల అనారోగ్య సమస్యలకు, ధీర్ఘకాలిక వ్యాధులకు గురవువుతున్నారు. బీపీ, షుగర్, ఆస్తమా, కీళ్లనొప్పులు తదితర వాటికి గురవడంతో పాటు, కిడ్నీ, లివర్, గుండె సంబంధిత సమస్యలతో శారీరకంగా బలహీన పడుతున్నారు. ఇలాంటి వారికి బలవర్దకమైన ఆహరం చిరుధాన్యాలే. ముఖ్యంగా కొర్రలు, అండుకొర్రల్లో పీచుపదార్థాలతో పాటు, బలమైన పోషక విలువలుంటాయి. రాగుల్లో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి.వీటిని ఆహరంగా తీసుకుంటే బీపీ, షుగర్ లాంటి రోగాలు దూరం కావడంతో పాటు, శారీరకంగా బలపడతారు. అవగాహన, మార్కెటింగ్ సౌకర్యం కరువు గడిచిన ఏడెనిమిది ఏళ్ల నుంచి చిరుధాన్యాల ఆవశ్యకతపై వైద్యులు, మేధావులు ఆహారపు అలవాట్లుగా చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయినా వీటి సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలపై మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాలన్ని ఆరుతడి పంటలే. సాధారణంగా రెండు సీజన్లలో సాగు చేయవచ్చు. అయితే ఈ పంటల్లో కలుపు ఎక్కువగా వస్తుంది. దీనికితోడు నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు సరైన అవగాహన లేదు. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. వీటన్నింటి ఫలితంగా జిల్లాలో పత్తి, పొగాకు లాంటి వాణిజ్య పంటలు, వరి లాంటి ఆహారపు పంటలపై ఎక్కువగా దృష్టి సారిస్తూ వస్తున్నారు. కారణం వరి, పత్తి తదితర పంటలకు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, మద్దతు ధరకు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తుండటమే. కాస్త పెరిగిన జొన్న, సజ్జ చిరుధాన్యాలకు బాగా డిమాండ్ ఉన్నందున స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. అయితే, జొన్న, సజ్జలు పోషక విలువలు ఉండే బలవర్ధకమైన ఆహారం. ఈపంటల సాగు ఈ ఏడాది కొంత పెరిగిన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వీటికి మార్కెట్లో గిట్టుబాటు ధరలు ఉన్నాయి. పది, పదిహేనేళ్ల క్రితం వరకు జొన్న, సజ్జ సాగు చేసిన రైతులు ఆతర్వాత వరి, పత్తి లాంటి పంటలను వేస్తున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలు నాణ్యమైన జొన్నలు లభించకపోవడంతో కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెచ్చుకుంటున్నారు. జొన్న, సజ్జల సాగు బాగా పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో పంటల సాగు ఇలా.. (ఎకరాల్లో) ఏడాది చిరుధాన్యాలు జొన్న, సజ్జ 2016–17 500 6,881 17–18 650 4,138 18–19 1050 3,767 19–20 271 2,572 20–21 380 3,412 21–22 325 4,210 22–23 539 5,467 23–24 269 3,220 24–25 276 6,221 అవగాహన కల్పిస్తాం చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికి ఇక్కడి రైతులు వాణిజ్య, ఇతర ఆహార పంటలపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొర్ర, అండుకొర్రలు వేసేలా రైతులకు ఏటా చెబుతున్నాం. జొన్న, సజ్జ పంటకు పిట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేసేలా రైతులకు అవాహన కల్పిస్తాం. – సక్రియానాయక్, డీఏఓ డిమాండ్ ఉన్నా వీటి సాగుపై రైతుల అనాసక్తి అవగాహన కల్పించడంలో వ్యవసాయశాఖ విఫలం జిల్లాలో కాస్త పెరిగిన జొన్న, సజ్జ సాగు ‘ఆత్మ’కు నిధుల కేటాయింపు ఏదీ..? చిరుధాన్యాల సాగుపై వ్యవసాయ అధికారులు ఆత్మ (వ్యవసాయ సాంకేతిక సంస్థ) ఆధ్వర్యంలో 2019లో అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్) పథకం కింద పండించే రైతులకు 90శాతం సబ్సీడీపై విత్తనాలు అందించి ప్రోత్సహించారు. దీనివల్ల 2016, 2017, 2018 గణాంకాలను పోల్చితే 2019లో సాగు పెరిగింది. ఆతర్వాత 2020 నుంచి మళ్లీ తగ్గింది. ఎప్పటి లాగే రైతులు వరి, పత్తిపై దృష్టి సారించారు. ఇదిలా ఉంటే ‘ఆత్మ’కు గడిచిన నాలుగేళ్లుగా నిధులు కేటాయించడం లేదు. దీంతో కార్యక్రమాలకు నిలిచిపోయాయి. -
క్షయ రహిత జిల్లాగా మార్చాలి
గద్వాల క్రైం: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. సోమవారం క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి కాదని, నివారణ దిశగా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత కేసుల విషయంలో రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైయ్యే మందులను ఉచితంగా అందించామన్నారు. జ్వరం, దగ్గు ఉన్న వారి గళ్ల పరీక్షలు నిర్వహించి వారిని గుర్తించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని, మంచి ఆహారపు అలవాట్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం లక్షణాలు కలిగిన వారు దగ్గర్లోని పీహెచ్సీలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, క్షయ వ్యాధి నివారణ కోసం వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తల సేవలు ఎంతో అభినందనీయమన్నారు.అంతకు ముందు జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. -
చల్లంగుండాలి..
మాకు మీరు.. మీకు మేము ! ‘సివిల్ సప్లయ్’లో తోడు దొంగలు ● జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ఇద్దరు అధికారుల హవా ● మిల్లర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వ్యవహారం ● వేడి భరించలేం.. ఏసీలు ఇవ్వాలంటూ బేరం ● నజరానాగా లారీకి 5 క్వింటాళ్ల సీఎమ్మార్ మిగిలించుకునేలా ఒప్పందం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే.. ‘మమకారం’ పంచిన మిల్లర్లకే మొగ్గు.. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం విదితమే. జోగుళాంబ గద్వాల జిల్లాలో 61 వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నులు.. మొత్తం 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యంగా ఇవ్వాలని గద్వాల జిల్లాలోని 37 రైస్ మిల్లులకు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనే సివిల్ సప్లయ్ అధికారులు వివక్ష చూపినట్లు తెలుస్తోంది. తమపై మమకారం చూపిన మిల్లర్లకు అధికంగా.. తమను పట్టించుకోని వారికి తక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేసినట్లు సమాచారం. మొత్తానికి గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మర ఆడించి.. 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. -
యువతకు స్ఫూర్తి భగత్సింగ్
గద్వాల: ప్రజా పోరాటాలతోనే పీడిత ప్రజలకు విముక్తి లభిస్తుందని భగత్సింగ్ స్ఫూర్తితో అందరూ ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. ఆదివారం భగత్సింగ్ 94వ వర్థంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహా, అంజి, తిమ్మప్ప, పురుషోత్తం వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో... బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన గొప్ప దేశభక్తుడు భగత్సింగ్ అని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఆదివారం భగత్సింగ్ 94వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, రంగన్న, పరమేష్, తిమ్మప్ప, వెంకటేష్, నాగన్న, రామన్న తదితరులు పాల్గొన్నారు. భగత్సింగ్ ఆశయ సాధనకు కృషి గద్వాలటౌన్: భగత్సింగ్ ఆఽశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న భగత్సింగ్ విగ్రహానికి విద్యార్థి సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భగత్సింగ్ చిన్న వయస్సులోనే స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరికంబం ఎక్కిన పోరాట యోధుడని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. భగతత్సింగ్ స్ఫూర్తితో చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. -
పేట్రేగిపోతున్నారు..!
● మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడులు ● నడిగడ్డలో వరుస ఘటనలతో ప్రజల బెంబేలు ● రాజకీయ జోక్యంతో తలలు పట్టుకుంటున్న అధికారులు గద్వాల క్రైం: జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం మత్తులో కర్రలు.. గాజు సీసాలతో దాడులకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే ఓ ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ కిందపడి మృతి చెందింది. కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ప్రజలు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు.. ● ఈ నెల 6వ తేదీన గద్వాల మండలం కుర్వపల్లికి చెందిన ఓ మహిళ.. అదే గ్రామానికి చెందిన తాపీ మేసీ్త్రలతో ఇంటి నిర్మాణ పనులు చేయించింది. అయితే పనులు చేయడంలో జాప్యం చేయడంతో మరొకరితో పనులు చేయించింది. దీంతో ఇద్దరు తాపీమేసీ్త్రలు మద్యం మత్తులో సదరు మహిళ ఇంటి వద్దకు వచ్చి వాదనకు దిగారు. గమనించిన ఓ మహిళ సర్ది చెప్పేందుకు వెళ్లిన క్రమంలో ఆమెను తోసివేశారు. దీంతో కిందపడిన సదరు మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. – ఈ నెల 8వ తేదిన గద్వాల పట్టణానికి చెందిన ఓ పార్టీకి చెందిన నాయకులు మద్యం పార్టీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో మల్దకల్ మండలానికి చెందిన ఓ నాయకుడు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడుతున్న క్రమంలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కలత చెందిన ఓ నాయకుడు మరో వర్గానికి చెందిన వ్యక్తులను బీరోలు రోడ్డు మార్గంలోకి రప్పించుకుని దాడి చేశారు. బాధితులు పట్టణ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. – ఈ నెల 11వ తేదీన గంజిపెటకు చెందిన ఓ యువకుడిని తమ వర్గానికి చెందిన వ్యక్తులపై దాడి చేశాడని పాతకక్ష ఉంచుకొని బజాజ్ షోరూం సమీపంలో మద్యం మత్తులో దారి కాచి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి తలకు 16 కుట్లు పడ్డాయి. దాడి చేసిన వారిపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ● ఈ నెల 14న గద్వాల పట్టణానికి చెందిన యవకులు హోలీ పండుగ నేపథ్యంలో రంగులు చల్లుకున్నారు. అనంతరం కృష్ణానది సమీపంలో వడ్లవీధి, బీసీ కాలనీకి చెందిన యువకులు మద్యం తాగుతున్నారు. అయితే గుర్తు తెలియని యువకుడు మద్యం ఇవ్వాలంటూ వారితో అకారణంగా వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో యువకులు మద్యం మత్తులో ఉండడంతో రెండు వర్గాలకు చెందిన యువకులు ఒకరిపై మరొకరు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే ఓ యువకుడిపై గాజు సీసాలతో దాడి చేయగా కుడి కన్ను కింద భాగంలో 9 కుట్లు పడ్డాయి. ● ఈ నెల 18న గద్వాల మండలంలోని చేనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు. వృద్దులపై దాడి చేసిన క్రమంలో గాజు సీసాలతోనే దాడులు చేసినట్లు స్థానికులు గుర్తించారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దాడులు చేస్తే సహించం ఇటీవల చోటు చేసుకున్న దాడి ఘటనలను ఎంత మాత్రం సహించేది లేదు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. అల్లర్లు చోటు చేసుకోకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దిపాం. పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేశాం. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం నమోదైన కేసుల తీవ్రత ఆధారంగా, దాడులకు పాల్పడిన వ్యక్తులపై రౌడీషీట్ నమోదు చేస్తాం. రాజకీయ జోక్యంతో మాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పడం అవాస్తవం. ఇప్పటికే దాడి కేసుల్లో నలుగురు వ్యక్తులను రిమాండ్కు తరలించాం. త్వరలో మరి కొంతమందిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తాం. – మొగిలయ్య డీఎస్పీ, గద్వాల రాజకీయ జోక్యంతో చర్యలకు వెనకడుగు నడిగడ్డలో వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుందామంటే కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, రాజీ కుదుర్చుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో కృష్ణానది సమీపంలో దాడికి పాల్పడిన ఘటన విషయానికి వస్తే.. దాడిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన క్రమంలో రెండు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కట్టడి చేసే క్రమంలో వారిని సైతం పెడచెవిన పెట్టడంతో చివరికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఫోన్ కాల్ నేపథ్యంలో చోటుచేసుకున్న దాడి, కృష్ణానది వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు అడుగులు వేయగా.. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రాగా కేసులతో పోలీసులు మౌనం దాల్చారు. అయితే ఈ ఘర్షణలు మూడు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల మధ్య చోటు చేసుకోవడం.. ఎవరిపై చర్యలు తీసుకుందామన్న రాజకీయ నేతాల ఒత్తిళ్లతో పోలీసులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
గద్వాల: రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు తథ్యమని ప్రతిఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పార్టీ బలోపేతం కోసం పనిచేసి గెలుపొందేందుకు కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న రామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్నారు. ఆధోనిలో 70వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని, అలాంటి చోటనే బీజేపీకి చెందిన పార్థసారధి గెలుపొందారని పార్థసారధి గెలుపును స్ఫూర్తిగా తీసుకుని గద్వాలలో బీజేపీ గెలిచే వరకు పనిచేయాలన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి 20వేల మెజారిటీ ఇచ్చి బీజేపీ ఆదిపత్యాన్ని నిరూపించినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అయితే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను పూర్తిగా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ చేసేదే చెబుతుంది.. చెప్పిందే చేస్తుందని ఆమె అన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతే దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి ముందుకు నడిపిన నాయకుడు ప్రధాని మోడీ అని గుర్తు చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షమాభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు ప్రధాని మోడీ అన్నారు. నూతన అధ్యక్షుడు రామాంజనేయులు పార్టీలోని ప్రతిఒక్కరిని కలుపుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, భరత్కుమార్, రాంచంద్రారెడ్డి, ఎక్బోటేరవి, అయిజ రాంచంద్రారెడ్డి, రమాదేవి, వెంకట్రాములు, జయలక్ష్మీ, శివారెడ్డి, రజక జయశ్రీపాల్గొన్నారు. వన్ నేషన్...వన్ ఎలక్షన్ వన్ నేషన్... వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దీని వల్ల దేశ ఖజానాపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజలకు సైతం అన్ని విధాల మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ సంజీవ్రెడ్డి అన్నారు. గద్వాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అలంపూర్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన 306 మంది లబ్ధిదారులకు రూ.36,35,496 విలువగల చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి కుటుంబాల్లో వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లక్ష్యమన్నారు. సీఎం సహాయ నిధి ద్వార 161 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, నాయకులు, లబ్దిదారులు ఉన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అలంపూర్: ఆశా కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని.. అణచివేతతో ఉద్యమాలను ఆపలేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాజు అన్నారు. ఆదివారం అలంపూర్ పట్టణంలోని కేవీపీఎస్ కార్యాలయంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయిస్తుందని ఆరోపించారు. ఒక రోజు ముందే పోలీసులు ఆశ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని కట్టడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు కార్మికులకు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పోలీసలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం రెవంత్ రెడ్డి ముందస్తు అరెస్టులతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నరసింహ్మ, అయ్యప్ప, నాగరాజు ఉన్నారు. -
ఆదిశిలాక్షేత్రంలో భక్తుల కిటకిట
మల్దకల్: ఆదిశిలాక్షేత్రం స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారిలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, అమరవాయి చింతలమునిస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, అరవిందరావు, నాగరాజుశర్మ, వాల్మీకి పూజారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీచుపల్లిని సందర్శించిన ఎమ్మెల్యే బండ్ల ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అ నంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట భార్య బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్రెడ్డి, కుటుంబ సభ్యులు, తదితరులున్నారు. ‘ప్రాధాన్యత రంగాలను విస్మరించారు’ వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేదని సీపీఎం జిల్లా నాయకుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శనివారం మండలంలోని బొల్లారం గ్రామంలో నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 శాతం పంట రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మీ పథకం, కొత్త ఆసరా పింఛన్లు, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాల్రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, మహబూబ్పాషా, రవిప్రసాద్, నాయకులు బాలగౌడ్, ఆశన్న, ఈశ్వర్, కృష్ణయ్య, నిరంజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చెరుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అమరచింత: చెరుకు సాగుచేస్తున్న రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన ప్రోత్సాహకాలు అందించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం ఫ్యాక్టరీ డీజీఎం మురళిని కలిసి చెరుకు రైతుల సమస్యలు విన్నవించారు. రెండేళ్లుగా సకాలంలో కోతలు పూర్తి చేయడం, రైతులకు అనుకున్న సమయానికి విత్తనాలు అందించడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. సాగు రైతులకు కంపెనీ ప్రకటించిన రాయితీలు అందించి ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్లో కోత కార్మికులకు అడ్వాన్సులు ముందస్తుగా చెల్లించి త్వరగా రప్పించాలని, కోత యంత్రాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని డీజీఎంకు అందజేశారు. కార్యక్రమంలో వాసారెడ్డి, నారాయణ, తిరుపతయ్య, నాగేందర్, రామకృష్ణ, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షల నిర్వహణ.. కత్తిమీద సామే
గద్వాల టౌన్: జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం కేంద్రాలకు నిధుల కేటాయింపులో భారీస్థాయిలో కోత విధించడంతో పర్యవేక్షకులు చేతి నుంచి డబ్బులు చెల్లించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇస్తున్న నిధులు ఏడురోజులపాటు జరిగే పరీక్షల సమయంలో తాగునీటి వసతి కల్పించడానికే సరిపోతుందని వాపోతున్నారు. ఫలితంగా సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడైనా టీ తాగాలంటే రూ.10 ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థికి పరీక్ష నిర్వహణ కోసం మొక్కుబడిగా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏటా పరీక్షలకు ముందు ఈ వాదన ముందుకు వస్తున్నా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిధుల కేటాయింపులో అన్యాయం.. పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 45,837 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం నిధుల కేటాయింపులో మాత్రం శాసీ్త్రయంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థి నుంచి పరీక్ష ఫీజు కింద రూ.125 వసూలు చేసే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు మాత్రం కేవలం రూ.8.25 మాత్రమే ఇస్తున్నారు. ఈ లెక్కన రోజుకు వెచ్చిస్తున్నది రూ.1.17 మాత్రమే. ఇక ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రూ.10 కేటాయిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు తక్కువగా కేటాయించడం ఎంతవరకు సమంజసమని పరీక్షల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థికి కనీసం రూ.20 కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.8.25 ఇస్తుంది. ఇందులోనే విద్యార్థులకు ప్రతిరోజూ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. రోజుకు ఐదారు క్యాన్లకు గాను రూ.100 వరకు ఖర్చవుతుంది. ఏడురోజులకు రూ.700 వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. కొన్నిచోట్ల తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాగునీటికే సరిపోవడం లేదు.. వసతుల కల్పనకు వేధిస్తున్న నిధుల కొరత ఫీజు వసూలు చేస్తున్నా.. కేంద్రాలకు కేటాయించని వైనం తలలు పట్టుకుంటున్న పర్యవేక్షకులు రూ.20కు పెంచాలి.. పరీక్షల నిర్వహణ నిధులు పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి చెప్పినా ఫలితం లేకుండా పోతుంది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.20 ఇవ్వాలి. తక్కువ నిధులు ఇవ్వడం వల్ల పదో తరగతి పరీక్ష ఇన్విజిలేషన్కు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం అన్ని ధరలు పెరిగాయి. ఇన్విజిలేటర్లకు రోజుకు కేవలం రూ.33 ఇవ్వడం బాధాకరం. దీన్ని రూ.150కు పెంచాలి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా పునరాలోచించాలి. – గోపాల్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, గద్వాల మార్గదర్శకాల ప్రకారమే.. ప్రభుత్వ మార్గదర్శకాలు, వచ్చిన బడ్జెట్ ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. నిధుల పెంపు అనే దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. – అబ్దుల్ఘని, డీఈఓ -
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి
కేటీదొడ్డి: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు. శనివారం మండలంలోని పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, వార్షిక పరీక్షలలో ప్రైవేటుకు దీటుగా ఫలితాలు అనేది ఎంతో కీలకమైనదని, ఎక్కడికి వెళ్లినా మొదట ఎస్సెస్సీ మెమోనే చూస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడం, చదవడం, రాయడం, చేస్తారో వారే మంచి మార్కులు సాధిస్తారన్నారు. క్రమశిక్షణతో చదువుకున్న వారు పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, చైల్డ్ అబ్యూస్ వంటి చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర్రెడ్డి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పాగుంట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ప్రతిఒక్కరికి బీమా తప్పనిసరి
నాగర్కర్నూల్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరు జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని తపాలా ప్రమాద బీమా పాలసీ సేకరణ కేంద్రాలను సందర్శించారు. అంతకు ముందు తపాలా కార్యాలయం వద్ద నాగర్కర్నూల్ ఎంపీడీఓ కోటేశ్వర్ తపాలా బీమా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ పర్యవేక్షకుడు భూమన్న మాట్లాడుతూ కేవలం తక్కువ డబ్బులతో ఎక్కువ బీమా పొందవచన్నారు. రూ.వెయ్యి చెల్లిస్తే ఏడాదిపాటు రూ.15 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్మికులు, ఉపాధి, అంగన్వాడీ, యువకులకు ఈ ప్రమాద బీమా చేయించాలని గ్రామీణ తపాలా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్పీఎం గఫార్, సిబ్బంది మహ్మద్ ఖాన్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిజీవికి నీరు ప్రాణాధారం
గద్వాల టౌన్: ప్రతి జీవికి నీరు ప్రాణాధారమని, విద్యార్థులు నీటి వినియోగం పట్ల అవగాహన ఏర్పరచుకోవాలని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మీనాక్షి అన్నారు. శనివారం కళాశాల ఆవరణలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఏర్పాటు విధానాన్ని, వాటి వల్ల భూగర్భజలం పెరుగుదల గురించి వివరించారు. ఇంకుడు గుంతల ఆవిష్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ మీనాక్షి మాట్లాడుతూ నీటి వృథాను తగ్గించుకొని, సహజ వనరులను పరిమితంగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ దేవుజా పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి.. యువత వృత్తి నైపుణ్యాలు పెంచుకుని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కలందర్బాషా అన్నారు. టాస్క్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించగా.. జాబ్మేళాలో పాల్గొన్న సుమారు 250 మంది నిరుద్యోగులకు నైపుణ్యాలపై ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రతిభకనబర్చిన 106 మందిని ప్రైవేటు కంపెనీలలో వివిధ ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ప్రియాంక, వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, టాస్క్ కోఆర్డినేటర్ సత్యమ్మ పాల్గొన్నారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలి గద్వాల క్రైం: ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో ప్రతిఒక్కరు జాగ్రత్తగా, దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువత, విద్యార్థులు, ఎవరైనా అనుమతి లేని బెట్టింగ్ యాప్స్లకు అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఎవరైనా చెడు దారిలో నడుస్తున్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. -
పరిష్కారం చూపండి సారూ..
ఫోన్– ఇన్గద్వాల: తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి.. పది శాతం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.. పురాతన కట్టడాలను ఆక్రమిస్తున్నారు అంటూ పట్టణ ప్రజలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపుతామని అదనపు కలెక్టర్, మున్సిపాలిటీల ప్రత్యేకాధికారి నర్సింగ్రావు పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు గద్వాల, అయిజ, వడ్డేపల్లిలో నెలకొన్న వివిధ రకాల సమస్యలపై ‘సాక్షి’ శనివారం అదనపు కలెక్టర్ నర్సింగ్రావుతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించగా అపూర్వ స్పందన లభించింది. ప్రజలు సంధించిన ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఇలా.. ప్రశ్న : జిల్లాకేంద్రంలోని పురాతన బావిని కబ్జా చేశారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.? – మోహన్రావు, శంకర ప్రభాకర్, గద్వాల ప్రత్యేకాధికారి : మీరు చెప్పిన విషయం వాస్తవమే. దీనిపై ఇది వరకే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. పురాతన కట్టడాలను కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుని వాటిని కాపాడుతాం. ప్రశ్న : చెత్త సేకరించడం లేదు. కొన్నిచోట్ల మధ్యాహ్నం సమయంలో చెత్త తీసుకెళ్లడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగులమంతా డ్యూటీలకు వెళ్తున్నాం. ఇంట్లో చెత్త పేరుకుపోయింది. అదేవిధంగా కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే పిల్లలపై దాడి చేసి గాయపరిచాయి. – ప్రవీణ్, కొత్తహౌసింగ్బోర్డు కాలనీ, గద్వాల ప్రత్యేకాధికారి : చెత్త సేకరణను క్రమం తప్పకుండా ఉదయం వేళలో తీసుకెళ్లేలా పురమాయిస్తాం. అదేవిధంగా కుక్కల బెడదను అరికట్టేలా స్టెరిలైజేషన్ ప్రక్రియ చేపట్టి.. ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రశ్న : తేరుమైదానం వద్ద ఉన్న ప్రధాన రోడ్డును ఆక్రమిస్తూ డబ్బాలు పెడుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. – ఖరీంపాష, అశోక్నగర్, గద్వాల ప్రశ్న : గద్వాల మున్సిపాలిటీ పరిధిలో సర్వే నం.789, సర్వే నం.389లో 10 శాతం స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని కాపాడి రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. – రాఘవేంద్ర, న్యూహౌసింగ్బోర్డు కాలనీ, గద్వాల ప్రత్యేకాధికారి : ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించి మోఖపై వెళ్లి రికార్డుల ఆధారంగా విచారిస్తాం. కబ్జాకు గురైతే తప్పకుండా చర్యలు తీసుకుని వాటిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా రక్షణ కంచె ఏర్పాటు చేసి మున్సిపల్ బోర్డులు ఏర్పాటు చేస్తాం. ప్రశ్న : జయప్రజావైద్యశాల పక్కన అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వంద గజాల స్థలంలో ఆరు అంతస్తులు భవనం నిర్మిస్తున్నారు. పైగా ఎలాంటి సెట్బ్యాక్ కూడా లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై పత్రికలో వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – ప్రసాద్, నల్లకుంట, గద్వాల ప్రత్యేకాధికారి : నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడితే వెంటనే పనులు ఆపేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : ఫ్లై ఓవర్ పక్కన పెద్ద ఆస్పత్రి సమీపంలో 12 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క డ్రెయినేజీ, సీసీరోడ్లు లేవు. దీంతో ఇళ్ల నుంచి వచ్చిన మురుగు రోడ్లపైనే పారుతోంది. వానాకాలంలో నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. – ఇస్మాయిల్, గద్వాల ప్రత్యేకాధికారి : మున్సిపల్ ఏఈని పంపించి నివేదిక తెప్పించుకుంటాం. డ్రెయినేజీ, అంతర్గత రహదారులు నిర్మించేలా చూస్తాం. ప్రశ్న : అయిజ దుర్గానగర్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే ఠాగూర్ స్కూల్ వద్ద మురుగు రోడ్డుపైకి వచ్చి చేరుతుండడంతో ఇబ్బంది పడుతున్నాం. – భీంసేన్రావు, అయిజ ప్రత్యేకాధికారి : అధికారులను పంపి డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : అయిజ 20వ వార్డులో నారాయణస్వామి ఆలయం వద్ద తాగునీటి సమస్య ఉంది. అలాగే కరెంట్ స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. – జగదీశ్వర్, అయిజ ప్రత్యేకాధికారి : ఏఈని పంపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే కరెంట్ స్తంభాల సమస్య కూడా పరిష్కరిస్తాం. ప్రశ్న : ప్రతి శుక్రవారం శాంతినగర్లో సంత జరుగుతుంది. కానీ, సంతకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో రోడ్లపైనే అంగళ్లు ఏర్పాటు చేిస్తుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – వెంకటేశ్వర్లు, వడ్డేపల్లి ప్రశ్న : వడ్డేపల్లి 5, 6 వార్డుల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. – పావని, వడ్డేపల్లి ప్రత్యేకాధికారి : శాంతినగర్లో సంత ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న : అయిజలోని 8వ వార్డులో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం. ముళ్ల కంపలు పెరిగినా పట్టించుకోవడం లేదు. అలాగే కరెంట్ స్తంభాలు వాలిపోయి విరిగే ప్రమాదం ఉంది. ప్లాిస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంది. – భగత్రెడ్డి, అయిజ ప్రత్యేకాధికారి : డ్రెయినేజీ సమస్య, ముళ్లకంపల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. పాడైపోయిన చోట కరెంట్ స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలు సహకరించాలి. ప్రశ్న : అంబాభవాని ఆలయం దగ్గర డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. కాల్వలు లేకపోవడంతో మురుగంతా రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో దోమల బెడద, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. – ఎల్లప్ప, 9వ వార్డు, గద్వాల ప్రత్యేకాధికారి : డ్రెయినేజీ నిర్మాణం కోసం సిబ్బందిని పంపి వివరాలు తెలుసుకుంటాం. అప్పటి వరకు మురుగు రోడ్డుపైకి రాకుండా అవసరమైన చర్యలు చేపడుతాం. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం. ప్రశ్న : అయిజలోని కోట్లవీధిలో తాగునీటి సమస్య ఉంది. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు. అంబేడ్కర్ చౌరస్తాలో పెద్దపాటి గుంతలు ఉండటంతో ప్రమాదాలకు గురవుతున్నాం. తిక్కవీరేశ్వరస్వామి గుడి వద్ద హై లెవెల్ మినీ వంతెన నిర్మిస్తే బాగుంటుంది. అంబేడ్కర్ చౌరస్తాలో సమీకృత మార్కెట్లో పూర్తయినా అందుబాటులోకి రాలేదు. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. – రామచంద్రారెడ్డి, తిరుమల్రెడ్డి, ఖదీర్, మహబూబ్, అయిజ ప్రత్యేకాధికారి : అధికారులను పంపించి అవసరమైన చర్యలు చేపట్టి పరిష్కరిస్తాం. ప్రశ్న : వడ్డేపల్లి 5, 6 వార్డుల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. – పావని, వడ్డేపల్లి ప్రత్యేకాధికారి : శాంతినగర్లో సంత ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న : శాంతినగర్లో గ్రంథాలయ భవనం ఏర్పాటు చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. – గాయత్రి, శాంతినగర్ ప్రత్యేకాధికారి : పరిశీలించి గ్రంథాలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు తాగునీరు, డ్రెయినేజీ సమస్యలపై ప్రజల ఏకరువు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రత్యేకాధికారి నర్సింగ్రావు ‘సాక్షి’ ఫోన్– ఇన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన ప్రశ్న : 28వ వార్డులో తాగునీరు దుర్వాసనతో వస్తుంది. వాటర్ టెస్టింగ్ చేయించి సురక్షితమైన తాగునీటిని అందించాలి. అలాగే చారిత్రాత్మకమైన గద్వాల కోటను సంరక్షించే చర్యలు చేపట్టాలి. – రామ్నాథ్, 28వ వార్డు, గద్వాల ప్రత్యేకాధికారి : 28వ వార్డులో తాగునీటి శాంపిల్ తీసుకుని టెస్టింగ్ చేయిస్తాం. సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు చేపడుతాం. అలాగే గద్వాల కోటను సంరక్షించుకునేందుకు కలెక్టర్తో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడుతాం. ప్రశ్న: డ్రెయినేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అధికారులు, వార్డు నాయకులకు చెప్పినా పరిష్కారం కాలేదు. – పూజారి కృష్ణ, వెంకటరమణ కాలనీ, గద్వాల ప్రత్యేకాధికారి : మీరు చెప్పిన ప్రాంతానికి ముందుగా సిబ్బందిని పంపించి సమస్యను పూర్తిస్థాయిలో తెలుసుకుంటాం. ఆ తర్వాత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. -
ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి
మానవపాడు: జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఎ.బుర్ధిపాడు, కలుకుంట్ల, మానవపాడులో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో 50 మందికి పైగా కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో జాబ్కార్డు ఉన్నవారందరికీ అవగాహన కల్పించాలని ఫీల్డ్అసిస్టెంట్లను ఆదేశించారు. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామానికి ఉపయోగపడే పనులు చేపట్టాలని, గ్రామపరిదిలోని చిన్నపాటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు. అనంతరం నర్సరీలను పరిశీలించి అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలాఉండగా, ఉపాధిహామీ కూలి రూ.300కు పెంచాలని కలుకుంట్ల కూలీలు అడిషనల్ కలెక్టర్ను కోరారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
గద్వాల క్రైం: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి అన్నారు. శనివారం జిల్లా ఆస్పత్రిలో న్యాయపరమైన సమస్యలు, చట్టాలపై మాట్లాడారు. బుద్దిమాంద్యం గల వ్యక్తులు వివిధ దశలలో న్యాయపరమైన హక్కులను వినియోగించక లేకపోతున్నారని, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి వైద్యుల నుంచి పూర్తి సహకారం ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతి ఉట్టిపడేలా.. యువ ఉత్సవ్ పోటీలు
గద్వాలటౌన్: పల్లెజీవనం ప్రతిబింబించే నృత్యాలు.. సంస్కృతిలో ఆచార వ్యవహారాల ప్రదర్శనలు.. శాసీ్త్రయ జానపద నృత్యాలు ఇలా ఎన్నో భారతీయ కళలు ఉట్టిపడేలా జిల్లాస్థాయి యువ ఉత్సవ్ పోటీలు సాగాయి. భారత ప్రభుత్వం యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం వారు కళాశాల విద్యార్థులకు యువ ఉత్సవ్ – 2025 పోటీలు నిర్వహించారు. శుక్రవారం ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోటీలకు వేదికై ంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఒకరికి మించి ఒకరు చక్కటి ప్రతిభ కనబర్చి న్యాయ నిర్ణేతల మెప్పు పొందారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు, జీవనశైలి తదితర అంశాలతో కూడిన నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. సందేశాత్మకమైన అంశాలతో పలువురు విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చి మెప్పు పొందారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్ బాషా, ప్రభుత్వ పీజీ సెంటర్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి వారు మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తి వెలికితీయడానికి పోటీలు దోహదం చేస్తాయన్నారు. అనిల్గౌడ్, రాజేంద్రకుమార్ పాల్గొన్నారు. -
లక్ష్యానికి అడ్డంకులు..!
పన్ను వసూళ్లలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లురెండు వారాల్లో పెరిగిన వేగంఆర్థిక సంవత్సరం మరో 12 రోజుల్లో ముగుస్తోంది. దీంతో పన్నుల వసూళ్లల్లో కమిషనర్ దశరథ్, రెవెన్యూ అధికారులు దూకుడు పెంచారు. బడాబకాయిదారుల జాబితాను చేతపట్టి అధికారులు నేరుగా దుకాణాలకు వెళ్తున్నారు.. ఆస్తిపన్ను చెల్లించే వరకు కట్టు కదలడం లేదు. ఈ క్రమంలో దుకాణాదారులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల సిఫార్సులను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు రోజువారి లక్ష్యాలు నిర్దేశిస్తుండటంతో... వారి ఆదేశాల మేరకు పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గడిచిన రెండు వారాలుగా పన్ను వసూళ్లుల్లో వేగం పెరిగింది. గద్వాలటౌన్: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది గద్వాల మున్సిపల్ అధికారుల పరిస్థితి. పట్టణంలో పన్ను వసూళ్లకు ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించారు. రోజువారి వసూళ్లకు రాజకీయ నేతలు మోకాలడ్డుతున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా మాజీ కౌన్సిలర్లు, లేదా పెద్ద రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు చేయిస్తున్నారు. లేదా చెల్లించమని బెదిరిస్తున్నారు. దీంతో పన్నులు వసూలు కాక ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక నలిగిపోతున్నారు. ఇదీ జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో అధికారుల పరిస్థితి. వంద శాతం పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఇరువురి మధ్య నలుగుతున్న మున్సిపల్ అధికారులు జిల్లా కేంద్రంలో పన్ను వసూలైంది 46.4 శాతమే.. నోటీసులు జారీ చేస్తున్నాం.. ఆస్తిపన్ను నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించడానికి అధికారులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా పన్ను వసూళ్ల వేగం పెరిగింది. బడా బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం వారు పన్ను చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నెలాఖరులోగా వందశాతం పన్ను వసూళ్లు చేస్తాం. – దశరథ్, కమిషనర్, గద్వాల -
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652
సమయం : శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు.. గద్వాల: జిల్లాలో పుర పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అఽధికారిగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) నర్సింగ్రావుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకునేందుకు శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. నేడు మున్సిపల్ ప్రత్యేక అధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
మొదటిరోజు 99.58 శాతం హాజరు
గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 7,597 మంది విద్యార్థులకుగాను 7,565 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 32 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. 99.58 శాతం హజరు నమోదైంది. మొత్తం 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు సహాయకుల సహాయంతో పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు బెంచీలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని గదులలో వెలుతురు సక్రమంగా లేక, ఫ్యాన్ల కొరతతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు వేర్వేరుగా జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పరీక్ష ముగిసే వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కలెక్టర్, ఎస్పీ తనిఖీ పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాలను వారు పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బంది తప్పని సరిగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, విద్యారుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు -
మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యం
గద్వాల క్రైం: మహిళల రక్షణ కోసం షీ టీంలు విధులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో ఆవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో 81 సమస్యాత్మక ప్రదేశాను గుర్తించి నిత్యం గస్తీ చేపట్టామన్నారు. వేధింపులకు గురి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు సైతం తరలించామన్నారు. కళాశాలలో ర్యాగింగ్ వంటివి చేస్తే నిర్భయంగా అధ్యాపక బృందానికి తెలియజేయాలని, వేధింపులకు గురిచేసినా, సామాజిక మాద్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాధితులు నేరుగా షీటీం సభ్యులకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 8712670312కు సంప్రదించాల్సిందిగా డీఎస్పీ తెలిపారు. 26న తైబజార్ వేలం అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ తైబజార్ వేలం పాటను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు, ఆసక్తి ఉన్న వారు 25వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను మున్సిపల్ కార్యాలయంలో తీసుకొని నిబంధనల మేరకు సాయంత్రం 5 గంటలోపు డీడీ డిపాజిట్లు అందజేయాలని తెలిపారు. మిగిలిన వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు గద్వాల: విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు శుక్రవారం తన ఛాంబర్లో కలెక్టర్ బీఎం సంతోష్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించి గుర్తింపు పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తూ పారదర్శకత, నిబద్దత, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, తదితరులు పాల్గొన్నారు. -
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం ● ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు సదావకాశం ● ఆన్లైన్లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్సైట్ ● రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులు నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. దరఖాస్తు విధానం.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్ ఐడీతో ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఈ నెల 23 వరకు.. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండటం, ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. వేసవిలో శిక్షణ.. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు. ఇవీ కేంద్రాలు.. విద్యార్థులను ప్రోత్సహించాలి.. వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట -
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652
సమయం : శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు.. గద్వాల: జిల్లాలో పుర పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అఽధికారిగా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) నర్సింగ్రావుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకునేందుకు శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రేపు మున్సిపల్ ప్రత్యేక అధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ఇసుక కొరత అధిగమించేందుకు చర్యలు
గద్వాల/రాజోళి/శాంతినగర్/అయిజ: ఇసుక అందుబాటులో ఉంచి, జిల్లాలో ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం జిల్లా మైనింగ్ ఏడీ వెంకటరమణతో కలిసి తుమ్మిళ్లలో కలెక్టర్ పర్యటించారు. తుంగభద్ర నదీ తీరంలో గల ఇసుక డీ–సిల్టేషన్ ప్రాంతాన్ని గుర్తించి పరిశీలించారు. గతంలో టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో ఇక్కడి నుండే ఇసుక సరఫరా చేయగా, ప్రస్తుతం వారి కాంట్రాక్ట్ ముగియడం, దాని రెన్యూవల్ ప్రక్రియ నడస్తుండటంతో మళ్లీ ఇసుక సౌలభ్యం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అక్కడ ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించి వాటి సరఫరా వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. క్షేత్ర స్థాయిలో బౌగోళిక పరిస్థితులను పరిశీలించి ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ ఎండీసీ ఆద్వర్యంలో ఇసుక డీ–సిల్టేషన్ ను ప్రారంభించాలన్నారు. అంతకుముందు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్,తహసీల్దార్ రామ్మోహన్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఓటరు నమోదు, బూత్లెవెల్ ఏజెంట్ల నియామకాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతిఒక్కరికి ఓటుహక్కు కల్పించేందుకు నిర్ణయించిందన్నారు. అదేవిధంగా పోలింగ్బూతులలో ఏజెంట్ల నియామకానికి సహకరించాలన్నారు. ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఏదైనా అభ్యంతరాలుంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. నూతన ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలను ఫామ్ 6,7,8 ద్వారా అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్రావు, తహసీల్దార్ మల్లిఖార్జున్, డీటీ కరుణాకర్, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలు
గద్వాలటౌన్: ఇంటర్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మార్చి 5 నుంచి ప్రారంభమైన పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ–2, కామర్స్–2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3,577మంది విద్యార్థులకుగాను 3,458 మంది హాజరయ్యారు. పలువురు రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యార్థులు మొత్తం కలిపి 117 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్య జిల్లా అధికారి హృదయరాజు, మండల కేంద్రాలలోని కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పరీక్షలు ముగిసిన వెంటనే స్నేహితులు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. సంతోషంగా ఇంటిబాట పట్టారు. 117 మంది విద్యార్థులు గైర్హాజరు -
బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం
గద్వాల: రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కుర్వ పల్లయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్లో బడ్జెట్ పత్రాలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి సర్కార్ విద్యావ్యవస్థను పాతాళానికి తొక్కేసిందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.53శాతమే నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శమన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ రూపంలో రూ.8వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, ప్రస్తుతం బడ్జెట్లో కేవలం రూ.23,108కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. విదేశీ యూనివర్సిటీలలో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం సున్నా అన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్టున్న సీఎం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాజు, సందేష్, మాధవ్, నరేంద్ర, పవన్, జోయోల్, హరికృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థీ... విజయీభవ!
గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 7,717 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 117 మంది ఉన్నారు. పది పరీక్ష రాసే వారిలో మొత్తం 3,851 మంది విద్యార్థులు బాలురు కాగా, 3,866 మంది బాలికలున్నారు. పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నాతధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత బస్పాస్, లేదా పదో తరగతి హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఆర్టీసీ ఇప్పటికే రూట్ మ్యాపింగ్ ప్రణాళికను తయారు చేసింది. సీసీ కెమెరాల నిఘాలో.. ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలోనే ప్రశ్నపత్రాల కవర్లను తెరవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాలలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును అధికారులు పరిశీలించారు. పోలీసు స్టేషన్లకు దూరంగా ఉన్న ‘సీ’ సెంటర్ల నుంచి ప్రశ్న పత్రాలను తరలించేందుకు పోలీసు ఎస్కార్టుతో ప్రత్యేక వాహనాలను కేటాయించారు. విద్యార్థులు, సిబ్బంది పరీక్ష కేంద్రం లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు అనుమతించరు. పటిష్ట బందోబస్తు కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులతో పది పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను తరలించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలి. నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు హాజరుకానున్న 7,717 మంది ద్యార్థులు మొత్తం 40 పరీక్ష కేంద్రాలు.. 430 మంది ఇన్విజిలేటర్లు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు ప్రశాంతంగా రాయండి జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మాస్ కాపీయింగ్కు పాల్పడితే డిబార్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – బీఎం సంతోష్, కలెక్టర్ -
నాలుగు జిల్లాలు
అట్టడుగున ● రాష్ట్రంలోనే సోలార్ మోడల్ విలేజ్గా నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్ మోడల్ ప్రాజెక్ట్ను చేపట్టింది. సాక్షి, నాగర్కర్నూల్: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అయితే అనీమియా ముక్త్ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్కర్నూల్ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్నగర్ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి. ● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్నగర్లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్కర్నూల్ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్కర్నూల్ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగు పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు సోలార్ మోడల్ విలేజ్గా కొండారెడ్డిపల్లి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్ లుక్ 2025లో వెల్లడి -
మీ సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తే చర్యలు
కేటీదొడ్డి: మండల కేంద్రంతో పాటు నందిన్నె మీసేవ కేంద్రాలను ఈడీఎం శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీసేవ కేంద్రాలలో సిటిజన్ చార్ట్ నోటిస్ బోర్డ్, సర్టిఫికేట్, రిజిష్టర్, టోల్ఫ్రీ కాల్ నంబర్స్ ను ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రజల నుండి ఆరా తీవారు. మీసేవ కేంద్రాల నిర్వహకులు సిటిజన్ చార్ట్ సర్టిఫికేట్స్ రిజిష్టర్ గురించి వినియోగదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యాలు కలిగించకుండా మీసేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకుంటే కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన రేషన్కార్డుల సర్వీసులకు రూ.45 మాత్రమే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యం అని ఆయన తెలిపారు. ధరల పట్టిక కూడా క్షుణంగా కేంద్రాలలో ఉంచాలని సూచించారు. వారి వెంట మీసేవ జిల్లా యూనియన్ అధ్యక్షుడు సురేష్, వెంకటేష్ నాయుడు, మౌలాలి, తదితరులు ఉన్నారు. ఆదివాసీ చెంచుల సమస్యలపై పోరాటం మన్ననూర్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆదివాసీ చెంచులకు కనీస సౌకర్యాల కల్పన కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ చెంచు ఐక్యవేదిక అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్ అన్నారు. బుధవారం చెంచు పెంటల్లో పర్యటించిన ఆయన.. అగర్లపెంటలో చెంచులతో సమావేశమై మాట్లాడారు. పాలకులు, అధికారులు చెంచుల సంక్షేమాన్ని కాగితలకే పరిమితం చేశారని విమర్శించారు. పండగలు, జాతర్ల పేరుతో చెంచు పెంటలకు వస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు.. అరచేతిలో వైకుంఠం చూపించి చేతులు దులుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. చెంచులకు మౌలిక వసతుల కల్పన కోసం పాలకులు నిధులు మంజూరు చేస్తుంటే.. ఆంక్షల పేరుతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అప్పాపూర్, సార్లపల్లి గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించినప్పటికీ.. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. వేసవి కాలం వచ్చిందంటే చెంచు పెంటల్లో నివసిస్తున్న చెంచులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచు పెంటలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఐటీడీఏ తరఫున మోడల్ జీపీ పాఠశాలలు, వైద్యం, అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందించాలని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,050 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది. -
‘పాలమూరు’కు ఇచ్చింది రూ. 2,514 కోట్లే..
ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14.5 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఈ బడ్జెట్లో నిరాశే మిగిలింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఇంకా కనీసం రూ.20 వేల కోట్లు అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు చేపట్టిన పనులకు దాదాపు రూ.9వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం రూ.2,514 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది బడ్జెట్లోనూ ప్రభుత్వం రూ.2 వేల కోట్లే కేటాయించగా, ఆ మాత్రం నిధులను కూడా ఖర్చు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. సరైన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రాజెక్ట్ పను లు ముందుకు సాగే పరిస్థితులు కన్పించడం లేదు. -
లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
అలంపూర్: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఎస్టీఓలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని నియోజకవర్గ రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు సదానందమూర్తి, ఎం. మద్దిలేటి, కేశవ ఆచారి తెలిపారు. అలంపూర్ పట్టణంలోని బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని, మీ–సేవ ద్వార ఆన్లైన్లో పొందిన లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ ఎస్టీఓలో సమర్పించని పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ నెల 25వ తేదీ లోగా ఎస్టీఓలో లైఫ్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలన్నారు. లేదంటే పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్కు మార్చి నెల పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని, నిర్ణీత సమయంలోపు పెన్షనర్స్, ఫ్యామిలి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్స్ తప్పక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ మానవపాడు: మండలంలోని పెద్దపోతులపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన జి.ప్రభావతి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను కలెక్టర్ ఆదేశానుసారం ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ భాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సదరు కార్యదర్శి విధులకు సరిగా హాజరుకాకపోవడంతోపాటు ఇంటి పన్ను 20శాతం కూడా వసూలు చేయలేదని తెలిపారు. హామీలు అమలు చేయాలి గద్వాల: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆశాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశాలకు రూ.18వేల ఫిక్స్డ్ జీతాన్ని ఇవ్వాలన్నారు. అదేవిధంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు పదోన్నతలు కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు సగం పెన్షన్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఆశాల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నర్సింగ్రావుకు అందజేశారు. కార్యక్రమంలో కాంతమ్మ, పద్మ, నాగప్రమీల, రేణుక, సునీత, అభేద, శ్వేతా, జయలక్ష్మీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరగలేదు. ప్రభుత్వం బడ్జెట్లో ప్రజా సంక్షేమమం విస్మరించింది. అన్ని వర్గాలకు బడ్జెట్లో అన్యాయం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఏకై క శక్తిపీఠమైన జోగుళాంబ క్షేత్ర అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించలేదు. రోడ్లు, తాగునీటికి, సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు ఇవ్వలేదు. సరిహద్దులోని నియోజకవర్గాలకు వైద్య సేవల విషయమై బడ్జెట్లో ప్రస్తావించనేలేదు. ఆరు గ్యారంటీలకు, ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలకు నిధులకు మంగళం పాడారు. ప్రజలను మోసగించడానికి ప్రయత్నించినట్లు ఈ బడ్జెట్తో స్పష్టంగా తెలుస్తుంది. – విజయుడు, ఎమ్మెల్యే, అలంపూర్ -
‘ఉపాధి’ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మల్దకల్: ఉపాధిహామీలో భాగంగా జాబ్ కార్డులు లేని కూలీలందరికి జాబ్కార్డులు అందించి పని కల్పించాలని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని తాటికుంట, పెద్దొడ్డి, మల్దకల్, అమరవాయి, బూడిదపాడు గ్రామాలను మోటార్సైకిల్పై కలెక్టర్ వెళ్లి అక్కడ చేపడుతున్న సీసీ రోడ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, నర్సరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దొడ్డి గ్రామంలో ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా నర్సరీతోపాటు ఉపాధిలో భాగంగా చేపడుతున్న ప్రదేశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. కూలీలకు అందుతున్న బిల్లులు, పనులు చేసిన రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఉపాధి పనుల వద్ద నేమ్బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాలలో చేపడుతున్న సీసీ రోడ్లను పరిశీలించి పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ బషీర్, ఎంపీఓ రాజశేఖర్, ఏపీఓ సుజాత, టెక్నికల్ అసిస్టెంట్లు నాగరాజు, ఉమేరా, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్అసిస్టెంట్లు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మోటార్సైకిల్పై వెళ్లి క్షేత్రస్థాయి పనుల పరిశీలన -
దాహార్తి తీరేదెలా..?
వేసవి సమీపిస్తున్న వేళ మూగజీవాలకు కరువైన నీటి తొట్టెలు రాజోళి: వేసవి కాలం సమీపిస్తుందంటే జీవులన్నీ దాహార్తితో గుక్కెడు నీళ్ల కోసం పరితపిస్తుంటాయి. ఆ క్రమంలో మూగజీవాల కోసం వేసవిలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనుషులతో పోలిస్తే మూగ జీవాల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వమే ప్రత్యేక అవసరాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని వేలాది పశువులకు రానున్న రోజుల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఇంకా ఈ చర్యలు ప్రారంభించలేని పాడి రైతుల నుండి, వ్యవసాయ దారుల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్చి మాసం గడుస్తుండటంతో ఎండలు మరింత ముదిరే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, గ్రామాల్లో ప్రత్యేకంగా ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు నీరు తాగేందుకు వీలుగా ట్యాంకులు, నీటి తొట్టెలు నిర్మించాల్సి ఉంది. కాగా వాటిపై ఎలాంటి కదలిక లేకపోవడంతో ముందు రోజుల్లో పశువులు దాహార్తితో ఇబ్బందులు పడతాయనే ఆందోళన గ్రామాల్లో నెలకొంది. 217 గ్రామాలు.. 7.71 లక్షల మూగజీవాలు జిల్లాలో వేల సంఖ్యలో పశు సంపద ఉంది. మొత్తం 217 గ్రామాల్లో గేదెలు 52,248, ఆవులు ఎద్దులు కలిపి 75,463, మేకలు 67,568, గొర్రెలు 5,76,000 మొత్తం 7.71లక్షలు ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా ట్యాంకులు అవసరం లేకపోయిన్పటికీ, చాలా వరకు బయటకు వెళ్లి మేత మేసే పశువులకు, గ్రామీణ ప్రాంతాలతో పాటు, గ్రామం బయట ఉండే జీవాలకు తప్పకుండా నీటి అవసరముంటుంది. దాని కోసం గ్రామంలో పశువులు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో, నీటి వనరులుండి, పశువలకు నీరు తాగేందుకు అనువుగాని చోట ప్రత్యేకంగా ట్యాంకులు, నీటి తొట్టెలు నిర్మిస్తారు. అలాంటివే జిల్లాలో 128 మాత్రమే నిర్మించగా, అవి కూడా ఏళ్ల కాలం కింద నిర్మించినవి కావడంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిలో నీరు నింపితే అవి వృథాగా కిందకు పోవడమే కాక, పశువుల దాహార్తి తీర్చడంలేదు. జిల్లాలో ఉన్న పశువుల సంఖ్యకు, నిర్మించిన నీటి తొట్టెలకు అసలు పొంతనే లేకుంది. ఇప్పటికే చాలా చోట్ల రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సొంతంగా నిర్మించుకోగా మరికొన్ని చోట్ల పూర్తిగా శిథిలమై, అసలు ఉపయోగంలోనే లేవు. నిర్మించిన 128లో కూడా 57 తొట్టెలు మరమ్మతులో ఉండగా,38 తొట్టెలలో అసలు నీరే పోయడం లేదు. ఇక మిగిలిన 75 మాత్రమే వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా, అధికారులు 357 తొట్టెలు నిర్మించాల్సి ఉందని ప్రతిపాదనలు పంపగా నేటి వరకు ఎలాంటి మంజూరు కాలేదు.జిల్లాలో నీటి తొట్టెల వివరాలిలా.. కొత్తవి నిర్మించాలి వేసవి కాలం ప్రారంభం అవుతుంది. గ్రామాల్లో పశువులకు నీరు తాగేందుకు వనరులునన్నప్పటికీ, ఎండలు ముదిరేకొద్ది అవి పూర్తిగా ఎండిపోతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే గ్రామాల్లో తొట్టెల నిర్మాణాలు చేస్తే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. గ్రామాల్లో ఉన్న తొట్టెలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటికి మరమ్మతులు, అవసరమైతే కొత్తగా నిర్మించాలి. చాలా వరకు రైతులు బోర్ల దగ్గరే షెడ్లు నిర్మిస్తున్నప్పటికీ బయటకు వెళ్లే పశువులకు ఇబ్బందులు తప్పడం లేదు. – బాను, పాడి రైతు, శాంతినగర్ జిల్లాలో వేల సంఖ్యలో పశువులు 217 గ్రామాల్లో 128 తొట్టీలు మాత్రమే అందుబాటులో.. శిథిలావస్థకు చేరినవి కొన్ని.. పర్యవేక్షణ కరువై మరికొన్ని నిరుపయోగం 357 తొట్టెలకు ప్రతిపాదనలు పంపినా మంజూరుకాని వైనం ఇబ్బందులు రానివ్వం పశువులకు నీటి అవసరాలు ఉన్నప్పటికీ, పాడి రైతులు తమ షెడ్ల దగ్గర, ఇళ్ల దగ్గర బోర్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వేసవిలో కొంత నీటి కొరతను అధిగమిస్తున్నారనే చెప్పవచ్చు. కానీ బయటకు వెళ్లే పశువులకు ట్యాంకుల విషయంలో జిల్లాలో పలు చోట్ల ఇ బ్బందులు ఉన్నాయనే ఆలోచనతో గతంలోనే నీటి తొట్టెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ఈ వేసవిలో ఎక్కడ పశువులకు తాగునీ టి ఎద్దడి రాకుండా చూస్తాం. – వెంకటేశ్వర్లు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి -
మోదం.. ఖేదం
ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే ప్రాధాన్యం సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తారని భావించగా, బడ్జెట్లో కేవలం రూ.2,514 కోట్ల మేరకే కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు బడ్జెట్లో ప్రస్తావించింది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో నిధులను కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేఎల్ఐ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు.. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో రూ.800 కోట్లను కేటాయించింది. గతేడాది సైతం రూ. 715 కోట్లు కేటాయించగా, ఈసారి మరికొంత నిధులను పెంచింది. కల్వకుర్తి కింద పెండింగ్లో ఉన్న 28, 29, 30వ ప్యాకేజీలను పూర్తిచేయడం ద్వారా ఆయా ప్రాజెక్ట్లకు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి రూ.110 కోట్లు పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్ల పంపిణీ పథకాలకు నిధులను సమకూర్చింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ. 31,605 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందనున్నారు. ● ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని చెబుతూ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు. ● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది. పెండింగ్లో ఉన్న కోయిల్సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్లకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించింది. కోయిల్సాగర్కు రూ.80.73 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్కు రూ.144 కోట్లు, సంగంబండకు రూ.98.08 కోట్ల నిధులను కేటాయించింది. కోయిల్సాగర్ ప్రాజెక్ట్కు అవసరమైన కేటాయింపులు దక్కడంతో పెండింగ్లో ఉన్న దేవరకద్ర గ్రావిటీ కెనాల్, ఎడమ కాల్వ, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనుల్లో వేగం పెరుగనుంది. సంగంబండ కింద చేపడుతున్న భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. కోయిల్సాగర్, సంగంబండకు కేటాయింపులు కేఎల్ఐకు రూ.800 కోట్లు కేటాయింపు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతలకు మరోసారి నిరాశే నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు రాష్ట్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన -
‘పాలమూరు’ పరుగులు పెట్టేనా?
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదు. మొత్తం 12.50 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2015లో తొలుత రూ.35,200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే అంచనా వ్యయం రూ.52,056 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు కింద పంపుహౌస్లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అన్నిచోట్ల కీలకమైన మోటార్ల బిగింపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదటి లిఫ్టు వద్ద ఒక్క మోటారును మాత్రమే ప్రారంభించారు. నార్లాపూర్ సమీపంలో మొదటి లిఫ్టు వద్ద రెండు మోటార్లు, ఏదుల సమీపంలో రెండో లిఫ్టు వద్ద నాలుగు మోటార్లు, వట్టెం సమీపంలో మూడో లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల చొప్పున బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ● రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కొడంగల్– పేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులకు సంబంధించిన సర్వే మూడు దశల్లో పూర్తి కాగా.. ప్రాజెక్టు డీపీఆర్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ● కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఏడాదికి రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి. -
వారంలోగా ‘ఉపాధి’ పనులు పూర్తిచేయాలి
గద్వాల: జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఽఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల నిర్వహణలో అలసత్వం వహించకుండా నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించడంతో పాటు ప్రతి పనికి సంబంధించిన సమగ్ర వివరాలను అందుబాటులో ఉండాలని సూచించారు. మండలాల వారీగా పూర్తయిన పనుల జాబితా, ఎఫ్టీఓ జనరేషన్, పెండింగ్, పురోగతిలో ఉన్న పనులకు సంబంధించి నిర్దేశిత సమయంలోగా ఎంబీ రికార్డు వంటి వివరాలను నమోదు చేయాలన్నారు. చేసిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, పంచాయతీరాజ్ ఈఈ దామోదర్రావు, డీఈలు, ఏఈలు ఉన్నారు. -
అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ప్రజా భవన్లో మంగళవారం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై అలంపూర్ క్షేత్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్గర్ కలెక్టర్గా అజయ్ కల్లం విధులు నిర్వర్తించిన సమయంలో అలంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేశారని గుర్తుచేశారు. క్షేత్రం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్తో కలిసి రెండుసార్లు సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్, పార్కింగ్, ఆలయ చరిత్రతో కూడిన ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్షేత్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం, అతిథిగృహాల నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, అర్చీల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20న మరోసారి సమావేశం నిర్వహించి.. అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ వైస్ చాన్స్లర్ రాఘవారెడ్డి, రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీడ్స్ గ్రోవర్స్ సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు డా.కేశవులు తదితరులు ఉన్నారు. -
కూలీలకు కనీస వసతులు కల్పించండి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కూలీలకు కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఇటిక్యాల సమీపంలో పెద్దదిన్నె రోడ్డు, లింగమ్మచెరువు కట్ట వద్ద చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి పని కొలతలను పక్కాగా నమోదు చేయాలని.. 80 పనిరోజులు పూర్తిచేసిన కూలీలకు 100 రోజులు ఉపాధి పనులు పూర్తిచేసే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏవీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఎం శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఏ పురేందర్ పాల్గొన్నారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. కోయిల్సాగర్ది అదే దారి.. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం తాజాగా సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా.. పెండింగ్ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు -
టీ–ఫైబర్ సేవలెప్పుడో?
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్ సేవలకు సంబంధించిన పరికరాలను బిగించి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలకు డిజిటల్ సేవలు అందడం లేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరమవుతాయి. – నాగేంద్రం, డీపీఓ గ్రామపంచాయతీల్లో నిరుపయోగంగా పరికరాలు ● ఇంటర్నెట్ సౌకర్యంలేక మరుగున పడిన ఈ–పాలన ● ఏ పనికై నా మండల కేంద్రానికి వెళ్లాల్సిందే.. ●మానవపాడు: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సేవలు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతీ పనికి సాంకేతికతతో ముడిపడి ఉంది. ఈ నైపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల, కళాశాలలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతువేదికలు, ఇతర ప్రజాసేవల సంస్థలకు అతివేగంతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మిషన్ భగీరథ పథకం పైప్లైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్ కేబుల్ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ టీ–ఫైబర్ పరికరాలు అమర్చారు. అయితే ఇప్పటి వరకు సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఎన్నికలలోపు అందుబాటులోకి వచ్చేనా? ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, విజేతల వివరాలు ఇలా ప్రక్రియ అంతా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేక మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే, పంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించక ముందే విద్యుత్ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో రూ. వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత మాత్రం తప్పడం లేదు. జాడలేని ఈ–పాలన.. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయ వ్యయాలు, కార్మికుల జీత భత్యాల చెల్లింపులతో పాటు జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటిపన్ను తదితర సేవలను గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు డిజిటల్ రూపంలో అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసం క్లస్టర్ల వారీగా ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్లేట్లు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ కూడా చేశారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. అయితే పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ఈ–పాలన మరుగున పడింది. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనంతో పాటు ప్రజలకు డిజిటల్ సేవలు అందించాలనే సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా అవాంతరాలు ఉంటే లబ్ధిదారులు మండల పరిషత్ కార్యలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి పంచాయతీ కార్యదర్శులు చేతిరాత రశీదులే ఇస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం టీ–ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ఈ–పాలన అందించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని మంగళవారం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి అశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. ఆయన వెంట ఆలయ మాజీ ధర్మకర్త నీలప్ప, కడప డివిజన్ ఎస్డీఎం రవికుమార్, రాయచూరు ఎస్డీఎం వైవీ రావు, ఎంఎంలు శ్యాంసుందర్, చిరంజీవి ఉన్నారు. అదే విధంగా సీరియల్ నటి జ్యోతిరెడ్డి అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించి జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్ఎల్ఎంతో తక్కువ వడ్డీకే రుణాలు అయిజ: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే ఎక్కవ మొత్తంలో రుణాలు అందిస్తున్నట్లు నాబార్డ్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ బొల్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీడీఎంలు షణ్ముఖాచారి, మనోహర్రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ అయ్యపురెడ్డిలతో కలిసి అయిజ సింగిల్విండో కార్యాలయాన్ని సందర్శించారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్, ఫెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ మధుసూదన్రెడ్డితో వివరాలు తెలుసుకున్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల కేటాయింపులు, వాటి అమలు తీరుపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోనే రైతులకు అన్నివిధాలా మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. నేషనల్ లైవ్స్టాక్ పథకం ద్వారా గొర్రెలు, బర్రెలు, పౌల్ట్రీ తదితర వాటి ఏర్పాటు కోసం రైతులకు తక్కువ వడ్డీ రేట్లకే ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తామని.. ఇందులో గణనీయమైన సబ్సిడీ కూడా ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు గద్వాల: గద్వాల బార్ అసోసియేషన్కు 2025–26 సంవత్సరం నూతన అధ్యక్ష, కార్య దర్శులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షఫి ఉల్లా ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గ ఎన్నికలకు సీనియర్ న్యాయవాది పూజారి శ్రీధర్ను ఎన్నికల కమిషనర్గా నియమించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ఈ నెల 27వ తేదీలోగా పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం తగదు ధరూరు: మండలంలోని నీలహళ్లి–పాతపాలెం మార్గంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం విషయంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్కుమార్ అన్నారు. మంగళవారం బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే బ్రిడ్జి గతేడాది వర్షాకాలంలో వరదలకు కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఆయన వెంట నడిగడ్డ హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, మండల అధ్యక్షుడు గోవిందు, లవన్న, మునెప్ప, ఇస్మాయిల్, రాము, జగదీశ్, జమ్మన్న, ఆంజనేయులు, నాగరాజు, మల్దకల్, ప్రేమ్రాజ్ తదితరులు ఉన్నారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. కోయిల్సాగర్ది అదే దారి.. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం తాజాగా సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా.. పెండింగ్ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు -
ఇథనాల్ కంపెనీని రద్దు చేయించండి
శాంతినగర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటుచేస్తే రైతులు పంటలు నష్టపోతారని, ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్కు పెద్ద ధన్వాడ ప్రజలు విన్నవించారు. ప్రజలకు, రైతులకు నష్టం వాటిల్లే ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దుచేయించాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వంతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, వడ్డేపల్లి మండలం కొంకలకి చెందిన ఎం.శారదమ్మ అనారోగ్యానికి గురికాగా ఆమె ఆపరేషన్ ఖర్చుల కొరకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ కాపీని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఆర్డీఎస్కు నీరందించండి.. ఆర్డీఎస్ కెనాల్కు నీటిని విడుదల చేయించాలని ఆయకట్టు రైతులు ఆయనను కోరారు. వడ్డేపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు సోమవారం శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో కలిసి నీటిని విడుదల చేయించాలని కోరారు. స్పందించిన ఏఐసీసీ కార్యదర్శి నీటిని విడుదల చేయించేందుకు తన వంతు కృషిచేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయులు
గద్వాల: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా టి.రామాంజనేయులును నియమిస్తూ పార్టీ రాష్ట్ర ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారి గీతామూర్తి సోమవారం ప్రకటన విడుదల చేశా రు. అలాగే, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గద్వాల నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు బండల వెంకట్రాములు, అక్కల రమాసాయిబాబ, అలంపూర్ నియోజకవర్గం నుంచి కె.జయలక్ష్మీని నియమించారు. అలివేలు మంగ హుండీ లెక్కింపు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి కొనుగోలుకు రశీదు తప్పనిసరి
అలంపూర్: వినియోగదారులు ప్రతి కొనుగోళుకు రశీదు తీసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్తేజ అన్నారు. అలంపూర్లోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వినియోగదారులు కొనుగోలుకు సంబంధించి రశీదు పొందడం వలన ఏవైనా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు కలిగిన రశీదు ఆధారంగా న్యాయం పొందవచ్చని అన్నారు.సమావేశంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, న్యాయవాదులు శ్రీనివాసులు, నాగరాజు యాదవ్, వెంకటేష్, యాకోబు, నాగయ్య, తిరుమలేష్, కక్షిదారులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలో వసతులు కల్పించాలి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ నాయకులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, విద్యార్థులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆర్భాటంగా ప్రారంభించడంతో చూపిన శ్రద్ధ, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చూపలేదని విమర్శించారు. సమస్యలతో విద్యార్థులు సహజీవనం చేస్తున్నారని మండిపడ్డారు. 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోనే మెడికల్ కళాశాలను నిర్వహించడం దారుణమన్నారు. మెడికల్ కళాశాల భవనం ఇంకా నిర్మాణంలోనే ఉందని చెప్పారు. విద్యార్థులకు వసతి సౌకర్యం లేదని, కళాశాలకు ప్రహరీ నిర్మించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఫుడ్ సప్లైయ్కు టెండర్ నిర్వహించాలని కోరారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మెడికల్ కళాశాలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, రామాంజనేయులు, మురళిధర్రెడ్డి, కేకే రెడ్డి, బండల వెంకట్రాములు, రాజగోపాల్ పాల్గొన్నారు. -
భూ బాగోతంపై విచారణకు ఆదేశం
గట్టు: గుట్టుగా ఐదెకరాల భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారంపై సోమవారం జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. గట్టు మండలంలోని ఇందువాసి శివారులో ఐదెకరాల భూమిని అడ్డదారుల్లో వారసులు కాని వారసులు రికార్డులను మార్చుకొని సొంతం చేసుకునేందుకు యత్నించగా.. దీనిపై ‘ఐదెకరాల భూమికి టెండర్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా అధికారులు స్పందించారు. అసలు గట్టు రెవెన్యూ కార్యాలయంలో ఏం జరుగుతుందని, అక్రమాలకు ఎవరెవరు సహకరిస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్ ఎవరు జారీ చేశారు, జారీ చేసే క్రమంలో కనీస విచారణ చేశారా లేదా అనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. జీవించి ఉన్న తల్లిదండ్రులను చనిపోయినట్లుగా నమ్మించిన వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్ను రెవెన్యూ అధికారులు గుడ్డిగా ఎలా జారీ చేస్తారని, ఎవరి హయాంలో ఈ సరిఫ్టికెట్ను జారీ చేశారనే వివరాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలాఉండగా అసలు పట్టాదారుడైన ముత్తయ్య చాలా కాలం క్రితమే చనిపోయినప్పటికీ అతను 2019లో చనిపోయినట్లుగా చూపుతున్న మరణ ధ్రువీకరణ పత్రం కూడా నకిలీది అని తెలిసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని పోర్జరీ చేసి, మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లుగా తెలుస్తోంది. 2019లో ఇందువాసి కార్యదర్శిగా పని చేసిన వ్యక్తిని మరణ ధ్రువీకరణ పత్రం గురించి ప్రశ్నిస్తే.. అసలు ఆ సంతకం తనది కాదని, తన సంతకాన్ని పోర్జరీ చేసినట్లు వ్యక్తి తెలపడం గమనార్హం. మొత్తం మీద గట్టు భూ బాగోతం వ్యవహారంపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనే దానిపై మండల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
గుర్రంగడ్డ పనుల్లో కదలిక
నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం 2018లో రూ.12కోట్లతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో మాత్రం చలనం లేదు. దీంతో గత ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతం సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు గుర్రంగడ్డవాసులు. విద్య, నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందాలన్నా పుట్టీల సాయంతో నది దాటాల్సిందే. కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం ఇదే. వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ఏళ్లుగా గుర్రంగడ్డ వాసులు కోరుతున్నా.. బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తవడంలేదు. తాజాగా వంతెన నిర్మాణ పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించామని, పనులు వేగవంతం చేసి కష్టాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈగ్రామంలో మొత్తం 600 కుటుంబాలు నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతో దీవివాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి. ఆర్నెళ్లు నది మధ్యలోనే.. కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం.. అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు ఏడాదిలో పూర్తి చేస్తాం 2018లో రూ.12కోట్లతో గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీంతో పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. – రహీముద్దీన్, ఇన్చార్జ్ ఎస్ఈ -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 30మంది ఫిర్యాదులు అందజేసిట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు.. గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు అందాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై వివరించారని, ఇందుల్లో భూ సంబంధ, సైబర్ మోసాలు, వేధింపులపై ఫిర్యాదులు అందాయన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు వివరించారు. -
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
గద్వాల క్రైం: వేసవి కాలంలో ప్రజలందరు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. సోమవారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. గత వారం రోజల నుంచి జిల్లాలో ఎండ తీవ్రత దాటికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరు సరిపడా నీటిని తాగాలన్నారు. ఆహార అలవాట్లు, రోజు వారి శ్రమ తదితర విషయాలను సూర్యరశ్మి తీవ్రత ఉన్న సమయంలో ఉపశమనం తీసుకోవాలన్నారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల శిక్షణకు ఎంపిక గద్వాలటౌన్: ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జమ్ము కాశ్వీర్లో జరిగే జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీల శిక్షణ క్యాంపునకు గద్వాలకు చెందిన క్రీడాకారుడు బీచుపల్లి ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. గత నెల 21వ తేది నుంచి 24వ తేదీ వరకు వికారాబాద్లో జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బాలుర కబడ్డీ పోటీలలో జిల్లా జట్టు తరపున బీచుపల్లి పాల్గొని ప్రతిభ కనబర్చారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో బీచుపల్లి క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలక్టర్లు జాతీయ స్థాయి పోటీల శిక్షణా శిబిరానికి ఎంపిక చేశారని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ అబ్రహాం, సెక్రటరి రవి, కోశాధికారి చందు, కరెంటు నర్సింహా, నగేష్, రైల్వేపాష, వెంకటన్న సీనియర్ క్రీడాకారులు హర్షం తెలిపారు. ముగిసిన వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఎదుర్కోళ్లు, స్వామివారి కల్యాణం, చతురస్త్రార్చన వంటి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు చతురస్త్రార్చన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రాతారాధన, సేవాకాలం, రాజభోగం, పూర్ణాహుతి, నవ కలశ స్నపన చక్రతీర్థం అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణ, అర్చకులు శ్రీకర్, శేషసాయి, రంగనాథ్, ప్రసాద్, నర్సింహచార్యులు, నవీన్, తివారీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. వారం రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఐదెకరాల భూమికి టెండర్
నకిలీ వారసుడి నిర్వాకం గట్టు: మొన్నటికి మొన్న.. గట్టుకు చెందిన ఓ వ్యవసాయ భూమి యజమాని 2016లో చనిపోతే ఆ వ్యక్తి ఆధార్ను మరో వ్యక్తి లింకు చేసుకొని 2021లో గట్టు రెవెన్యూ ఆఫీసులో దర్జాగా భూ బదలాయింపు చేశారు. దాయాది కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం బయట పడింది. నిన్నేమో.. ఆలూరులో ఒక కులానికి చెందిన వ్యక్తి చనిపోతే మరో కులానికి చెందిన వ్యక్తి ఆ భూమికి తామే వారసులమని వారసత్వం భూమిని బదలాయించగా తమ పనితనాన్ని చాటుకొని ఔరా అనిపించుకున్నారు. ఇక తాజా విషయానికి వస్తే.. వారసులు కాని వారసులు గట్టు రెవెన్యూ అధికారుల సహకారంతో తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొని ఇందువాసి శివారులోని 5–18 ఎకరాల భూమికి టెండర్ పెట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మొత్తంగా గట్టు రెవెన్యూ అధికారులు ఏం చేసినా అడిగే దిక్కెవరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఉన్నతాధికారులు కూడా ఇవేం పెద్ద నేరాలు కాదన్నట్లుగా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని సామాన్యులు ఆరోపిస్తున్నారు. తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్తో.. ఇటీవల ఇందువాసి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 385/బీ/1లోని 5–18 ఎకరాల భూమికి అసలు వారసులు కాకుండా నకిలీ వారసులు ముందుకు వచ్చి భూమిని కాజేసే ప్రయత్నం చేశారు. వారం రోజుల క్రితం అక్రమ భూ బదలాయింపు వ్యవహారంపై అసలు వారసులు గట్టు రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని ఘర్షణకు దిగి, పోలీస్ స్టేషన్ దాకా పంచాయితీ వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. ఇందువాసి గ్రామానికి చెందిన ముత్తయ్య తండ్రి ఇంజన్నకు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 358/బీ/1లో 5–18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ముత్తయ్య ప్రకాష్, గొర్లన్న అనే ఇద్దరు కుమారులతో పాటుగా ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే సదరు భూ యజమానితో పాటుగా కుటుంబ సభ్యులు ఉపాధి నిమిత్తం శాంతినగర్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. భూ యజమాని చనిపోయిన విషయం తెలుసుకున్న దాయాది అయిన విజయ్ తండ్రి ఇంజన్న అనే వ్యక్తి చనిపోయిన ముత్తయ్య తన తండ్రి కాకపోయినప్పటికి తన తండ్రే అని రెవెన్యూ అధికారులను నమ్మించాడు. ముత్తయ్య ఆధార్ లింకును తన తండ్రి ఇంజన్న ఆధార్కు లింకు చేయించుకున్నాడు. తన తండ్రి ఇంజన్న, తల్లి సుశీలమ్మ బతికుండగానే చనిపోయినట్లుగా నమ్మించి, గత ఏడాది నవంబర్లో తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను తీసుకున్నాడు. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా గత ఏడాది నవంబర్లో గట్టు తహసీల్దార్ కార్యాలయంలో వారసత్వంగా భూ బదలాయింపునకు ప్రయత్నించాడు. విషయం కాస్త శాంతినగర్లో ఉండే అసలు వారసుడికి తెలియడంతో గట్టు రెవెన్యూ కార్యాలయానికి వచ్చి, భూ బదలాయింపును అడ్డుకొని వాగ్వానికి దిగారు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత తహసీల్దార్ మారిపోవడంతో నకిలీ వారసుడు మళ్లీ రెవెన్యూ అధికారుల దగ్గర భూ బదలాయింపునకు ప్రయత్నించగా, అసలు వారసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ అధికారుల ఎదుటే ఘర్షణకు దిగారు. రెవెన్యూ అధికారులు అసలు విషయం తెలుసుకుని భూ బదలాయింపును నిలిపి వేసినట్లు తెలిసింది. కళ్లు మూసుకుని ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్ ఇచ్చిన అధికారులు అసలు వారసుడి రంగప్రవేశంతో ఆగిన భూ బదలాయింపు ఇందువాసి శివారులోని భూమికి ఎసరు తహసీల్దార్ ఏమంటున్నారంటే.. ఇందువాసి భూ బదలాయింపు వ్యవహారం తన దృష్టికి వచ్చినట్లు తహసీల్దార్ సలిముద్దీన్ తెలిపారు. తప్పుడు ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తన దృష్టికి రావడంతో రిజిస్ట్రేషన్ను నిలిపి వేశాం. గతంలో జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు సిఫారస్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం.. ఒక్కో మైనార్టీ గురుకుల కళాశాలల్లో ఒక్కో గ్రూప్లో 40 సీట్ల చొప్పున రెండు గ్రూప్ల్లో 80 సీట్లు ఉంటాయి. మైనార్టీలకు 75 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, (ముస్లింలకు 26, క్రిస్టియన్లు 2, జైన్స్, పార్సిస్, బుద్దిస్ట్, సిక్లకు 2 సీట్లు), ఇతరులకు 25 శాతం రిజర్వేషన్ల ప్రకారం 10 సీట్లు కేటాయిస్తారు. నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్నగర్ -
అవస్థల ప్రయాణం
అంతర్ జిల్లాల దారిలో.. మహబూబ్నగర్– శ్రీశైలం, పెబ్బేరు– జడ్చర్ల మధ్య పెరిగిన రాకపోకలు ●కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలు గు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ అచ్చంపేట: అంతర్ జిల్లాల రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఒకవైపు గుంతలు, మరోవైపు ప్రమాదకర మలుపులతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల రద్దీకి అనుగుణంగా అంతర్ జిల్లాల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలనే ప్రతిపాదనలు మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు వెళ్లేందుకు రెండు వరుసల రహదారులే దిక్కవుతున్నాయి. ఫలితంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి బిజినేపల్లి, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం మీదుగా అచ్చంపేట, మన్ననూర్ వరకు.. పెబ్బేరు నుంచి వనపర్తి జిల్లాకేంద్రం, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల వరకు రెండు వరుసల రహదారులు ఉన్నాయి. వీటిని జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉండగా.. కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు అలంపూర్ చౌరస్తా నుంచి డిండి, నల్లగొండ వరకు మరో జాతీయ రహదారి కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. మహబూబ్నగర్తోపాటు గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల ప్రజలు శ్రీశైలం– హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రోడ్డుపై ప్రయాణించాలి. ఉమ్మడి జిల్లావాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వాహనదారులు రాకపోకలు సాగిస్తారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రెండు వరుసల రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కనీస వేగంతో ఈ రోడ్డుపై ప్రయాణించడం కష్టతరంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు తిరిగే అంతర్ జిల్లాల రోడ్డును జాతీయ రహదారిగా మారిస్తే ప్రయాణికులు, వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది. వీటితో అనుసంధానిస్తే.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఎన్హెచ్–44, 167, 765 ఉన్నాయి. వీటికి అదనంగా భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ మీదుగా చించోలి వరకు ఎన్హెచ్–167ఎన్, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఎన్హెచ్–167కే, కర్నూలు నుంచి షోలాపూర్ వరకు ఎన్హెచ్–150సీ జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. అలాగే భూత్పూర్ నుంచి ఎన్హెచ్–44, చించోలి 167–ఎన్ రహదారులను అనుసంధానిస్తూ.. మన్ననూర్ (శ్రీశైలం ఎన్హెచ్–765) వరకు 104 కి.మీ., రోడ్డును పొడిగించాలనే డిమాండ్ ఉంది. పెబ్బేరు ఎన్హెచ్– 44 నుంచి వనపర్తి, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల ఎన్హెచ్–167 వరకు 74 కి.మీ., పుల్లూరు ఎన్హెచ్–44 నుంచి అలంపూర్, పెంట్లవెల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట మీదుగా డిండి ఎన్హెచ్–765 వరకు, వనపర్తి నుంచి కొత్తకోట మీదుగా మంత్రాలయం వరకు 110 కి.మీ., ఎర్రవల్లి ఎన్హెచ్–44 నుంచి గద్వాల మీదుగా రాయచూర్ వరకు 67 కి.మీ., మరికల్ నుంచి నారాయణపేట మీదుగా రామసముద్రం ఎన్హెచ్–150 వరకు 63 కి.మీ., రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి జాతీయ రహదారులుగా మారితే ఆయా గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిసారిస్తే జాతీయ రహదారుల దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. మహబూబ్నగర్– శ్రీశైలం అంతర్రాష్ట్ర రహదారి ఇలా.. పుణ్యక్షేత్రాలను కలుపుతూ.. గడిచిన రెండు దశాబ్ధాల కాలంలో ఉమ్మడి జిల్లా ఎంతో ప్రగతి సాధించింది. అంతర్ జిల్లాల రోడ్లు జాతీయ రహదారులుగా మారితే పర్యాటకంగా, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రజల రాకపోకలు, సరుకుల రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందినవారు శ్రీశైలానికి రావాలంటే మహబూబ్నగర్– అచ్చంపేట రోడ్డే దిక్కు. శ్రీశైలం, మద్దిమడుగు ఆంజనేయస్వామి, ఉమామహేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, సలేశ్వరం పుణ్యక్షేత్రాలు, పర్యాటకంగా విరాజిల్లుతున్న నల్లమల ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇలా రాకపోకలు సాగించే వాహనాలకు మహబూబ్నగర్–అచ్చంపేట, పెబ్బేరు– జడ్చర్ల్ల మధ్య ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు మార్గాల్లో రోడ్ల సామర్థ్యానికి మించి వాహనాలు నడుస్తున్నాయి. ఫలితంగా వాహనాలు తక్కువ వేగంతో వెళ్లాల్సి వస్తుండటంతో కొద్ది దూరానికే ఎక్కువ సమయం గడిచిపోతోంది. వీటిని జాతీయ రహదారులుగా మార్చాల్సిన అవసరం ఉంది. వాహనాల రద్దీకి అనుగుణంగా లేని రోడ్డు సౌకర్యం ప్రతిపాదనలకే పరిమితమైన జాతీయ రహదారి డిమాండ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
మిల్లుల్లో దొంగలు పడ్డారు
జోగుళాంబ గద్వాలనడిగడ్డలో వరుస బియ్యం అపహరణలతో విస్మయం సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025వివరాలు 8లో u● అమ్ముకున్నారా.. అపహరించారా.. అన్న అనుమానాలు ● తాజాగా రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు ● పోలీసుల అదుపులో నిందితులు? ●విచారణ దశలో ఉంది రైస్ మిల్లులో వరిధాన్యం, బియ్యం, నూకలను అపహరించిన ఘటనపై కొందరిని అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. అయితే ఇది ప్రభుత్వం కేటాయించిన సీఎమ్మారా.. లేక ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యమా అనేది తేలాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. సివిల్సప్లై శాఖ అధికారుల నివేదికాల ఆధారంగా విచారణ చేపడతాం. – శ్రీకాంత్, ఎస్ఐ, గద్వాల రూరల్ గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, బ్యాంకుల్లో దొంగలు పడడం వింటుంటాం. కానీ, నడిగడ్డలో ఏకంగా రైస్మిల్లుల్లో దొంగలు పడుతున్నారు. వందలాది ధాన్యం, బియ్యం బస్తాలను ఎత్తుకుపోతున్నారు. 50 నుంచి 75 కేజీల వరకు బరువు ఉండే వందలాది బియ్యం, ధాన్యం బస్తాలను గుర్తు తెలియని దుండగులు అపహరించడం.. అందులోను మొత్తానికి మొత్తం సీఎంఆర్ (మర ఆడించేందుకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం) ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా గద్వాల మండల పరిధిలోని ఓ రైస్ మిల్లులో దొంగలు చొరబడి వరిధాన్యం, బియ్యం, నూకలు అపహరించారని యాజమాని రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. గత ఏడాది ఎర్రవల్లి మండలంలోని ఓ రైస్ మిల్లులో సీఎంమ్మార్ బస్తాలు అపహరణకు గురయ్యాయి. ఇదంతా నిజంగా దొంగల పనా.. లేక ఇంటి దొంగల పనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సంఘటనలు యాజమానుల గారడీయే అని పలువురు ఆరోపిస్తున్నారు. మిల్లు యజమాని ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. పోలీసుల అదుపులో నిందితులు ఇదిలాఉండగా, మొదటి కేసులో పోలీసులు విచారణలో ఆరుగురు నిందితులను గుర్తించారు. ఏ1 లారీ డ్రైవర్ కావడం తరచూ గోదాంకు వరిధాన్యంను అన్లోడు చేసే క్రమంలో తెలిసిన కూలీల ద్వారా దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే తాజాగా రూరల్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులోను మిల్లులో పని చేసే వ్యక్తులే దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులోని రైస్ మిల్లులో వరిధాన్యం, బియ్యం, నూకలు అపహరించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎంత మొత్తంలో చోరీకి పాల్పడి వాటిని ఎక్కడికి తరలించారు, ఎంత విక్రయించారనే వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే కొన్ని చిక్కు ముడులున్నాయి. ప్రభుత్వం కేటాయించిన సీఎంమ్మార్ను మిల్లర్లు బ్లాక్ మార్కెట్లో గుట్టుగా విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా చేసి అందజేయాల్సి ఉండగా వాటి నుంచి తప్పించుకునేందుకే ఈ చోరీల అంశాన్ని సాకుగా చూపిస్తున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అనుమానాలెన్నో..? జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలు 25.12.2024 తేదీన హరినాథ్ రైస్ మిల్లు వ్యాపారికి సంబంధించి ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద ఓ గోదాంలో ప్రభుత్వం కేటాయించిన 1,50,000 బస్తాల సీఎమ్మార్ను కేటాయించగా అట్టి ధాన్యాన్ని గోదాంలో నిల్వ ఉంచారు. అయితే దుండగులు గోదాం షెట్టర్ను ధ్వంసం చేసి రూ.3.50లక్షల విలువ గల 300 బస్తాలు వరిధాన్యాన్ని అపహరించినట్లు ఇటిక్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. 8.03.2025 తేదీన అశోక్కుమార్ రైస్ మిల్లు వ్యాపారి గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులో రైస్ మిల్లును ఏర్పాటు చేసుకుని వరిధాన్యం మర ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో మిల్లులో వరిధాన్యం, బియ్యం, నూకల బస్తాలను మిల్లులో పని చేసే వ్యక్తులు అపహరించారని అనుమానం వ్యక్తం చేస్తు ఫిర్యాదు చేశాడు. అపహరించిన వరిధాన్యం, బియ్యం, నూకల విలువ రూ.2 లక్షలు ఉంటుందని ఫోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్, అయిజ పరిధిలో 37 రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం సీఎంమ్మార్ను 2024 – 2025 ఖరీఫ్ సీజన్కుగాను 85,483 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు మిల్లర్లు 31,481.696 మెట్రిక్ టన్నుల బియ్యంను (9.84 శాతం) మాత్రమే ప్రభుత్వానికి అప్పగించినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక ఆశోక్కుమార్ రైస్ మిల్లుకు ప్రభుత్వం 1470.120 మెట్రిక్ టన్నులకుగాను ఇప్పటివరకు 40 శాతం మేర సరఫర చేసినట్లు సమాచారం. ఖరీఫ్ గడువులోగా మొత్తం మర ఆడించిన బియ్యాన్ని అందజేయాల్సిన తరుణంలో చోరీ సంఘటన వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదులో రూ.2లక్షల విలువగా పేర్కొనగా.. నిందితులపై రూ.కోటిపైగా విలువ గల వరిధాన్యం, బియ్యం, నూకలను అపహరించినట్లు అభియోగం మోపినట్లు సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, 2023 సంవత్సరంలో గద్వాల, శాంతినగర్, అయిజ పోలీసు స్టేషన్లోని మూడు మిల్లులపై సైతం కేసులు నమోదయ్యాయి. అయితే ఆర్థిక బలం, నాయకుల మద్దతు ఉండడమే రైస్ మిల్లు వ్యాపారులకు కలిసి వస్తుంది. సివిల్ సప్లై శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా లేకపోవడం వ్యాపారులను నిలువరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు, వ్యాపారుల అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్ఫోర్స్ మెంట్, ఇంటెలిజెన్సీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. -
ఉపాధి కూలీలకు మేలు చేకూర్చండి
అయిజ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు మేలు చేకూర్చాలని అడిషనల్ కలెక్టర్ (లోకల్బాడీ) నర్సింగరావు అన్నారు. శనివారం మండలంలోని సంకాపురం, బింగుదొడ్డి గ్రామాల శివార్లలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి పనులు చేసే కూలీలకు ప్రతిరోజు రూ. 300 కూలి వచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాలని సిబ్బందిని సూచించారు. కూలీలు పనిచేసే ప్రదేశాల్లో షెడ్ నెట్, మంచినీటి సదుపాయం కల్పించాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. ఎక్కువమంది కూలీలు పనికి వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈసందర్భంగా ఈజీఎస్ సిబ్బంది కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఎంపీడీఓ వెంకటయ్య, ఏపీడీ శ్రీనివాసులు, ఈజీఎస్ ఏపీఓ లాలు నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు రాధాగోపాల్, రమేష్ ఉన్నారు. కొత్తబావిని సంరక్షించాలి.. గద్వాల: గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా రాజుల కాలం నాటి సంస్థానాదీశులకు చెందిన (కొత్తబావి) సంరక్షించాల్సిన బాధ్యత అందిరిపై ఉందని గద్వాల క్రీడా సంఘాలు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని జిల్లా అడిషన్ కలెక్టర్ నర్సింగ్రావుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా బావి చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి తలపెట్టిన సందర్భంలో మున్సిపల్ కమిషనర్కు జనవరిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ వేణుగోపాల్ స్ధానిక రాజకీయ నాయకుల అండతో బావిని మట్టితో కూల్చడానికి కార్యచరణ చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మోహన్రావు, శంకర ప్రభాకర్, గోపాల్, శుబాన్, నాగరాజ్, తదితరులు ఉన్నారు. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
గద్వాలటౌన్: వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రియదర్శిణి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి పేర్కొన్నారు. శనివారం కళాశాలలో అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విక్రయాల సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఏ వస్తువు కొనుగోలు చేసినా విఽధిగా రశీదు పొందాలని సూచించారు. వస్తువు నకిలీదైనా.. మోసపోయామని గుర్తించినా తిరిగి పరిహారం చెల్లించడంలో ఇది ఉపకరిస్తుందని చెప్పారు. బాధితులు పూర్తి వివరాలతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం జరుగుతుందన్నారు. ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైతం వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జ్ ప్రిన్సిపల్ చంద్రమోహన్ వినియోగదారుల హక్కుల గురించి వివరించారు. ‘ఆరోగ్యశ్రీ’ సేవలకు అవకాశం కల్పించాలి అలంపూర్: అలంపూర్ నియోజకవర్గం ఆంధప్రదేశ్లోని కర్నూలుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ ప్రాంత ప్రజలు వైద్యసేవల కోసం కర్నూల్పై ఆధారపడతారని, అక్కడి రెండు ఆస్పత్రుల్లో ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేలా అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. శనివారం శాసన మండలి సభ సమావేశాలు జరగగా.. ఈమేరకు ఎమ్మెల్సీ మాట్లాడారు. రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న అలంపూర్ నియోజకర్గ సమస్యలను శాసన మండలి దృష్టికి తీసుకెళ్లారు. అలంపూర్ ప్రాంతంలోని చాలామంది రైతులకు ఎప్పటి నుంచో కర్నూల్లో బ్యాంకు రుణాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ కర్నూల్లో బ్యాంక్ ఖాతాలు ఉన్న రైతులకు చేయలేదని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎమ్మెల్యే విజయుడుతో కలిసి మంత్రికి విన తి పత్రం అందజేసినట్లు తెలి పారు. కానీ కర్నూల్లో ఖాతా లు ఉన్న రైతులకు రుణ మాఫీ చేయలేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కర్నూల్లో ఖాతాలు ఉన్న రైతులకు రుణ మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మన ప్రాంత రైతులు, మన ప్రాంత భూములు కేవలం బ్యాంక్ ఖాతా కర్నూల్లో ఉండటంతో రుణ మాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిసారించి కర్నూల్లో రుణాలు పొందిన రైతులకు రుణ మాఫీ వర్తింపజేయాలని కోరారు. గవర్నర్ ప్రసంగంలో అభివృద్ధి పనులకు సంబందించిన అంశాలు లేవని తెలిపారు. సరిహద్దులో ఉన్న అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించడానికి చొరవ చూపాలని కోరారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు ఆత్మకూర్/అమరచింత/మదనాపురం: మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని ప్రజలు తనను గెలిపించారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తానని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లి, బాలకిష్టాపూర్లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతో పాటు తిప్పడంపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే అమరచింత ఏడో వార్డులో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, మదనాపురం మండలం గోపన్పేటలో బీజేపీ జెండా ఆవిష్కరించి వివిధ పార్టీలకు చెందిన 40 మంది పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం నిరుపేదలకు పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అర్హులందరికీ ఇళ్లు ఇప్పిస్తానని, గ్రామాల్లో హైమాస్ట్ వీధిదీపాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే రేవంత్రెడ్డి పయనిస్తున్నారని.. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాల్లో నీటి ఇబ్బందులు దూరం చేయడానికే కేంద్రం అమృత్ 2.0 పథకం తీసుకొచ్చిందన్నారు. -
ప్రాధాన్యం ఇస్తున్నాం..
యూనివర్సిటీలో అధ్యాపకులు, ఇటు రీసెర్చ్ స్కాలర్ ఎంతో ఉత్సహంగా పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని పేటెంట్లు కూడా వచ్చాయి. దీని ద్వారా పీయూకు ప్రాజెక్టులు, రీసెర్చ్ పరమైన అంశాల్లో ముందంజ వేస్తున్నాం. నిర్మాణంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఉంది. అది అందుబాటులోకి వస్తే పీయూ రీసెర్చ్ హబ్గా మారనుంది. అందులో పూర్తిస్థాయిలో ల్యాబ్లో అధునాతన ప్రయోగ పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పాలమూరు యూనివర్సిటీ ● -
సర్కారు బడుల్లో కృత్రిమ మేధస్సుతో బోధన
ఎర్రవల్లి: సర్కారు బడుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో మరింత ప్రభావవంతంగా విద్యా బోధన అందించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ ఏఎక్స్ఎల్ కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ఏఐ ఆధారిత బోధన పద్ధతులను వీక్షించి ఉపాద్యాయులకు పలు సూచనలు అందించారు. విద్యార్థుల అభ్యాసాన్ని ఆకర్శనీయంగా, ఇంటరాక్టివ్గా మార్చేందుకు ఏఐ కీలకంగా సహకరిస్తుందని అన్నారు. 26 ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఏఐ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమెరసీ ప్రాథమిక విద్యా స్థాయిలో ఏఐ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, సంఖ్యాపరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు. దీనికోసం పాఠశాలల్లో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పూర్తి స్థాయి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ నరేష్, ఎంఈఓ అమీర్ఫాష, హెచ్ఓం శ్రీనివాసులు, జిల్లా కోఆర్డినేటర్ ఎస్తర్ రాణి తదితరులు పాల్గొన్నారు. పట్టుదలతో చదివితే లక్ష్య సాధన ఎర్రవల్లి: విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదివితే జీవితంలో ఏ లక్ష్యమైనా సాధించగలరని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని సరస్వతి పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలలు కనే ప్రతి ఒక్కరూ వాటిని నిజం చేసుకునే ధైర్యం, పట్టుదలను కలిగి ఉండాలన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారో కాదు, మీ లక్ష్యం ఎంత గొప్పదో, దాని కోసం ఎంత కృషి చేస్తున్నారో, అదే మీకు నిజమై న విజయాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. విద్యార్థులు చదువులో మాత్రమే కాకుండా క్రీడలు, శారీరక విద్య, మౌళిక నైపుణ్యాల్లో కూడా రాణించాలన్నారు. అనంతరం గత ఏడాది సబీఎస్ఈ 10వ తరగతి టాపర్ తల్లిదండ్రులను కలెక్టర్ మెమోంటోలను అందజేశారు. గోవర్దన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
రిమోట్ కంట్రోల్తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు. -
రైతుల అభ్యున్నతికి కృషి
అయిజ: రైతులకు అన్నిరకాలుగా చేయూతనిచ్చేందుకే పీఏసీఎస్లు పనిచేస్తున్నాయని, రైతులు అభ్యున్నతికోసం అందరం కృషిచేద్దామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం ఆవరణలో అయిజ సింగిల్విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి అధ్యక్షతన పీఏసీఎస్ చైర్మన్లు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్నగర్లో 78 సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో అయిజ పీఏసీఎస్లో ఎక్కవమంది ఉద్యోగులను నియమించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. పీఏసీఎస్ల ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాయని అన్నారు. వ్యవసాయం కోసం అతి తక్కువ వడ్డీతో పంట రుణాలు ఇవ్వడంతోపాటు దీర్ఘకాలిక రుణాలను ఇస్తుందని, ట్రాక్టర్, హార్వెస్టర్, డ్రోన్స్ తదితర వ్యవసాయ వస్తువులు కొనుగోలుకు చేసేందుకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సొసైటీలు కేవలం రైతులకు రుణాలు ఇచ్చేవిగా ఉండరాదని, రైతులకు మేలుచేయడంతోపాటు సొసైటీ ఆదాయాన్ని పెంచుకునేందకు అనేక రకాల కార్యకలాపాలను చేపట్టాలని పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఈర్లదిన్నె రంగారెడ్డి, అలంపూర్ క్యాతూర్, కలగొట్ల, మానవపాడు, వడ్డెపల్లి, గట్టు సహకార సంఘాల చైర్మెన్లు మోహన్రెడ్డి, రాఘవరెడ్డి, గజేంద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, క్యామ వెంకటేష్ పాల్గొన్నారు. -
కీలకంగా పర్యావరణహిత రీ ఏజెంట్లు
రసాయన పరిశ్రమలు, ట్యాబ్లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్లో పరిశోధనలో ఉన్నాయి. -
ఆవిష్కరణలకు గుర్తింపు
పీయూలో పరిశోధనలపై దృష్టి సారించిన అధ్యాపకులు ● ఇప్పటికే కెమిస్ట్రీ విభాగంలో పూర్తిస్థాయి పేటెంట్ హక్కులు ● డిజైన్ విభాగంలో రెండు, యుటిలిటీలో ఒకటి, పరిశీలనలలో మరొకటి ● గుర్తింపు వస్తే పూర్తిస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు బోధనపైనే కాకుండా.. పరిశోధనలపై సైతం దృష్టిసారించారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిశోధనలతో పలు అంశాల్లో పేటెంట్ రైట్స్ సైతం సాధించారు. మొత్తం కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులు పర్యావరణహిత రీ ఏజెంట్లు, ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణ పర్యావరణానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఓ మైలురాయి. దీనికి పేటెంట్ రైట్ రావడంతో టీచర్స్ అసోసియేట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫెల్లోషిప్ అధ్యాపకులు చంద్రకిరణ్ ఎంపికయ్యారు. మ్యాథ్స్ విభాగంలో అధ్యాపకులు రిమోట్ కంట్రోల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారీ, రోలర్ స్టాంప్ తయారీకి డిజైన్ విభాగంలో పేటెంట్ రాగా.. స్ట్రెచింగ్ షీట్పై కాసన్ నానోఫ్లూయిడ్స్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పంచే పద్ధతి వంటివి ఇటీవలే ఆవిష్కరించారు. ఇవి పరిశీలన దశలో ఉండగా.. మరో ఆవిష్కరణను ఎంబీఏ అధ్యాపకులు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రిడెక్టర్ వంటి పరికరాలు ఆవిష్కరించారు. దీంతో ఇటు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల అనంతరం ఒక కొత్త యంత్రాల ఆవిష్కరణతో జరిగే ప్రయోజనం వంటి అంశాలపై దృష్టిసారించారు. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్● రోలర్ స్టాంప్ పరికరాన్ని మ్యాథ్స్ విభాగం అధ్యాపకులు మధు ఆవిష్కరించగా.. పేటెంట్ రైట్ లభించింది. గణితం అంటే భయపడే పాఠశాల స్థాయి విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా గణిత ప్రక్రియలను సులభతరం చేసేందుకు అవకాశం ఉంది. ● రసాయన శాస్త్రంలో కెమికల్స్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, బయో మెడికల్ ఇంజినీరింగ్ పారిశ్రామిక అనువర్తనాల్లో వేడి, ద్రవ్యరాశి బదిలీలో కీలకపాత్ర పోషిస్తున్న స్ట్రెచింగ్ షీట్పై కానస్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పెంచే పద్ధతిలో కూడా మ్యాథ్స్ విభాగంలో పరిశోధనలు పూర్తి కాగా పేటెంట్ రైట్ పరిశీలనలో ఉన్నాయి. -
కృత్రిమ మేధ
అక్షరభ్యాసానికి ప్రాథమిక స్థాయిలో.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ‘ఏఐ’ బోధన● నేటినుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66 స్కూళ్లలో నిర్వహణ ● గత నెల 25నే నారాయణపేటలో ప్రారంభం ● సత్ఫలితాలు ఇవ్వడంతో అన్నిచోట్ల అమలుకు చర్యలు ● కంప్యూటర్ ల్యాబ్లు ఇతర పరికరాల ఏర్పాటు ●ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. -
మరో 56 పాఠశాలల్లో..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధన గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల ద్వారా బోధన సాగుతుండగా.. విద్యార్థి అక్షర పరిజ్ఞానం, అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసి.. వాటిని మదింపు చేయడం అనుకున్నంత మెరుగ్గా జరగడం లేదు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు చదువులో వెనకబడి పోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో విద్యార్థి విద్యా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈకే స్టెఫ్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంతో కీలకంగా మారింది. దీని సేవలను పాఠశాలలో వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద నారాయణపేటలో 10 పాఠశాలల్లో గత నెల 25న ప్రారంభించారు. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన మరో 56 పాఠశాలల్లో శుక్రవారం నుంచి అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఇందుకోసం ఎంపిక చేశారు. హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. ప్రతి జిల్లాలో నలుగురు రీసోర్సుపర్సన్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. వారు ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ల్యాబ్ల ఏర్పాటుకు దాదాపు అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు వచ్చినా ఇందులో టేబుళ్లు, కుర్చీలు, హెడ్ఫోన్స్, ఇంటర్నెట్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. విజయవంతం చేస్తాం.. తక్కువ సామర్థ్యాలు ఉన్న విద్యార్థులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏఐ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్పై ఏఐ ద్వారా సామర్థ్యాలను పెంచేందుకు వీలుంది. వారి సామర్థ్యం ఎంతో కంప్యూటర్ ఒక అంచనా రిపోర్టు ఇస్తుంది. దాని ఆధారంగా విద్యార్థిని మరింత మెరుగుపర్చే విధంగా చర్యలు ఉంటాయి. పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం 10 పాఠశాలల్లో ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ సులభంగా ఉంది.. ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. – మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట అర్థం అవుతున్నాయి.. మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి. – భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట ఈ విధానం బాగుంది.. కంప్యూటర్ ద్వారా బోధన ప్రారంభించిన తర్వాత తెలుగు, ఆంగ్లంలో పదాలను అర్థం చేసుకుని బాగా పలుకుతున్నాం. గణితంలోనూ కూడికలు, తీసివేతలు తదితర వాటిని చక్కగా చేయగలుగుతున్నాం. మొదట్లో టీచర్లు ఎంత చెప్పినా నెత్తికి ఎక్కేది కాదు. ప్రస్తుత విధానం బాగుంది. – విజయలక్ష్మి, 4వ తరగతి, కొల్లంపల్లి, నారాయణపేటసామర్థ్యాల మదింపు.. ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు వెనకబడి ఉండే విద్యార్థులను గుర్తించి కంప్యూటర్ ముందు కూర్బోబెడతారు. ఇందులో ప్రధానంగా ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థి అభ్యాసనా సామర్థ్యాలను పరిశీలించాల్సి ఉంది. ముందుగా విద్యార్థికి కేటాయించిన పెన్ నంబర్ (పర్మనెంటర్ ఎడ్యుకేషన్ నంబర్) ద్వారా ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఎంటర్ చేసిన ప్రతిసారి విద్యార్థి గత కొన్ని రోజులుగా చేస్తున్న పర్ఫామెన్స్, డెవలప్మెంట్, నేర్చుకున్న అంశాలు ఇందులో నిక్షిప్తమవుతాయి. -
ఆస్తిపన్నుపై వడ్డీ భారమే..
తెలకపల్లి మండలం ఆలేరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు గద్వాల టౌన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులకు ఈసారి వడ్డీ మినహాయింపు ఇవ్వకూడదనే ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. ఆస్తిపన్ను వడ్డీతో సహా మొత్తం వసూలు చేయాలని ఆదేశాలు ఇస్తున్న ఉన్నతాధికారులు వడ్డీ మాఫీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో మున్సిపల్ ఉద్యోగులు ఆస్తిపన్నును వడ్డీతో కలిపి వసూలు చేస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికి తోడు పన్ను మొండి బకాయిదారులపై ఇప్పటికే వడ్డీ రెట్టింపు అయ్యింది. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి పన్నుల వసూళ్లు, చెల్లింపులు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆస్తిపన్ను వసూలు గురించి ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెలాఖరు వరకై నా ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందని బకాయిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ వైఖరితో ఈసారి అన్ని మున్సిపాలిటీలు ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేస్తాయా.. లేదా.. అనేది సందిగ్ధంగా మారింది. ఒకవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు.. మరోవైపు వడ్డీతో కలిపి పన్నులు వసూలు చేయడం మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరంగానే తయారైంది. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కొంతకాలంగా వడ్డీ మినహాయింపు వెసులుబాటు కల్పిస్తోంది. ప్రతి మార్చిలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేసి ఈ అవకాశాన్ని ఇస్తోంది. ఆస్తిపన్ను బకాయిదారులకు వడ్డీ మినహాయింపు కొంత ఊరటనిచ్చేది. ఆస్తిపన్ను బకాయిదారులపై మున్సిపల్ అధికారులు రెండు శాతం వడ్డీ విధిస్తారు. ఏడాది పొడవునా వివిధ కారణాలతో చెల్లించని ఆస్తిపన్ను బకాయిదారులకు వడ్డీ మినహాయింపుతో కొంత తగ్గడంతోపాటు మున్సిపాలిటీలకు సైతం ఆస్తిపన్ను పూర్తిస్థాయిలో వసూలయ్యేది. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తిపన్నుపై వడ్డీ మినహాయింపు ఇవ్వకపోవడంతో వందశాతం వసూలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శకాలు జారీ.. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో వంద శాతం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఆస్తిపన్నుతోపాటు లైసెన్స్, నీటి పన్ను, ప్రచార పన్నుల వసూళ్లను వేగిరం చేసేందుకు మార్గదర్శకాలను కూడా సూచించారు. ఈ మేరకు జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. ● మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేసే అధికారుల పర్యవేక్షణలో బిల్ కలెక్టర్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, వార్డు ఆఫీసర్లతో బృందాలను ఏర్పాటు చేయాలి. ● ఒక్కో బృందానికి రోజువారి లక్ష్యాలను కేటాయించి.. వసూళ్ల తీరు సమీక్షించాలి. ● మైకులు, కరపత్రాలతో బకాయి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రచారం చేయాలి. ● ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలో బకాయిలు పడిన 500 మంది జాబితాను తయారు చేసి వసూలుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ● బకాయిల వసూళ్లలో బిల్లు కలెక్టర్ 85 శాతం, ప్రత్యేక బృందాలు 10 శాతం, కమిషనర్ 5 శాతం వసూలు చేయాల్సి ఉంటుంది. ● ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలపై ఆయా కమిషనర్లు కలెక్టర్ను సంప్రదించి, వసూలయ్యేలా చర్యలు చేపట్టాలి. ● గతేడాదితోపాటు అంతకు ముందు కరోనా కాలంలో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మినహాయింపు ఇవ్వడంతో గద్వాలలో 90 శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలైంది. వడ్డీ మినహాయింపుతో దాదాపు రూ.20 లక్షలకు పైగా బకాయిదారులకు మేలు జరిగింది. మున్సిపాలిటీకి కొంత నష్టమైనా ఆస్తిపన్ను వసూలై అభివృద్ధికి దోహదపడింది. ఈసారి ఉండకపోవచ్చు.. ఆస్తిపన్నుపై వడ్డీమాఫీకి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రాలేదు. బకాయిలతోపాటు ఆస్తిపన్ను చెల్లించాలి. ఆ దిశగానే వసూళ్లు చేస్తున్నాం. వరుసగా రెండేళ్లపాటు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. బకాయిలు చెల్లించిన వారికి పెద్ద మొత్తంలోనే రాయితీ వచ్చింది. ఈసారి వడ్డీమాఫీ ఉండకపోవచ్చు. ప్రతిఒక్కరూ పన్ను చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలి. – దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల ఈసారి వెసులుబాటు లేనట్లే వందశాతం వసూలు చేయాలని ఆదేశాలు -
వినియోగదారుల్లో చైతన్యం రావాలి
జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్కు ఫోన్ చేయాలి. – సృజన్కుమార్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరింటెండెంట్ ఎలక్ట్రానిక్ తూకాల్లో మోసాలు గద్వాలలో చాలా వరకు వ్యాపార దుకాణాల్లో ఎలక్ట్రానిక్ తూకాలు ఏర్పాటు చేసినా వాటిలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ తూకాలను ముందస్తుగానే 15– 20 గ్రాముల వరకు ఎక్కువ ఉండేలా సర్దుబాటు చేసి తూకాలలో మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. – హుస్సేన్, గద్వాల బంగారం షాపుల్లో.. గద్వాల పట్టణం పెద్ద వ్యాపార కేంద్రం. ఇక్కడ ముఖ్యంగా బంగారు వ్యాపారం పెద్దఎత్తున జరుగుతుంది. చాలా వరకు బంగారు షాపులలో ఎలక్ట్రానిక్ తూకాలు వినియోగిస్తున్నా 10 గ్రాముల బంగారంపై కనీసం 0.5– 1 గ్రాముల వరకు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఈ షాపులలో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. – రమేష్, గద్వాల ● -
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
గద్వాలటౌన్: చెత్త, ఇతర వ్యర్థాలను రోడ్ల పక్కన ఇష్టానుసారంగా చెత్త పారవేస్తారో అలాంటి వారిని గుర్తించి జరిమానా విధించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలో కలియ తిరిగారు. ఆయా వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలోని దుకాణాలు, హోటళ్లు, వైన్స్ షాపుల దగ్గర పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, వారికి హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం విచ్చలవిడిగా ఉందని మండిపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణ పాటించని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గద్వాల లక్ష్యంగా పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపరిచి, పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ దశరథ్, శానిటరి ఇన్స్పెక్టర్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే సాగునీటిని విడుదల చేయండి
కేటీదొడ్డి: ర్యాలంపాడు ప్రధాన కాల్వకు తక్షణం సాగునీటిని విడుదల చేయాలని, నీటి సరఫరా సమర్ధవంతగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, గువ్వలదిన్నె గ్రామంలోని నీటి కొరతతో ఎండుతున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సరఫరా లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాలంపాడు ఎడమ ప్రదాన కాలువ 104 ప్యాకేజీ పరిధిలోని కొండాపురం, గువ్వలదిన్నె, మైలగడ్డ గ్రామాల వద్ద కాలువ ప్రవాహన్ని నీటి సరఫరా పరిస్ధితిని కలెక్టర్ పరిశీలించారు. కాలువలో నీటి విడుదల పంపిణీ విధానం, ఆయకట్టు పరిదిలోని ప్రాంతాలకు నీరు చేరుతున్న తీరును తెలుసుకునేందుకు అక్కడి పంపింగ్ స్టేషన్లు పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడి రైతుల సూచనల మేరకు తక్షణమే సాగునీటిని కాల్వలకు విడుదల చేయాలని నీటి పారుదల వాఖ అధికారులను ఆదేశించారు. కాల్వల వెంట నీటి వినియోగాన్ని సమతుల్యంగా నిర్వహించే విధంగా చూడాలని, నీటి ప్రవాహం చివరి ఆయకట్టు వరకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని వారి పంటలను కాపాడేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకొని సాగునీటి సరఫరా పద్దతులను మొరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ రైతులకు వివరించారు. కలెక్టర్ వెంట వెంట ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్, వ్యవసాయ అధికారి సక్రియానాయక్, ఏడీఏ సంగీత లక్ష్మీ, విద్యుత్ శాఖ ఎడి రమేష్బాబు, ఏఓ సజీద్రెహమ్మన్, ఏఈఓ ప్రీయాంక, సంబందిత అధికారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు గద్వాల: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు వృత్తినైపుణ్యాలను పెంపొందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు కోసం జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో మూడు ఎకరాల స్థలం గుర్తించడం జరిగిందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ నిర్వహించిన జూమ్మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను సోమవారం లోగా నివేదిస్తామన్నారు. మీటింగ్లో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ ర్యాలంపాడు ప్రధాన కాల్వ, ఎండిన పంటల పరిశీలన -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (డీవైఎస్ఓ) జితేందర్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్ –14, 16, 18, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేరువేరుగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వమించారు. 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంతో పాటు జావలిన్ త్రో విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 150మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. డీవైఎస్ఓ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఎంపికై న వారందరూ ఈ నెల 23వ తేదీలలో హైదరాబాద్లోని కొల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు నగేష్బాబు, విజయ్, అమరేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
గడ్డివాములు దగ్ధమయ్యాయి..
గతేడాది వేసవిలో పొలంలో గడ్డివాము నిల్వ చేశాం. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనో ఏమో మధ్యాహ్నం ఇంటికి వెళ్లి వచ్చేసరికి గడ్డివాములు మొత్తం దగ్ధమయ్యాయి. కొన్ని రోజులపాటు పశువులకు మేత కరువైంది. ఒక్కో గడ్డివాము రూ.14వేలు పెట్టి కొనుగోలు చేశాం. – గోద జయన్న, ఉండవెల్లి అవగాహన కల్పిస్తున్నాం ఇళ్లు, విద్యాసంస్థలు, గోదాములు, పెట్రోల్ బంకులు, పరిశ్రమల్లో వేసవిలో అగ్ని ప్రమాదాలు నియంత్రించే సాధనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య వంతులను చేయడానికి అవగాహన కార్యక్రమాలు, మాక్డ్రిల్స్ చేపడుతున్నాం. గతంతో పోల్చితే ప్రమాదాలు బాగా తగ్గాయి. – కురుమూర్తి, ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్, అలంపూర్ చౌరస్తా ● -
పదోన్నతులు కల్పించాలి
అలంపూర్: ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రాజగంగారెడ్డి అన్నారు. బుధవారం అలంపూర్లో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. 2005 నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు, డీఏలు పెండింగ్లోఉన్నాయని, త్వరగా ఇవ్వాలన్నారు. పీఆర్సీను అమలు చేయాలని, ప్రధానోపాధ్యాయుల సమస్యలపై చర్చించిన ఆయన త్వరలో వాటి పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, ప్రధానోపాధ్యాయులు హేమలత, శ్రీనివాసులు, వెంకటేశ్వర రెడ్డి, అమరేందర్ రెడ్డి, జాఫరుల్లా, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
కాల్వలో క్రికెట్ ఆడి.. వినూత్న నిరసన
కాల్వలకు నీరు పారించి పంటలను కాపాడతామని ఇటీవల అధికారులు చెప్పినా.. అది అమలుకు నోచుకోకపోవడంపై బీజేపీ నాయకులు వినూత్న నిరసనకు దిగారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి పంటలకు సాగునీరు అందక దాదాపు 5 వేల ఎకరాల్లో వరి పంట వాడుముఖం పట్టింది. మూడు రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా సైతం చేపట్టారు. వారబందీ పద్ధతిలో నీరు అందిస్తామని అధికారులు చెప్పినా.. నేటికీ కాల్వకు నీరు పారలేదు. దీంతో బుధవారం కేటీదొడ్డి మండలం కొండాపురం శివారులో 104 ప్యాకేజీ కాల్వలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ఇప్పటికై నా నీరు అందించి పంటను కాపాడాలని డిమాండ్ చేశారు. – కేటీదొడ్డి -
కళ్లను సంరక్షించుకోవాలి
గద్వాల: అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమని అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారని, కళ్లను సంరక్షించుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటిపరీక్షలు నిర్వహించిన అనంతరం కంటి సమస్య ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఆరోగ్యజాగ్రత్తలు పాటించాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యక్రమాలైన నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ బ్లైండ్నెస్ రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1784 మంది విద్యార్థులు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మొదటి విడతగా 361మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధవహించి కష్టపడి చదువుకోవాలన్నారు. గట్టు, కేటిదొడ్డి మండలాల నుంచి 9మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరు కష్టపడి చదివి ఉన్నతవిద్యను అభ్యసించాలన్నారు. ఈసందర్భంగా తమ పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య నెలకొందని దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఓ విద్యార్థి కలెక్టర్కు విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను బాగా రాసి ప్రతి విద్యార్థి కూడా 10 జీపీఏ సాధించాలన్నారు. వారికి ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ 1784 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు కష్టపడి చదవాలి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంపై వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. అదేవిధంగా చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మనిషి ఎదుగుదలకు చదువే ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ మాత్రమే లేదని, మిగిలిన అన్ని రకాల కాలేజీలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే అందరూ కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సిద్దప్ప, డీఈఓ అబ్దుల్ఘని, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రోడ్లపైనే చెత్త పేరుకుంటుంది
ప్రధాన రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త తరలింపు సక్రమంగా జరగడం లేదు. ఊడ్చిన చెత్తను అక్కడే కుప్పులుగా పోసి తగలబెడుతున్నారు. దీంతో వ్యర్థాల నుంచి వచ్చే పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరికొన్ని కాలనీలలో చెత్తను గుంతలలో వేస్తున్నారు. – అనిల్కుమార్, గద్వాల డంపింగ్ బిన్లు లేవు.. మా కాలనీలో అక్కడక్కడ డంపింగ్బిన్లు వుండేవి. ప్రస్తుతం అవి అగుపించకుండా పోయాయి. దీంతో చెత్తబండి రాని రోజు ఇళ్లలోని వారు చెత్తను రోడ్డుపై పారబోస్తున్నారు. రాజోళి రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం, డ్రెయినేజీ శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతుంది. రోడ్లపై చెత్త వుండకుండా చర్యలు తీసుకోవాలి. – నర్సింహులు, ఇందిరానగర్ కాలని, శాంతినగర్ ఆరుబయట చెత్త వేయకుండా చూడాలి మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో కొందరు వ్యక్తులు చెత్తను మురుగు కాల్వల్లో, ఖాళీ ప్రదేశాల్లో గుమ్మరించి వెళ్తున్నారు. గాలికి పొడిచొత్త చెల్లాచెదారంగా రోడ్లపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో నివాస గృహాల్లోకి చెత్త ఎగిరి వస్తోంది. చెత్తను రోడ్లపై, మురుగుకాల్వల్లో వేసే వారికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించాలి. అప్పడైతేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. – భాషా, అయిజ ● -
నెరవేరని తడి, పొడి చెత్త సేకరణ లక్ష్యం
గద్వాల మండలం గోనుపాడు శివారులో సుమారు పది ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చుట్టు ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో నిత్యం 20 నుంచి 22 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 70 శాతం చెత్త మాత్రమే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మిగిలిన చెత్తను రోడ్ల పక్కన, గుంతలలో పారవేస్తున్నారు. అయితే ఇంటింటి చెత్త సేకరణ కొన్ని వార్డులలో సక్రమంగా జరగడం లేదు. వాహనాలల్లో సిబ్బంది అన్ని రకాల చెత్తను కలిపి సేకరిస్తుండటంతో తడి,పొడి చెత్త సేకరణ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతి రోజు చెత్తను వేరుచేసి సేకరించాల్సిన ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇంటింటికీ ఉచితంగా రెండు రకాల బుట్టలు పంపిణీ చేసినప్పటికి ప్రజలు కూడా తమ ఇళ్లలోని చెత్తను ఇష్టానుసారంగా పేర్చి అందజేస్తున్నారు. డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త నుంచి వేరువేరుగా కంపోస్టు ఎరువు, పొడి వనరులను తయారు చేయడానికి కేంద్రాన్ని నిర్మించారు. అది ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. మొదట్లో కంపోస్టు ఎరువు, చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ చెపట్టి వదిలేశారు. చెత్త, ఆకులు, చెట్ల కొమ్మలు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువుల డంపింగ్ యార్డులో గుట్టలు, గుట్టులుగా ఉండటం... వేసవిలో వాటికి కొన్సిసార్లు ఆగ్గిరాజుకుని మంటలు చెలరేగాయి. ఇలాంటి సందర్భాలలో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. డంపింగ్ యార్డులో తాత్కాలిక చర్యలు తప్ప, శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడంలో ప్రజలను భాగస్వాములయ్యేలా చైతన్యపరచడానికి నిరంతర కార్యక్రమాలు చేపట్టాలి. -
అవగాహన లేక.. కాల్వల్లో పారబోత
అయిజ మున్సిపాలిటీలో ఆరుబయట చెత్త పారబోయవద్దని, ఆ పరిసరాలు అపరిశుభ్రంగా మారి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నా ప్రజలు పట్టించుకోవట్లేదు. దీంతో మున్సిపాలిటీలోని కొన్ని వార్డులో రోడ్లపై, మురుగు కాల్వల్లో చెత్త పారబోస్తున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను 50 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరు 14 వాహనాల్లో ప్రతిరోజు చెత్తను ఇంటింటి నుంచి సేకరిస్తారు. కానీ, ఈ సిబ్బంది, వాహనాలు ఏమాత్రం సరిపోకపోవడంతో రోజు విడిచి రోజు చెత్త సేకరణ కొంత ఇబ్బందిగా మారింది. మూడేళ్ల క్రితం రూ.20 లక్షలతో డ్రైవేస్ట్ షెడ్, రూ.20 లక్షలతో వెట్ వేస్ట్ షెడ్లు నిర్మించారు. ప్రతి రోజు 12 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. ఇందులో 2 టన్నుల తడి చెత్తను ఎరువుగా, ఒక టన్ను పొడి చెత్తను డీఆర్సీసీ కేంద్రానికి తరలిస్తున్నారు. మిగిలిన 9 టన్నుల తడి, పొడి చెత్తను డీఆర్సీసీ కేంద్రానికి తరలిస్తున్నారు. తయారుచేసిన వర్మీ కంపోస్ట్ ఎరువును మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రజల్లో అవగాహన లోపం, నిర్లక్షంతో చెత్తను మురుగు కాలువల్లో గుమ్మరిస్తున్నారు. -
సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకం
గద్వాల: సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తారని, వారు ఆర్థికంగా ఎదిగితే సమాజం సైతం అభివృద్ధి చెందుతుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మహిళా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళల సాధికారత కోసం ప్రతిఒక్కరు తోడ్పడాలని కోరారు. బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి పట్టణంలోని ప్రధాన రోడ్ల వెంబడి కృష్ణవేణి చౌరస్తావరకు సాగింది. అనంతరం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలకు వివిధ రకాల పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ జిల్లా అదికారిని సునంద, డీసీపీవో నర్సింహులు, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ –1లో సత్తా చాటిన న్యాయవాది గట్టు: గట్టు మండలం గొర్లఖాన్దొడ్డి గ్రామానికి చెందిన రవికుమార్గౌడ్ గ్రూప్– 1 ఫలితాల్లో 458.5 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఈయన న్యాయవాదిగా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. గొర్లఖాన్దొడ్డి గ్రామానికి చెందిన మునిస్వామిగౌడ్, గోవిందమ్మ దంపతుల ద్వితీయ సంతానం రవికుమార్గౌడ్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అలాగే, సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యాడు. ఈక్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటాడు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎంపీడీఓ తదితర పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2014 నుంచి కష్టపడి సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యానని, తన విజయంలో తల్లిదండ్రులతోపాటు తమ్ముడు సివిల్ ఇంజినీర్ కృష్ణ, అన్న నాగన్గౌడ్ సహకారం ఎంతో ఉందని, తన 10 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని రవికుమార్గౌడ్ తెలిపారు. ఇదిలాఉండగా, తమ గ్రామానికి చెందిన వ్యక్తి గ్రూప్–1లో ప్రతిభ కనబర్చడంతో గొర్లఖాన్దొడ్డి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వారబందీ విధానంలో సాగునీరు ఇస్తాం
గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టు కింద సాగుచేసిన ఆయకట్టు పంటలకు వారబందీ విధానంలో సాగునీటిని ఇస్తామని జిల్లా ఇరిగేషన్శాఖ అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. నెట్టెంపాడు ప్రాజెక్టులోని 104 ప్యాకేజీ కింద 5 వేల ఎకరాలు నీరందక ఎండుతున్నాయని రైతులు ఆందోళనకు దిగగా.. ‘పంటలు ఎండుతున్నాయ్’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈమేరకు అధికారులు స్పందించారు. 104ప్యాకేజీ కింద 5వేల ఎకరాలకు, కుడికాల్వ కింద 15 వేల ఎకరాలకు సాగునీటిని వారబందీ విధానంలో ఇవ్వాలని ఎస్సీఐడబ్య్లుఏఎం కమిటీలో నిర్ణయించినట్లు తెలిపారు. కానీ, రైతులు 50వేల ఎకరాల్లో పంటలు సాగుచేశారని, కాల్వపై అక్రమంగా మోటార్లు వేసి సాగునీటిని తరలిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈనెల 10వ తేదీన సాగునీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సూచన మేరకు ఈ నెల 14వ తేదీన 104 ప్యాకేజీ కింద ఉన్న చివరి ఆయకట్టు పొలాలకు నీరు ఇవ్వటానికి నిర్ణయించామని తెలిపారు. అదేవిధంగా అక్రమ మోటార్ల వినియోగంపై చర్యలు తీసుకుని కట్టడి చేస్తామని, వారబందీ విధానంలో సాగునీటిని చివరి ఆయకట్టు పొలాలకు సైతం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అలంపూర్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కలిశారు. మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగగా.. సమావేశానికి వారు ఇరువురు హాజరయ్యారు. ఈక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ను కలిసినట్లు వారు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి గట్టు: గట్టులో కొనసాగుతున్న ఇంటర్ వార్షిక పరీక్షలను మంగళవారం సిట్టిండ్ స్క్వాడ్ బృందం బాలస్వామి, నల్లన్న తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు, మాస్కాపీయింగ్కు అవకాశం లేకుండా తావులేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఐదో రోజు ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 288 మంది విద్యార్థులకు గాను 281 మంది విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ కేఎస్డీ రాజు, డీపార్టుమెంటల్ అధికారి కాశీ విశ్వనాథ్తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు సంబందించి 61 మంది విద్యార్థులకు గాను 55 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రం బయట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పీయూలో 27, 28 తేదీల్లో వర్క్షాప్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలి
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేసీ్త్రలు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం పీజేపీ క్యాంపులో పాత కలెక్టరేట్ సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మేసీ్త్రలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూ.5లక్షలతో అందించే ఇందిరమ్మ ఇళ్లను ఉత్తమ నాణ్యతతో నిర్మించాలన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మేసీ్త్రలకు రోజుకు రూ.300 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. శిక్షణ ద్వారా కొత్త రకమైన నిర్మాణ పద్ధతులు, మెరుగైన సామగ్రి వినియోగం, భద్రతా ప్రమాణాలు వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం మేసీ్త్రలకు టీషర్ట్స్, కిట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో హౌసింగ్ శాఖ జిల్లా అధికారి భాస్కర్, డీఈ నరేందర్, ఏఈ ప్రకాష్, శివశంకర్, మేసీ్త్రలు పాల్గొన్నారు. నిబంధనల మేరకే లేఅవుట్ల అభివృద్ధి ప్రభుత్వ నిబఽంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల మున్సిపాలిటీలోని సర్వే నంబర్లు 898, 900, 93 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్లు ఏర్పాటు చేసే క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని,ల్యాండ్ డెవ్లప్మెంట్ ప్రణాళికకు అనుగుణంగా మౌళిక వసతులు సమకూర్చాలని సూచించారు. సర్వే నంబర్ 898, 900, 93లలో లేఅవుట్లో ఏర్పాటు చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, మ్యాన్హోల్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. అంతర్గత రహదారులు, ప్రతిఇంటికి తాగునీటి కనెక్షన్, సేవరేజీ లైన్, స్ట్రామ్వాటర్ డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్(ఎస్టీపీ), విద్యుత్ సదుపాయం, అప్రోచ్ రోడ్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఓపెన్ స్థలాలను పచ్చదనంతో అభివృద్ధి చేసి ప్రహరీ నిర్మాణాలు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, టౌన్ప్లానింగ్ అధికారి కురుమన్న, తహసీల్దార్ మల్లీఖార్జున్, ఏఈలు పాల్గొన్నారు. -
ముక్కు మూసుకోవాల్సిందే..
వడ్డేపల్లి మున్సిపాలిటీలో ప్రధానంగా కొత్త కాలనీలు, అలాగే సీసీరోడ్లు నిర్మించి డ్రెయినేజీలు నిర్మించకుండా వదిలేసిన కాలనీల్లో మురుగు పారేందుకు వీలు లేక కాలనీలు దుర్గందభరితంగా మారాయి. ఇంట్లో నుంచి బయటికి వచ్చారంటే ముక్కు మూసుకోవాల్సిందే. రాఘవేంద్ర హైస్కూల్ పరిసర ప్రాంతాలు, 5, 6వ వార్డులు, బోయ కాలనీ, గోకారమయ్య దర్గా, దస్తగిరయ్య కాలనీల్లో డ్రెయినేజీలు అధ్వానంగా మారాయి. అంతేగాక శాంతినగర్–రాజోళి రోడ్డులోని ప్రధాన డ్రెయినేజీ కాల్వలో చెత్తాచెదారం పేరుకుపోయింది. మురుగు ముందుకు కదలక కంపు కొడుతోందని ఇందిరానగర్, జమ్ముల మడుగు కాలనీవాసులు వాపోతున్నారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులు స్పందించి ఇబ్బందికరంగా వున్న కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు నిర్మించి, కాల్వలు శుభ్రం చేయించి, చెత్తాచెదారం తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు. -
‘మురుగు’పాలిటీలు..!
పురపాలికల్లో అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు ●అలంపూర్లో శాశ్వత పరిష్కారం కరువు.. అలంపూర్ మున్సిపాలిటీ ప్రజలు నిత్యం డ్రైనేజీ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రంతోపాటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ డ్రైనేజీ సమస్య కొలిక్కి రావడం లేదు. గతంలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు వెచ్చించి దాదాపు దశాబ్దకాలం పాటు పనులు కొనసాగించారు. కానీ, డ్రైనేజీ నిర్మాణానికి శాశ్వత పరిష్కారం లభించలేదు. అంతర్గత డ్రైనేజీలో భాగంగా కాలనీల్లో మ్యాన్హోల్స్ ఏర్పాటు చేశారు. డ్రైనేజీ కాల్వలు సైతం చిన్నగా ఉండటంతో నిరంతరం కాల్వలు నిండి మ్యాన్ హోల్స్ ద్వారా మురుగు రోడ్లపైకి వస్తుంది. దీంతో కాలనీల్లో ఎక్కడో ఒక చోట మ్యాన్ హోల్స్ ద్వారా మురుగు బయటికి వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. అలాగే, వాహనాల రాకపోకలకు, నడచి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రదేశాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వీటికి తోడు కందకాల సమస్య తీవ్రంగా ఉంది. కందకాల్లో వర్షపు నీరు, మురుగు నిలిచి నిరంతరం దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికై నా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అలంపూర్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదు డ్రైనేజీలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడం లేదు. ఒక చోట శుభ్రం చేస్తూ మరోచోట వదిలేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయాన్ని పలుసార్లు పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. వ్యర్థాలు, చెత్తాచెదారంతో డ్రైనేజీలన్ని పూడకుపోయి దుర్గందభరితంగా మారాయి. – వెంకటరమణ, గద్వాల దుర్వాసన వెదజల్లుతోంది మున్సిపాలిటీలోని 14వ వార్డులో డ్రైనీజీ నిర్మించకపోవడంతో మురుగు ఇళ్ల పక్కన నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిలబడలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసి వెళ్తారు కానీ డ్రైనేజీ నిర్మించలేదు. కనీసం మురుగు ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి. – మాలన్బీ, అయిజ పునాదుల్లోకి నీరు వస్తుంది మున్సిపాలిటీలోని కొత్తపేటలో మురుగు నిలిచి ఉండడంతో చుట్టుముట్టు ఉన్న గుడిసెలు, ఇళ్ల పునాదుల్లోకి మురు చేరుకొని గోడలు బీటలు పారుతున్నాయి. గతంలో గుడిసె కూలి చిన్నారి మృతి చెందింది. డ్రైనేజీ నిర్మించాలని అధికాలకు, పాలకులకు చెబుతుంటే నిధులు లేవంటున్నారు. – వెంకటమ్మ, అయిజ అధికారులు పట్టించుకోవట్లే.. మా ఇంటి ముందు రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుంటుంది. కాలు బయటపెడదామంటే మురుగు నీటిలో నడిచి వెళ్లాలి. సమీపంలోని కాలనీలో సీసీ రోడ్డు వేశారు. మా కాలనీలో సీసీ రోడ్డు వేయలేదు. ఇంటి పన్నులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పట్టించుకోరు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు మా కాలనీకి వచ్చి చూసి సీసీ రోడ్డు, డ్రెయినేజీ కాల్వ నిర్మించాలి. – రామేశ్వరమ్మ, 5వ వార్డు, వడ్డేపల్లి మున్సిపాలిటీ అయిజలో పడకేసిన పారిశుద్ధ్యం అయిజ మున్సిపాలిటీలోని అనేక కాలనీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చాలా కాలనీల్లో డ్రైనేజీలు శిథిలం కావడంతో మురుగు ఎక్కడికక్కడే నిలిచి ఆ పరిసరాలు కంపు కొడుతున్నాయి. ముఖ్యంగా మడ్డి గుంతకాలనీ, టీచర్స్ కాలనీ, గాజుల పేట, కొత్తపేట, భరత్నగర్ కాలనీల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ప్రధానంగా కాలనీల్లో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మరుగు ముందుకు పారడంలేదు. దీంతో దోమల ఉధృతి ఎక్కువై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, త్వరితగతిన సీసీ రోడ్లు నిర్మించి ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే పట్టణంలో అన్ని కాలనీల్లో డ్రైనేజీలు నిర్మించేందుకు సుమారు రూ.20 కోట్ల నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయిజ మున్సిపాలిటీలో నిధులు లేవు. నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గద్వాల టౌన్/అలంపూర్/అయిజ/శాంతినగర్: కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మారింది మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల తీరు చూస్తే. వర్షం నీరు, వరదనీరు సాఫీగా వెళ్లడానికి నిర్మించిన వరద, మురుగునీటి కాల్వలతో పాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంతో సమస్య జఠిలంగా మారుతున్నాయి. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో కొత్త కాలనీల్లో డ్రెయినేజీ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు రహదారులపై పారుతుండడంతో కాలనీలు దుర్గందభరితంగా మారుతున్నాయి. వరాహాలు, దోమల వ్యాప్తిచెంది ప్రజలు అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. ప్రత్యేకాధికారుల పాలనలో అయినా అసంపూర్తి డ్రెయినేజీలు పూర్తి చేసి మురుగుకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రణాళిక లేకుండా పనులతో అవస్థలు గద్వాల పట్టణ పరిధిలోని పలు వార్డులలో డ్రైనేజీలు అధ్వానంగా మారాయి. కృష్ణవేణి చౌరస్తా నుంచి సత్యసాయి మందిరం వరకు ఉన్న పెద్ద డ్రైనేజీలో పూడిక పేరుకుపోయింది. కుంటవీధిలోని డ్రైనేజీలు సైతం దుర్గందంగా మారాయి. సుంకులమ్మమెట్టు, కుంటవీధి, ఓంటెలపేట, గంటగేరి, వడ్డేగేరి, చింతలపేట తదితర ప్రాంతాల్లో పూడిక, వ్యర్థాపదార్థలు పేరుకుపోయి డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. పట్టణ ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న మురుగు, వరద నీటి కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు ప్రణాళికా ప్రకారం వ్యవహరించలేదు. దీంతో అందులోని మురుగు వెళ్లకుండా నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో మురుగు, వర్షం నీటిని మళ్లించడానికి తప్పనిసరిగా కల్వర్టులు నిర్మించాల్సి ఉన్నా ఎక్కడికక్కడే మురుగు కాల్వలు మూసివేశారు. కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కల్వర్టులు, రాజీవ్ సర్కిల్లో ఉన్న డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోయాయి. రద్దీగా ఉండే ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలలో దుకాణ దారులు డ్రైనేజీలను కూడా ఆక్రమించారు. డ్రైన్లపై పక్కాగా స్లాబ్లు కూడా వేసుకొని తమ షాపుల ముందు పార్కింగ్ కోసం, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో డ్రైనేజీలలో పేరుకపోయిన పూడికను తీయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది సైతం హడావుడిగా పనులు చేసి చేతులు దులుపుకొటున్నారు. మరికొన్ని చోట్ల పూడికతీత పనులే ప్రారంభించలేదు. రాబోయే రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ మరీ దుర్భరంగా మారనుందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై పారుతున్న మురుగు దోమల విజృంభణ.. రోగాల భారినపడుతున్న జనం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇదే దుస్థితి -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి
అయిజ: మహిళలు ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఆర్బీఐ హైదరాబాద్ ఆర్ఓ అజయ్ మణికంఠ అన్నారు. సోమవారం ఆర్బీఐ ఆధ్వర్యంలో డిజిటల్ పేమెంట్స్పై అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయిజ బ్రాంచ్ ఆవరణలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఆయనతోపాటు ఆర్ఓ హర్షవర్ధన్ హాజరయ్యారు. ఈసందర్భంగా వారు బ్యాంకులు అందించే వివిధ రకాల సేవలు, సౌకర్యాల గురించి వివరించారు. ఏటీఎం రూపే కార్డులను వాడి సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు జరుపుకోవాలని కోరారు. బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో రుణాలు చెల్లించి తిరిగి రుణాలు పొందాలని కోరారు. మోసపూరిత ఫోన్ కాల్ను గమనించాలని, సైబర్ నేరగాళ్ల భారినుంచి మోసపోతే 1930 నెంబర్కి ఫోన్ చేసి పిర్యాదుచేయాలని సూచించారు. కార్యక్రమంలో హర్షవర్ధన్, గద్వాల ఏఎంహెచ్ మేనేజర్ సీవీ రమేష్, అయిజ బ్రాంచ్ మేనేజర్ రూపశ్రీ, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ హంసిని, క్యాషియర్ ఋషికేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,061 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.4,691 ధరలు లబించాయి. అదేవిదంగా కందులు గరిష్టంగా రూ.6,851, కనిష్టంగా రూ.5,400, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,361, కనిష్టంగా రూ.2,001, పెబ్బర్లు రూ.6,500, జొన్నలు రూ.3,601, మినుములు రూ.7.417 ధరలు లభించాయి. -
ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 38మంది ఫిర్యాదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు.. గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 10 ఫిర్యాదులు అందాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై వివరించారన్నారు. ఇందులో భూ సంబంధ, సైబర్ మోసాలు, వేధింపులపై ఫిర్యాదులు అందాయని, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కారం అందేల చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు వివరించారు. -
మిగిలింది 20 రోజులే..
మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్నుల రాబడితో పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. మున్సిపాలిటీల్లోని నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపు (టెక్నాలజీ)లపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ.1.94 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తులకు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లకు మిగిలింది కేవలం 20 రోజులేనని.. అంతలోపే లక్ష్యం చేరుకోవాలని ప్రత్యేకాధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం సోమ, గురువారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేళా ద్వారా ప్రజలకు అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆస్తులు పన్నులు, వసూలు (రూ.కోట్లలో) సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు లక్ష్యం చేరుకుంటాం.. ప్రతి ఏడాది మార్చిలోనే అత్యధికంగా పన్నులు వసూలు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి పట్టణ ప్రజలు, వ్యాపారులు త మ ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలి. గత వా రం రోజులుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు కృషిచేస్తున్నాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేక.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులే దిక్కయ్యారు. మున్సిపాలిటీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో పన్నుల వసూలు చేయడంలో జాప్యం జరుగుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన విషయం కావడంతో ప్రధాన మున్సిపాలిటీల్లో తప్పా కొత్తగా ఏర్పాటైన వాటిలో ఇప్పటి వరకు ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని సమాచారం. పన్నులు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం మరో సమస్యగా చెబుతున్నారు. -
పంటలు ఎండుతున్నాయ్
జోగుళాంబ గద్వాలనెట్టెంపాడు ఆయకట్టుకు అందని సాగునీరు మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025వివరాలు 8లో u●● దాదాపు 3వేల ఎకరాల్లో వరి పంట వాడుముఖం ● నీరందించి పంటలు కాపాడాలంటూ రైతుల ఆందోళన ● కలెక్టరేట్ వద్ద ధర్నా.. వినతిపత్రం అందజేత 6 ఎకరాల్లో ఎండిన పంట నెట్టెంపాడు ప్రాజెక్టు 104 ప్యాకేజీ డి–9 కింద 15ఎకరాలలో వరిపంట వేశాను. పంట కంకి దశలో సాగునీరు లేకపోవడంతో 6 ఎకరాలు ఎండిపోయింది. పైభాగాన ఉన్న కొందరు రైతులు అనధికారికంగా కాల్వకు మోటార్లు వేసి నీటిని తోడేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మిగిలిన 9 ఎకరాల వరి పంటనైనా కాపాడాలి. వెంటనే నీరు అందించాలి. – పద్మారెడ్డి, రైతు కొండాపురం కెటి.దొడ్డి మండలం బోరువేసినా నీళ్లు పడలే 104 ప్యాకేజీ పరిధిలో డి–9లో మాకు ఉన్న 8ఎకరాల్లో వరిపంట వేశాను. సాగునీరు అందక 4 ఎకరాలు ఎండిపోయింది. పంటను కా పాడుకునేందుకు రూ.50వేలు ఖర్చు పెట్టి బోరు కూడా వేశాను. నీళ్లు పడలేదు.అధికారు లు స్పందించి మిగిలిన పంటనైనా కాపాడాలి. – సత్యపాల్రెడ్డి, రైతు పంటలు కాపాడాలి నాకు 5 ఎకరాల భూమి ఉంది. మొత్తం వరి పంట వేయగా.. నీరు అంద క 3 ఎకరాలు ఎండిపోయింది. ప్రాజెక్టు పైను న్న రైతులు అనధికారికంగా మోటార్లు పెట్టుకుని నీళ్లు తోడుకుంటున్నా రు. అధికారులు స్పందించి పంట కాపాడాలి. – డొల్లు గోవిందు, రైతు, కొండాపురం అధికారులు స్పందించాలి 5 ఎకరాల్లో వరిపంట వేశాను. నీరు అందకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. ఖరీఫ్లో ప్రభుత్వం ఇచ్చిన బోనస్ డబ్బులు కూడా కలిపి వరిపంట వేశాను. ఈసారి మొత్తం పంట ఎండిపోయే పరిస్థితి. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలి. – రంగారెడ్డి, రైతు, కొండాపురం గద్వాల: ‘ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో నీరులేక ఎండిపోతున్నాయి.. ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే ఆశతో యాసంగిలో కూడ వరిపంటను సాగుచేశాం. పంట గింజపట్టే దశలో నీరు అందడం లేదు. దీంతో 2వేల ఎకరాల వరిపంట ఇప్పటిఏ ఎండిపోయింది. అధికారులు స్పందించి సాగునీరు అందించకపోతే మరో 3 వేల ఎకరాల పంటలు ఎండిపోతాయి.. సాగునీరు అందించి పంటలను కాపాడండి..’ అంటూ నెట్టెంపాడు రైతులు ఆందోళన బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. అనంతరం కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకొని.. గింజ దశలో ఉన్న పంటలను కాపాడాలని వినతిపత్రం అందజేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 104ప్యాకేజీ పరిధిలోని రైతుల సాగునీటి కష్టాలపై కథనం.. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధి ర్యాలంపాడు జలాశయంలో లీకేజీలు ఏర్పడడంతో గత నాలుగేళ్లుగా పూర్తి స్థాయిలో అంటే 4 టీఎంసీలకు బదులు 2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతూ వస్తున్నారు. ఈనేపథ్యంలో యాసంగిలో 2టీఎంసీల నీటితో సుమారు 20వేల ఎకరాల వరకు ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తారు. అయితే రైతులు మాత్రం ఎన్నో ఆశలతో సుమారు 50వేల ఎకరాల వరకు పంటలు సాగుచేశారు. దీంతో అందుబాటులో ఉన్న నీటితో మొత్తం 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలంటే కష్టతరంగా మారింది. ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు కాల్వలకు మోటార్లు వేసుకుని సాగునీటిని పారించుకుంటున్నారు. దీంతో ఆయకట్టుదారులు సాగుచేసుకున్న పంటలకు సాగునీరు పారటం కష్టంగా మారింది. ఆందోళన చెందొద్దు 104 ప్యాకేజీ కింద సాగుచేసిన పంటలకు పూర్తిస్థాయిలో నీరుఅందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయనే విషయాన్ని రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడాను. రెండు మూడు రోజుల్లో సాగునీరు అందించేలా చర్యలు తీసుకుని పంటలను కాపాడుతాం. రైతులు ఆందోళన చెందొద్దు. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల వారబందీ విధానంలో.. 104 ప్యాకేజీ కింద వాస్తవానికి 5వేల ఎకరాలకు మాత్రమే వారబంధీ విధానంలో సాగునీటిని ఇస్తామని రైతులకు ముందస్తుగానే చెప్పాం. కానీ రైతులు 15వేల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. దీంతో పాటు కొందరు రైతులు కాల్వకు మోటార్లు వేసుకుని నీటిని తీసుకుంటున్నారు. ఈ కారణాలతో కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తాయి. విషయాన్ని మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. – రహీముద్దీన్ ఇన్చార్జ్ ఎస్ఈ ●104 ప్యాకేజీ కింద 15వేల ఎకరాలు నెట్టెంపాడు ప్రాజెక్టు 104 ప్యాకేజీ కింద మొత్తం 15వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఉన్న నీటి నిల్వల దృష్ట్యా సాగుచేసిన 15వేల ఎకరాలకు సాగునీరు పారడం ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉంటే కొందరు రైతులు అనధికారికంగా కాల్వలకు మోటార్లు వేసుకుని సాగునీటిని తోడేస్తున్నారని నెట్టెంపాడు ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో 104 ప్యాకేజీ డి–9 కింద సాగుచేసిన 5వేల ఎకరాల్లో సుమారు 2వేల ఎకరాల వరకు వరిపంటకు సాగునీరు అందక ఎండిపోయింది. మిగిలిన 3వేల ఎకరాలకు సాగునీరు అందించకపోతే ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం తమ పంటలకు సాగునీటిని అందించి పంటలు కాపాడాలని కలెక్టర్ను కోరారు. ఆశలు.. అంచనాలు తలకిందులు -
క్రీడా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు
గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడా స్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని డీవైఎస్ఓ జితేందర్ పేర్కొన్నారు. ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు, కిట్లు అందజేయాడానికి దాతలు ముందుకు వచ్చారు. ఆదివారం వాటిని డీవైఎస్ఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సుమారు 50 మంది కబడ్డీ క్రీడాకారులకు క్రీడా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా నిర్దేశించుకొని ఆడాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తి ప్రదర్శించాలని సూచించారు. కబడ్డీ క్రీడా వల్ల శారీరక దృఢత్వంతోపాటు, మానసిక దృఢత్వం లభిస్తుందని చెప్పారు. గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమన్నారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. గెలుపు ఓటములను ప్రతి క్రీడాకారుడు సమానంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్ తిరుపతి, ఫిజికల్ డైరెక్టర్ రజినికాంత్, విజయ్కుమార్, బాస్కర్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు సర్వేశ్వర్రెడ్డి, మోహన్బాబు, సురేష్, కొత్త గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ కళాశాల మంజూరు చేయాలి
గద్వాలటౌన్: గద్వాలకు నూతన ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్టంలో ప్రస్తుతం 8 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని, మరో మూడు కొత్త కళాశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు. నిజామాబాద్, సూర్యాపేట, కొడంగల్ నియోజకవర్గాలలో కొత్త కళాశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని గద్వాల జిల్లాలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు రవికుమార్ఏక్బోటే, బండల వెంకట్రాములు, దేవదాసు, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీను, సాయి, ప్రదీప్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి దందా
అనుమతులు లేకుండా తవ్వకాలు సిండికేటుగా మారి.. జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులు గతంలో ఒకరిపై మరొకరు అధికారులకు ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేయించే వారు. లేదా మట్టి తరలిస్తుండగా వాహనాలను పట్టుకొని కొన్ని రోజులపాటు స్టేషన్లో ఉంచేలా పావులు కదిపేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మొత్తం మారింది. మట్టి అక్రమ వ్యాపారులు అందరూ ఒక్కటయ్యారు. ఓ నాయకుడు రంగ ప్రవేశం చేసి మట్టి వ్యాపారులతో రెండు రోజుల క్రితం చర్చలు జరిపి అందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చాడు. అనుమతులు ఉన్నా లేకున్నా అన్నీ తాను చూసుకుంటానని, తాను ప్రకటించిన ధరకే మట్టిని విక్రయాలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. అయితే అలంపూర్ సెగ్మెంట్లో ఓ నాయకుడు చెప్పిన వారే మట్టి తరలింపు చేయాల్సిందిగా హుకూం జారీ చేశాడు. రెవెన్యూ, మైనింగ్, పోలీసుశాఖ అధికారులు చర్యలు తీసుకుందామని ముందుకెళ్తే.. వారిపై బదిలీ వేటో లేదా కానుకలతో బుజ్జగిస్తున్నారు. ఈ ఘటనలపై జిల్లా మైనింగ్ శాఖ అధికారి మల్లికార్జున్ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ● కనుమరుగవుతున్న గుట్టలు.. కుంటలు ● సిండికేటుగా మారిన అక్రమార్కులు ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● పట్టించుకోని అధికార యంత్రాంగం గద్వాల క్రైం: అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. కాపాడాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. సహజ వనరులైన గుట్టలను తవ్వేసి రూ.కోట్లు గడిస్తున్నారు. జిల్లాలో గద్వాల, గట్టు, కేటీదొడ్డి, మల్దకల్, ధరూర్, ఇటిక్యాల, అయిజ, మానవపాడు, అలంపూర్, ఉండవెల్లి మండలాల్లో గత కొన్ని రోజులుగా కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు షురూ చేశారు. ఇలా చేపడితే చట్ట పరమైన చర్యలు తప్పవని అధికారులు పేర్కొంటున్నా.. అవి మాటలకే పరిమితమయ్యాయి. ఈ మట్టి దందా నిర్వహిస్తున్న వ్యాపారులకు కొందరు నాయకుల అండదండలు ఉండడంతోనే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో వెంచర్లు, గృహ నిర్మాణాల పనులు జోరందుకున్నాయి. దీంతో మట్టి తవ్వకాలు సైతం అదే స్థాయిలో ఉదయం, రాత్రి యంత్రాల సహాయంతో మట్టిని అక్రమంగా తరలించి పెద్ద ఎత్తున డబ్బులు వెనకేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలో అక్రమార్కులను కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం దాగుడుమూతలు అడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మైనింగ్, రెవెన్యూశాఖ అధికారులు సీజ్ చేసిన, నిలువరించిన దాఖలాలు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అక్రమార్కులు అందరూ సిండికేట్గా మారి దందా కొనసాగిస్తున్నారు. కేసులు నమోదు చేస్తాం అనుమతి లేకుండా జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేపట్టరాదు. ఇటీవల జిల్లాలో పలు చోట్ల గుట్టుగా మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసుల తనిఖీల్లో మట్టి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తాం. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల సంయుక్తగా నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. మట్టి దందా నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ మల్దకల్ మండలం ఎల్కూర్లో మట్టి టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు (ఫైల్) గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లోని పలువురు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమార్కులు మట్టి తరలింపు చేపట్టారు. మట్టి తరలింపుపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు తమకేందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న వ్యాపారులు గత 20 రోజుల నుంచి మట్టి తవ్వకాల్లో వేగం పెంచారు. టిప్పర్ మట్టికి రూ.6వేలు, ట్రాక్టర్కు రూ.1600 వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఎటు చూసిన నూతన నిర్మాణాలు వేగవంతం అవుతుండడంతో మట్టి వ్యాపారులు సిండికేట్గా మారి ఆయా శాఖల అధికారులకు చేయి తడపడంతో సిబ్బంది చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అ క్రమార్కులకు కొందరు నాయకుల మద్దతు సై తం ఉండడంతో మట్టి మాఫియాకు ఎక్కడా లేని బలం చేకూరుతుంది. ఎవరెవరికి ఎంతో కొంత ● ఈ నెల 4వ తేదీన అర్ధారాత్రి గద్వాల మండలం నుంచి గద్వాల వైపునకు లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో రూరల్ పోలీసులు రెండు టిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉదయం పట్టుకున్న టిప్పర్లను అనంతరం వదిలేశారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ● ఈ నెల 7వ తేదీన అయిజ మున్సిపాలిటీ పరిధిలో టిప్పర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించలేదు. సామాజిక మాద్యమాల్లో మట్టి తరలిస్తున్న వీడియోలను వైరల్ చేయడంతో అయిజ పోలీసులు టిప్పర్ను అదుపులోకి తీసుకున్నారు. గట్టు మండలంలో ఓ నాయకుడు పెద్ద ఎత్తున మట్టి నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తుంది. ● 2025 ఫిబ్రవరి 10వ తేదీన కేటీదొడ్డి మండలంలోని గ్రామ శివారులోని చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తుండగా.. విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. ● 2025 ఫిబ్రవరి 13వ తేదీన మల్దకల్ మండలం ఏల్కూర్ గ్రామం నుంచి ప్రభుత్వ భూముల నుంచి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుని వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మల్దకల్ పోలీసులు ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడుతూ టిప్పర్లను వదిలేయాల్సిందిగా చెప్పారు. దీంతో గ్రామస్తులు ఫోన్లోనే పోలీసులకు చురకలు అంటించారు. దీంతో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనక్కితగ్గారు. ఇస్తేనే మన వైపు ఎవరు రారు అనే దీమాతో ఈ దందాలోని వ్యక్తులకు రాచబాటలు కల్పిస్తారు. అయితే జిల్లాలో వీరే కీలకంగా ఉన్నారు. పోలీసుశాఖ నిఘా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కట్టడి చేయలేక పోతున్నారు. చర్యలు శూన్యం జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు -
సొరంగంలో ర్యాట్ మైనర్స్
24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే.. సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోపల 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమారు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్లెట్ టన్నెల్లో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది. రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు.. మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్ కిందుగా పైప్లైన్ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్ చేయాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి. వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు జరుపుతున్న వైనం -
సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలి
గద్వాలటౌన్: మహిళల సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలని, ఇంట్లో మగపిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని, అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునేలా స్వేచ్ఛను ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలికల గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన సెమినార్కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంట్లో నుంచే స్వేచ్ఛ మొదలైతే మంచి ఉన్నత శిఖరాలు సాధించే అవకాశం ఉందన్నారు. అయితే క్రమశిక్షణ, సాధించాలనే తపన, అన్ని మంచిగా తీసుకోవడం, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం చేస్తే.. ప్రపంచాన్ని సృష్టించే స్థాయికి చేరుకుంటారన్నారు. మార్చి 8వ తేదీ అసమానతలపై జరిగే పోరాటాలకు దిక్సూచి కావాలని, ఈ రోజు దోపిడీపై మహిళలు చేసిన అనేక పోరాటాలు మనకు స్పురణకు వస్తాయన్నారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు చేసింది ఏమీ లేదని మిమర్శించారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం మహిళలను మరింత వెనకకు నెట్టే విధంగా చర్యలు చేపడుతుందని ఆరోపించారు. మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలకు సవరణలు చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీ్త్రల భద్రతలో మన దేశంలో 126వ స్థానంలో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, జిల్లా అధ్యక్షురాలు ఏమేలమ్మ, కార్యదర్శి నర్మద, జిల్లా నాయకురాలు రాధ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
గద్వాలటౌన్: మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థిక స్వావలంబన సాధించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత అన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శనివారం మహిళాలలను, మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. స్వశక్తితో ఎదగాలనే సంకల్పం ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలోని మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళా శక్తి ఎదిగినప్పుడే దేశానికి, రాష్ట్రానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి ఉందని చెప్పారు. బాల్య వివాహాలను రూపు మాపాలని సూచించారు. ఆడపిల్లలను చదివించాలని, అందుకు తల్లిదండ్రులు మంచి వాతావరణం కల్పించాలన్నారు. అక్షరాస్యతతోనే చాలా వరకు సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడ,మగ పిల్లలను సమాన దృష్టితో ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా లింగవివక్ష విడాలని పేర్కొన్నారు. శంకర్, జి తిరుమలేష్, నాయకులు కబీర్దాసు అనిత, శారద, సుకన్య, ఇసాక్ పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యం..!
అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం ●ఉపేక్షించేది లేదు అక్రమ నిర్మాణాలు, కబ్జాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు. ప్రజా అవసరాల కోసం ఇచ్చిన పది శాతం స్థలాల్లో చేపడుతున్న నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే కొన్ని అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవు. వీటిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నారు. ఆ దిశగానే చర్యలు ఉంటాయి. – దశరథ్, కమిషనర్, గద్వాల అధికారుల ద్వంద్వ వైఖరి? గత కొంత కాలంగా మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం మానేశారు. దీంతో రాజకీయ, అంగబలం ఉన్న వారు నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా, మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల కబ్జాలపై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వాటిపై చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ సైతం చేపట్టలేదు. దీంతో మున్సిపల్ అధకారుల పనితీరుపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలను ఉదహరిస్తున్నారు. బసవన్న చౌరస్తాలో అక్రమంగా నిర్మించిన దుకాణాలను రాత్రికి రాత్రే పోలీసు బందోబస్తుతో కూల్చేశారు. అదే సందర్భంగా కుంటవీధిలోని పదిశాతం ప్రజా అవసరాల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి చేపట్టిన భవన నిర్మాణంపై చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నేత నుంచి బెదరింపు ఫోన్ రావడంతో అక్రమ నిర్మాణంపై కూల్చివేయడానికి వెళ్లిన అధికారులు వెనుదిరిగారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడానికి తాత్సరం చేస్తున్నారు. అధికారుల ద్వంద వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ స్థలాల కబ్జాలపై కొరఢా ఝులిపించాలని స్థానికులు కొరుతున్నారు. గద్వాలటౌన్: కలెక్టర్ ఆదేశించినా జిల్లాలో మాత్రం ఈ విషయం అడుగులు ముందుకు పడటం లేదు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించినా.. కూల్చివేతలు చేపట్టలేదు. నామమాత్రపు హెచ్చరికలతో చేతులు దులుపుకొన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో అదే తీరు నెలకొంది. కలెక్టర్, అడిషినల్ కలెక్టర్లు నివాసం ఉంటున్న జిల్లా కేంద్రంలో అంతా ఇదే తీరు కనిపిస్తుంది. అధికారికంగానే వందకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అనధికారికంగా రెట్టింపు సంఖ్యలో అక్రమ కట్టడాలు ఉన్నాయి. మీనమేషాలు లెక్కింపు జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో అలంపూర్ మినహా మిగిలిన మూడు మున్సిపల్ పట్టణాలు వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో భవన యజమానులు, బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీ భవంతులను నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు అధికారులకు కళ్ల ముందు కనిపిస్తున్నా.. చర్యలు తీసుకోవడం లేదు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించిన అధికారులు వాటి యజమానులకు నోటీసులు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్నా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై మక్కువ చూపడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. సామాన్యులపై ప్రభావం చూపే టౌన్ ఫ్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తున్న యజమానుల జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా కొంత మంది నాయకులకు అక్రమ నిర్మాణాలు కాసులు కురిసిస్తున్నయనేది బహిరంగ రహస్యం. పార్టీలకు అతీతంగా కొంతమంది నేతలు వసూళ్లలో మునిగితేలుతున్నారు. ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కలెక్టర్ చొరవ చూపితే మేలు కలెక్టర్, అదనపు జిల్లా కలెక్టర్లు మున్సిపాలిటీలపై ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నారు. మున్సిపల్ పాలనతో పాటు ఆదాయ వనరుల సమీకరణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించి, ఆ దిశగా అధికారులను దిశానిర్ధేశం చేశారు. అదేవిధంగా మున్సిపల్ పట్టణాలలో సాగుతున్న అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, అనధికారిక వెంచర్ల బాగోతంపై వారు దృష్టి సారించాలి. సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లడం లేదు. రాజకీయంగా ఒత్తిడి వచ్చినా లెక్క చేయక వాటిని కూల్చేయాలి. స్థానిక నాయకులు వారికి సహకారం అందించాలి. ముఖ్యంగా గద్వాలలోని అభివృద్ధి చెందుతున్న కాలనీలలోనే అక్రమ నిర్మాణాలు, కబ్జాలు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి జిల్లా కేంద్రంలో అంతా అదే తీరు ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు ‘జిల్లాలోని ఏ మున్సిపాలిటీల్లో కూడా కబ్జాలు, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు.. గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేసి అక్రమ కట్టడాలను అడ్డుకోండి. అప్పటికీ వినకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుని, ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయండి..’ ఇటీవల జరిగిన సమీక్షలో మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ సంతోష్ ఆదేశం -
ప్రతిఒక్కరూ గౌరవించాలి
అలంపూర్: ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని అలంపూర్ నియోజకవర్గ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, స్థానిక న్యాయమూర్తి మిథున్ తేజ అన్నారు. అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్వర్యంలో అలంపూర్లోని జూనియర్ సివిల్ కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం నిర్వహించగా జడ్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పలువురిని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, న్యాయవాదులు నారాయణరెడ్డి, శ్రీధర్ రెడ్డి , తిమ్మారెడ్డి , యాకోబు, వెంకటేష్, గజేందర్, గవ్వల శ్రీనివాసులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. -
ఆలోచన ధోరణి మారాలి
ఎర్రవల్లి: సమాజంలో అవమానాలు, అత్యాచారం, అభద్రతాభావం ఉన్న ప్రస్తుత కాలంలో మహిళల పట్ల ఆలోచన ధోరణి మారాలని పదో బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి సాంబయ్య అన్నారు. శనివారం మండంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించగా.. కమాండెంట్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన, కేక్ కటింగ్ చేశారు. అనంతరం బెటాలియన్లోని మహిళలను శాలువాలతో సత్కరించి మాట్లాడారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన సీ్త్ర సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. చాలామంది మహిళా మూర్తులు స్వశక్తితో ఉన్నత స్థితికి చేరుకొని సీ్త్రశక్తి అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేస్తున్నారన్నారు. అంతరిక్ష యానంలో సేవలందిస్తున్న సునీతా విలియమ్స్, దేశ రాష్ట్రపతి ద్రౌపతిముర్ముతోపాటు కిరణ్బేడి, పీ.వీ సింధు వంటి వారు ఎన్నో రంగాల్లో ముందున్నారన్నారు. అనంతరం మహిళలకు వివిధ క్రీడలను నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారిని కమాండెంట్ అభినందించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, శ్రీనివాసరావు, పాణి, ఆర్ఐలు రాజేష్, రాజారావు, వెంకటేశ్వర్లు, శ్రీదర్, అదికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సమాఖ్యకు బస్సు మంజూరు
ఇటిక్యాల: మండల మహిళా సమాఖ్య ప్రభుత్వం నుంచి ఆర్టీసీ బస్సు మంజూరైనట్లు ఏపీఎం కురుమయ్య శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మండల మహిళా సమాఖ్యకు రూ.36 లక్షల వ్యయంతో ఆర్టీసీ బస్సును మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలి వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్వేస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద తాగునీరు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, రేషన్షాపు లేక అవస్థలు పడుతున్నారని.. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని అనుసరించి చిరు వ్యాపారులు, మెకానిక్లు ఏర్పాటుచేసుకున్న డబ్బాలను రోడ్డు విస్తరణలో తొలగించడంతో రోడ్డున పడ్డారని.. వారికి అడ్డాలు చూపించి ఆదుకోవాలని కోరారు. పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీలో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు అలుపెరగని పోరాటం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.లక్ష్మితో కలిసి జాన్వెస్లీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్, మండ్ల రాజు పాల్గొన్నారు. సీఎంను కలిసిన పీయూ వీసీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్లో బాలుర, బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. -
లోక్ అదాలత్లో 6,926 కేసుల పరిష్కారం
గద్వాల క్రైం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 6926 కేసులు పరిష్కరించినట్లు లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి కె కుష తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులకు సంబందించి ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు ఆయన తెలిపారు. ఇరువురు అవగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషంగా ఉండాలని, లోక్ అదాలత్ మంచి అవకాశమని, చిన్నచిన్న కేసులను క్షమించి రాజీ కావడం వల్ల వారికి ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుందన్నారు. సివిల్ తదితర కేసులలో ఒకరికొకరు రాజీ కావడం వల్ల కేసులు పరిష్కారం అవుతాయని ఇద్దరూ గెలుస్తారని తెలిపారు తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి. లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, న్యాయవాదులు రాఘురాం రెడ్డి, తదితరులు ఉన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
గద్వాల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ దళ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సాయుధ దళ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విపత్కర సమయాల్లో సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రజలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. విధుల నిర్వహణతో పాటు ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సంక్షేమ్మంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరు శరీరకంగా, మాససికంగా ధృఢంగా ఉండాలన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం సిబ్బందితో పలు విషయాలపై ఆరా తీశారు. సమావేశంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్ రావు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఎక్త్సెజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రితోపాటు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరై మొదట సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలందరికీ ముందుగా మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజా సంక్షేమం, మహిళల అభ్యున్నతి కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని ఎదుర్కొనేలా దైర్యంగా మహిళలు ఉండాలన్నారు. చిన్న వయస్సు నుంచి పిల్లలకు మంచి విషయాలు, సమాజంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రధానంగా ఐదు విషయాలపై శ్రద్ద వహించాలని అవి చదువు, ఆరోగ్యం, సమయపాలన, సాంప్రదాయం, నడవడిక అని అన్నారు. బాలురతో సమానంగా బాలికలను చదివించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, విధిగా ఒక గంటపాటు వ్యాయామం చేస్తే వ్యాధుల భారిన పడకుండా తప్పించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ఉద్యోగులు. మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లాస్ధాయి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
సామాజిక మార్పుతోనే విజయం
గద్వాల క్రైం: తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుతోనే ప్రతి మహిళ అన్ని రంగాల్లో విజయం సాధిస్తుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇంటా, బయట ఎదుర్కొనే సమస్యలు, లైంగిక దాడులు, సమస్యల వలయంలో ఎందరో మహిళలు ఉన్నారన్నారు. ఇలాంటి వాటిపై ప్రతి ఒక్కరు చైతన్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రతి ఏటా మహిళల దినోత్సవం నిర్వహించడం కంటే లింగ వివక్ష లేకుండా అందరు సమానమేనని గుర్తిస్తే ఎంతో మంచిదన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం పనిచేస్తుందని అన్నారు. బాధింపపడ్డ మహిళలు, విద్యార్థినుల కోసం భరోసా కేంద్రం సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రజిత, భరోసా సిబ్బంది శివాని, శిరిష తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు యూనిక్ డిజెబిలిటీ ఐడీలు
గద్వాల: దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దివ్యాంగుడికి సదరం సర్టిఫికెట్ స్థానంలో యూనిక్ డిజెబిలిటీ ఐడీ కార్డులను కేటాయించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి, విద్య, పెన్షన్ల కోసం దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందే విధంగా సదరం సర్టిఫికెట్కు బదులు యూనిక్ డిసెబిలిటీ ఐడీ కార్డును ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జారీ చేయాలన్నారు. ఈ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుందన్నారు. మార్చి 2025 నుంచి 21 రకాల అంగవైకల్యాలకు సంబంధించి యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతకు పూర్వం సదరం క్యాంపుల ద్వారా 7 రకాల అంగవైకల్యాలకు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేయబడేవన్నారు. ఇక నుంచి సదరం బదులు యూడీఐడీ పోర్టల్లో లబ్ధిదారులు స్వయంగా గాని లేదా మీ–సేవా కేంద్రాల ద్వారా కాని పూర్తి వివరాలు నమోదు చేయాలిస ఉంటుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు యూడీఐడీ కార్డులు స్పీడ్పోస్టు ద్వారా నేరుగా సంబంధిత లబ్ధిదారుల చిరునామాకు చేరుతాయన్నారు. అదేవిధంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. -
యఽథావిధిగా పింఛన్, ఇతర ప్రయోజనాలు..
ఇదివరకు సదరం సర్టిఫికెట్లు ఉన్న దివ్యాంగులు రాష్ట్రంలో పెన్షన్, ఇతర ప్రయోజనాలను యధావిధిగా పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ప్రయోజనం పొందాలంటే యూడీఐడీ కార్డు తప్పనిసరి అన్నారు. 2025మార్చి 1వ తేదీ నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు యూడీఐడీ పోర్టల్ www.swavalambancard.gov.in ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇకమీదట సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సదరం సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునే సమయంలో ఖచ్చితంగా యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఉన్న మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీడబ్ల్యువో సునంద, మెడికల్ కాలేజీ సూపరిండెంట్ ఇందిర, ఇంచార్జీ డీపీవో నాగేంద్రం, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మీసేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ 6–27 (శనివారం సాయంత్రం)
సహర్ 5–18 (ఆదివారం తెల్లవారుజామున) జోగుళాంబ ఆలయ అభివృద్ధికి ప్రణాళిక అలంపూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జోగుళాంబ ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి.. ముందుకు సాగాలని దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తక్షణ పనుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎండోమెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, ఆగమ శాస్త్ర పండితులు గోవింద హరి, తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాత్కాలిక, దీర్ఘ కాలిక పనుల జాబితాను సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ నాటికి తాత్కాలిక, తక్షణ పనులను ఎంపిక చేసి నివేదిక అందజేయాలని కమిటీకి కాల పరిమితిని నిర్ణయించారు. తాత్కాలిక పనులలో భాగంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్, పార్కింగ్, ప్రచార బోర్డులు పెట్టనున్నారు. అందుకు బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయనున్నారు. దీర్ఘ కాలిక పనులలో బోటింగ్, టూరిజం అభివృద్ధి, అతిథి గృహాల నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, ఆర్చిల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి పలు సూచనలు చేశారు. సూర్యనారాయణ మూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎండోమెంట్స్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
శెభాష్.. నారాయణమ్మ
పాడి పరిశ్రమతో రాణింపు ● మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తూ ముందుకు..నారాయణపేట: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన.. కేవలం వంటింటికే పరిమితం కాకూడదన్న తలంపు.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశయం ముందు కష్టాలు, అలసట పటాపంచలు అయ్యాయి. ఫలితంగా తనతో పాటు మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోందిన నారాయణపేటకు చెందిన కాకర్ల నారాయణమ్మ. పట్టణంలోని సింగార్బేష్కు చెందిన కాకర్ల నారాయణమ్మ 1983లో భర్త కాకర్ల భీమయ్య ప్రోత్సాహంతో రూ.5 వేల పెట్టుబడితో రెండు గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా ఆ వ్యాపారం ప్రస్తుతం 30 గేదెలతో నెలకు రూ.1.20 లక్షలు ఆదాయం సంపాదిస్తూ.. ఆదర్శంగా నిలిచింది. నిత్యం కష్టజీవిగా పరితపిస్తూ 42 ఏళ్లుగా గేదెలతో చిన్నపాటి కుటీర పరిశ్రమగా మార్చుకుంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తానూ సంపాదించాలనే తాపత్రయంతో పాల వ్యాపారంలో రాణిస్తోంది. తనతోపాటు ఆరుగురికి ఉపాధిని కల్పిస్తోంది. గేదెల నుంచి పాల దిగుబడితో రోజుకు రూ.4వేల ఆదాయం ఆర్జిస్తోంది. ఆమె ఉత్తమ పాడి రైతు అవార్డును సైతం అందుకుంది. రుణం ఇవ్వకపోయినా.. పాడిపరిశ్రమ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, ఆ ఆర్థిక సహాయానికి కాకర్ల నారాయణమ్మ ఇంత వరకు నోచుకోలేదు. ఆమె తమ స్వయం కష్టార్జితంతోనే పాడి పరిశ్రమను అంచెలంచెలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారే తప్ప ఏ బ్యాంకు రుణ సదుపాయం అందిస్తామని ముందుకు రాలేదు. ఎంతో శ్రమిస్తున్న ఈ మహిళకు పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం, బ్యాంకర్లు ఆర్ధిక సహాయం అందించి మరింత చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళల సమస్యల పరిష్కార వేదికలు కొడుకు పేరిట ట్రస్టు ప్రతిఏటా నిరుపేద జంటలకు బంగారు పుస్తె, మెట్టెలు అందిస్తూ.. వృద్ధులకు చీరలు ఉచితంగా పంపిణీ చేస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతోంది నారాయణమ్మ. ఈమె కుమారుడు కాకర్ల సురేష్ హఠాన్మరణంతో కలత చెందారు. ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ పాడిపరిశ్రమలోఎంతో శ్రమించేవాడు. కొడుకు జ్ఞాపకార్థం సురేష్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తోంది. అలాగే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కౌన్సిలర్గా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తోంది. ప్రతిఏటా వేసవిలో జిల్లాకేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తోంది. ఫ్యామిలీ కోర్టు, మహిళా న్యాయ స్థానం, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా పోలీస్ స్టేషన్, సఖి కేంద్రం, భరోసా కేంద్రం -
No Headline
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు 102 మంది గైర్హాజరు
గద్వాలటౌన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు దాదాపు అర గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జనరల్, ఓకేషనల్ విభాగాలలో మొత్తం 3,685 మంది విద్యార్థులు పరీక్షక్ష రాయాల్సి ఉండగా 3,583 మంది విద్యార్థులు హాజరయ్యారు. 102 మంది గైర్హాజరయ్యారు. అలాగే, జనరల్ విభాగంలో 3,027 మంది విద్యార్థులకుగాను 2,945 మంది.. ఓకేషనల్ విభాగంలో 658 మందికిగాను 638 మంది విద్యార్థులు హాజరయ్యారు. 97 శాతం హాజరు నమోదు అయింది. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్యా జిల్లా అధికారి హృదయరాజు తనిఖీ చేశారు. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 144 సెక్షన్ను కేంద్రాల వద్ద అమలు చేశారు. -
హత్య కేసుపై డీఎస్పీ, సీఐల విచారణ
గట్టు: ఓ హత్య కేసుకు సంబందించి నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా.. సదరు నిందితుడి స్వగ్రామం లింగాపురంలో గద్వాల డీఎస్పీ మొగులయ్య, శాంతినగర్ సీఐ టాటాబాబు, ఎస్ఐ శ్రీనివాస్, అయిజ, గట్టు ఎస్ఐలు రాజశేఖర్, మల్లేష్ గురువారం విచారణ నిర్వహించారు. శాంతినగర్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసుకు సంబందించి లింగాపురం గ్రామానికి చెందిన ఉత్తనూర్ నర్సింహులు నిందితుడు. ఇతను జైలులో ఉండగా.. విచారణ నిమిత్తం పోలీసులు కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకున్నారు. ఈమేరకు లింగారానికి చేరుకొని నిందితుడి పూర్తి వివరాలు ఆరా తీశారు. 1,018 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం 1,018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదన్నారు. ఎన్టీఆర్ కాల్వకు 84 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 119 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం విద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ రాజ్కుమార్, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్ పాల్గొన్నారు. ఆరుగురికి పదోన్నతి మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు కేటాయించారు. ఆయుధ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి వనపర్తి: విధుల్లో వినియోగించే ఆయుధాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లిలోని 10వ బెటాలియన్లో గురువారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మూడురోజుల ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కరు పది రౌండ్లు కాల్చే అవకాశం కల్పించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా సాయుద దళాల అదనపు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించవచ్చన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవ న విధానాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసుశాఖకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, డ్యూటీలో ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్క్రైం డీఎస్పీ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, ఎండీ మొగ్ధుం, జిల్లాలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీగా నీట్ పరీక్ష
గద్వాల: నీట్ యూజీ–2025 పరీక్షను అత్యున్నత ప్రమాణాలతో పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజీలను నీట్ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయటానికి ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన గదుల్లో వసతులు, సీటింగ్ కెపాసిటీ, సీసీటీవీ నిఘా, టాయిలెట్లు, వెంటి లేషన్ తదితర అంశాలను పరిశీలించి పాఠశాల అధ్యాపక బృందానికి అవసరమైన సూచనలు చేశారు. నీట్ పరీక్షా మార్గదర్శకాలను అనుసరించి విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. అదేవిధంగా ప్రశ్నపత్రాల భద్రతాలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు అందించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు ఇమ్మన్యూల్, జహీరుద్దీన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
హైలెవల్ బ్రిడ్జిపైనే ఆశలు..
గతంలో కాజ్వే శిథిలావస్థకు చేరుకొని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం కలెక్టర్ బీఎం సంతోష్ దృష్టికి వెళ్లగా.. ఆయన నేరుగా కాజ్వేను సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజ్వే పూర్తిగా శిథిలమైందని, వాహనాలు వెళ్తే ప్రమాదమని పేర్కొంటూ.. తాత్కాలికంగా కాజ్వేకు మరమత్తులు చేసి వేసవి కాలంలో కాజ్వేను కూల్చివేసి దాని స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అయినా సరే ఇప్పటి వరకు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడడంలేదు. ఇదిలాఉండగా, అత్యవసర వైద్య సేవలైన కాన్పులు, రోడ్డు ప్రమాద బాధితులను నిత్యం అయిజ నుంచి ఏపీ రాష్ట్రంలోని కర్నూలుకు అంబులెన్స్లలో తరలిస్తుంటారు. కాజ్వే పూర్తిగా శిథిలం కావడంతో అంబులెన్స్ వాహనాలు గద్వాలకు చేరుకొని అక్కడ నుంచి జాతీయ రహదారిపై కర్నూలుకు వెళ్తుండడంతో అత్యవసర సేవలు ఆలస్యం కావడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. -
చేతివృత్తుల వారికి ఆర్థిక తోడ్పాటు
గద్వాల: సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థికంగా మరింత స్థిరపడేందుకు రూపొందించిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పీఎం విశ్వకర్మ పథకంపై ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న చేతికులవృత్తుల వారికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిలో సామర్థ్యాన్ని పెంచి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉత్పాదకత, నాణ్యత, ఉత్పత్తులను మెరుగుపర్చి ఆర్థికంగా చేయూతనిస్తూ జీవనోపాధిని అభివృద్ధి చేయడమే ఈపథకం లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి, ఎరుకలి, దర్జీ తదితర 18 కులవృత్తుల వారికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శిక్షణతో పాటు రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈపథకంలో చేరడం ద్వారా విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డుతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ టూల్కి ట్లు, రుణసదుపాయం, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం మార్కెటింగ్కు మద్దతు లభిస్తుందని తెలిపారు. ఉచిత శిక్షణ.. రుణాలు 18 సంవత్సరాలు పైబడిన కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులని ఎలాంటి విద్యార్హత లేకున్నా పేరు నమోదు చేసుకోవచ్చని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదన్నారు. విశ్వకర్మగా పేరు నమోదు ద్వారా ఆన్ౖలైన్లో రేషన్కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు పాసుబుక్, మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలని అనంతరం దరఖాస్తులను గ్రామ పంచాయతీ స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయి అమలు కమిటీకి పంపుతుందని తెలిపారు. ఎంపికై న వారికి రెండు రకాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రాథమిక నైపుణ్యం ద్వారా ఐదు నుంచి ఏడు రోజులు, అధునాతన నైపుణ్యానికి 15 రోజులు శిక్షణ అందిస్తూ శిక్షణ కాలంలో ప్రతిరోజు రూ.500 భృతి ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం రూ.15వేల విలువైన టూల్ కిట్లు, ధ్రువీకరణ పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రెండువిడతలుగా మొత్తం రూ.3లక్షల రుణం అందించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో రూ.లక్ష, రెండో విడతలో రూ.2 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి రుణాలు మంజూరీ చేయడంలో బ్యాంకర్లు సహకరించాలన్నారు. ఈ రుణానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో పరిశ్రమల జిల్లా అధికారి రామలింగేశ్వర్గౌడ్, మైక్రో,స్మాల్, మీడియం ఎంటర్పైజెస్ ఏడీ శివరామ్ప్రసాద్, ఢిల్లీ ప్రతినిధి సంజీవ్కుమార్ సైని, ఇంచార్జీ డీపీవో నాగేంద్రం, ఎల్డీఎం అయ్యప్పురెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్బాబు, చేనేత జౌళి ఏడీ గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాల కేటాయింపుపై పోరాడాలి
పాలమూరు: కృష్ణా బేసిన్లోని అన్ని జిల్లాలలో నీటి వాటా కోసం కృష్ణానది జలసాధన జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడాల్సిన అవసరం ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు హరగోపాల్, కన్వీనర్ రాఘవాచారి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు నిధులు అన్నింటిని ఆంధ్ర ప్రాంతాల్లో వెచ్చించి, కృష్ణానది జలాల దోపిడీకి పాల్పడ్డారని ఆ క్రమంలో ఎన్నో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వచ్చినా.. పార్టీల అధికారం మారినా.. స్థానిక రైతులకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ తెలంగాణకు నీటి వాటా పంపిణీ చేయలేదని, గత ప్రభుత్వం కేంద్రంతో పోరాడి నీటివాటా సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల గడుస్తున్నా కృష్ణానది జల సాధనకు కృషి చేయడం లేదని విమర్శించారు. -
మోక్షమెప్పుడో..?
అంతర్రాష్ట్ర రహదారిపై హైలెవల్ బ్రిడ్జి లేక ఇబ్బందులు ●బ్రిడ్జితోనే శాశ్వత పరిష్కారం పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర సేవలందించేందుకు కర్నూలుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన కాజ్వేపై తరుచూ గుంతలు ఏర్పడడంతో రోడ్డు దాటలేని పరిస్థితి నెలకొంది. దానివలన 108 సేవలకు ఆటంకం కలుగుతుంది. హై లెవల్ బ్రిడ్జి నిర్మిస్తే వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగకుండా ఉంటుంది. – శ్రీధర్ 108 సిబ్బంది, అయిజ మండలం పహారా కాస్తున్నాం పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గతంలో నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలమైంది. ఇటీవల కాజ్వేపై భారీ గుంత పడింది. అధిక లోడుతో ఉన్న వాహనాలు వెళ్లకుండా పోలీసులు కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఇలా జరిగితే మరమ్మతు చేసేంత వరకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రాత్రింబవళ్లు కాపలా కాశం. – శ్రీనిసాసరావు, ఎస్ఐ, అయిజ నివేదికలు పంపించాం.. అయిజ–రాయచూర్ రోడ్డుపై అయిజ పట్టణ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలమైంది. భారీ వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. కాజ్వేను తొలగించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. దీని కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. నిధులు మంజూరైతే బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. – దేశ్యానాయక్, ఆర్అండ్బీ ఈఈ అయిజ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలిపే కర్నూలు–రాయచూరు అంతరాష్ట్ర రహదారిపై అయిజ సమీపంలోని పెద్దవాగు వద్ద కొన్నేళ్ల క్రితం నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో మూడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే భారీ వాహనాలను కాజ్వే గుండా వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కాజ్వే రక్షణ గోడలు శిథిలమై.. రంద్రాలు పడగా తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. ఇటీవల మరోసారి గోతులు పడగా మంగళవారం నుంచి భారీ వాహనాలను కాజ్వే గుండా అనుమతించడంలేదు. పోలీసులు ఆర్అండ్బీ వారికి సమాచారమిచ్చినా.. అటు అధికారులు, ఇటు పాలకులు స్పందించడం లేదు. మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలు ఈ కాజ్వేపై మూడు రాష్ట్రాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. ప్రతి రోజు వేల సంఖ్యలో వాహనాలు ఈరోడ్డుపై వెళ్తుంటాయి. అలాంటి రోడ్డుకు అడ్డుగా అయిజ పట్టణ సమీపంలో పెద్దవాగు ఉంది. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన కాజ్వేపై వరదనీరు ఉధ్రుతంగా ప్రవహించినప్పుడు ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుంది. ఎక్కడికి వాహనాలు అక్కడే నిలిచిపోవాల్సి ఉంటుంది. ఇటీవల కాజ్వేపై పెద్ద గొయ్యి ఏర్పడగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాజ్వే రక్షణ గోడలు బీటలు వారాయి. గోడకు నిర్మించిన రాళ్లు ఊడిపోతున్నాయి. విధిలేక వాహనదారులు వేరే మార్గంపై వెళ్లాలంటే 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు వెళ్లాలంటే రాయచూరు నుంచి గద్వాల మీదుగా.. అలాగే ఏపీ ప్రజలు కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లాలనుకుంటే గద్వాల మీదుగా రావాల్సిందే. ఇక రాష్ట్ర ప్రజలు రాయచూరుకు వెళ్లాలన్నా చుట్టూ తిరిగి గద్వాల మీదుగా వెళ్లాల్సిందే. దీంతో ప్రయాసాలతోపాటు వెలకట్టలేని సమయం వృథా చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులను కలిపేలా పెద్దవాగుపై కాజ్వే నిర్మాణం భారీ వాహనాల రాకపోకలతో శిథిలావస్థకు చేరిన వైనం ఇటీవల వాహనాలను అనుమతించకుండా పోలీసులు పహారా కలెక్టర్ పరిశీలన.. అయినా సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు -
ఏమైపోయారో..
అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ గుర్తింపు కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు అరవింద్కుమార్ తెలిపారు. గురువారం ఉదయం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. మట్టి తరలింపులో ఇబ్బందులు.. సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలి.. సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు పడిగాపులు.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలీకాప్టర్లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు తాజాగా రంగంలోకి కేరళ క్యాడావర్ డాగ్స్ ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సొరంగం ప్రాంతానికి చేరుకుంది. వారితో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి.. సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలని కోరారు. గురువారం అమ్రాబాద్ రేంజ్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా సర్వే చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఫారెస్టు అధికారులు వారికి సహకరిస్తున్నారు. సహాయక చర్యలను కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్ హోం అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్ టన్నెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ప్రస్తుతం టీబీఎంను కొద్దికొద్దిగా కట్ చేస్తూ కార్మికులను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కన్వేయర్ బెల్ట్ మళ్లీ ప్రారంభం కావడంతో మట్టిని బయటికి తరలించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు. -
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
గద్వాలటౌన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాల్లో 4,235 మంది విద్యార్థులకు గాను 4,080 మంది హాజరయ్యారు. 155 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. 3,415 మంది జనరల్ విద్యార్థులకు గాను 3,304 మంది, 820 మంది ఓకేషనల్ విద్యార్థులకు గాను 776 మంది హాజరైన వారిలో ఉన్నారు. విద్యార్థులు నిర్ణీత గడువుకు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోగా.. అధికారులు తనిఖీ చేసి అనుమతించారు. అయితే పరీక్ష కేంద్రాల్లోని కొన్ని గదుల్లో వెలుతురు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. మరికొన్ని గదుల్లో ఫ్యాన్ల కొరత కనిపించింది. ఎండ తీవ్రత, ఉక్కపోత కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇక్కట్లకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ కెమెరాల నీడలో పరీక్షలు జరిగాయి. కేంద్రాల్లో తాగునీటి సమస్య లేకుండా జాగ్రతలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి హృదయరాజు, ఇతర అధికారుల బృందాలు వేర్వేరుగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను తదితరులు ఉన్నారు. మొదటి రోజు 155 మంది విద్యార్థులు గైర్హాజరు -
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి
● అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాలటౌన్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గద్వాల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో కలిసి ఆయా శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల విధులు, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వాహనాల స్థితి, పన్నుల వసూలు, ఆదాయ వనరులు, వ్యయాలు తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి పూర్తి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పార్కుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం అవసరమైన ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలన్నారు. ఆదాయ మార్గాలపై దృష్టి సారించండి.. మున్సిపల్ ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు దుబార వ్యయాన్ని తగ్గించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆస్తిపన్ను వసూలు లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దుకాణాల అద్దె బకాయిలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఐడీఎస్ఎంటీ కాలనీలో మిగిలిన ప్లాట్లకు, లీజు గడువు ముగిసిన దుకాణాలకు వేలం నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్లాట్ల వేలంతో వచ్చే ఆదాయంతో కాలనీని అన్నివిధాలా అభివృద్ది చేయవచ్చని తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందికి బాధ్యతలు వద్దు.. మున్సిపాలిటీలో కాంట్రాక్టు సిబ్బందికి కీలక విభాగాలను అప్పగించవద్దని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ప్రతి విభాగానికి రెగ్యులర్ అధికారి బాధ్యత వహించేలా విధులు కేటాయించాలని సూచించారు. అనంతరం కలెక్టర్తో కలిసి మున్సిపల్ పారిశుద్ధ్య వాహనాలు, యంత్రాలను పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, కమిషనర్ దశరథ్, ఇంజినీరు గోపాల్ తదితరులు ఉన్నారు. -
బకాయిలపై నజర్
జిల్లాలో రవాణాశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్ ●స్పెషల్ డ్రైవ్ చేపట్టాం.. ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. సామర్థ్యానికి మించి సరుకులు రవాణా చేస్తున్న గూడ్స్ వాహనాలు, పర్మిట్, ఫిట్నెస్ తదితర అనుమతి పత్రాలు లేని వాహనాలకు రెట్టింపు జరిమానాలు విధిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 850 వాహనాలు సీజ్ చేశాం. అందులో ట్యాక్స్ చెల్లించని, ఫిట్నెస్ లేని వాటిని గుర్తించాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరలోనే సాధిస్తాం. – వెంకటేశ్వర్లు, డీటీఓ గద్వాల క్రైం: వాహనాలకు సంబంధించిన పన్నుల వసూలుపై జిల్లా రవాణాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సంబంధిత అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కొన్ని రోజులుగా ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. సకాలంలో ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేస్తూ.. రెట్టింపు జరిమానా విధిస్తున్నారు. అన్ని రకాల అనుమతి పత్రాలు ఉంటేనే వాహనం రోడ్డెక్కాలని సూచిస్తున్నారు. మరోవైపు ట్యాక్స్ చెల్లించకుండా బకాయి పడిన వాహనదారులకు ఫోన్ ద్వారా లేదా మెసేజ్లతో అప్రమత్తం చేస్తు న్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 50.61 కోట్ల ట్యాక్స్ వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటి వరకు రూ. 39.38 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు గాను రవాణాశాఖ అధికారులు ట్యాక్స్ చెల్లించని వాహనదారుల భరతం పడుతున్నారు. బకాయిలే లక్ష్యంగా.. రవాణాశాఖకు ట్యాక్స్లు చెల్లించని వాటిలో ట్రాక్టర్లు, మ్యాక్సీ క్యాబ్లు, గూడ్స్ వాహనాలు, ప్రైవేటు స్కూల్ బస్సులు, లారీలు తదితర వాహనాలు ఉన్నాయి. ఏడాదిలో నాలుగుసార్లు ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మానవపాడు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద రవాణాశాఖ సిబ్బంది నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ట్యాక్స్లు చెల్లించని వాహనాలను సీజ్ చేసి.. ట్యాక్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు నూతన వాహనాలకు జీవిత పన్ను (లైఫ్ ట్యాక్స్) రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ప్రధాన రహదారులపై విస్తృతంగా తనిఖీలు అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలపై కొరడా రూ. 50.61కోట్లకు గాను రూ. 39.38కోట్ల పన్ను వసూలు -
మెసేజ్లతో హెచ్చరికలు..
సకాలంలో ట్యాక్స్ చెల్లించని వాహనదారులకు రవాణాశాఖ మెసేజ్ల ద్వారా సందేశాలు పంపిస్తోంది. సకాలంలో ట్యాక్స్ చెల్లిస్తే సరే.. లేదంటే రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తోంది. జిల్లాలో ప్రయాణికులను తరలించే వాహనాలతో పాటు కమర్షియల్ ట్రాక్టర్లు, పాత లారీలు, ప్రైవేటు బస్సులు, గూడ్స్ వాహనాలు చాలా వరకు ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలు తిప్పడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ఈ నేపథ్యంలో వివిధ ట్యాక్స్లు రవాణా శాఖకు చెల్లించకుండా పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిల వసూలు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అయితే కొన్ని వాహనాలను గ్రామాల్లో మాత్రమే తిప్పుకొని ఇళ్ల వద్ద ఉంచుతున్నారు. అలాంటి వాహనాల విషయంలో నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నారు. వాహన సామర్థ్యం (ఎఫ్సీ), అనుమతి (పర్మిట్), క్వార్టర్ పన్నులు చెల్లించని వివరాలతో ఇప్పటికే బకాయిల జాబితాను రూపొందించుకున్నారు. బకాయిల వసూలుకు అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. -
సమగ్ర వివరాలు సమర్పించండి
గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ను త్వరలో రూపొందించనున్న నేపథ్యంలో సమగ్ర వివరాలు సమర్పించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్శాఖ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా డ్రోన్ సర్వే ద్వారా సమగ్ర సమాచారం సేకరించినట్లు తెలిపారు. నివాస ప్రాంతాలు, పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధి జరగబోయే ప్రాంతాలను గుర్తించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ ప్లానింగ్, ఆరోగ్య, నీటివనరుల నిర్వహణ, పరిశ్రమల స్థాపన తదితర అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. ఆమోదిత మాస్టర్ ప్లాన్ ప్రచురించి.. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనల అనంతరం తుది ప్రణాళికలను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు మాస్టర్ ప్లాన్కు సంబంధించి వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు అందించాల్సిన సమాచారం, ఆయా శాఖల బాధ్యతలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
12 రోజులైనా జాడే లేదు
ఇంకా లభించని ఎస్ఎల్బీసీ కార్మికుల ఆచూకీ అచ్చంపేట/అమ్రాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. రోజు మాదిరిగానే బుధవారం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి. కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఇందుకు సంబంధించిన నివేదిక అందించాల్సి ఉంది. కాగా, కార్మికుల వెలికితీతకు చేపట్టాల్సిన చర్యలపై రెస్క్యూ బృందాల ప్రతినిధులతో విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నమూనా టీబీఎంను పరిశీలించారు. టన్నెల్ వద్ద కనిపించని అధికారుల హడావుడి మళ్లీ పని చేయని కన్వేయర్ బెల్టు లోకో ట్రైన్ ద్వారానే మట్టి, ఇతర వ్యర్థాల తరలింపు సహాయక బృందాల మధ్య కొరవడిన సమన్వయం -
తిండికీ తిప్పలే..
నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత కారం, తొక్కులే నిత్య భోజనం.. నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ● నిత్యం కారం, తొక్కులే ఆహారం ● చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనీమియా సమస్య ● గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు ‘నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న రాంపూర్పెంటకు చెందిన గర్భిణి బయమ్మ(25)ను ఇటీవల డెలివరీ కోసం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి ఆమెకు హిమోగ్లోబిన్ 4 శాతమే ఉన్నట్టు గుర్తించారు. రక్తం ఎక్కించడంతో పాటు అత్యవసర చికిత్స అందించి డెలివరీ చేశారు. అయితే 8 రోజుల అనంతరం పుట్టిన శిశువు చనిపోయాడు.’ ఇలా నల్లమలలో రక్తహీనత సమస్యతో అధికశాతం చెంచు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనీమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. బర్త్ వెయిటింగ్ సెంటర్లతో ప్రయోజనం.. చెంచుపెంటల్లోని మహిళలకు రేషన్బియ్యం, పప్పులు, గుడ్లు తదితర ఆహారం అందించేందుకు అప్పాపూర్లోని ఏకై క అంగన్వాడీ కేంద్రమే ప్రధాన దిక్కుగా మారింది. ఇక్కడి నుంచి 20, 30 కి.మీ. దూరంలో ఉన్న చెంచుపెంటలకు సరుకుల రవాణా జరగడం లేదు. అంగన్వాడీల ద్వారా ప్రతి చెంచుపెంటల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఇంటింటా కూరగాయల మొక్కలతో కిచెన్గార్డెన్ను ప్రోత్సహించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రక్తహీనత సమస్యతో గర్భిణులు, శిశు మరణాలను తగ్గించేందుకు బర్త్ వెయిటింగ్ సెంటర్లను నెలకొల్పి, అవసరమైన వారిని ముందస్తుగా అక్కడి తరలించి పౌష్టికాహారం, చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చెంచుల జనాభా 8,784 చెంచు కుటుంబాలు 2,595 నల్లమలలో చెంచుల ఆవాసాలు: 88 సీ్త్రలు: 4,443 పురుషులు: 4,341 -
ఆచూకీ లభించేనా.?
● ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం ● ఎట్టకేలకు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ ● ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు అందుబాటులోకి కన్వేయర్ బెల్టు.. సొరంగంలో టీబీఎం మెషీన్తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు. ● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం రాక.. సొరంగంలో సహాయక బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఉన్నతాధికారుల సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ పరిక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు. -
నిఘా నీడలో పరీక్షలు
మాస్ కాపీయింగ్కు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు గద్వాలటౌన్: ఇన్నాళ్లు తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన ఇంటర్ విద్యార్థులు ఇప్పుడు పరీక్షలు సజావుగా రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. ఉత్తమ ఫలితాలు రాబట్టాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే ఆయా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇదిలాఉండగా, నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు నర్సింగరావు, లక్ష్మినారాయణ సంబంధిత శాఖల అధికారులతో ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగనున్నాయి. మాల్ ప్రాక్టీస్, చూచిరాతలు, ఒకరికి మరొకరు పరీక్ష రాయడం, ఇన్విజిలేటర్లు విధుల దుర్వినియోగం తదితర వాటికి తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేశారు. 14 కేంద్రాలు.. 8,341 మంది విద్యార్థులు జిల్లాలో అన్ని వసతులు కలిగిన 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8 ప్రభుత్వ కళాశాలలు, మిగిలినవి ప్రైవేటువి. మొదటి సంవత్సరంలో 4,057 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,260 మంది విద్యార్థులు జనరల్ పరీక్షలు, 797 మంది ఒకేషనల్ పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో 4,284 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో జనరల్ పరీక్షలు 3,396 మంది, ఒకేషనల్ పరీక్షలకు 715 మంది, 173 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారు. మొత్తం 8,341 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. గద్వాలలో ఆరు, అయిజలో మూడు పరీక్షా కేంద్రాలతో పాటు అలంపూర్, మానవపాడు, ధరూరు, మల్దకల్, గట్టు ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ‘పతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్తో పాటు డిపార్ట్మెంట్ అధికారిని ఏర్పాటు చేశారు. గద్వాలకు, అయిజలకు కస్టోడియన్ను నియమించారు. 20 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. వసతుల కల్పన.. విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతులు కల్పించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఎండ తాకిడి తట్టుకోవడానికి వీలుగా పరీక్ష కేంద్రాల ఆవరణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రతి పరీక్ష కేంద్రంలో ముగ్గురు చొప్పున ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి సైతం కింద కూర్చోకుండా బెంచీలను ఏర్పాటు చేశారు. పక్కా భవనాలు కలిగిన చోటనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాగునీరు ప్రతి కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 14 కేంద్రాలు.. హాజరుకానున్న 8,341 మంది విద్యార్థులు నేటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్దేశించిన సమయానికి చేరుకోవాలి విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాలలో పనిచేసే సిబ్బంది, అధికారులు, ఇన్విజిలేటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డును తమ వద్ద ఉంచుకోవాలి. సెల్ఫోన్లను ఎవరూ పరీక్ష సమయంలో ఉపయోగించొద్దు. – హృదయరాజు, డీఐఈఓ, గద్వాల -
అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
కొత్తకోట: ఈ నెల 14న పౌర్ణమిని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచలం దైవ క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు వనపర్తి బస్స్టేషన్ నుంచి బస్సు బయలుదేరుతుందని వివరించారు. ఈ యాత్ర మూడు రోజుల పాటు కొనసాగుతుందని, 13వ తేదీన కాణిపాకం, అదేరోజు సాయంత్రం వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. 14వ తేదీన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, దర్శనానంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అడ్వాన్సుగా సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే సెల్నంబర్ 94906 96971 సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సరైన వసతులు కల్పించాలి
ఎర్రవల్లి: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ–2025 నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో నీట్ పరీక్ష జరిగే సరస్వతి పాఠశాల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్బంగా గదుల వసతులు, సీటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, వెంటిలేషన్, తదితర అంశాలను పరిశీలించి పాఠశాల యాజమాన్యానికి అవసరమైన సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు తగినంత సీటింగ్ సామర్థ్యం ఉండేలా చూడాలని, సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత, టాయిలెట్ వంటి వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్గని, కోఆర్డినేటర్ వెంకటేష్, ప్రిన్సిపల్ నందిని పాల్గొన్నారు. -
చారిత్రక కట్టడాలను పునరుద్ధరించాలి
గద్వాలటౌన్: సంస్థానాదీశుల కాలం నాటి కోట, లింగంబావిని పునరుద్ధరించి, సుందరీకరణ పనులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి చారిత్రక నిర్మాణాలు, కట్టడాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి, భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గద్వాల కోటను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మరమ్మతులు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. కోట, లింగంబావిల పునరుద్ధరణ కోసం డీపీఆర్ తయారుచేయాలని ఆర్కిటెక్ట్ అధికారులను ఆదేశించారు. కట్టడాన్ని స్థిరంగా నిలిపేందుకు సరైన నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. లింగంబావి పరిసర ప్రాంతాలు ఆకర్షణగా ఉండేందుకు ల్యాండ్స్కేపింగ్ పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్ దశరథ్, అర్కిటెక్ట్ అధికారిణి శ్రీలేఖ పాల్గొన్నారు. నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్– 2025 నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో ఉన్న గద్వాల ఎస్ఆర్ విద్యానికేతన్ స్కూల్లలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి కలెక్టర్ సంతోష్ క్షేత్రస్థాయి పరిశీలించారు. ఆయా పరీక్ష కేంద్రాలలో ఉన్న వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. నీట్–2025 నిర్వహణకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు క ల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ఘనీ, కోఆర్డినేటర్ వెంకటేష్, ప్రిన్సిపాల్స్ రాముడు, నందిని తదితరులు పాల్గొన్నారు. గద్వాల కోట, లింగంబావిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు
కొత్తకోట రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదగడం చాలా ముఖ్యమని.. నాబార్డ్ అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ మహబూబ్నగర్ క్లస్టర్ డీడీఎం మనోహర్రెడ్డి సూచించారు. మంగళవారం పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక బలోపేతంతో గ్రామాలు గొప్పగా ఎదుగుతాయన్నారు. అనంతరం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని.. అన్నిరంగాల్లో రాణించే శక్తి వారి సొంతమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో విత్తనం పొలంలో నాటిన దగ్గర్నుంచి పంట ఉత్పత్తులు మార్కెట్లో విక్రయించే వరకు మహిళల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయంలో రోజురోజుకు మహిళల ప్రాధాన్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అనంతరం ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ స్వయం సహాయక బృందాల మహిళలను విద్యార్థులు, ప్రొఫెసర్లు సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా అడిషనల్ డీఆర్డీఓ భాస్కర్, వనపర్తి లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, కళాశాల ఉమెన్ సెల్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ డా. ఆర్.పూర్ణిమా మిశ్రా, డా. విద్య, డా. గౌతమి, నవ్య, శ్వేత, ఏఈఓ రమేష్కుమార్, విద్యార్థినులు, స్వయం సహాయక బృందాల మహిళలు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
గద్వాల క్రైం: వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. మంగళవారం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వేసవి నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరగనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిందని, అందులో భాగంగా వైద్యులు, సిబ్బంది రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే, అవసరమయ్యే మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర వాటిని నిల్వ ఉంచుకోవాలన్నారు. ఎవరైన రోగులు, వారికి అందించే వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. వడదెబ్బకు గురైన వారి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరించాలన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో అనారోగ్య భారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది తప్పనిసరిగా అవగాహన కల్పించాలని, తరచూ నీరు తాగాలని, చిన్నారులు, వృదు్ధులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట తిరగకపోవడమే మంచిదని అన్నారు. సమావేశంలో వైద్యులు సంధ్యా కిరణ్మై తదితరులు ఉన్నారు. -
సమగ్రాభివృద్ధికి బాటలు
గద్వాల నియోజకవర్గంలో రూ.130 కోట్లతో అభివృద్ధి పనులు రూ.30 కోట్లతో విద్యుత్ సమస్యలకు చెక్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో రూ.30.25 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లు, నూతన విద్యుత్ లైన్ల నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. కెటి.దొడ్డి మండలంలోని మల్లాపురంలో రూ.83 లక్షలు, ఇర్కిచేడులో రూ.1.2 కోట్లు, వెంకటాపురంలో రూ.95 లక్షలు, నర్సన్దొడ్డిలో రూ.85 లక్షలు, పాతపాలెంలో రూ.85 లక్షలు, గద్వాల మండలంలోని జమ్మిచేడులో రూ.65లక్షలు, ధరూరు మండలంలోని మార్లబీడులో రూ.95లక్షలు, గద్వాల టౌన్లో రూ.4 కోట్లు, అదేవిధంగా డీటీఆర్ కింద గద్వాల నియోజకవర్గంలో(400) రూ.4కోట్లు, ధరూరు మండలంలో గుడ్డెందొడ్డి, పెద్దపాడు, గద్వాల మండలంలోని తుర్కోనిపల్లి, మల్దకల్ మండలంలో ఉలిగపల్లె, కుర్తిరావులచెర్వు, గట్టు మండలంలో తుమ్మలచెర్వు, సోంపురం, రాయపురం గ్రామాల్లో ఒక్కో గ్రామంలో రూ.3కోట్లు చొప్పున నూతనంగా 33/11కేవీ సబ్ స్టేషన్లు నిర్మాణాల కోసం నిధులు మంజూరీ అయ్యాయి. అదేవిధంగా గట్టులో 33/11కేవీ లైన్ నిర్మాణం కోసం రూ.95లక్షలు, గద్వాల నియోజకవర్గ పరిధిలో 11కేవీ ఫీడర్ నిర్మాణాల కోసం రూ.1.50కోట్లు, స్థంబాల ఏర్పాటు కోసం రూ.2కోట్లు నిధులు మంజూరీ అయ్యాయి. ● ఐదు మండలాల్లో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు ● సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, టాయిలెట్లు ● పురోగతిలో పనులు..పర్యవేక్షిస్తున్న కలెక్టర్ గద్వాల: గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయి. ఇందులో ప్రధానంగా సీసీ రహదారుల, బీటీ రహదారులు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలో టాయిలెట్స్ వంటి మౌళిక సదుపాయాలకు సంబంధించి సుమారు రూ.100 కోట్లకు పైనే నిధులు విడుదల కాగా, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో నూతన విద్యుత్ సబ్స్టేషన్లతో పాటు, విద్యుత్తు లైన్లు వంటి పనులకు రూ.30 కోట్లు మంజూరీ అయి కొన్ని చోట్ల పనులు సైతం పూర్తయ్యాయి. ఈ పనులన్నీంటిని కలెక్టర్ బీఎం సంతోష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పురోగతి సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీకి రూ.59.18 కోట్లు జాతీయ ఉపాధి హామి పథకం కింద నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం రూ.59.18కోట్లు నిధులు మంజూరయ్యాయి. కాగా ఈనిధులను సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణాల కోసం వెచ్చిస్తున్నారు. ఇక కన్స్ట్రక్షన్ రూరల్ రోడ్ల పథకం కింద నియోజకవర్గ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.10కోట్లు నిధులు మంజూరీ అయ్యాయి. వీటిని ఐదు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారుల పనులు చేపట్టారు. అలాగే, మెయింటనెన్స్ రూరల్ రోడ్లు పథ కం కింద నియోజకవర్గానికి రూ.15.33 కోట్లు మంజూరు కాగా.. వీటి కింద నియోజకవర్గంలోని మండలాలకు వెళ్లు ప్రధాన బీటీ రహదారుల మెయింటనెన్స్ పనులు చేపట్టనున్నారు. రూ.100 కోట్లతో రహదారులు.. పంచాయతీ భవనాలు గద్వాల నియోజకవర్గంలోని గద్వాల మున్సిపాలిటీ, గద్వాల, ధరూరు, గట్టు, కెటి.దొడ్డి, మల్దకల్ మండలాల పరిధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, నూతన పంచాయతీ భవనాలు, నూతన అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.100కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ పనుల్లో చాలా వరకు మొదలు కాగా, కొన్ని పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఐదు మండలాల్లో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు, నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు కోసం రూ.30కోట్లు నిధులు మంజూరీ అయి కొన్ని పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా, స్పెషల్ డెవ్లప్మెంట్ ఫండ్ కింద నియోజకవర్గంలో రూ.10 నిధులు మంజూరయ్యాయి. ఈనిధుల ద్వారా ఐడు మండలాల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలలో మౌళిక వసతులైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, తాగునీటి వసతి వంట పనులు చేపడుతున్నారు. అభివృద్ధి కృషి గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా. ఎక్కడెక్కడా ఏఏ పనులు అవసరమో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదికలు పంపి అవసరమైన నిధులు తీసుకొచ్చేలా కృషిచేస్తున్నా. 2024–25ఏడాదిలో వివిధ రకాల అభివృద్ధి పనులు, విద్యుత్తు లైన్ల నిర్మాణాల కోసం రూ.134కోట్లు మంజూరయ్యాయి. ఈపనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల త్వరగా పూర్తయ్యేలా.. ఎస్డీఎఫ్, ఈజీఎస్, ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ కింద విడుదలైన నిధులతో చేపట్టిన పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నాను. పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాను. – బీఎం సంతోష్, కలెక్టర్ ● -
కొనసాగుతున్న అన్వేషణ
బురద, ఊట నీరే ప్రధాన సమస్య ● నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట ● సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు ● పదోరోజు కొనసాగినసహాయక చర్యలు ● రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం అచ్చంపేట/ మన్ననూర్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు సోమవారం పదో రోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నాయి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తున్నాయి. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది. సహాయక చర్యలు వేగవంతం సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్టు పనులు వేగవంతం చేసినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సోమవారం ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వద్ద రెస్క్యూ బృందాల ఆపరేషన్లో పాల్గొన్న సహాయక బృందాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిని తొలగించేందుకు డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. 12 సంస్థలకు సంబంధించిన బృందాలు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారని, సమస్యలు ఎదురువుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకుపోతున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకాధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి జాడ గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇరువైపుల నుంచి నీరు రాకుండా సొరంగంలో ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టామని, దీని కోసం ప్రత్యేక యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి, మైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. -
చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు
గద్వాల: జిల్లాలో సాగుచేసిన చివరి ఆయకట్టు ఎండిపోకుండా సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన అనంతరం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. రాబోయే పదిరోజుల్లో అధికారులు క్షేత్రసాయిలో పర్యటించి రైతులతో మాట్లాడాలన్నారు. ఎక్కడెక్కడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయో తెలుసుకుని అందుకనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా క్రమం తప్పకుండా గురుకులాలు, రెసిడిన్షియల్ పాఠశాలలను తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ట్రాన్స్కో సీఈ భాస్కర్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రహీముద్దీన్, డీఏవో సక్రియనాయక్, అక్బర్బాష తదితరులు పాల్గొన్నారు. -
రూ.5 లక్షలతో నాణ్యమైన ఇల్లు నిర్మించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద ఐదు లక్షల రూపాయల్లో నాణ్యమైన ఇంటిని నిర్మించాలని హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ అన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాక్ శిక్షణ కేంద్రంలో మేసీ్త్రలకు నిర్మాణ రంగంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)సెంటర్లో హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీతో రూ.5 లక్షల బడ్జెట్లో ఇళ్లను నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాక్ ఏడీ శివశంకర్, గృహ నిర్మాణ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
స్టేషన్ మహబూబ్నగర్: అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు ఈ నెల 12న రాత్రి 7 గంటలకు మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ కాణిపాకం విఘ్నేశ్వరుడు, 13న సాయంత్రం 6 గంటలకు అరుణాచలంకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి బయలుదేరుతుందని పేర్కొన్నారు. tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9959226286 సంప్రదించాలని సూచించారు. -
నల్లమల వన్యప్రాణులకు స్వర్గధామం
మన్ననూర్: రాష్ట్ర అటవీ శాఖ అమ్రాబాద్ టైగర్ రిజర్వును ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడం వల్ల నల్లమల ప్రాంతం వన్యప్రాణులకు స్వర్గధామంగా మారిందని డీఎఫ్ఓ రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం మన్ననూర్లోని ఈసీ సెంటర్ వద్ద వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ, వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములుగా ఉన్న ఆయా గ్రామాలు, పెంటలు, గూడేలలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి కొత్తగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నల్లమల, కృష్ణానది పరివాహక ప్రాంతాలతోపాటు శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో సైతం ప్లాస్టిక్ను నిషేధించడం శుభపరిణామం అన్నారు. అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధికి గాను రిసార్టులు, కాగితం పరిశ్రమ, జనపనార ఉత్పత్తులు వంటివి ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు తెలిపేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం పురోగతి సాధించేదిగా కూడా ఉందన్నారు. ఈ సమాచారాన్ని తెలియజేసే అంశాలను ప్రజల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు డిగ్రీ విద్యార్థులు
గద్వాలటౌన్: కళాశాల విద్యాశాఖ ఏటా జిజ్ఞాస పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడం, సృజనాత్మకత ఆలోచనలకు పదును పెట్టించడమే ఈ పోటీల లక్ష్యం. ఈ సంవత్సరం స్థానిక ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికయ్యాయి. గణితం, ఫిజిక్స్, మైక్రోబయాలజీ, ఆంగ్లం సబ్జెక్టుల నుంచి ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ఆయా సబ్జెక్టులకు ఆధ్యాపకులు సత్యన్న, రాధిక, నవిత, మల్లికార్జున్ సూపర్వైజర్లుగా వ్యవహరిస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు బృందంలో 4–6 మంది విద్యార్థులు ఉంటారు. ఈ నెల 4వ తేదీ నుంచి హైదరాబాద్లోని నాంపల్లి ఉమెన్స్ కళాశాలలో జరిగే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో విద్యార్థులు పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శన ఇవ్వనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్బాషా అభినందించారు. -
ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 35 మంది ఫిర్యాదులు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 8 ఫిర్యాదులు అందాయి. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై వివరించారన్నారు. ఇందుల్లో భూ సంబంధ, సైబర్ మోసాలు, వేధింపులపై ఫిర్యాదులు అందాయన్నారు. -
కలిసికట్టుగా గ్రామాభివృద్ధి చేసుకోవాలి
ధరూరు: ప్రతి గ్రామంలో బడి, గుడి అనేవి తప్పకుండా ఉండాలని, ఆలయాలతో ప్రజల్లో భక్తి భావం పెరిగి శాంతి పెంపొందుతుందని, గ్రామస్తులంతా కలిసికట్టుగా గ్రామాభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఖమ్మంపాడులో నూతన ఆలయాల ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామస్తులు ఇటీవల నిర్మించుకున్న శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలను పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పాడి పంటలు సమృద్దిగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, డీఆర్ విజయ్కుమార్, రఘువర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు అభ్యున్నతికి కృషి
అయిజ: వ్యవసాయ సహకార సంఘాలు రైతు అభ్యున్నతికి కృషిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ పురుషోత్తంరావు అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించారు. ఈసందర్భంగా పురుషోత్తంరావు మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి కృషితో మహబూబ్నగర్ డీసీసీబీ నష్టాల నుంచి గట్టెక్కి లాభాల బాట పట్టిందన్నారు. మరికొన్ని నూతన డీసీసీబీ బ్యాంక్లు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైందని అన్నారు. అయిజలో 2026 సంవత్సరంలో డీసీసీబీ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని, అయిజ పీఏసీఎస్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇచ్చేందుకు రూ. 50 లక్షలు నిధులు కేటాయించామని, అదేవిధంగా చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు క్యాష్ క్రెడిట్ నిధులు రూ.50 లక్షలు విడుదల చేసినట్లు పీఏసీఎస్ ప్రసిడెంట్ మధుసూదన్ రెడ్డికి తెలిపారు. ఏప్రిల్ మెదటి వారంలో ఈ రెండు స్కీంలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, గద్వాల బ్రాంచ్ మేనేజర్ ఆంజనేయులు, సొసైటీ కార్యదర్శి మల్లేష్, శ్రీనివస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఉపకులాలకు అన్యాయం చేయొద్దు గద్వాల: ఎస్సీలో ఉన్న ఉప కులాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఎస్సీ 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హోలియా దాసరి రామచంద్రుడు అన్నారు. ఈమేరకు ఆయన సోమవారం కలెక్టర్ బీఎం సంతోష్కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా 2024లో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను సైతం తప్పుదారి పట్టిస్తూ కొందరు రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలిచ్చి కుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉపకులాలకు తీరని అన్యాయం చేస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. తప్పుడు నివేదికలిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని ఎంతో వెనకబడిన ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో దివాకర్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,609 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు సోమవారం 965 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6609, కనిష్టం రూ.3699, సరాసరి రూ.5389 ధరలు పలికాయి. అలాగే, 126 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.7019, కనిష్టం రూ.1926, సరాసరి రూ.7009 ధరలు వచ్చాయి. 44 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5819, కనిష్టం రూ. 3519, సరాసరి రూ. 5819 ధరలు లభించాయి. -
పాలమూరు రుణం తీర్చుకుంటా
వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభిృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. పాలమూరు వాసులు అమాయకులేం కాదు.. దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు. ● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు.కార్పొరేషన్ల వ్యవస్థ మళ్లీ బలోపేతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు. ● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. కేసీఆర్ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి నాలుగు దశాబ్దాలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు కక్షపూరిత డబ్బుతో కూడిన రాజకీయాలను ఏనాడు చేయలేదని.. ఐదేళ్ల క్రితం వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన వ్యక్తి వల్ల నియోజకవర్గ రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం అన్నారు. గతంలో వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వారి పేర్లను ప్రభుత్వ ఆస్పత్రులు, తాగునీటి ఎత్తిపోతల పథకాలకు పెడతామని... వేదికపైనే ఈ విషయం గురించి సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కె.దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్వర్రెడ్డి, శంకర్, వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
పరిస్థితి సంక్లిష్టం..
నీటి ఊటతో పెరుగుతున్న బురద.. టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం గంటల తరబడి మట్టి, రాళ్ల శిథిలాలను తొలగించింది. అయితే నీటి ఊటతో బురద పెరుగుతుందని చెబుతున్నారు. టన్నెల్లో నలుగురి అవశేషాలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లను తొలగించారు. మరో మూడు మీటర్లు తొలగిస్తే కాని ఏ విషయం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి కార్మికులు షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కో షిఫ్ట్కు 40 నుంచి 80 మంది వరకు సొరంగంలోకి ప్రవేశించి.. అక్కడ మట్టి, నీరును వేరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో అవశేషాల గుర్తింపుపై వీడని సందిగ్ధం అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యతపై స్పష్టత కరువైంది. వారి కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాల్లో పొంతన లేకుండా పోయింది. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా.. సహాయక చర్యలను వేగిరం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు పాల్గొంటున్నప్పటికీ.. ప్రధానంగా సింగరేణి కార్మికులే అధికంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా.. కార్మికుల ఆచూకీ లభ్యతపై సందిగ్ధం వీడటం లేదు. మరోవైపు జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలు కనుగొన్నామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో దాదాపు గంటన్నర పాటు సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యతపై స్పష్టతనివ్వలేదు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వయంగా సీఎం ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్మికుల ఆచూకీ కోసం తప్పని ఎదురుచూపులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు భారీగా ఉబికి వస్తున్న నీరు, బురదతో ఆటంకాలు కొండల నుంచి నీరు వస్తుండటంతోనే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కొండల నుంచి నీరు రావడమేనని అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫారెస్ట్లో ఉన్న తిర్మలాపూర్ సమీపం నుంచి లేదా మల్లెలతీర్థం నుంచి నీరు వస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జియోలాజికల్ సర్వే అధికారులు అటవీ శాఖ అధికారులతో కలిసి నీటి ధారలు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయనే కోణంలో సర్వే చేపట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదస్థలంలో సముద్ర మట్టానికి 450 మీటర్ల లోతులో కుర్తిపెంట ప్రదేశంలో నీటి పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి పొరలు అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ పరిసర అడవుల్లోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు చెబుతున్నారు. వాగుల ప్రవాహంతోనే నీరు వస్తుందని అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది.