Jogulamba District News
-
రజతోత్సవ సభకు సైన్యంలా కదలాలి
కేటీదొడ్డి: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాసు హనుమంతు నాయుడు అధ్యక్షతన కేటీదొడ్డి మండలం వెంకటాపురంలో రజతోత్సవ సభకు సంబందించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం మాజీ సీఎం కేసీఆర్.. పదవులనే లెక్కచేయలేదని, చావుదాక వెళ్లి రాష్ట్రాన్ని సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ సార్కారు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం పాత సీసాలో కొత్తసారా..లాగానే ఉందన్నారు. రైతుల భూముల పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి ఫొర్టల్ను తిట్టిపోసిన కాంగ్రెస్కు ఇప్పుడు ఆ ధరణి మార్గదర్శకాలే దిక్కయ్యాయని అన్నారు. అంతకుముందు మండలంలోని వెంకటాపురం శ్రీపాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, చక్రదర్రావు, వెంకటేష్ నాయుడు, మోనేష్, శేఖర్ నాయుడు, రామునాయుడు, మాక్బూల్, తిరుమల్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే చట్టం
ఎర్రవల్లి: భవిష్యత్లో ప్రతి భూమికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కల్పించేలా సర్వే ద్వారా కొలతలు, హద్దులు వంటి సమగ్ర వివరాలతో భూధార్ను ప్రవేశ పెట్టనున్నట్లు, భూభారతి చట్టం ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసుకునే అవకాశం కల్పించబడుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కును కల్పించడంతో పాటు భూ సంబంధిత వివాదాలను పూర్తిగా నివారించేలా ప్రభుత్వం అనేక కీలక అంశాలను సమన్వయపరిచి నూతన భూభారతి ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. ఈచట్టంలో మొత్తం 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉండటం ద్వారా భూ పరిపాలన మరింత స్పష్టతతో, శాసీ్త్రయంగా అమలవుతుందని వెల్లడించారు. భూమి రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూ సర్వే నిర్వహించి మ్యాప్ సిద్దం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాదా బైనామాల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్దమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని, భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కలగనుందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డిసిసిబి చైర్మెన్ విష్ణువర్దన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నీలి శ్రీనివాసులు, పిఎసిఎస్ చైర్మెన్ రంగారెడ్డి, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ ఖాన్, ఏఓ రవికుమార్, ఏఈఓలు, జీపీ కార్యదర్శులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్
అలంపూర్: రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అలంపూర్ పట్టణంలో బీజేపీ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారంలో పురోగతి లేదన్నారు. రూ.50 కోట్లు ఖర్చు చేసి చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే 24 గ్రామాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉందన్నారు. తుమిళ్లకు అనుసంధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం, వేముల వద్ద జూరాల లింకును కలిపితే ఆర్డీఎస్ డీ–40 వరకు సాగునీటిని అందించవచ్చన్నారు. అధికారుంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదన్నారు. గద్వాలలోని ర్యాలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికి నిధులు కేటాయించి నిర్వహణ చేపట్టకపోవడంతో 2 టీఎంసీల నీళ్లు అందడం లేదన్నారు. నెట్టెంపాడు కింద ఉన్న 104, 107, 99 ప్యాకేజీలు పూర్తి చేయకపోవంతో కృష్ణా, తుంగభద్ర వంటి జీవనదులు ఉన్నప్పటికి రైతులు సాగు నీటికి కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిలో సిబ్బంది లేక వైద్య సేవలు అందడం లేదన్నారు. గద్వాలలో మెడికల్ కళాశాలలో సరైన సౌకర్యాలు, సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్, ఈశ్వర్, శరత్ బాబు, సంజీవ రెడ్డి, జగదీశ్, నాగేశ్వరరెడ్డి, నాగమ్లయ్య, రంగస్వామి, నరేష్, మద్దిలేటి, రాజశేఖర్, దాన రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్, రవికుమార్ తదితరులు ఉన్నారు. -
మంత్రి పర్యటన సైడ్లైట్స్
● ఉదయం 10.45 గంటలకు ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ధరూరుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.15 గంటలకు చేరుకోవాల్సి ఉండగా గంటన్నర ఆలస్యమైంది. ● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయుల మధ్య వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. సరిత వర్గీయులు మంత్రి గో బ్యాక్.. పొంగులేటి గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ● ప్రోటోకాల్ ప్రకారం కొందరినే సభపైకి పిలవడంతో.. మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరితను సైతం స్టేజీ పైకి పిలవకపోవడంతో ఆమె వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ● ఎంపీ మల్లు రవిని స్టేజీపైకి వెళ్లకుండా సరిత వర్గీయులు అడ్డుకోవడంతో ఆయన స్టేజీ కిందనే కూర్చున్నారు. కాసేపటి తర్వాత వెళ్లారు. ● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రసంగిస్తుండగా సరిత వర్గీయులు.. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేవి కాంగ్రెస్ కండువా వేసుకుని మాట్లాడాలని అడ్డుతగిలారు. ● 11.24 గంటలకు మంత్రి పొంగులేటి ప్రసంగం ప్రారంభం. ● 11.50 గంటలకు ప్రసంగాన్ని ముగించి కాన్వాయ్ వద్దకు మంత్రి చేరుకుంటుండగా మరోసారి తోపులాట జరిగింది. కారులో కూర్చున్న మంత్రితో సరిత రెండు నిమిషాలు మాట్లాడారు. ● గంట పాటు జరిగిన మంత్రి పర్యటన ఆసాంతం అరుపులు, కేకలు, వాగ్వాదాలతోనే ముగిసింది. -
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
గద్వాల క్రైం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని.. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా జడ్జి కె.కుషా అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 44 మంది విద్యార్థులకు జడ్జి సైకిళ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుతున్న విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలలకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కరించేందుకుగాను సైకిళ్లు అందజేశామన్నారు. వసతులను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని అన్నారు. న్యాయమూర్తులు గంట కవితాదేవి, టీ లక్ష్మీ, ఎన్వీహెచ్ పూజిత, మిథున్తేజ్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు గద్వాలటౌన్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 20 నంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షల కోసం రెండు పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, టెన్త్ పరీక్షలకు 501 మంది విద్యార్థులు, ఇంటర్ పరీక్షలకు 721 మంది హజరవుతున్నారని చెప్పారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంటర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొన సాగుతాయన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు స కాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభివృద్ధిపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం అలంపూర్: ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధిపై ఉన్నతస్థాయి కమిటీ శనివారం సమావేశమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి వల్లీ నాయగం, అడ్వైజర్ గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, శృంగేరి పీఠాధిపతి శిష్య బృందం శనివారం అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో దేవస్థానం చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్తో వారు సమావేశమై భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి గర్బాలయాలను పరిశీలించారు. ఆలయాల్లో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు, సేవలను తెలుసుకున్నారు. ఆలయ ధర్మకర్తలు జగదీశ్వర్గౌడ్, అర్చకులు ఉన్నారు. 23 నుంచి బాలభవన్లో వేసవి శిక్షణ తరగతులు గద్వాలటౌన్: వివిధ కళల పట్ల చిన్నారులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని మరింత ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని బాలభవన్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 23 నుంచి జూన్ 2 తేదీ వరకు వేసవి శిక్షణ తరగతులు కొనసాగుతాయని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ శిబిరం ఉంటుందని చెప్పారు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, వాయిద్యం, కుట్లు, అల్లికలు అంశాలలో శిక్షణ ఇస్తామన్నారు. 05–16 ఏళ్లలోపు వయస్సు గల చిన్నారులు ఉచిత శిక్షణ తరగతులకు అర్హులని, ఆసక్తి గల చిన్నారులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోస్టు సైజ్ ఫొటోతో బాలభవన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేసవి శిబిరాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇతర వివరాలకు సెల నంబర్ : 96668 53335, 94409 81190 సంప్రదించాలని కోరారు. రామన్పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 270 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 34 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
ప్రతి రైతుకు భద్రత
జోగుళాంబ గద్వాలభూ భారతితో ప్రాణాలు తీసిన అతివేగం ఎన్హెచ్–44పై వేముల స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు.ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు IIలో uగద్వాల/ధరూరు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి– 2025 చట్టం రైతులకు పూర్తి భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం భూభారతి చట్టం గురించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ధరూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ధరణి వలన రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. ఆ ఇబ్బందులను విముక్తి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం–2025ను తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, ఈచట్టం గురించి ప్రజలకు, రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. 26వేల సాదాబైనామా దరఖాస్తులు, పరిష్కరించనున్నట్లు వివరించారు. అలాగే, ఆధార్ తరహాలో భూధార్ నంబర్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు వినియోగించుకోవాలి ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు భూభారతి చట్టాన్ని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేసినట్లు వాటిని అర్హులైన పేదలకు అందిస్తామన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ గతంలో భూసమస్యలకు అడ్డంకులు ఉండేవని తాజా చట్టం ద్వారా నేరుగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం లభిస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 45678 ద్వారా ఆర్ఓఆర్ దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. వారసత్వం సక్షెన్ సెక్షన్8లో కోర్టు, లోక్ అదాలత్ సమస్యల నుంచి ఈచట్టం ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. ప్రతిగ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూసమస్యలు పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో టీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నీలిశ్రీనివాసులు, మార్కెట్యార్డు చైర్మన్ హనుమంతు, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ ఆధార్లాగే త్వరలోనే భూధార్ నంబర్ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
నిషేధిత కల్లు విక్రయాలను ఉపేక్షించేది లేదు
గద్వాల క్రైం: లైసెన్స్ లేకుండా కల్లు, నిషేధిత పదార్ధాలతో తయారు చేసిన కల్లు విక్రయాలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శుక్రవారం కల్లు విక్రేతలతో డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో నిషేధిత కల్లు విక్రయాలపై నార్కోటిక్ డ్రగ్ అధికారులు తనిఖీ చేపట్టిన క్రమంలో కల్తీ కల్లు వెలుగు చూసిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గద్వాల సెగ్మెంట్లలో కల్లు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. లైసెన్స్ పొంది నిషేధిత, అనుమతి లేకుండా కల్లు విక్రయాలు చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కల్లు దుకాణాల వివరాలు, ఈత చెట్ల నుంచి రోజువారీగా ఎన్ని వేల లీటర్లు కల్లు విక్రయాలు చేస్తున్నారు అనే అంశాలపై వారి నుంచి వివరాలు సేకరించామన్నారు. కృతిమ కల్లు పేరిట నిషేధిత కల్లు అమ్మకాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు, ఇందుకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, వారికి సిబ్బంది సహాయ సహకారాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నామని, గీతా కార్మికులు, సొసైటీలు, కల్లు డిపోలు, ఈత వనలు తదితర అంశాలపై మాట్లాడారు. అనుమతి లేని దుకాణాలు ఉన్నట్లు గుర్తిస్తే కట్టడి చేసేందుకు పోలీసు శాఖ సైతం చొరవ తీసుకుంటుందన్నారు. కల్తీ కల్లు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచామని, ఇక నుంచి క్రమం తప్పకుండా కల్లు దుకాణాల విక్రయాలు, నిర్వహణ అంశాలపై నిరంతరం తనిఖీలు ఉంటాయన్నారు. మత్తు పదార్థాల సరఫరా, నిల్వలు ఉన్నట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో సీఐ శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు. -
సర్వ మానవాళికి ఏసుక్రీస్తు రక్ష
గద్వాలటౌన్: జిల్లా వ్యాప్తంగా గుడ్ఫ్రైడేను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సర్వమానవాళికి రక్షణ లభిస్తుందని, పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని పాస్టర్లు సందేశమిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ మిస్పాచర్చి, ఒలీవ చర్చి, కర్మెలు చర్చి, ఎంబీ జియాన్ చర్చి, హోసన్నా మందిరం, హోలీ మినిస్ట్రీస్, ఎల్ఈఎఫ్ తదితర చర్చిలలో గుడ్ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తును ఆరాధించారు. వాక్యోపదేశాలు, బైబుల్ సూక్తులు విన్నారు. క్రీస్తు ప్రవచనాలు ఆచరించాలి మానవాళి శాంతి కోసం ఏసుక్రీస్తు శిలువకు బలయ్యారని, ఆయన ప్రవచనాలు అందరూ ఆచరించాలని పాస్టర్లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంబీ మిస్పా చర్చిలలో జరిగిన గుడ్ఫ్రైడే వేడుకల్లో పాస్టర్ చార్లస్ శాంతిరాజ్ వాక్యోపదేశం చేశారు. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన సమయంలో చెప్పిన ఏడు మాటలను పాస్టర్లు రోస్, ప్రకాశం, శిభాప్రభుదాస్, సాల్మన్ప్రకాష్, అశోక్, వీడీ సోలమాన్, సైమన్ సుధాకర్లు వివరించారు. శాంతికి ప్రతిరూపం ఏసు అని, శత్రువులను సైతం ప్రేమించాలని సూచించారన్నారు. తెలియక చేస్తున్న తప్పును క్షమించాలన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా క్వయిర్ సభ్యులు, మహిళా సమాజం వారు ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆయా చర్చిల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే -
జోగుళాంబ గద్వాల
సమస్యల పరిష్కారానికి డెడ్లైన్శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 10లో uపోలీసుల అదుపులో యువకులు గద్వాల క్రైం: గుట్టుగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా పోలీసులు.. కొందరు యువకులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన యువకులు గంజాయి, మత్తు కలిగించే పదార్థాలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి జిల్లాలో కొందరు వ్యక్తులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్, గద్వాల కేంద్రంగా విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే పట్టుబడిన వారు గద్వాల జిల్లాకు చెందినవారేనని తెలిసింది. గంజాయి సరఫరా, విక్రయాల నివారణకు ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో నడిగడ్డకు చెందిన యువకులు మత్తు పదార్థాల సరఫరా చేయడం హాట్టాపిక్గా మారింది. కూపీలాగుతున్న ప్రత్యేక బృందం జిల్లాలో ఎవరెవరు గంజాయి తదితర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు, వాటికి బానిసలయ్యారు అనే దానిపై అనుమానాస్పద స్థితిలో పట్టుబడిన యువకుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఇందులో అధికంగా యువకులకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని శివారుకాలనీలో కొందరు యువకులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రాత్రి సమయంలో మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండగా.. ఎకై ్సజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడిన యువకులు ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువులు కావడం, ఓ ముఖ్యనేత ఒత్తిళ్లతో పట్టుబడిన యువకులకు కౌన్సెలింగ్ అందించి విషయాన్ని బయటకు రాకుండా చేశారు. ప్రస్తుతం అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడిన యువకులు సైతం ఎవరికి మత్తు పదార్థాలు విక్రయించారు అనే విషయం తెలియాలిఉంది. ఈ ఘటనపై ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు యువకులను పట్టుకున్నామని, మత్తు పదార్థాల విక్రయ అంశంపై ఆరా తీస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ‘ప్రధానిని విమర్శించే స్థాయి కాదు’ గద్వాల: ప్రపంచ దేశాలన్నీ దేశప్రధానిని గొప్పదార్శనికత ఉన్న నాయకుడని కొనియాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ స్థాయిని మరిచి దేశ ప్రధానినే విమర్శిస్తుండడం వారి దివాళాకోరు తనానికి నిదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలకు పెట్టింది పేరని, వారి కుంభకోణాలు వెలుగు చూసి చట్టం తన పనితాను చేసుకుంటూ పోతుంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ పార్టీ నేతలు, అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించడం సరైన విధానం కాదని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు బండల వెంకట్రాములు, రవి, ఇసాక్, దేవదాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి, నాగర్కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్త్రృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు.. పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్లను మారుస్తారు. భూభారతి పోర్టల్లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు. ధరూరు: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో నూతనంగా అమలులోకి తెచ్చిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ధరూరుకు రానున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ధరూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సభ ఏర్పాటు చేయగా.. ఉదయం 9.15 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి ఉదయం 8.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా గద్వాలకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంగుండా ధరూరుకు చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు సభా స్థలాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. సభ ముగిసిన అనంతరం 11 గంటలకు నాగర్కర్నూలుకు బయలుదేరి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. న్యూస్రీల్మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు.. ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది. గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు. ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన.. భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన భూభారతిపై విస్త్రృత అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు నేడు గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి -
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్నాల్, ఎర్గోల, మినాస్పూర్ బ్లాక్లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ● -
దేశంలోనే రోల్ మోడల్గా భూభారతి
నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల వద్దకే అధికారులు.. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మద్దూరు మండలం ఖాజీపూర్లో రెవెన్యూ సదస్సు ప్రారంభం -
పశు సంపదను కాపాడేందుకే టీకాలు
ఎర్రవల్లి/ఇటిక్యాల: పశు సంపదను కాపాడేందుకే పశువైద్య, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వైరస్ వల్ల పశువులలో నోరు, కాలి గెట్టెల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే గాలి ద్వార ఇతర పశువులకు వ్యాపిస్తుందని, దీనిని గాలి కుంటు రోగం అంటారన్నారు. జ్వరం అధికంగా ఉండి నోరు, నాలుక భాగములో పుళ్ళు ఏర్పడి మేత తీసుకోవడంలో ఇబ్బందులు, నోటి నుండి నురుగు వస్తూ దగ్గుతుంటాయన్నారు. గిట్టల మధ్య ఎర్రబడి, మెత్తబడి వ్యాధి సోకిన దూడలు 30–40 శాతం వరకు చనిపోతాయన్నారు. అందుకే పాడి రైతులు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని పశు సంపదను కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల పశు వైధ్యాధికారి డాక్టర్ భువనేశ్వరి, వినయ్కుమార్, పశువైద్య సిబ్బంది మాసూమన్న, సబీనా, రామకృష్ణ, విజయ్భాస్కర్, రాజేంద్ర సింహా, భారతీష్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. ● కొండేరులో 80 తెల్ల పశువులు (గోవుజాతి), 186 గేదెలకు టీకాలు వేశామని మూడు నెలలు పైబడిన అన్ని పశువులకు టీకాలను ఖచ్చితంగా వేయించాలని అన్నారు. ఈ వ్యాది సోకిన పశువులు ముడుచుకొని పడుకుంటాయని, జ్వరం 105 డిగ్రీల పైబడి ఉంటుందని, ముందుజాగ్రత్తగా టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాదికారి డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ వినయ్కుమార్, సిబ్బంది మాసూమన్న, సబీనా, రామకృష్ణ, విజయ్ బాస్కర్, రాజేంద్ర సింహా, భారతీషా, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ నిర్వాహకుల ఆటకట్టు
విచారణ కొనసాగుతుంది నాలుగు రోజుల క్రితం శాంతినగర్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. బెట్టింగ్ వ్యవహారంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యక్తుల వివరాలపై ఆరా తీస్తున్నాం. ఇందులో ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో కూపీ లాగుతున్నాం. జిల్లాలో ఎవరైన బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. త్వరలో పూర్తి విషయాలను వెల్లడిస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీగద్వాల క్రైం: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్ కాస్తున్న ప్రధాన సూత్రధారిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నమ్మదగిన సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితం శాంతినగర్ పోలీసులు నిఘా ఉంచి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన శాంతినగర్ పోలీసులు వడ్డేపల్లికి చెందిన కుమ్మరి వీరేంద్రచారిని అదుపులోకి తీసుకున్న క్రమంలో బెట్టింగ్ ఎంతమంది నిర్వహిస్తున్నారనే కోణంలో కూపీలాగారు. అయితే అయిజకు చెందిన వడ్ల రాఘవచారి అనే వ్యక్తి బెట్టింగ్ వ్యవహారం మొత్తాన్ని ఓ యాప్ ద్వారా నిర్వహిస్తారని, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇదంతా నిర్వహిస్తారని తెలిసింది. ఈక్రమంలో మొత్తం ఆరుగురు బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. జిల్లాలో ఇటీవల ఇద్దరు యువకులు బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసి, తిరిగి చెల్లించే స్థోమత లేక బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో జిల్లా పోలీసుశాఖ బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రాధాన బూకీ కనుసన్నల్లోనే.. ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయంటే చాలు అయిజకు చెందిన బూకీ వడ్ల రాఘవచారి కనుసన్నల్లోనే బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుంది. 2017, 2018లో గద్వాల, అయిజ, శాంతినగర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదు కావడంతో ప్రాధాన సూత్రధారి విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలు పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయితే జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కోసం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు మరికొందరిని రంగంలోకి దింపినట్లు సమాచారం. అయిజ, గద్వాలకు చెందిన ప్రధాన బూకీలు హైదరాబాద్లోని మణికొండ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో ప్రధాన సూత్రధారి మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు -
జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఉమ్మడి నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి గురువారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. అనంతరం వారికి శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి, జిల్లా మాజీ గౌరవ అధ్యక్షుడు వెంకటరామయ్య శెట్టి, జిల్లా అధ్యక్షుడు మచ్చర్ల తిమ్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎన్ వేణుగోపాల్ ఉన్నారు. నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలి అలంపూర్: నర్సరీల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని, మొక్కలు జూన్ నాటికి కనీసం మీటర్ ఎత్తులో ఉండే విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. గురువారం అలంపూర్ మండలం ర్యాలంపాడులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో పశు కొట్టాల నిర్మాణం, నర్సరీ అభివృద్ధి పనులు పరిశీలించారు. పనుల నాణ్యతతోపాటు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం అలంపూర్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంద రోజులు పని దినాలు కల్పించాలి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కూలీలతో డిమాండ్లపై అడిషనల్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని, ప్రతి పనిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామాల వారీగా మైక్రో ప్లాన్లు సిద్ధం చేయాలని, ఈమేరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి. కేజీవీ ప్రన్సిపల్ కృష్ణవేణి. ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎన్.వెంకట్రాంను నాగర్కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. -
భూ వివాదాలకు ‘భూ భారతి’తో పరిష్కారం
గద్వాల: భూ వివాదాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా భూ భారతి–2025 అనే నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం–2025పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా భూ భారతి చట్టంలోని నూతనంగా పొందుపర్చిన అంశాలపై రైతులకు వివరించారు. ఎలాంటి భూవివాదాలకు తావులేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికే పూర్తి భూ యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక మార్పులు చేస్తూ కొత్త అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. భూభారతి చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలు పొందుపర్చినట్లు తెలిపారు. భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దులు వంటి సమగ్రమైన వివరాలతో తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈచట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడిందని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతో పాటు, వారసత్వ భూముల మ్యూటేషన్లు నిర్ణీత గడువులోపల పూర్తి చేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. చట్టంపై రైతులకు విస్తృత అవగాహన భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ అవకాశం కల్పించినట్లు దీంతో రైతులకు న్యాయబద్దమైన మార్గం కల్పిస్తుందన్నారు. ఇంటి స్థలాలు, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాసీ్త్రయంగా చేస్తూనే మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూములపై హక్కుల పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం కల్పించబడిందన్నారు. భూ భారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందన్నారు. మే 1వ తేదీ నుంచి గ్రామ పాలన అధికారుల నియామకంతో భూ సమస్యలు సులభతరం అవుతుందన్నారు. గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారుల సాయంతో రైతు వేదికల వద్ద చట్టం గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై ప్రతిఒక్కరు అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్రావు, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, సుభాన్, నీలిశ్రీనివాసులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం వేగవంతం కలెక్టర్ బీఎం సంతోష్ -
ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు..
ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్ ఎస్ఈ జూరాల మరో తడి ఇవ్వండి.. అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత రైతులను ఆదుకోవాలి.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మణ్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం ● -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం మండలందిలోని కొండేరు గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 17శాతం తేమ వచ్చేలా వడ్లను ఎండబెట్టాలని, తాలు, రాళ్లు, మట్టి పెల్లలు లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. -
నత్తనడకన నిర్మాణాలు
అయిజ: విధిగా పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు మున్సిపాలిటీలలో ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏర్పాటుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అయిజ, బాదేపల్లి, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, వనపర్తి మున్సిపాలిటీల్లో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించేందుకు రూ.18 కోట్లు వెచ్చించారు. ఈ ఖర్చులో సగభాగం ప్రభుత్వం, మిగిలిన సగభాగం పీవీవీ ఎన్ఫ్రాం కంపెనీ వారు ఖర్చు చేయాలనే ఒప్పందం ఉంది. యూనిట్ ఇంచార్జ్లదే బాధ్యత యూనిట్ నిర్మాణం పూర్తయిన అనంతరం 10 ఏళ్లపాటు యూనిట్ నిర్వహణ బాధ్యతలు యూనిట్ ఇంచార్జ్లు తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో సెప్టిక్ ట్యాంక్ యజమానితో మున్సిపాలిటీ అధికారులు ఒప్పందం చేసుకొని సెప్టిక్ ట్యాంక్లనుంచి మానవ విసర్జితాలను ప్లాంట్కు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటారు. అనంతరం ప్లాంట్లో సాంకేతిక పద్ధతిలో మలంను ఎరువుగా మార్చుతారు. ఎఫ్ఎస్టీపీలో తయారైన ఎరువును యూనిట్ నిర్వాహకులు కిలోల చొప్పున లెక్క కట్టి విక్రయిస్తారు. అది వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడుతుంది. శుద్ధిచేసిన నీటిని మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే హరతహారం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. రెండు మున్సిపాలిటీల్లో వినియోగం గద్వాల, అయిజ మున్సిపాలిటీలలో ఎస్ఎఫ్టీపీ ప్లాంట్లు వినియోగంలోకి వచ్చాయి. అయిజ మున్సిపాలిటీలో నిర్మించిన ఎస్ఎఫ్టీపీ ప్లాంట్ 2022 నుంచి ఉపయోగంలోకి తెచ్చారు. గద్వాల మున్సిపాలిటీలో 2023 ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి ఉపయోగంలోకి వచ్చింది. అయితే రెండు మున్సిపాలిటీల్లో కూడా ఇంతవరకు అధికారికంగా ప్లాంట్లను ప్రారంభించలేదు. వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీలో రూ. 55 లక్షల నిధులతో 2022లో ఎఫ్ఎస్టీపీ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కా లేదు. అలంపూర్లో గతంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ ( సివరేజ్ ట్రీటమెంట్ ప్లాంట్) ఉన్నందుకు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ నిర్మాంణం మంజూరును రెండు సంవత్సరాలు హోల్డ్లో పెట్టారు. ఎట్టకేలకు గతేడాది నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతులు లభించాయి. ఉమ్మడి జిల్లాలోనే అయిజ ప్రఽథమం ఉమ్మడి మహబూబ్నగర్లో చేపట్టిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం ముందుగా అయిజ మున్సిపాలిటీలో పూర్తయ్యింది. నివాస గృహాల సెప్టిక్ ట్యాంక్ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేసేందుకు అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం గ్రామం సమీపంలో సుమారు రూ.1.5 కోట్లతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను గతేడాది పూర్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలోని సుమారు 7వేల నివాస కుటుంబాల నుంచి సెప్టిక్ ట్యాంకుల్లోని మానవ విసర్జితాలను తరలించేందుకు ప్లాంట్ నిర్మించారు. విసర్జితాలను శుద్ధీకరుణ యూనిట్ ప్లాంట్లో అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టర్తో మెథనైజేషన్ పద్దతిలో శుద్ధిచేసి విసర్జితం, నీటిని వేరుచేస్తారు. నీటిని పాలిసింగ్ ఫండ్లో పాస్పరేట్, సల్ఫర్ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్ వాటర్గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈప్రక్రియ మెత్తం ఆధునిక సాంకేతిక పద్ధతిలో జరుగుతుంది. ఒకసారికి 10 కేఎల్డీ (10వేల లీటర్ల సామర్ధ్యం) గల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ప్లాంట్ను ప్రారంభించకపోయినా సరే నిర్వహణ మాత్రం సజావుగా సాగుతోంది. అయిజలో నిర్మించిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లపై వీడని నిర్లక్ష్యం వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో కానరాని పురోగతి గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న నిర్వహణ పారిశుద్ధ్యం మెరుగు.. అయిజ మున్సిపాలిటీలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధి చేసేందుకు నిర్మించిన ఎఫ్ఎస్టీ ప్లాంట్ సద్వినియోగం అవుతోంది. ఈ ప్లాంట్లో ద్వారా విసర్జితాలు శుద్ధిచేసి ఎరువుగా మార్చి మొక్కలకు ఉపయోగించడం మంచి విషయం. – రాజశేఖర్, ఏఈ, అయిజ మున్సిపాలిటీ రెండేళ్లుగా కొనసాగుతోంది అయిజ మున్సిపాలిటీలో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ రెండేళ్ల క్రితం నుంచే వినియోగంలోకి వచ్చింది. గద్వాలలో కూడా వినియోగంలో ఉంది. అలంపూర్లో, వడ్డెపల్లిలో ఇంకా పనులు పూర్తి కాలేదు. పనులు వేగవంతం చేసేందుకు కృషిచేస్తాం. – నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్ -
ఫలించిన రైతుల ఆందోళన
జూరాల ఎడమ కాల్వకు నీటి విడుదల అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు తమకు నీరు అందడం లేదని, పంటలు వాడుముఖం పడుతున్నాయంటూ ప్రాజెక్టు రహదారిపై రెండు పర్యాయాలు చేసిన ఆందోళనకు ఫలితం దక్కింది. రైతుల ఆవేదనను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఎట్టకేలకు చివరి తడిగా రెండురోజుల పాటు నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జూరాల ఎడమ కాల్వకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అత్యధికంగా వరి సాగు చేయడంతో ఇరు మండలాల ప్రజలు సాగునీరు కావాలంటూ వారం రోజుల్లో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టారు. మరోతడి అవసరమే.. ఆత్మకూర్ మండలంలోని తూంపల్లి, కత్తేపల్లి, ఆరేపల్లి, మెట్లంపల్లి, జూరాల గ్రామాలతో పాటు ఇతర గ్రామాల ఆయకట్టు రైతులు ఆలస్యంగా వరి సాగుచేయడంతో సమస్య జఠిలంగా మారింది. అధికారుల అంచనా ప్రకారం మార్చి చివరి వారంలోనే పంట చేతికందాల్సి ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో 15 రోజుల తర్వాతే పూర్తిస్థాయిలో వరిపంట చేతికందే పరిస్థితి ఉంది. చివరి తడిగా బుధవారం నుంచి రెండురోజుల పాటు నీటిని వదులుతుండగా.. వచ్చేవారం రెండ్రోజుల పాటు నీటిని అందిస్తే పంటలు చేతికందుతాయంటున్నారు. జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ఇదే చివరితడిగా వదులుతున్నామని, పొదుపుగా వాడుకోవాలని సూచిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎత్తిపోతల రైతులు గట్టెక్కినట్లే.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు చివరిసారిగా అందిస్తున్న నీటితో తమ పంటలు చేతికందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. సాగునీరు వదిలిన వెంటనే ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల, మస్తీపురం, సింగంపేట, ఖానాపురం, అమరచింత, పాంరెడ్డిపల్లిలో రైతులు వెయ్యి ఎకరాల వరి సాగుచేశారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు ప్రస్తుతం అందిస్తున్న సాగునీరు ఊపిరి పోసేలా ఉందని, పంట చేతికందుతుందనే ఆశలో ఉన్నారు. చివరి తడిగా ప్రకటించిన అధికారులు మరో తడి ఇవ్వాలంటున్న రైతన్నలు రెండ్రోజుల పాటు సరఫరా.. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు జూరాల ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సాగునీరు రెండురోజుల పాటు వదులుతున్నాం. రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించాం. – శ్రీనివాస్రెడ్డి ఎస్ఈ, జూరాల జలాశయం -
ముచ్చటగా మూడుసార్లు ప్రారంభం
ఒక్క కొనుగోలు కేంద్రాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా మూడు సార్లు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొండేరులో వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే విజయుడు ప్రారంబించారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 15న మంగళవారం బీఆర్ఎస్ నాయకులు మొదటి సారి ప్రారంభించారు. బుధవారం ఉదయం అలంపూర్ మార్కెట్యార్డు చైర్మెన్ దొడ్డెప్ప రెండవసారి ప్రారంభించారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే స్థానిక ఎమ్మెల్యే విజయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించడం గమనార్హం. దీనిపై ఏపిఎం కుర్మయ్యను వివరణ కోరగా.. మొదటిసారి బీఆర్ఎస్ నాయకులు తమకు సమాచారం లేకుండానే ప్రారంభించారని, రెండవసారి ప్రారంభానికి వచ్చిన అలంపూర్ మార్కెట్యార్డు చైర్మన్ దొడ్డెప్పకు ఎమ్మెల్యే వస్తున్నారన్న విషయాన్ని చెప్పామన్నారు. గంట వ్యవధిలోనే మూడోసారి ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభించారని తెలిపారు. -
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం. – జీఎన్.శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ఉన్నత విద్యా మండలి సూచనలతో.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
గద్వాలటౌన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులలో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రతి వారం పురోగతిపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వ సూచనల ప్రకారం నిర్వహించాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా చూడాలి వేసవిలో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాపై మండలాల వారీగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పట్టణ, గ్రామాల పరిధిలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకూడదన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నీటి కొరత ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటికి అవకాశం ఉన్న అన్ని మార్గాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల తాగునీటి సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పైపులైన్ లీకేజీలు, మోటర్ల మరమ్మతు చేపట్టాలన్నారు. స్ట్రాంగ్రూం వద్ద పటిష్ట భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంలను కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా కలెక్టర్ తనిఖీ చేపట్టి, భద్రత చర్యలను పరిశీలించారు. స్ట్రాంగ్రూం రికార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న జంటకు సమావేశ మందిరంలో ప్రోత్సహాక బహుమతిని అందజేశారు. పట్టణానికి చెందిన మౌనిక, రమేష్ కులాంతర వివాహం చేసుకోగా.. ప్రభుత్వం కల్పించిన పథకం ద్వారా రూ.2.50 లక్షల ప్రోత్సాహక బహుమతికి సంబంధించిన బాండ్ను కలెక్టర్ వారికి అందజేశారు. సమావేశాల్లో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, సంబంధిత అధికారులు నాగేంద్రం, రమేష్బాబు, శ్రీధర్రెడ్డి, పరమేశ్వరి, సరోజ, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి కలెక్టర్ బీఎం సంతోష్ -
జిల్లా నూతన జడ్జిల నియామకం
గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లా జడ్జిగా ఎన్.ప్రేమలత, అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా ఎస్.రవికుమార్ను నియమిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇక్కడ జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న కె.కుషాను హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ చేశారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రేమలతను గద్వాల జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అయిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.రవికుమార్ను గద్వాల అదనపు సెషన్ కోర్టు జడ్జిగా రానున్నారు. వీరు త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. . నష్టపోయిన మామిడి రైతుల వివరాలు పంపండి నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో వర్షాలు, ఈదురు గాలుల వల్ల నష్టపోయిన మామిడి రైతుల వివరాలను నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు ఎంపీ మల్లురవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి రైతులు కూడా తమకు జరిగిన నష్టం వివరాలను కలెక్టర్తోపాటు ఆయా మండలాల్లో తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 1,070 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు మంగళవారం 1,070 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.6,089, కనిష్టంగా రూ.3,019, సరాసరిగా రూ.4,926 చొప్పున ధరలు వచ్చాయి. అలాగే 25 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,409, కనిష్టంగా రూ.2,219, సరాసరిగా రూ.6,406, 284 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,001, కనిష్టంగా రూ.3,561, సరాసరిగా రూ.5,909, 2,245 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,069, కనిష్టంగా రూ.1,739, సరాసరిగా రూ.1,889 చొప్పున ధరలు లభించాయి. సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు రిజిస్ట్రార్ రమేష్బాబుకు మంగళవారం సమ్మె నోటీస్ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులు ఏళ్లుగా యూనివర్సిటీలో పని చేస్తున్నారని, అలాంటి వారిని రెగ్యులరైజ్ చేయాలని, బడ్జెట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల గొంతు నొక్కవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీధర్రెడ్డి, భూమయ్య, రవికుమర్, విజయ్భాస్కర్, ప్రభాకర్రెడ్డి, సోమేశ్వర్, సుదర్శన్రెడ్డి, రవికుమార్, మృదుల తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
అమరచింత: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు రహదారిపై సాగునీరు ఇవ్వాలంటూ మండుటెండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని రామన్పాడు వరకే అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత, ఆత్మకూరు మండలాల రైతులు వరిపంట సాగుచేశారు. వారబందితో సాగునీటిని అందించిన అధికారులు పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, తూంపల్లి, గుంటిపల్లి, జూరాల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకొని ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడే ఉన్న బారికేడ్లు, ముళ్లపొదలు అడ్డంగా పెట్టడంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఎస్ఐ, వనపర్తి జిల్లా అమరచింత ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు సాగునీరు అందించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతుల రాస్తారోకో విషయాన్ని సీఐ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వచ్చి ఉన్నతాధికారులతో చర్చించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మండుటెండలో జూరాల ప్రాజెక్టుపై బైఠాయింపు గంటన్నర వరకు కదలని రైతులు నిలిచిన వాహన రాకపోకలు -
దేశాభివృద్ధిలో ఆర్థికశాస్త్రం కీలకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికశాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలోఎకానామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ ఎకానామిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎకానామిక్స్ పూర్తిస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు వ్యాపార, వాణిజ్య విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీ రాఘవేందర్రావు, జిమ్మికార్టన్, శివలింగం, రాజునాయక్ తదితరుల పాల్గొన్నారు. -
నల్లమల ప్రాణ వాయువుతో సమానం
మన్ననూర్: నల్లమల ప్రాంతం నాకు ప్రాణ వాయువుతో సమానం అని, ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు నాకు ఎంతగానో ప్రేరణ కలిగిస్తాయని వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు, కాళోజీ పురస్కారం గ్రహీత జయరాజ్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పదరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నల్లమల ప్రాంతం అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబాటుకు గురైందని, అయినప్పటికీ ఇక్కడి ప్రజల్లో రాష్ట్రం నలుమూల గుర్తుండిపోయేంత మంచితనం ఉందని, అందుకే నాకు ఈ ప్రాంతం అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా ఎంతో ఇష్టం అన్నారు. దళిత బహుజనులు అంబేడ్కర్ మార్గంలో పయనిస్తూ.. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసేసి తిరిగి రాచరికాన్ని తీసుకువచ్చే కుట్ర జరుగుతుందన్నారు. అంబేడ్కర్ వారసులమైన మనం అగ్రకుల భావాజాలాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో చదువుకు ఉన్న విలువ మరొక దానికి లేదని గమనించి తమ పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ గడుదాస్ వెంకటేశ్వర్లు, కళాకారుడు జక్కా గోపాల్, నాయకులు సత్యనారాయణ, రామలింగం, చిన్న చంద్రయ్య, వెంకటయ్య, ప్రవీణ్కుమార్, రాయుడు, బాలింగం, బాలాకుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు పనుల్లో కదలిక
వివరాలు 8లో u● నార్లాపూర్– ఏదుల ప్రధాన కాల్వ పెండింగ్ పనులకు రూ.780.63 కోట్లు మంజూరు ● డిసెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేసేలా కార్యచరణ ● విడతల వారీగా పనులను పూర్తిచేయనున్న ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు నిధులు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాల్వకు 1.725 కి.మీ. పాయింట్ నుంచి 2.125 పాయింట్ కాల్వ తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 6.325 కి.మీ. పాయింట్ నుంచి 6.650 కి.మీ. పాయింట్ నడుమ కాల్వ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్యాకేజీ 3 పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.780.63 కోట్లు కేటాయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్య పెండింగ్లో ఉన్న అప్రోచ్ కెనాల్, ఓపెన్ కెనాల్ నిర్మాణంతో పాటు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కుడికిళ్ల సమీపంలో ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అక్కడ హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలకు ఇబ్బందిగా ఉందని చెబుతుండగా, తాజాగా ప్రభుత్వం అంచనాలను సవరించి నిధులను విడుదల చేసింది. గతంలో ఈ ప్యాకేజీ కింద పనులకు రూ.416.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఈ పనుల విలువను రూ.780.63 కోట్లకు చేరింది. -
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కృషి
కేటీదొడ్డి/ ధరూరు: పేద ప్రజల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులతో సమానంగా సన్న బియ్యం అందిస్తోందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి మండలంలోని మల్లాపురం గ్రామంలో లబ్ధిదారుడు సురేష్నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడితో సన్నబియ్యం ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందిస్తామన్నారు. ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. సన్న బియ్యాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంటికి కలెక్టర్ను ఆహ్వానించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, తహసీల్దార్ హరికృష్ణ, నాయకులు రాజశేఖర్, రామకృష్ణనాయుడు, విజయ్, రమేష్నాయుడు, టీచర్ గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం పరిశీలన ధరూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణ పనులను కలెక్టర్ బీఎం సంతో్ష్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందించడంతోపాటు ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కుల, ఆదాయ, ఏబీసీ, రెసిడెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భూపాల్రెడ్డి, డీటీ మంగమ్మ, ఆర్ఐ తేజ తదితరులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య..
మాకు కేటాయించిన బస్సును మార్చి 20 నుంచి కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలతో ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి అప్పగించింది. ఆర్టీసీ వారు నెలకు రూ.77,220 అద్దె చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య జిల్లాలోనే ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎంపికై ంది. – అరుణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పెద్దకొత్తపల్లి జిల్లాకు ఏడు బస్సులు.. నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు గాను ఏడింటికి మొదటి విడతలో ఏడు బస్సులు మంజూరయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా పెద్దకొత్తపల్లికి చెందిన సమాఖ్య బస్సు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాగా మహిళా సంఘాల అకౌంట్లో జమ అయ్యాయి. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ, నాగర్కర్నూల్ ● -
మహిళల చేతికి ప్రగతి చక్రాలు
అచ్చంపేట: మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో మొత్తం ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేట 5, కల్వకుర్తి 4, నాగర్కర్నూల్ 2, కొల్లాపూర్ 2, గద్వాల 4, వనపర్తి 7, మహబూబ్నగర్ 5, నారాయణపేట 2, కోస్గి 1, షాద్నగర్ 17 చొప్పున 49 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసరమయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ– సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. రద్దీ నేపథ్యంలో 64 కొత్త బస్సుల కోసం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ల కిందటివి కావడంతో తరుచుగా మరమ్మతుకు గురవుతున్నాయి. పండుగలు, జాతర్లు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్భవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బస్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేటకు (2 ఎక్స్ప్రెస్లు), కల్వకుర్తికి (2 ఎక్స్ప్రెస్లు) నాగర్కర్నూల్కు (3 పల్లె వెలుగులు), గద్వాలకు (7 ఎక్స్ప్రెస్లు, 12 పల్లె వెలుగులు, 2 డీలక్స్లు), వనపర్తికి (4 ఎక్స్ప్రెస్లు, 4 పల్లె వెలుగులు), మహబూబ్నగర్కు (11 ఎక్స్ప్రెస్లు, 6 పల్లె వెలుగులు), నారాయణపేటకు (1 ఎక్స్ప్రెస్, 1 పల్లెవెలుగు), షాద్నగర్కు (6 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు) చొప్పున మొత్తం 64 బస్సుల కోసం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి. అద్దె ప్రాతిపదికన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకై నా సమస్య తీరనుంది. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.77,220 అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్య సొంతం కానుంది. మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 49 బస్సుల కోసం ప్రతిపాదనలు ప్రతినెలా ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లింపు మహిళలూ ఆర్థిక పరిపుష్టి సాధించే సదావకాశం ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చేయూత -
నెరవేరిన ఉపాధి లక్ష్యం
శాశ్వత పనులకు అధిక ప్రాధాన్యం జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2025–26)లో చేపట్టాల్సిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది చేత ప్రత్యేకంగా గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గడిచిన అక్టోబర్, నవంబర్ నెలలో పనుల గుర్తింపు చేపట్టారు. ఆయా గ్రామాల్లో రైతులు, కూలీలు, ప్రజలతో కలిసి పనులను గుర్తించారు. పనులను గుర్తించిన అనంతరం గ్రామాల వారీగా ప్రణాళికను తయారు చేశారు. శాశ్వత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పంటపొలాల్లో చిన్న కుంటలు, వ్యవసాయ పొలాలకు బాటలు, పంట కాల్వల పూడికతీతల పనులతో పాటు, నీటి సంరక్షణ (పాంపాండ్స్, బావుల పూడికతీత, వాలుకట్టలు) ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్లు, నాడేక్ కంపోస్ట్ పిట్లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, గొర్రెల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని చేయాల్సిన పనులు, కూలీల డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నారు. వ్యవసాయ సీజన్ ఉన్నప్పుడు, లేనప్పుడు ఆయా పంచాయతీల పరిధుల్లో ఏరకమైన పనులు చేపట్టవచ్చో ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని పనులను గుర్తించారు. పనులను గుర్తించిన అధికారులు అందుకు అవసరమయ్యే పనిదినాల సంఖ్య, బడ్జెట్ను (కూలీల వేతనాలు, మెటిరియల్కు అయ్యే ఖర్చు) పంచాయతీల వారీగా అంచనా వేసి రికార్డుల్లో నమోదు చేశారు. ఈవివరాలను మండలాల వారీగా క్రోడీకరించి డీఆర్డీఏ కార్యాలయానికి కొద్దిరోజుల క్రితం నివేదించారు. అక్కడి అధికారులు మరోసారి మండలాల వారీగా గుర్తించిన పనులను, పనిదినాల వివరాలను పరిశీలించనున్నారు. ఇక్కడ పరిశీలించిన అనంతరం కలెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. మరో పదిరోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాల లక్ష్యం.. బడ్జెట్ కేటాయింపులు నిర్ధేశితమవుతాయని అధికారులు తెలిపారు. గద్వాల న్యూటౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో పనిదినాల లక్ష్యం పూర్తి అయ్యింది. అంతేగాక, ఈ ఏడాది (2025–26) చేపట్టే వాటిలో వ్యవసాయ ఆధారిత పనులకు ఎక్కువ ప్రాధాన్యతను కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి సిబ్బంది పనులను గుర్తించారు. ప్రత్యేక దృష్టితో పనిదినాలు పూర్తి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేందుకు గాను 23,22,812 పనిదినాల సంఖ్య లక్ష్యంగా నిర్ధేశించారు. లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించడంతో పనిదినాల లక్ష్యం నేరవేరింది. ఇందుకోసం గడిచిన ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం లక్ష్యాన్ని ఆయా మండలాలకు నెల వారీగా లక్ష్యాన్ని విభజించారు. దీంతోపాటు ప్రతి నెల ఆయా మండలాల్లో జరిగే పనులు, హాజరవుతున్న కూలీలు, పనిదినాల సంఖ్యపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎక్కడైతే పనులు జరగలేదో అక్కడ ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో లక్ష్యం నెరవేరింది. ప్రతి కూలీకి పని కల్పించాం 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హమీ కింద చేపట్టాల్సిన పనిదినాల లక్ష్యం నెరవేరింది. నడిగడ్డలో వలసలు పూర్తిగా నివారించి, ప్రతి కూలీకి ఉపాధిహామీ పథకం కింద పని కల్పిస్తాం. ఈ ఏడాదిలో (2025–26) వ్యవసాయ ఆధారిత పనులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నాం. పనులను సైతం గుర్తించాం. 2025–26లో పనిదినాల లక్ష్యం నెరవేరేలా ఆరంభం నుంచి చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావ్, డీఆర్డీఓ 2024 –25లో 23.22 లక్షల పనిదినాలు పూర్తి కూలీలకు వంద శాతం పని కల్పించిన వైనం 2025–26 లో వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యం ఇప్పటికే పనులను గుర్తించిన ఉపాధి సిబ్బంది -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని సోమవారం పలువురు ప్రముఖలు దర్శించుకున్నారు. అడిషనల్ డీజీపీ అభిలాష బిష్త్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే, ఎంల్సీ సురభివాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులతో కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధప్రసాదాలు అందించగా.. అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. క్రికెట్ బెట్టింగ్.. పోలీసుల అదుపులో వ్యక్తి శాంతినగర్: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడని వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నాడనే సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు గత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో వున్న వ్యక్తిని విచారణ నిమిత్తం తీసుకువెళ్లినట్లు తెలిసింది. 24 గంటలపాటు విచారణ చేసినప్పటికీ సమాచారం గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయమై శాంతినగర్ పోలీసులను వివరణ కోరగా.. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం వాస్తవమని, విచారణ పూర్తి అయిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సమగ్ర విచారణ జరిగేనా? ● వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటంతో కలకలం కల్వకుర్తి రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. వినియోగదారులు సైతం దొడ్డు బియ్యం తినలేమనే ఉద్దేశంతో వచ్చిన ధరకు మధ్యవర్తులకు విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వినియోగదారుని వద్దకు వెళ్లిన బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరుకోవడం అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి వెళ్లి మళ్లీ రేషన్ షాపుల ద్వారా వినియోదారులకు రావడం ఒక రీసైక్లింగ్ వ్యవహారంగా కొనసాగింది. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్ప్రయోజనంగా మారిపోయాయి. తలా పాపం తిలా పిడికేడు అన్న చందంగా రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి అధికారులు తదితరవి రేషన్ బియ్యం చుట్టూ తిరగడంతో అక్రమ రవాణాకు అడ్డు, అదుపు లేకుండా చేశాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్న బియ్యం సైతం పక్కదారి పట్టి అధికారులకు పట్టుబడిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి మండలంలోని మార్చాల రైస్ మిల్లులో ఏకంగా వెయ్యికిపైగా క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటం కలకలం రేపింది. మిల్లులో 90 శాతం.. అధికారులు దాడి చేసిన రైస్ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎంఆర్ ధాన్యం ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు. అయితే సీఎంఆర్ కేటాయించని మిల్లులో రేషన్ బియ్యం ఎలా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం ఈ మిల్లుకు ఎలా వచ్చాయనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది. సదరు మిల్లులో ఏకంగా 90 శాతం రేషన్ బియ్యం ఉండటం గమనార్హం. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మరికొన్ని మిల్లుల భాగోతం బయటకు వస్తుందని పలువురు చెబుతున్నారు. కొన్ని బ్రాండ్ల కవర్లను తొడిగి రేషన్ బియ్యం కల్వకుర్తిలోని కొందరికి అమ్మేందుకు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఆదివారం సైతం దాడులు నిర్వహించడం పక్కా సమాచారంతోనే అంటున్నారు. అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకున్న కొన్ని మిల్లుల యజమానులు తమ వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించారని తెలుస్తుంది. రేషన్ బియ్యం వ్యవహారంపై మరిన్ని నిజాలు తెలిసే విధంగా అధికారులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన జాతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాడు మహనీయుడు అంబేద్కర్కు కనీస అవసరాలు లేకున్నా ఉన్నత చదువులు చదివి భావి భారత తరాలకు ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ఆయన కృషితోనే మనం రిజర్వేషన్లు, ఉద్యోగాలు అనుభవిస్తున్నామన్నారు. మహనీయుల ఆశయాలు విద్య ద్వారానే సాకారం చేయవచ్చన్నారు. వారి ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ముఖ్యంగా యువత, విద్యార్థులపై ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఏఓ నరేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి సరోజ తదితరులు పాల్గొన్నారు. ● ఎర్రవల్లి: భారత రాజ్యాంగ వ్యవస్థకు రూపకల్పన చేయడంతోపాటు విలువలకు, చట్టబద్దమైన పాలనకోసం ఎంతో కష్టపడి బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని పదో బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంటరానితనంపై అనేక ఉద్యమాలు చేయడంతో పాటు వ్యవస్థలో ఉన్న రుగ్మతకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో మార్పులను తీసుసుకువచ్చిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, ఆర్ఐలు రాజు, రాజారావు, పటాలం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● గద్వాల క్రైం: రాజ్యాంగ నిర్మాతగా, న్యాయవాదిగా, వెనకబడిన కులాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాలులర్పించారు. నిరక్షరాస్యత, అంటారానితనం, పేదరికం రూపుమాపడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అదే విధంగా గద్వాల రవాణాశాఖ, అగ్నిమాపక, ఎకై ్సజ్, వైద్యశాఖ ఆర్టీసీ తదితర ప్రభుత్వ కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. -
జిల్లాలో ఉపాధి హామీ పనుల వివరాలిలా..
మండలం పూర్తి అయిన పనిదినాలు ధరూర్ 2,94,933 కేటీదొడ్డి 2,43,474 మల్దకల్ 2,41,972 ఇటిక్యాల 2,36,536 గట్టు 2,34,871 అయిజ 2,24,439 గద్వాల 1,95,942 ఉండవల్లి 1,58,893 మానవపాడు 1,56,806 అలంపూర్ 1,33,352 రాజోళి 1,26,295 వడ్డేపల్లి 75,299 -
‘భూ భారతి’కి మద్దూరు ఎంపిక
నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. రెవెన్యూ గ్రామాలు 17.. భూమి 30,621 ఎకరాలు మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్దిన్నె దమ్గన్పూర్ దొరెపల్లి, జాదరావ్పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
అలంపూర్: అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమని అలంపూర్ ఫైర్స్టేషన్ ఇన్చార్జ్ కురుమూర్తి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఫైర్ స్టేషన్లో అగ్ని మాపక వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధ్వర్యంలో ఫైర్ సిబ్బంది 1944లో విక్టోరియాలో జరిగిన నౌకా ప్రమాదంలో మృతి చెందిన ఫైర్స్టేషన్ సిబ్బందికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. వారోత్సవాల్లో భాగంగా తొలి రోజు అగ్ని ప్రమాదాల నివారణలో వినియోగించే సామగ్రితో స్టాల్స్ నిర్వహించారు. స్టాల్స్ సందర్శనకు విచ్చేసిన ప్రజలకు వాటి వినియోగం గురించి వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రవిప్రకాష్, రవీందర్, నవీన్ గౌడు, అమరనాథ్, వినీత్ కుమార్ రెడ్డి, సాయికుమార్, జగదీశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
రాజ్యాంగ నిర్మాతను అవమానించిన కాంగ్రెస్
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సముచిత గౌరవం ఇవ్వకపోగా.. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు త్రీవంగా అవమానించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ ఆరోపించారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక గంజిపేట కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1952 లోక్సభ ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించేందుకు ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి నారాయణరావ్ కథరోల్కర్ను పోటీకి నిలిపాయని, నెహ్రూ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేద్కర్ ఓటమికి కారకులయ్యారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ హయాంలో అంబేద్కర్ స్మృతివనం, పంచతీర్థ పేరుతో ఆయన పుట్టిన, నివసించిన, దహన సంస్కారాలు నిర్వహించిన స్థలాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని 75 సార్లు సవరించిందన్నారు. బీజేపీ మాత్రమే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. అంబేద్కర్ చూపిన బాటలోనే ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పారు. అంబేడ్కర్ లాంటి మహనీయులను స్మరించుకోవాలని, వారు కలలుకన్న నవభారతాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రవికుమార్ఏక్బోటే, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, దేవాదాస్, శివారెడ్డి, స్వప్న, చిత్తారి కిరణ్, తిమ్మన్న, శంకర్, నర్సింహా, శ్యామ్రావు, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్కొండ, మహబూబ్నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. బస్తాకు 3 కిలోల వరకు తక్కువగా వస్తున్నాయి.. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు పలువురు అక్కడే రేషన్ బియ్యం తీసుకునేవాళ్లు. అక్కడ ఎమ్మెల్సీ కోడ్ కారణంగా సన్న బియ్యం అమలు కాలేదట. దీంతో వారు ఈ నెల ఇక్కడకు వచ్చి తీసుకెళ్తున్నారు. మరోవైపు సివిల్ సప్లయ్ గోదాంల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న 50 కేజీల బస్తాల్లో ఒక్కో దాంట్లో ఒక్క కేజీ నుంచి మూడు కేజీల వరకు బియ్యం తక్కువగా వచ్చాయి. దీంతో కొంత ఇబ్బందిగా ఉంది. అధికారులు ఈ సమస్య రాకుండా చూడాలి. – బాలస్వామి, రేషన్ డీలర్, ఖానాపూర్, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల నాణ్యతపై రాజీ పడొద్దు.. మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – కాసింబీ, గోప్లాపూర్, దేవరకద్ర, మహబూబ్నగర్ 3 రోజుల్లోనే అయిపోయాయి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షాపుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం సరఫరా జరిగిపోయింది. కోటా అయిపోయిన కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం. – సంజీవరెడ్డి, డీలర్, రేషన్షాప్ నంబర్–3, మద్దూరు, నారాయణపేటఅవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ ల.ప.అ మహబూబ్నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్షాపులు,రే.కా: రేషన్కార్డులు, రే.షా.ప.అ: రేషన్షాపులకు పంపిణీ అయింది, ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాలటౌన్: ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై సమరం సాగించాల్సి ఉంటుందని ఎస్జీటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ఎస్జీటీ యూనియన్ ఛలో ఇందిరాపార్కు చేపట్టింది. అందులో భాగంగా ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎస్జీటీ యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరాపార్కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న అయిదు డీఏలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలన్నారు. పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేయాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. వీటితో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్జీటీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
అంతుచిక్కట్లేదు..!
జిల్లాలో వరుస బలవన్మరణాలు వీడని మిస్టరీ.. పై నాలుగు కేసుల్లోనూ కుటుంబసభ్యులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి కేసు విషయానికి వస్తే.. మల్దకల్కు చెందిన యువకుడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న గద్వాలకు చెందిన ట్రాన్స్జెండర్, మరికొంత మంది అతని ఇంట్లోకి వెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతూ.. ట్రాన్స్జెండర్తోపాటు వెళ్లిన వ్యక్తులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. రెండో ట్రాన్స్జెండర్ కేసు విషయానికి వస్తే.. గద్వాలకు చెందిన యువకుడు, ట్రాన్స్జెండర్ రహస్యంగా ప్రేమించుకుంటుండగా.. ట్రాన్స్జెండర్ సోదరుడు, మరొకరు యువకుడి ఇంటి వద్దకు వచ్చి బైక్పై అతడిని ఎక్కించుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. గంటల వ్యవధిలోనే యువకుడు అతని తండ్రి సమాధి వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం తరలించినా లాభం లేకుండా పోయింది. పోలీసులు ట్రాన్స్జెండర్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పడం గమనార్హం. మృతుడి ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయని పోలీసులు విచారించగా.. అవి ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపినట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరో రెండు మృతి కేసుల్లోనూ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయగా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. గద్వాల క్రైం: నడిగడ్డలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అనుమానాస్పద మృతి కేసులు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. నిజంగా వారిది ఆత్మహత్యనా.. లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది అంతుచిక్కట్లేదు. అనుమానం.. అవమాన భారం.. వ్యక్తిగత సమస్యలు.. వివాహేతర సంబంధాల కారణంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ క్షణికావేశంలో తనువు చాలిస్తున్న వారే అధికం. దీనికితోడు మల్దకల్ మండలంలో ఓ యువకుడు ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందడం.. అంతకుముందు జిల్లా కేంద్రంలో మరో యువకుడు సైతం ట్రాన్స్జెండర్తో స్నేహంగా ఉన్న క్రమంలోనే అనుమానాస్పదంగా మృతిచెందడం జిల్లాలో కలకలం రేపింది. ఈ మరణాలపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. మృతికి గల కారణాలు, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా ఎదురుచూస్తున్నారు. ●● 2025 మార్చి 27న...హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు చెందిన యువతీ యువకుడు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని జీవనోపాధి నిమిత్తం గద్వాలకు వచ్చారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే దంపతుల మధ్య డబ్బు విషయమై తరచూ విభేదాలు వచ్చేవి. ఈక్రమంలో మార్చి 27న భర్త పని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాకు వెళ్లగా.. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య (35) ఫ్యాన్కు ఉరేసుకుని అత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీన మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు.. ● 2025 ఏప్రిల్ 11న.. మల్దకల్ మండలానికి చెందిన ఓ యువకుడు (35) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే సదరు యువకుడు గతకొంత కాలంగా గద్వాలకు చెందిన ఓ ట్రాన్స్జెండర్తో చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల నేపథ్యంలో యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనపై మల్దకల్ పోలీసు స్టేషన్లో అనుమానాస్పద కేసు నమోదైంది. త్వరలో కేసులు ఛేదిస్తాం ఎంతటి విపత్కర కేసులైన పోలీసుశాఖ పూర్తి ఆధారాలతో నిందితులను గుర్తిస్తాం. సాంకేతిక పరమైన అంశాలే కీలకంగా ఉంటాయి. ఏ చిన్న తప్పిదం జరిగినా పోలీసుశాఖపై విమర్శలు ఉంటాయి. బలవన్మరణాలు లేక హత్య చేయబడ్డారనే విషయాలపై ప్రత్యేక బృందంచే విచారణ జరిపిస్తున్నాం. కేసుల మిస్టరీలను త్వరలో ఛేదిస్తాం. అన్ని నివేదికలు, సాక్షుల వాంగ్మూలం మేరకు దోషులకు చట్టపరమైన చర్యలు ఉంటాయి. – శ్రీనివాసరావు, ఎస్పీ● 2024 డిసెంబర్ 11న.. మల్దకల్ మండలానికి చెందిన యువతీ యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్త గద్వాలలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుండగా, భార్య హైద్రాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేది. కొన్నాళ్లకు భార్య.. గద్వాలలో భర్త ఉంటున్న ఇంటికి వచ్చింది. రెండు రోజులు ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే డిసెంబర్ 11న ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా భార్య ఫ్యాన్కు ఉరేసుకొని మృతిచెందింది. ఈ సంఘటనపై యువతి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ● 2025 ఫిబ్రవరి 4న.. గద్వాలకు చెందిన ఓ యువకుడు (25) అదే కాలనీకి చెందిన ఓ ట్రాన్స్జెండర్తో కొంతకాలంగా స్నేహంగా ఉన్నాడు. ఈక్రమంలోనే స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అంతలోనే.. ఫిబ్రవరి 4న సదరు యువకుడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మూడురోజుల అనంతరం మృతి చెందాడు. అయితే యువకుడి శరీరంపై కాలిన గాయాలు ఉండడంతో తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హత్యనా.. ఆత్మహత్యనా తేలని మిస్టరీ ట్రాన్స్జెండర్లతో చనువు.. ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి కేసుల్లో పోలీసులు పురోగతి సాధించేనా ? -
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ జాగ్రత్తలు పాటిస్తున్నాం జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్లు, కూలింగ్ గ్లాస్లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. – భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్నగర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి.. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే ఘటన స్థలానికి వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మయ్య, ఏఎస్ఐ, మహబూబ్నగర్ టోపీలు, కళ్లద్దాలతో మేలు.. దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది. – రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్నగర్ ఎండతో ఇబ్బందికరం.. ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. – శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్కర్నూల్ ● -
హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు
గద్వాల క్రైం: నా భర్తను ఓ ట్రాన్స్జెండర్, మరికొందరు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలంటూ మృతుడి భార్య కృష్ణవేణి ఆందోళనకు దిగింది. మల్దకల్ మండలానికి చెందిన కుర్వ రామక్రిష్ణ (24) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే శనివారం ఉదయం అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మృతుడి భార్య, వారి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కంటే ముందు హత్య చేసిన ట్రాన్స్జెండర్ శ్రీవాణితో పాటు మరి కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజేప్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలోనే మృతుడి భార్య కృష్ణవేణి, తన చిన్నారితో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతానని పెట్రోల్ బాటిల్ తీసుకురావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వెంటనే వారించి పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. ఆ వెంటనే చిన్నారితో కలిసి సదరు మహిళ ఆసుపత్రి బయటికి పరుగులు తీసి రోడ్డుపై వెళ్తున్న బస్సు కింద పడేందుకు ప్రయత్నం చేసింది. గుర్తించిన బస్సు డ్రైవర్ క్షణాల్లో బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఉద్రిక్త వాతావరణం దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై మండిపడ్డారు. న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న తమపై ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీను అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని బాధిత కుటుంబసభ్యులను శాంతింపజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేకురుస్తామని భరోసా కల్పించారు. వారిని పట్టుకునేందుకు ఇప్పటికే పలు బృందాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు పంపించామని, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే పని లో ఉన్నామన్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దోషులను శిక్షించాలని మృతుడి భార్య ఆందోళన చిన్నారితో కలిసి పెట్రోల్ పోసుకొని.. బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి క ల్యాణోత్సవం శనివారం వేదపండితు ల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, రవిచారి, మధుసూదనాచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా మహాహోమం నిర్వహించి స్వామి వారి ఉ త్సవమూర్తులకు కల్యాణం జరిపించా రు. ఈ వేడుకను తిలకించేందుకు భ క్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఈఓ సత్యచంద్రారెడ్డి, ఆలయచైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,270 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శనివారం 459 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6270, కనిష్టం రూ.3500, సరాసరి రూ.5400 ధరలు పలికాయి. అలాగే, 12 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6409, కనిష్టం రూ.6206, సరాసరి రూ.6409 ధరలు వచ్చాయి. 129 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.6030, కనిష్టం రూ.4670, సరాసరి రూ.6030 ధరలు పలికాయి. 1117 క్వింటాళ్ల వ రి (సోన) రాగా గరిష్టం రూ.2067, కనిష్టం రూ. 1740, సరాసరి రూ.1986 ధరలు లభించాయి. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్లో శనివారం ఎంఎస్ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎస్ఎన్ అర్జున్కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. పయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్రెడ్డి, హెచ్ఆర్ సుబ్బారావు పాల్గొన్నారు. రామన్పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం వరకు పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులకు చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 63 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వివరించారు. -
అంజన్న జయంతి.. భక్తజన సందడి
గద్వాలటౌన్: శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుడి జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో చేపట్టిన వీర హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు ధరూర్, బీచుపల్లి, చింతరేవుల, మల్దకల్, అయిజ, అలంపూర్, శాంతినగర్, బిజ్వారం తదితర ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజులు నిర్వహించారు. మండల కేంద్రాలలో భారీ ఊరేగింపులు నిర్వహించారు. జయంతి సందర్భంగా దీక్షా పరులు అర్థరాత్రి నుంచే హనుమాన్ భజనలు, పాటలుతో హోరెత్తించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్మోగిన నామస్మరణం జిల్లా కేంద్రంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్దళ్, విశ్వహిందు పరిషత్, దర్మ ప్రసార సమితి నాయకులతో పాటు వివేకానంద సేవాదళ్, హనుమాన్ దీక్షపరులతో గద్వాల పట్టణం కాషాయరంగును సంతరించుకుంది. ‘రామలక్ష్మణ జానకి.. జై భోలో హనుమాన్కీ’ అని కీర్తిస్తూ, పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ నాయకులు అయ్యప్పురెడ్డి, డీకే స్నిగ్దారెడ్డి తదితరులు హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. డీఎస్పీ మొగలయ్య హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. శోభాయమానంగా హనుమాన్ శోభయాత్ర -
తప్పని వెతలు
ఎండలో విధులు.. వడగాలుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ.. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా.. వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. – మహబూబ్నగర్ క్రైం ఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్స్టేషన్ మహబూబ్నగర్లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెడ్కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్ఐ, ఏఎస్ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్కర్నూల్లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను బట్టి రెండు షిఫ్ట్లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్నగర్లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్గేట్, ఔట్గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు పాలమూరులో క్యాప్లు, కూలింగ్ అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ -
బీచుపల్లిలో ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ భక్తుడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆకుపూజ, అభిషేకంతో పాటు వివిధ ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో అభయాంజనేయస్వామిని దర్శించుకుకొని ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వికాస తరంగిని, విశ్వ హిందూ పరిషత్ మరియు ధర్మ ప్రసార సమితి ఆధ్వర్యంలో సభ్యులు ఆలయంలో 41సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాల గురించి భక్తులకు వివరించారు. ఈఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు, వివిద హిందూ సంఘాల సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో సిటీస్కాన్ సేవలు ప్రారంభం
గద్వాల క్రైం: రోగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ సంతోష్కుమార్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలోని నూతనంగా మంజూరైన సిటీ స్కాన్ మిషన్ను వారు ప్రారంభించి మాట్లాడారు. రోగ నిర్ధారణ సేవలు వేగవంతం కానున్నాయని, వివిధ సందర్భాల్లో రోగులకు అత్యాధునిక స్కానింగ్ పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లి పరీక్షలు చేయించుకునేవారని అన్నారు. ఇక నుంచి ప్రభుత్వాసుపత్రిలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, రూ.2.5 కోట్లు సిటీ స్కాన్ నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రిలో సేవలు కల్పించడం జరిగిందన్నారు. రోగులు, గర్భిణుల సమస్యలను గుర్తించి సత్వర సేవలు అందించడం ఇక నుంచి సులువవుతుందని వివరించారు. అనంతరం సిటీ స్కాన్ మిషన్ వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ ఇందిరా, ఆర్ఎం విగ్నేష్ సిబ్బంది ఉన్నారు. పకడ్బందీగా పోషణ్ పక్వాడ గద్వాల: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో సమీక్షించారు. పోషణ్ పక్వాడ 2025ను ఏప్రిల్ 8–22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల అభివృద్ధిలో అత్యంత కీలకమైన వెయ్యి రోజులు గర్భాధారణ ప్రారంభం నుంచి రెండవ పుట్టినరోజు వరకు ప్రత్యేక దృష్టి సారించబడుతుందన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, కౌమరదశలో ఉన్న బాలికలలో బలహీనంగా, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పోషకాహార లోపంతో ఉన్న గర్భిణులు వి వరాలను సేకరించి వారికి సరైన పోషకాహారం అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సి ంగ్రావు, సంక్షేమశాఖ జిల్లా ఽఅధికారి సునంద, వివి ధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
శనేశ్వరుడికి శతకుంభ తిలతైలాభిషేకం
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో వెలసిన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామివారికి శతకుంభ తిలతైలాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శుక్రవారం గణపతి పూజానంతరం జేష్ట్యాదేవి సమేత శనేశ్వరులకు వెయ్యి కుంభాలతో నువ్వుల నూనెతో ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక అష్టోత్తర సహిత అభిషేక పూజలు జరిపారు. కాగా.. శనివారం ఉదయం 9 గంటలకు ఉమామహేశ్వరస్వామి వ్రతం, శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి, సాయంత్ర ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రావు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు వీరశేఖర్, పుల్లయ్య, ప్రభాకరచారి, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, మల్లికార్జున్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలను సద్వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం మండలంలోని కోదండాపురంలో మండలాద్యక్షుడు జగదీష్రెడ్డి ఆధ్వర్యంలో గావ్ చలో గర్ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసి ఎంతో కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణం వీధిలైట్లను ఏర్పాటు చేసిందని, కరోనా కాలం నుంచి ఉచితంగా రేషన్ బియ్యం, ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తుందన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, ప్రదానమంత్రి ఆవాస్యోజన, ఫసల్ బీమా యోజన, గ్రామ సడక్ యోజన, జన్ధన్ యోజన, కౌశల్ వికాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ముద్ర యోజన, ఉజ్వల యోజన వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టి పేద, మధ్యతరగతి ప్రజలకు చేయూతను అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు కే.కే రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయ్, నరేష్, పరుశరామ్, రాముడు, రామకృష్ణ, మహేష్, నారాయణ పాల్గొన్నారు. -
వేరుశనగ క్వింటా రూ.6,289
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 765 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6289, కనిష్టం రూ.3459, సరాసరి రూ.5313 ధరలు పలికాయి. అలాగే, 21 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6509, కనిష్టం రూ. 6226, సరాసరి రూ. 6419 ధరలు వచ్చాయి. 98 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6021, కనిష్టం రూ. 5201, సరాసరి రూ. 6001 ధరలు పలికాయి. 787 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2062, కనిష్టం రూ. 1709, సరాసరి రూ.2009 ధరలు లభించాయి. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా భవానీప్రసాద్ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వచ్చారు. ఖమ్మం రీజియన్లో డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తున్న ఈయన ఇటీవల బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా పనిచేసిన శ్యామల హైదరాబాద్లోని మియాపూర్కు బదిలీపై వెళ్లారు. ముగిసిన జాబ్మేళా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్మేళాకు 380 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటిరోజు గురువారం టీఎస్కేసీ, సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో లెన్స్కార్, ట్రెండ్జ్ ఐటీ, గ్రావిటీ, అన్నపూర్ణ ఫైనాన్స్, ఫ్యూచర్ ప్రాపర్టీ, ఎంపవర్మెంట్, ధ్రువంత్, హెచ్ఆర్హెచ్ నెక్ట్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 300 మంది ఉద్యోగార్థులు రాగా వంద మందిని ఎంపిక చేశారు. అలాగే శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు నిర్వహించగా 80 మంది పాల్గొంటే 20 మందిని ఎంపిక చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని, అందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐక్యూసీ కో–ఆర్డినేటర్ డా.జె.శ్రీదేవి, టీఎస్కేసీ కో–ఆర్డినేటర్ డా.హరిబాబు, మెంటర్ పి.స్వరూప, సైంట్, టీఎంఐ ప్రాజెక్టు మేనేజర్ వికాస్, ఐసీఐసీఐ బ్యాంకు హెచ్ఆర్ కిరణ్ పాల్గొన్నారు. రామయ్యకు ఏకాంత సేవ చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామికి శుక్రవారం రాత్రి పల్లకీసేవ, చక్రతీర్థం, ఏకాంతసేవ, ద్వాదశ ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చనాథులు, శివదత్తాత్రేయ, పరశురామ, ముక్కిడిపోచమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు మురళీధర్శర్మ, లక్ష్మణ్, గోపి, వేణు, ఆనంద్, భాస్కర్, ప్రవీణ్, భక్తులు పాల్గొన్నారు. కనులపండువగా పంబ ఆరట్టు వనపర్తిటౌన్: అయ్యప్ప జన్మదినం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో పంబ ఆరట్టు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించి పంబ ఆరట్టులో భాగంగా పవిత్ర జలాలతో చక్రస్నానం చేయించారు. భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. చక్రస్నానం అనంతరం మేళతాళాలు, వాయిద్యాలతో స్వామివారిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చి పల్లకీసేవ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమై లక్ష్మీ గణపతి హోమం, మూల విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్శర్మ అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తికి 3 గంటల పాటు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఆలయంలోని మూలమూర్తికి సహస్ర నామార్చన, మహా మంగళహారతి, భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
పాలెం డిగ్రీ కళాశాలలో సమూల మార్పులు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (అటానమస్)లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అకాడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు, యూనివర్సిటీ అకాడమిక్ డీన్లు, ప్రొఫెసర్లు, సబ్జెక్టు నిపుణులు, ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరై అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన, సిలబస్ను అభివృద్ధి చేశారు. అంతేకాక పాఠ్యాంశాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం, సవరించడం, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష ఫీజుల నిర్ణయం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, మాడరేషన్, డిటెండ్ నియమాలు, వివిధ ప్రోగ్రాంల వివరణ, విద్యా సంబంధిత నిబంధనలు, ఇతర మార్గ దర్శకాలను రూపొందించారు. సమావేశంలో ప్రొఫెసర్లు చెన్నప్ప, జయపాల్రెడ్డి, పాలెం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాములు, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, పెబ్బేరు కళాశాల ప్రిన్సిపల్ వెంకటప్రసాద్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు పద్మజ, శ్రీనివాసులు, నాగరాజు, సుష్మ పాల్గొన్నారు. -
స్వచ్ఛ ర్యాంకు దక్కేనా?
స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు, సమావేశాలు మున్సిపల్ గత పాలకవర్గంతో పాటు ప్రత్యేక అధికారి నర్సింగరావు, కమిషనర్ దశరథ్ పర్యవేక్షణలో మెప్మా అధికారులు, ఆర్పీల సహకారంతో మహిళ సంఘం సభ్యులతో ఆయా పట్టణాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కాలనీల్లో సమావేశాలు జరిపి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి మున్పిపల్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు అన్ని విధాలా సహకారం అందించారు. మున్సిపాలిటీలకు మంచి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు వస్తుందని భావిస్తున్నారు. ఉత్తమ ర్యాంకే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి. ఆ దిశగా మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో మున్సిపాలిటీ ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా కృషి చేశాం. – దశరథ్, కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఇటీవల ముగిసింది. పట్టణాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అంశాలు, వాస్తవ పరిస్థితిపై వివిధ కోణాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఏ ర్యాంకు వస్తుందోనని సర్వత్రా ఆసిక్తి నెలకొంది. అన్ని అంశాలను పరిగణలోకి.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలో సర్వే నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించేందుకు రహస్య తనిఖీలు నిర్వహించాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ బృందాలు జిల్లాలోని నాలుగు మున్సిపల్ పట్టణాలకు వచ్చి పరిస్థితిని పరిశీలించాయి. స్థానికంగా ఎవరికి తెలియకుండా పట్టణాలలో పర్యటించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాయని సమాచారం. ఆయా మున్సిపల్ పరిధిలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, వినియోగం తీరు తెన్నులను, ఫ్లాస్టిక్ కవర్ల వినియోగం, చెత్త సేకరణ తదితర అంశాలను కేంద్ర బృందాలు పరిశీలించినట్లు తెలిసింది. మున్సిపల్ పనితీరుపై ఫోన్ ద్వారా (టోల్ ఫ్రీ నెంబరు)కు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ స్వచ్ఛ సర్వేక్షన్ యాప్ ద్వారా పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ప్రజలకు ప్రశ్నలు వేసి సమాధానాలను సేకరించి రికార్డు చేశారు. గద్వాలలో చాలా మంది ప్రజలు ఆన్లైన్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం విశేషం. ఆన్లైన్లో అభిప్రాయాలు వెల్లడించిన ప్రజల సంఖ్యను బట్టి రాష్ట్రంలో గద్వాలకు మెరుగైన ర్యాంకు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ముగిసిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై కేంద్ర బృందాల రహస్య తనిఖీలు ఏ మున్సిపాలిటీకి ఏ ర్యాంకు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి -
వంద రోజులు పని కల్పించండి
గద్వాల: ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలోని కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబిలైజ్ చేయాలని వందరోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ప్రతిపనికి సంబంధించి అన్ని రిజిస్ట్రర్లు, ప్రాథమిక రికార్డులు పూర్తిగా ఖచ్చితంగా ఉండాలన్నారు. గత మూడు సంవత్సరాల పనుల వివరాలు, సంవత్సరాల వారిగా ప్రతిపని పూర్తయిందా లేదా అనే వివరాలను ప్రతి పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. కేవలం ప్రజలకు పనులు కల్పించడమే కాకుండా తోటలు, చెరువులు, నీటినిల్వలు, రోడ్లు వంటి పనులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. కూలీ రేటు రూ.300–307పెంచినట్లు తెలిపారు. డిమాండ్కు తగ్గట్లు పనులు జరిగేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. ఉపాధి హామి పథకం కింద నిర్వహించే ఏడు రిజిస్టర్లను ఖచ్చితంగా తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఉపాధి పనుల్లో తోటలు, చెరువులు, రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి
కేటీదొడ్డి: మండలంలోని మీ సేవ కేంద్రాలను మీసేవ ఈ మేనేజర్ శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ఆయన మండల పరిదిలోని కుచినెర్ల గ్రామంలో మీ సేవ కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. సిటిజన్ చాటర్ట్, నోటీస్ బోర్డు, సర్టిఫికేట్, రిజిష్టర్ టోల్ ప్రీ నంబర్లు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలందించాలని సూచించారు. మీ సేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకుంటే కేంద్రాలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మీ సేవ లక్ష్యమన్నారు. ధరల పట్టి కూడా కేంద్రాల్లో విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సురేష్, వెంకటేష్ నాయుడు తదితరులు ఉన్నారు. -
కదలిక వచ్చేనా?
‘ర్యాలంపాడు’ లీకేజీలను పరిశీలించిన నిపుణుల బృందం ●మరమ్మతు చేయాలి ర్యాలంపాడు రిజర్వాయర్ కింద మాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా వరిపంట సాగుచేస్తాను. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడడంతో రిజర్వాయర్లో సగానికే నీటిని నింపుతున్నారు. దీంతో తమ పంటలకు పూర్తిగా నీరు అందడంలేదు. రెండేళ్లుగా ఖరీఫ్ సీజన్లో వారబంధి విధానంతో నీటిని వదిలారు. పంటలకు పూర్తిగా నీరుపారక ఇబ్బందిపడ్డాను. ఈసారైన రిజర్వాయర్కు రిపేర్లు చేయాలి. – రాముడు, రైతు దోర్నాల, ధరూరు మండలం పంటలకు నీరు అందించాలి రిజర్వాయర్ కింద 4ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండెకరాలలో వరి, మరో రెండెకరాలలో పత్తిపంటను పండిస్తాం. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు పడి రిపేర్లు చేయకపోవడంతో మూడేళ్లుగా ఒక్క పంటనే పండించుకుంటున్నాను. కొత్త ప్రభుత్వమైనా స్పందించి త్వరగా రిపేర్లు చేసి తమ పంటలకు నీరు అందించి ఆదుకోవాలి. – తాయప్ప, రైతు, కేటీదొడ్డి నిధులు విడుదల చేస్తేనే.. మరమ్మత్తులకు సంబంధించి నివేదిక హైదరాబాదులోని సీఈ కార్యాలయం టెక్నికల్ విభాగం పరిశీలనలో ఉంది. దీనిపై తుది నిర్ణయం వెలువడి, నిధులు విడుదల చేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తాం. అప్పటి వరకు జలాశయం రక్షణలో భాగంగా సగానికే నీటిని నిల్వ చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్శాఖ వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ.వేల కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కొందరు కాంట్రాక్టర్ల స్వార్థం.. అధికారుల అవినీతి మూలంగా వాటి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. లోపభూయిష్టమైన నిర్మాణాల కారణంగా ఒకటి కాదు రెండు కాదు ర్యాలంపాడు జలాశయం కుడి, ఎడమ అడుగు భాగాలు, రాక్టోల్ ప్రాంతాలు.. మొత్తం లీకేజీలమయంగా మారింది. రూ.కోట్లాది ప్రజాధనం మట్టికొట్టుకుపోతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ర్యాలంపాడు జలాశయం ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. తాజాగా గురువారం లీకేజీలను పూణె నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దీంతోనైనా ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు పనుల్లో కదలిక వస్తుందేమో.. మా పంటలకు నీటి కష్టాలు తీరుతాయేమోనని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. – గద్వాలనడిగడ్డ ప్రాంతంలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టులో ర్యాలంపాడు జలాశయం గుండెకాయ లాంటిది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నెట్టెంపాడు ప్రాజెక్టులో ఏడు జలాశయాలు నిర్మించారు. ఇందులో సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలు స్టాండ్బై కింద కేవలం నీటిని నిల్వ చేసుకునేందకు నిర్మించగా, మరో 5 జలాశయాలు ఆయకట్టుకు నీరు పారించేలా నిర్మించారు. ఇందులో ర్యాలంపాడు జలాశయం కింద 1.05లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4టీఎంసీలుగా నిర్మాణం చేశారు. ఈ జలాశయం ద్వారా, ధరూరు, కేటీదొడ్డి, మల్దకల్ మండలాల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు పారుతుండగా మరోవైపు 2.80టీఎంసీల సామర్థ్యంతో 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు పారించేలా రూ.580కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతలకు కూడా అవసరమైన 2.80టీఎంసీల నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచే ఎత్తిపోసేలా నిర్మాణం చేపట్టారు. అందుకే సాగునీటి నిపుణులు ఈ ర్యాలంపాడు జలాశయాన్ని ప్రాజెక్టుకు గుండెకాయగా పిలుస్తారు. సమగ్ర వివరాలు సేకరణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం జలాశయానికి కుడి, ఎడమ అడుగు భాగాలు, రాక్టోల్ ప్రాంతాల్లో పలుచోట్ల లీకేజీల గుర్తింపు మరమ్మతులకు రూ.137 కోట్ల అంచనా నివేదిక జలాశయం నిండక.. ఆయకట్టు రైతుల అష్టకష్టాలు -
‘ర్యాలంపాడు’ లీకేజీల పరిశీలన
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలను సీడబ్ల్యూపీఆర్ఎస్ పూణెకు చెందిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. ఉదయం11.30 గంటలకు రిజర్వాయర్ వద్దకు చేరుకున్న డాక్టర్ సంజీవ్ బరేలే, సునీల్ పిల్లై (కేరళ), కే. నర్సయ్య (ఏపీ కాకినాడ), మందిర ముజుకుదార్, తనుశ్రీ సమంత తదితరుల బృందం సభ్యులు దాదాపు 3 గంటల పాటు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఎడమ కాల్వ వద్ద నీటి లెవెల్స్, ప్రాజెక్టు బండ్ అండ్ గ్రౌండ్ లెవెల్లను పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్తో పలు విషయాలు ఆరా తీశారు. ప్రాజెక్టు డిజైన్ మ్యాప్స్, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి మెటీరియల్ వాడారు, ప్రాజెక్టు డిజైన్ను ఏ సంస్థ చేపట్టింది, ముందుగా సమస్య ఎక్కడ ఏర్పడింది అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత, లీకేజీల తరువాత ఎంత మేర నీటిని నిల్వ చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. అక్కడి నుంచి లీకేజీలు ఏర్పడిన మూడు ప్రాంతాలను బండ్ ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలించారు. ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటి లెవెల్ కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఉండడంతో లీకేజీ ప్రాంతాల వద్ద ఊట లేకపోవడంపై చర్చించారు. ప్రాజెక్టుపై భాగంలో ఎలాంటి సమస్య లేదని, కేవలం తగ్గు ప్రాంతాల వద్ద మాత్రమే లీకేజీ సమస్య వచ్చినట్లు గుర్తించామని బృందం సభ్యులు తెలియజేశారు. లీకేజీలు ఏర్పడటానికి గల కారణాలను అధ్యయనం చేసందుకు ఇక్కడి నుంచి కొంత మెటీరియల్ను తీసుకు వెళ్లి టెస్టులు నిర్వహించి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను సంబంధిత సీఈకి అందిస్తామని బృందం సభ్యులు తెలియజేశారు. రిజర్వాయర్ ప్రధాన కాలువల వెంట చేపట్టాల్సిన పనులపై ఎస్ఈకి వివరించారు. ఈ ప్రాజెక్టు పరిదిలోని మిగతా రిజర్వాయర్ల గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నోనిపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. -
సమృద్ధి వర్షాలతోనే..
2024–25 ఆర్థిక సంంవత్సరానికి గాను గద్వాల, అలంపూర్ యార్డులు నిర్ధేశించిన లక్ష్యానికి మించి ఆదాయాన్ని అందుకున్నాయి. ఈసారి వర్షాలు బాగా కురుసి, పంట ఉత్పత్తులు బాగా రావడంతోనే యార్డులకు ఆదాయం బాగా సమకూరింది. గద్వాల యార్డుకు నిత్యం వేరుశనగ వస్తోంది. దీనివల్ల సెస్ బాగా వచ్చింది. అలంపూర్ యార్డుకు చెక్పోస్టులతో పాటు, మిల్లులు, అయిజ సంత నుంచి బాగా ఆదాయం లభించింది. – పుష్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి ● -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలోని రైతులకు ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తేలితే వారిపై క్రిమినల్, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా గ్రామాల్లో రైతులు సాగుకు సన్నద్ధమవుతుంటారని, ఈక్రమంలోనే పలువురు వ్యాపారులు నాసీరకం విత్తనాలు, ఫర్టిలైజర్, యూరియా, పురుగుమందులు తదితర వాటిని రైతులకు విక్రయాలు చేస్తుంటారన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే అవకాశం ఉంటుందని, అలాంటి వారిపై నిఘా ఉంచాలని, విరివిగా వ్యవసాయ, పోలీసుశాఖ సంయుక్తంగా సోదాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర డీజీపీ రెండు రోజులపాటు అన్ని జిల్లా పోలీసు అధికారులతో సమావేశంలో ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బందికి వివరించారు. ఎక్కడైన బెట్టింగ్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా వంటి వాటిపై నిఘా ఉంచాలన్నారు. బాధితులతో సిబ్బంది హుందాగా వ్యవహరించి పోలీసులపై నమ్మకం కలిగేల విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, టాటాబాబు ఉన్నారు. -
హిందూ ధర్మం కోసం పాటుపడాలి
ఎర్రవల్లి: హిందూ ధర్మం, సంస్కృతిని కాపాడటం కోసం ప్రతి హిందువు పాటుపడాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఫణి మోహన్రావు అన్నారు. బుధవారం మండల పరిదిలోని బీచుపల్లిలో వివిద మండలాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై వీహెచ్పి నిర్వహిస్తున్న వివిధ అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడంతో పాటుగా సేవ చేయడం కోసం 1964లో వీహెచ్పిని స్థాపించడం జరిగిందన్నారు. దీని ద్వారా 1966లో కుంభమేళా సందర్భంగా ప్రయాగ్లో హిందువుల ప్రపంచ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి రాష్ట్రంలోని ప్రతి మండలంలో హిందూ సమాజం కోసం వీహెచ్పి పనిచేస్తూ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుందని అన్నారు. హిందూ దేవాలయాల పుణరుద్ధరణ మరియు నిర్మాణం కోసం, మతమార్పిడితో పాటు గోహత్యలను అడ్డుకునేందుకు కృషిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రసార ప్రముఖ్ సత్యం, మదన్ మోహన్, నర్సింహా, వివిద మండలాలకు చెందిన ప్రముఖ్లు, సహ ప్రముఖ్లు, తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
గద్వాల: యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ముందస్తు సన్నద్ధం కావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశం హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 యాసంగిలో రైతులు పండించిన ప్రతీగింజను కొనుగోలు చేయాలన్నారు. యాసంగిలో సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో అన్ని రకాల ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు వ్యవహారం సక్రమంగా కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎస్వో స్వామి, డీఎం విమల, డీఏవో సక్రియ నాయక్, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, ఏవోలు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో సివిల్ జడ్జి పూజలు
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గద్వాల సివిల్ జడ్జి గంట కవిత ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయానికి జడ్జి చేరుకోగా.. ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేరుశనగ క్వింటా రూ.6,159 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు బుధవారం 708 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6159, కనిష్టం రూ.3150, సరాసరి రూ.5919 ధరలు పలికాయి. అలాగే, 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4013 ధర వచ్చింది. దీంతోపాటు 38 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5980, కనిష్టం రూ. 4557, సరాసరి రూ. 5950 ధరలు వచ్చాయి. 262 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2057, కనిష్టం రూ. 1737, సరాసరి రూ.2026 ధరలు లభించాయి. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు– మహబూబ్నగర్), (పురుషులు–నాగర్కర్నూల్)లలో విద్యార్థులకు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని టీడబ్ల్యూ గురుకులం మహబూబ్నగర్ రీజియన్ కో–ఆర్డినేటర్ పీఎస్ కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీలో నాలుగు, ఫిజిక్స్లో రెండు, హిస్టరీ, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే ఆయా సబ్జెక్టులలో సెట్, నెట్, పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 16వ తేదీలోగా మహబూబ్నగర్ శివారు తిరుమల హిల్స్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (మహిళలు) ప్రిన్సిపాల్కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే కళాశాలలో నిర్వహించే డెమోకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.7901097704, 9848616564లను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ యా దయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెరుగైన విద్య అందించాలి తిమ్మాజిపేట/తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుదవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలకపల్లి సీఎల్ఆర్ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుపై కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు అత్యాధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చైర్మన్ను సత్కరించారు. ఆయన వెంట అధికారులు రాధాకృష్ణ, శివరాం, రామరాజు, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంఈఓలు శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణశెట్టి, సీఎల్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, రాజమహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘వికాసానికి ’ విఘ్నాలు..!
గద్వాల యార్డులో వడ్లు కాంటా వేస్తున్న కార్మికులు ●‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తులకు అడ్డంకులు రేషన్ కార్డు లేకపోవడంతో.. రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్కార్డు అడిగారు. మాకు రేషన్కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం.. యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్నగర్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్నగర్ ● అనేక ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ● ఆన్లైన్లో మండలం, బ్యాంక్, గ్రామాల పేర్లు గల్లంతు ● రేషన్కార్డులో ఒక్కరికే అవకాశం.. కొత్తవి రాక పలువురి ఆందోళన ● కొన్ని చోట్ల కులం, ఆదాయం సర్టిఫికెట్లకూ తప్పని పాట్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ఈ ఏడాది మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. ఈ ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురైన విషయం తెలిసిందే. దీంతో సర్కారు దరఖాస్తుల తుది గడువును మార్చి 30 నుంచి ఈ నెల 14 వరకు పొడిగించింది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు రకాల సాంకేతిక సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సర్కారు నిర్దేశిత గడువుకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. దరఖాస్తుదారుల్లో ఆందోళన గూడు కట్టుకుంది. మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు నిత్యం చక్కర్లు కొడుతున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో అసహనం వ్యక్తమవుతోంది. సమస్యలు.. ఇబ్బందులు ● జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండలాన్ని మహబూబ్నగర్ జిల్లాలో చేర్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గండేడ్ మండలం నుంచి కొత్తగా మహమ్మదాబాద్ మండలం ఏర్పాటైంది. ఈ క్రమంలో ఆయా మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి.. ఆ గ్రామ పరిధిలోని బ్యాంకులు వెబ్సైట్లో కనిపించడం లేదు. ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకులను ఎంపిక చేసుకున్న పక్షంలో వారికి సంబంధం లేని గ్రామాల పేర్లు చూపిస్తోంది. ఈ సమస్య మహమ్మదాబాద్తో పాటు ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఏర్పాటైన కౌకుంట్ల, మూసాపేట, కొత్తపల్లి, గుండుమాల్, ఎర్రవల్లి, పదర, చిన్నంబావి మండల పరిధిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ● మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, చౌదర్పల్లి గ్రామాలకు సంబంధించిన పేర్లు ఒకసారి వెబ్సైట్లో కనపడుతున్నాయి. మరికొన్ని సార్లు చూపించడం లేదు. దీంతో ప్రతిరోజు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లకు క్యూ కట్టాల్సి వస్తోందని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి యువ వికాసం పథకంలో తొలుత అడ్డంకులు వచ్చాయి. వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించలేదు. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను పక్కన బెట్టడమే కాకుండా.. వెబ్సైట్లో వాటిని ఎత్తేసినట్లు సమాచారం. ప్రస్తుతం వారికి ఇబ్బంది లేకున్నా.. గతంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించకపోవడమే ఇందుకు కారణం. ● రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్, పాన్కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలి. అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయం సర్టిఫికెట్ 2024 ఏప్రిల్ తర్వాత తీసినదై ఉండాల్సి రావడంతో ఎక్కువ మంది మీ సేవ సెంటర్లు, రెవెన్యూ కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు. ఐదారు మండలాల్లో మినహా మిగిలిన మండలాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు లేవు. కుల ధ్రువీకరణలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇంటర్వ్యూలకు త్వరలో షెడ్యూల్.. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో ఇంటర్వ్యూ నిర్వహణకు అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకున్న వారి వ్యాపార పెట్టుబడి ఆధారంగా ఆయా బ్యాంకులు సబ్సిడీ రుణాలు అందజేయనున్నాయి. రూ.50 వేలు తీసుకుంటే 100 శాతం సబ్సిడీ రానుంది. రూ.లక్షకు 90 శాతం, రూ.2 లక్షలకు 80 శాతం.. ఆ తర్వాత రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ వర్తించనుంది. జూన్ రెండో తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేసి.. రుణం మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ధ్రువపత్రాల జారీలో ఆలస్యం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు నారాయణపేట జిల్లా నర్వ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవి. ఇతను రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం వారం రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. చాలామంది ఒకే సారి దరఖాస్తు చేసుకోవడంతో కాస్త ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నాడు. దరఖాస్తులను ఆన్లైన్లో కాకుండా మండల పరిషత్ కార్యాలయంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని రవి కోరుతున్నాడు. తప్పని ప‘రేషాన్’.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది కొన్నేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం రేషన్కార్డులో ఉన్న పేర్లలో ఒకరికి మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో రేషన్కార్డులకు కొత్తగా దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్న వారు యువ వికాసంలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా అర్హులై ఉండి రేషన్ కార్డు రానివారిలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. -
పొగాకు రైతు పరేషాన్
అకాల వర్షాలకు నల్లబారుతున్న పొగాకు మండెలు ●న్యాయం చేయాలి పొగాకు మండలను తిప్పి తిప్పి చేతులు అరిగి పోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి పంటను సాగు చేశాం. తీరా పంట విక్రయిద్దామంటే ఆయా కంపెనీలు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు గతంలో రైతులను అడిగి మరి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలతో పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. ఎక్కడ పంట నల్లగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం, అధికారులు స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలి. – వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, ఉండవెల్లి కుదేలవుతున్నారు.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలో మాత్రమే పొగాకు పంటను సాగుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతు పొగాకు పండించే ముందు మీరు సాగు చేయండి.. మేం కొంటామంటూ నమ్మబలికారు. తీరా పంట చేతికి వచ్చిన సమయంలో కంపెనీ యజమానులు చేతులెత్తేస్తున్నారు. మొత్తంగా పొగాకు సాగు చేసిన రైతు కుదేలవుతున్నారు. జిల్లా అధికారులు రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కంపెనీల యజమానులతో మాట్లాడి రైతులకు న్యాయం అందేలా చూడాలి. – ఈదన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉండవెల్లి: ఓ వైపు అకాల వర్షాల భయం.. మరోవైపు డిమాండ్ ఉన్న రకాలను మాత్రమే కొంటామంటూ ఆయా కంపెనీల నిర్వాహకులు నిబంధనలు పెడుతుండడం.. మొత్తంగా పొగాకు రైతులు పరేషాన్లో పడ్డారు. పొగాకులో 62 రకాలు ఉండగా.. ప్రధానంగా బీడీ, సిగరెట్, చుక్కబర్లి, బర్లి, అడ్–50, కస్తూరికి డిమాండ్ ఎక్కువ. గత ఏడాది పొగాకు పంటకు అధిక ధర పలకడంతో ఈ సారి కూడా లాభాలు వస్తాయని, విస్తారంగా సాగు చేయాలని ఆయా కంపెనీల నిర్వాహకులు సూచించడంతో రైతులు పొగాకులో ప్రధాన రకాలైన సిగిరేట్, బీడిని అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి అందుతుంది. ఈ పరిస్థితుల్లోనే రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అటు అకాల వర్షాలతో ఎండకు ఆరబెట్టిన పొగాకు మండెలు నల్లబారుతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యమైతే మరింత నష్టపోయే అవకాశం ఉందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు బయటి మార్కెట్లో బీడీకి రకానికి మార్కెట్ లేదంటూ కేవలం సిగరెట్ రకాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో బీడీ రకం పొగాకు సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవల బీడి రకాన్ని సాగు చేసిన రైతులు సదరు ప్రైవేట్ కంపెనీ వద్దకు పంట విక్రయించే నిమిత్తం వెళ్లగా.. కంపెనీ వద్దకు రావద్దని తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో బూజు పడుతోంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడి రకం పొగాకు అధిక మోతాదులో సాగు చేశారు. గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నియోజకవర్గాలలోని గ్రామాలకు చెందిన రైతులు పంటను సాగు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 2 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. జోగుళాంబ గద్వాల వ్యాప్తంగా 3500 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేయగా.. కేవలం అలంపూర్ నియోజకవర్గంలోనే 2500 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది పొగాకు క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ఈ ఏడాది వచ్చేసరికి అమాంతం ధర పడిపోయింది. క్వింటా రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుండడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండు నెలలుగా పొగాకు మండలను దింపడం ప్రారంభించారు. ఇదిలాఉండగా, గత పది రోజులుగా కురుస్తున్న వర్షంతో మండలు నల్లబారి బూజు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు ఆశచూపడంతో విస్తారంగా సాగు తీరా పంట చేతికి వచ్చాక.. ఆ రకానికి మార్కెట్ లేదంటూ వెనుకంజ దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు -
బీచుపల్లిలో ముగిసిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: శ్రీరామ నవమిని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, యాగశాల చతుస్థానార్చన, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ వంటి పూజలు చేశారు. సాయంత్రం ద్వాదశారాధన, శ్రీపుష్పయాగం, ధ్వజావరోహణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి గద్వాలటౌన్: పాలమూరు యూనివర్సిటీ పరిఽఽధిలోని గద్వాల ప్రభుత్వ పీజీ సెంటర్లో మంగళవారం కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీఓ 21ని వ్యతిరేకిస్తూ తరగతులను బహిష్కరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రిన్సిపల్ వెంకటరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 21తో కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని.. పార్ట్టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంగళగిరి శ్రీనివాసులు, మహేందర్, గోపినాథ్ రాథోడ్, వంగూరి గణేశ్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,949 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 1,695 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 5,949, కనిష్టంగా రూ. 3,069, సరాసరి రూ. 5,199 ధరలు వచ్చాయి. 36 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,529, కనిష్టంగా రూ. 6,009, సరాసరి రూ. 6,529 ధరలు లభించాయి. 40 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,009, కనిష్టంగా రూ. 5,661 ధర పలికింది. 424 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,030, కనిష్టంగా రూ. 1,759, సరాసరి రూ. 2,019 ధరలు లభించాయి. -
రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకోండి
ఇటిక్యాల: ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకానికి అర్హులైన యువత దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ ఉన్నారు. కేటగిరీల వారీగా కేటాయింపులు గద్వాల: రాజీవ్ యువవికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం, ఒంటరి మహిళలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్, ఆదాయం, కుల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాన్స్పోర్ట్ పథకం కోసం), పట్టాదారు పుస్తకం (వ్యవసాయ సంబంధిత పథకానికి), సదరం ధ్రువపత్రం, వితంతు, ఒంటరి మహిళల ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జతపరిచి మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందించాలని సూచించారు. -
కొనుగోళ్లకు కంపెనీల అనాసక్తి
పొగాకు కంపెనీలు అయిన వీఎస్టీ, ఐటీసీ, అలియాన్స్, జీపిఐ, బొమ్మిడాల్, డెక్కన్, నూర్, తదితర కంపెనీలు ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లోనే అధికంగా ఉన్నాయి. బీడి రకం పొగాకు, చుక్కబర్లి, రకాలు త్వరగా కొంటారని ఎంతో ఆశపడి రైతులు సాగు చేశారు. ఒక్కో రైతు 10 ఎకరాలకు పైగా పొగాకును సాగు చేశారు. కానీ తీరా పంట చేతికి వచ్చే సమయంలో బయటి మార్కెట్లో ఏ రకానికి డిమాండ్ ఉంటే అదే కొనుగోలు చేస్తామంటూ కేవలం సిగరేట్ రకాన్ని కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో మిగతా రకాలు సాగు చేసిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని కంపెనీలు మీరు ఎంత సాగు చేసినా.. మేం ఇంత మేర మాత్రమే కొంటామని పేర్కొంటున్నాయి. మరికొన్ని ఈ ధర ఇస్తేనే కొనుగోలు చేస్తామని తేల్చి చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పడ్డారు. -
వంటింటికి గ్యాస్ సెగ
గద్వాలటౌన్: నిత్యావసరాల ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వంట నూనెలు సలసలమంటుండగా.. కూరగాయలు కంటతడి పెట్టిస్తున్నాయి. వీటికే సామాన్యుల వంటగది ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుండటంతో పేదల నెలవారీ బడ్జెట్ తలకిందలవుతోంది. తాజాగా గృహ వినియోగ 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై రూ.50 పెరగడం మరింత గుదిబండగా మారింది. ● జిల్లాలో మొత్తం 11 ఏజెన్సీలు ఉండగా.. వాటి పరిధిలో వివిధ రకాలకు చెందిన మొత్తం 1,76,578 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,68,637 కనెక్షన్లు గృహ వినియోగానికి సంబంధించినవి ఉన్నాయి. గతంలో వీటిపై ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. రానురాను ఏడాదికి ఆరు సిలిండర్లకే రాయితీని పరిమితం చేశారు. సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో పాటు రాయితీ తగ్గిపోయింది. ప్రస్తుతం సబ్సిడీని కూడా పూర్తిగా ఎత్తేశారు. అయితే ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందిన వారికే మాత్రమే రాయితీ దక్కనుంది. తాజాగా రూ.50 పెరగడంతో ప్రస్తుతం గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.925కు చేరుకుంది. అయితే జిల్లాలో ప్రతినెలా సరాసరి 70వేల గృహవినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. తాజా పెంపుతో గృహ సిలిండర్ వినియోగదారులకు ప్రతినెలా రూ. 35లక్షల వరకు అదనపు భారం పడనుంది. రెండేళ్లుగా తగ్గుతూ.. గ్యాస్ ధరలు రెండేళ్ల క్రితం భారీగా పెరగడంతో ప్రజలు సతమతమయ్యారు. తర్వాత క్రమంగా ధరలు తగ్గుతూ వచ్చాయి. 2023 మార్చి వరకు రూ. 1175 ఉన్న ధర.. నవంబర్లో రూ. 1,125కు చేరింది. తర్వాత నెల రోజులకే రూ.975కు తగ్గింది. ఇలా నాలుగు నెలలపాటు కొనసాగిన ధర 2024 మార్చి లో రూ. 875కు తగ్గింది. అప్పటి నుంచి ఏడాది పాటు ధర స్థిరంగా ఉంటూ వస్తోంది. తాజాగా గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మహాలక్ష్మి, దీపం పథకం లబ్ధిదారులపై మాత్రం పెరిగిన ధర ప్రభావం ఉండదు. భారం మోపడం తగదు.. వంట గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వాలే అలవాటు చేశాయి. సబ్సిడీలు ఇచ్చి మరీ కొనిపించారు. సబ్సిడీ నగదు క్రమేణ ఎత్తేశారు. రవాణా చార్జీలను అదనంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు సిలిండర్పై రూ.50 ధర పెంచడం దారుణం. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెంచేసి జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. సామాన్యులపై మోయలేని భారం మోపడం తగదు. – రేణుక, గృహిణి, గద్వాల వంటావార్పు కష్టమే.. అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయి. ఏం కొనలేం.. తినలేం అనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గ్యాస్ ధర పెరగడంతో వంట వండుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. సిలిండర్ ధర పెరిగిందని.. కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి లేదు. పేదలకు ఈ ధరల పెరుగుదల భారంగా మారుతుంది. – సావిత్రి, గృహిణి, గద్వాల ● గృహ వినియోగ సిలిండర్పై రూ.50 పెంపు సబ్సిడీని పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం జిల్లా వినియోగదారులపై ప్రతినెలా రూ. 35లక్షలకు పైగా భారం -
ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్
అయిజ/మల్దకల్: విద్యార్థులు శ్రద్ధగా ఉన్నత విద్య అభ్యసిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి గంట కవితాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని పులికల్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, మధ్యాహ్న భోజనం వంట సరుకులను న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని.. ఎక్కడైనా బాల్యవివాహం చేసేందుకు సిద్ధమైతే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలకు 5 కి.మీ. దూరంలోని బైనపల్లి, కిసాన్ నగర్, రాజాపురం గ్రామాల నుంచి వస్తున్నామని, తమకు సైకిళ్లు ఇప్పించాలని విద్యార్థులు కోరగా.. దాతలతో మాట్లాడి సైకిళ్ల పంపిణీకి కృషిచేస్తానని న్యాయమూర్తి హామీ ఇచ్చారు. ● మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామిని సీనియర్ సివిల్జడ్జి కవితాదేవి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తిని శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవిచారి, చంద్రశేఖర్రావు, మధుసూదనాచారి పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి
గద్వాల: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఈ నెల మూడో వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో పొందుపర్చాలని తెలిపారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఎదురైనా ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. సమావేశంలో డీఎస్ఓ స్వామి, డీఎం విమల, డీఏఓ సక్రియ నాయక్ తదితరులు ఉన్నారు. -
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మానవపాడు: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారి గంట కవిత సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో భవిష్య భారత్ ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మద్యం, సిగరెట్, గుట్కా, సారా వంటి వ్యసనాలను నియంత్రించాలని అన్నారు. బాల్యవివాహాలపై గ్రామస్థాయిలో ప్రజలకు ఆశ వర్కర్లు అవగాహన కల్పించాలని, వాటి వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అది చెడిపోతే కుటుంబం నాశనం అవుతుందని పేర్కొన్నారు. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేది ఒక్క వైద్యులు, వైద్య సిబ్బందికేనని, ఆశ కార్యకర్తలు ఆరోగ్య సైనికులని, గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆరోగ్యంపై, వ్యాసనాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అనంతరం జడ్జితోపాటు ప్రాజెక్ట్ మేనేజర్ నాగరాజు క్షయ వ్యాధికి సంబందించి పలువురికి ఆరోగ్య, పోషకకిట్లను అందించారు. ఎస్బీఐ భవిష్య అంబులెన్స్ సేవలను గురించి, బ్లడ్ పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధులు వెంటనే పరీక్షలు వివరలను రోగులకు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి రాజు, నోడల్ అఫీసర్ సాధిక్, డాక్టర్ హేమమానస, సూపర్వైజర్ చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 37మంది ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి పట్టాభిషేకం
ఎర్రవల్లి/ఉండవెల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు ఉదయం ఆలయంలో అర్చకులు సుప్రభాతసేవ, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి, తదనంతరం విష్వక్షేనపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, వస్త్రసమర్పన, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల నడుమ కనులపండువగా చేపట్టారు. నేత్రపర్వం.. రథోత్సవం ఉండవెల్లి మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో రాములోరి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఓ వైపు బాలికలు, చిన్నారుల కోలాటాలు.. మహిళల మంగళహారతుల నడుమ కనులపండువగా సాగింది. బీచుపల్లిలో రాములోరికి పట్టాభిషేకం చేస్తున్న అర్చకులు -
రెగ్యులర్ ‘రగడ’..!
●మాకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్, పీయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆందోళనలు తీవ్రతరం చేస్తాంయూనివర్సిటీ ప్రారంభం నుంచి పీయూలో లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్ పోస్టుల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. కాంట్రాక్ట్ అధ్యాపకుల స మస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. – శ్రీనివాస్, వీసీ, పాలమూరు యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఊరుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవారం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు. త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్.. యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్, 60 మంది పార్ట్టైం ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొత్తం 58 రెగ్యులర్ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. ఇవి పోను 42 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూలో ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గత తొలగింపుల నేపథ్యంలో.. పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. అనంతరం వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా.. నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, హెచ్ఓడీ కన్వీనర్గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటాయించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కులు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఒక్క సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్ ఫెల్లోషిప్ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్నట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తున్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీయూలో జీఓ 21 లొల్లి శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్లో ఆందోళన దశల వారీగా తమను తొలగిస్తారని బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం మేమెందుకు అర్హులం కాదు ? ఇటీవలి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్చాన్స్లర్ శ్రీనివాస్, నూతన రిజిస్ట్రార్ రమేష్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
కేంద్రం సహకారంతోనే సన్న బియ్యం పంపిణీ
ఎర్రవల్లి: రేషన్ బియ్యం పంపిణీలో సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని..ప్రతి వ్యక్తికి అందిస్తున్న 6 కిలోల సన్నబియ్యంలో కేంద్రం ప్రభుత్వం ఐదు కిలోలు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో మాత్రమే ఇచ్చి ప్రగల్బాలు పలుకుతోందని బిజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మండిపడ్డారు. సోమవారం మండల పరిదిలోని వల్లూరు గ్రామంలో ఆ పార్టీ మండలాద్యక్షుడు జగదీష్రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసి ప్రజలకు ఉచితంగా రేషన్బియ్యం అందిస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఇటీవలె సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటోను పెట్టకుండా కేవలం సిఎం పోటోను పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులుల కే.కే రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజు, గ్రామ పెద్దలు, తదితరులు ఉన్నారు. అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మానవపాడు: అసంక్రమిత వ్యాధులు మానవ జీవితాలను నాశనం చేస్తాయని, అసంక్రమిత వ్యాధులుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశలకు అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం మరణాల్లో సుమారు 74శాతం అసంక్రమిత వ్యాధుల వల్లనే జరుగుతున్నాయని, చాలా ఎన్సీడీలు జీవనశైలి సంబంధిత కారణాలతో కలుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత స్థాయిలో బాధ్యత, సామాజిక, ఆరోగ్య సేవలపై ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమమానస, హెలెన్, చంద్రన్న, అక్కమ్మ, సూపర్వూజర్లు, ఏఎన్ఎమ్లు, ఆశలు తదితరులు పాల్గోన్నారు. గడువు పొడిగింపు గద్వాల: జిల్లాలో నిరుద్యోగ క్రిస్టియన్ యువతకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చుటకు గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 12వ తేదీ వరకు పొడగించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్బాబు ప్రకటనలో తెలిపారు. సాగునీటి కోసం రైతుల ఆందోళన అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలను నిలిపివేయడంతో సోమవారం ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆత్మకూర్ మండలంలోని ఆరెపల్లి, కత్తేపల్లి, తూంపల్లి గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వద్దకు చేరుకొని గద్వాల– అమరచింత రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేతికొచ్చే దశలో ఉన్న యాసంగి పంటలకు సాగునీరు అందించక పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి సాగుకు వారబందీ ద్వారా సాగునీటిని క్రమం తప్పకుండా అందిస్తామన్న అధికారులు.. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. వారబందీ విధానంలో మరో రెండు పర్యాయాలు సాగునీరు వదలాలని డిమాండ్ చేశారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులపాటు సాగునీటిని కాల్వలకు వదులుతామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో రైతులు ధర్నాను విరమించారు. పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు అందించాలని ఏఈ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు. -
బెట్టింగ్ భూతం..!
ఈజీమనీ ఆశతో రూ.లక్షలకు లక్షలు బెట్టింగ్ గద్వాల క్రైం: ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అన్న యువత అత్యాశను కొన్ని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. యువతకు మొదట్లో డబ్బు వస్తున్నట్లు ఆశ చూపించి.. బెట్టింగ్ ఊబిలోకి దింపడం.. తీరా రూ.వేల నుంచి రూ.లక్షలు బెట్టింగ్ వేశాక కోరుకోలేని దెబ్బతీస్తున్నారు. అటు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. వారి ఒత్తిళ్లు భరించలేక.. కుటుంబసభ్యులకు ఏం చేప్పుకోవాలో తెలియక జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కావడంతో నడిగడ్డలో ఆన్లైన్ బెట్టింగ్లకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్లు మొబైల్స్ రాకతో పట్టణ, గ్రామీణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో పందెం ఆట విడుపుగా మారింది. పందెంలో వేసిన డబ్బులు పోగుట్టుకున్న వారంతా అప్పులు చేసి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ఘటనలు ● ఈ ఏడాది మార్చి 30న జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు(25) ఆన్లైన్లో క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లు వేస్తు రూ.6లక్షలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఓ కారును తాకట్టు పెట్టి కొంత మేర అప్పు తీర్చాడు. అయినప్పటికీ మిగతా అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇదే మొదటిసారి కాదు డబ్బులు ఇవ్వడం అంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ● ఈ నెల 5వ తేదీన గద్వాల మండలానికి చెందిన ఓ యువకుడు(22) ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఆన్లైన్లో బెట్టింగ్లు వేశాడు. బెట్టింగ్ ఓడిపోవడంతో వారికి డబ్బు చెల్లించేందుకుగాను తెలిసిన వ్యక్తుల ద్వారా రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారు మందలించారు. దీంతో కలత చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ● జూన్ 2.2023 జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రికెట్ బెట్టింగ్లో రూ. 70లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు క్రికెట్ బెట్టింగ్లో ప్రముఖులు సైతం రూ.కోట్ల పోగొట్టుకున్నారు. కొందరు అప్పులు చెల్లించే దుస్థితి లేకపోవడంతో జిల్లా విడచి పారిపోయారు. ఏజెంట్లపై గద్వాల, శాంతినగర్, రాజోళి, అయిజ, ఉండవెల్లి తదితర పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలి క్రికెట్, ఇతర బెట్టింగ్లకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలి. ఇలా బెట్టింగ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో సిబ్బందికి దిశానిర్ధేశం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటే అనుమానించాల్సిందే. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సైబర్క్రైం వెబ్సైట్, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930, డయల్ 100కు ఫిర్యాదు చేయాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడితో యువత సతమతం జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరి బలవన్మరణం మాయాజాలం టీవీలలో క్రికెట్ చూస్తూ టాస్ మొదలుకుని, వికెట్ల చొప్పున, బంతి, బంతికి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. మ్యాచ్లో తలపడే జట్టులో ఫలానా జట్టు టాస్ గెలుస్తుందని, ఫలానా జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని బెట్టింగ్ చేస్తారు. ఈ బెట్టింగ్లో ఒకటికి రెండింతలు చెల్లించే పద్ధతిని పాటిస్తారు. మొదటి ఓవర్లో వికెట్ పడుతుందని, సిక్సర్ కొడ్తారనే బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. తర్వాతి ఓవర్లలో బంతి, బంతికి... ఫోర్, సిక్సర్ కొడతారని, వికెట్ పడుతుందని, ఎక్స్ట్రా రన్ వస్తుందని, రివ్యూ ఛాయిస్ తీసుకుంటారంటూ పలు రకాలుగా బెట్టింగ్లు చేస్తారు. ఒక్కో సందర్భంలో బెట్టింగ్కు పాల్పడే మొత్తానికి 5 నుంచి 10 రెట్ల వరకు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. -
పల్లెపల్లెన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాలటౌన్: భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా పార్టీ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని బూత్స్థాయిలో పార్టీ జెండాను ఆయా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యకర్తలు సైతం తమ ఇళ్లపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై బీజేపీ ఆవిర్భవించిందని చెప్పారు. ఒకేదేశం, ఒకే ప్రజలు, ఒకే మతం కావాలని కోరిన ఘనత తమ పార్టీదేనని పేర్కొన్నారు. మహనీయుల అవిశ్రాంత సేవ, కృషి ఫలితంగానే జనసంఘ్ నుంచి భారతీయ జనతాపార్టీ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలు, నయవంచక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్సర్పాష, డీకే స్నిగ్దారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్ఏక్బోటే, బండల పద్మావతి, జయశ్రీ, సంజీవ్ భరద్వాజ్, వెంకటేశ్వర్రెడ్డి, నర్సింహా, దేవదాసు, అనిల్, చిత్తారికిరణ్, మమత తదితరులు పాల్గొన్నారు. -
జగమంతా రామమయం
జోగుళాంబ గద్వాలకనుల పండువగా సీతారాముల కల్యాణ మహోత్సవం వాతావరణం ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది. ఆకాశం స్వల్పంగా మేఘావృతమై ఉంటుంది. సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 8లో u● జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగిన కల్యాణోత్సవాలు ● తరలివచ్చిన భక్తజనం గద్వాలటౌన్: ఆకాశమంత పెళ్లిపందిరి.. భూలోకమంత కల్యాణ వేదిక.. అష్టదిక్కులా మార్మోగుతున్న మంత్రోచ్ఛరణల నడుమ జగదాభిరాముడు జానకి మెడలో మాంగల్యధారణ చేశారు. అంగరంగ వైభవంగా కోదండరాముని కల్యాణం జరిగింది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు నిర్వహించారు. అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయ ప్రాంగంణంలో, బీచుపల్లిలోని శ్రీ కోదండరామాలయంలో, ధరూర్ పాగుంట లక్ష్మివెంకటేశ్వరస్వామి ఆలయం, మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం, గద్వాల మండలంలోని చెనుగోనిపల్లి, సంగాల, కొండపల్లి, గోనుపాడు, పరుమాల గ్రామాల్లో కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కోటలోని రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని మంత్రాలయ మఠం ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతల ప్రత్యేక పూజలు. శ్రీరామనవమి వేడుకలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ తదితరులు వివిధ ఆలయాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల, మల్దకల్, ధరూర్, కేటీదొడ్డి మండలాల్లోని ఆలయాలలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడు సుగుణాభిరాముడు, ఆయన జీవితం మానవలోకానికి ఆదర్శమని ఆయన అన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత జిల్లా కేంద్రంలోని ఆలయాలతో పాటు గద్వాల మండలంలో పలు గ్రామాలలో జరిగిన కల్యాణత్సవ ఘట్టానికి ముందు జరిగే పూజా కార్యక్రమాలలో ఆమె శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భారతీయ సమిష్టి కుటుంబంలో పెద్ద కొడుకు, భర్త, అన్న, ప్రభువు, ఎలా ఉండాలో ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతుడు కోదండరాముడన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుఖశాంతలతో జీవించాలని ఆ కల్యాణరాముడ్ని కోరుకున్నానని చెప్పారు. మార్మోగిన రామనమం.. గద్వాలటౌన్: రామ నామంతో గద్వాల పట్టణ పురువీధులు మార్మోగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సాయంత్రం చేపట్టిన శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్దళ్, విశ్వహిందు పరిషత్, దర్మ ప్రసార సమితి, బీజేపీ నాయకులతో పాటు ఏబీవీపీ విద్యార్థులు, వివేకానంద సేవాదళ్, హిందూ ధార్మిక సంఘాలతో గద్వాల పట్టణం కాషాయరంగును సంతరించుకుంది. శ్రీరాముని పాటలు, ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎస్పీ మొగిలయ్య ఆధ్వర్యంలో యాత్రను ఎప్పటికప్పుడు సీఐ శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు. ఆరుగురు ఎస్సైలు, 50మంది పోలీసు సిబ్బంది శోభయాత్ర గస్తీలో పాల్గొన్నారు. చారకొండ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో ఆదివారం సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జగదభిరాముడి కల్యాణ వైభోగాన్ని భక్తజనం కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీతారామచంద్రస్వామిని పట్టువస్త్రాలతో చూడముచ్చటగా అలంకరించి.. మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా జరిపించారు. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులుగా.. జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలైన వేళ సిర్సనగండ్ల క్షేత్రం భక్తిపారవశ్యంతో ఉప్పొంగింది. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో గంటల తరబడి బారులుదీరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిర్సనగండ్ల దేవాలయం అభివృద్ధికి టూరిజం, సాంస్కృతికశాఖ నుంచి తక్షణమే రూ.2 కోట్లు విడుదల చేస్తామన్నారు. అలాగే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మరో రూ.50 కోట్ల మంజూరుకు కృషిచేస్తానన్నారు. దేవాలయ అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవానికి దాదాపుగా 30 వేల మంది భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు. గద్వాలలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అపర భద్రాద్రి సిర్సనగండ్లలో ఉప్పొంగిన భక్తిపారవశ్యం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు -
పల్లె వనం.. కళావిహీనం
మొక్కలను కాపాడతాం పల్లె ప్రకృతి వనాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం. నీటి సాదుపాయం అందించేలా చూస్తాం. మొక్కలు ఎండకుండా కాపాడతాం. – నాగేంద్రం, జిల్లా పంచాయతీ అధికారి నిర్వహణ ముఖ్యం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే పల్లె ప్రకృతి వనాల ముఖ్య ఉద్దేశం. నిర్వహణ లేకనే లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు స్పందించి మొక్కలు ఎండకుండా ప్రతి రోజు నీరందించాలి. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచాలి. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటుచేయాలి. – విజయ్కుమార్, మాజీ సర్పంచ్, బోరవెల్లి ● నీటి సౌకర్యం లేక వాడుతున్న మొక్కలు ● ఆహ్లాదానికి దూరమవుతున్న ప్రజలు ● మందుబాబులకు అడ్డాగా మారుతున్న వైనం ●మానవపాడు: పల్లె ప్రజలకు ప్రకృతి అందాలు పంచేందుకు దాదాపు రూ.లక్షలు వెచ్చించి పెంచిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేక వృథాగా మారాయి. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని.. ఎన్నో ఔషధ మొక్కలకు నెలవుగా మారాలని.. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పల్లె ప్రకృతి వనాలు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి.. మందుబాబులకు అడ్డాగా మారాయి. మొత్తంగా పల్లె ప్రకృతి వనాలు కళతప్పాయి. జిల్లాలోని 13 మండలాల్లో 254 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో పల్లెప్రకృతివనం నిర్మించారు. రెండేళ్ల పాటు ఈజీఎస్, ఆ తర్వాత జీపీలు నిర్వహణ బాధ్యతలు చూశాయి. అయితే, గ్రామాలకు దూరంగా ఉండటం, కొన్ని గ్రామాల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, నీటి సౌకర్యం లేకపోవడం.. వీటికి తోడు వేసవి ఎండలకు మొక్కలు ఎండిపోతున్నాయి. ఊరికి దూరంగా ఉండడంతో రాత్రివేళ్లలో మద్యం బాబులు అడ్డాలుగా వాడుకుంటున్నారు. -
ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ భవన్లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కల్పించబడిన చట్టబద్ధ హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక కర్షక ఫాసిస్ట్ విధానాలపై మే రెండో వారంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. -
అన్నదాతకు ఊరట
2025–26 ఆర్థిక సంవత్సరం పంట రుణపరిమితి పెంపు వివరాలు 8లో u●ఆదేశాలు జారీ.. పంట రుణాల పరిమితిని పెంచుతూ ఎస్ఎల్టీసీ నుంచి ఇటీవలే ఉత్తర్వులు అందాయి. ఈ వివరాలను జిల్లాలోని అన్ని బ్యాంకులకు పంపించాం. 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లలో పెంచిన రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు అందించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ మేరకు బ్యాంకర్లు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – అయ్యపురెడ్డి, ఎల్డీఎం గద్వాలన్యూటౌన్: బ్యాంకుల ద్వారా రైతులకు అందించే పంట రుణాల పరిమితి పెరిగింది. వివిధ రకాల పంటలకు ఇచ్చే రుణాల పరిమితిని పెంచుతూ జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్టీసీ) చేసిన ప్రతిపాదనలను ఎస్ఎల్టీసీ ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఏటా పంట రుణాలు పొందుతున్న అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెంపు.. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు డీసీసీబీ ఆద్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయిలో బ్యాంకర్లు, వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో వివిధ రకాల పంటలకు అయ్యే పెట్టుబడులు, ఇతరాత్ర అయ్యే ఖర్చులు, గడిచిన ఆర్థిక సంవత్సరం ఆయా పంటలకు ఇచ్చిన రుణాల గురించి చర్చిస్తారు. ఆయా పంటలకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన రుణాలు ఎంతమేర పెంచాలో చర్చించి, ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఇందులో భాగంగా 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో పంట రుణ పరిమితిపై గత మార్చిలో నిర్వహించిన డీఎల్టీసీ సమావేశంలో పంట రుణపరిమితిపై ప్రతిపాదనలు రూపొందించి స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ)కి నివేదించారు. అధికారులు అక్కడ మరోసారి చర్చించి.. పంట రుణపరిమితిని పెంచుతూ మార్చి 26న నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు రూ. వెయ్యి నుంచి రూ. 2వేల వరకు పెంచారు. అదే విధంగా కూరగాయల తోటలకు సంబంధించి సాధారణ సాగుకు రూ. వెయ్యి నుంచి రూ. 2వేల వరకు, మల్చింగ్ పద్ధతిన సాగుకు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు రుణపరిమితిని పెంచారు. గతేడాది ఎకరాకు ఇచ్చిన, ఈఏడాది ఇవ్వనున్న రుణ వివరాలు (రూ.లలో).. ప్రధాన పంటలకు ఇలా.. పంట 2024–25 2025–26 వరి 43,000–45,000 44,000–46,000 వరి (సీడ్) 48,000–50,000 48,000–50,000 జొన్న 18,000–20,000 19,000–21,000 జొన్న (సీడ్) 22,000–25,000 24,000–26,000 మొక్కజొన్న 32,000–34,000 34,000–36,000 సజ్జ 15,000–17,000 16,000–18,000 కంది 22,000–24,000 23,000–25,000 పప్పుశనగ 24,000–26,000 25,000–27,000 పత్తి 44,000–46,000 46,000–48,000 పత్తి (సీడ్) 1,40,000–1,50,000 1,40,000–1,50,000 వేరుశనగ 28,000–30,000 30,000–32,000 ఆముదం 19,000–20,000 20,000–21,000 పండ్లతోటలకు ఇలా.. రకం 2024–25 2025–26 మామిడి 42,000–44,000 45,000–47,000 మామిడి (హైడెన్సిటి) 60,000–65,000 64,000–66,000 పొప్పాయి 65,000–67,000 67,000–69,000 కలంగడి 33,000–35,000 34,000–36,000 జామ 45,000–47,000 47,000–49,000 బత్తాయి 43,000–45,000 45,000–47,000 దానిమ్మ 75,000–77,000 76,000–78,000 నిమ్మ 48,000–50,000 50,000–52,000 కూరగాయలకు ఇలా.. రకం 2024–25 2025–26 ఎండుమిర్చి 82,000–84,000 84,000–86,000 టమాటా 53,000–55,000 55,000–57,000 వంకాయ 38,000–40,000 40,000–42,000 ఉల్లి 43,000–45,000 45,000–47,000 బెండ 28,000–30,000 30,000–32,000 క్యాబేజీ 33,000–35,000 33,000–35,000 క్యాలీఫ్లవర్ 32,000–34,000 33,000–35,000 మునగ 33,000–35,000 34,000–36,000 క్యాప్సికమ్ 48,000–50,000 50,000–52,000 బ్యాంకు రుణాలపైనే ఆధారం.. జోగుళాంబ గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఇక్కడ జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, 120 దాకా చెరువులు, కుంటలు ఉన్నాయి. జిల్లాలో వేలాది మంది సన్న, చిన్నకారు రైతులు ఏటా పంట పెట్టుబడులకై బ్యాంకు రుణాలపైనే ఆధార పడతారు. పంట రుణ పరిమితి పెంచడం రైతులకు ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఏటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాాలం కలిసి వస్తేనే అన్నదాతకు కొంత డబ్బు మిగులుతోంది. పంట పెట్టుబడులకు రైతుభరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పథకాలు ఉన్నా.. వాటితో రైతుల అవసరాలు పూర్తిగా తీరవు. ఈక్రమంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది. ఎకరాకు రూ. 3వేల వరకు పెంచుతూ ఎస్ఎల్టీసీ ఉత్తర్వులు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ వానాకాలం, యాసంగి సీజన్లలో రుణాలు పొందే రైతులకు ప్రయోజనం -
భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం, చతుస్థానార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, గరుడపట గ్రామోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. నేడు సీతారాముల కల్యాణోత్సవం.. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. భక్తులు రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. వక్ఫ్ సవరణతో పేద ముస్లింలకు మేలు గద్వాలటౌన్: వక్ఫ్ సవరణ బిల్లుతో పేద ముస్లింలకు ఎంతో మేలు చేకూరుతుందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్పాషా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు పేరుతో ఇంతకాలం జరిగిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. వెనుకబడిన ముస్లింలకు ఇది ఆర్థికపరమైన ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. పేద ముస్లింలు బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు. సమావవేశంలో బీజేపీ నాయకులు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రవికుమార్, మాలీం ఇసాక్, మోహిద్ ఖాన్, ఆసిఫ్, అతాఉర్ రహమాన్, దేవదాసు, నర్సింహ తదితరులు ఉన్నారు. -
జగ్జీవన్రాం జీవితం.. ఆదర్శనీయం
గొప్ప విప్లవకారుడు.. సమాజంలో అసమానతలపై పోరాటం సలిపిన గొప్ప విప్లవకారుడు బాబు జగ్జీవన్రాం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బోయ వెంకట్రాములు, గడ్డం కృష్ణారెడ్డి, బండారి భాస్కర్, శ్రీధర్గౌడ్, మురళి, కురుమన్న పాల్గొన్నారు. గద్వాల: సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవిత పర్యాంతం శ్రమించిన గొప్ప మహనీయుడు దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రాం అని కలెక్టర్ బీఎం సంతోష్ కొనియాడారు. శనివారం బాబు జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రాం స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా.. స్వాతంత్య్రం అనంతరం దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్నారు. రక్షణశాఖ మంత్రిగా ఇండో, పాక్ యుద్ధ సమయంలో దేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో నాయకత్వం వహించినట్లు తెలిపారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్రాం జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సరోజ, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రమేశ్బాబు, ఇన్చార్జి డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్ మల్లిఖార్జున్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
రాజోళి/శాంతినగర్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. రాజోళి మండల కేంద్రం, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళారుల మాటలు నమ్మి సన్నబియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. అదే విధంగా రాజోళిలో కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పి.రామ్మోహన్, వీరభద్రప్ప, డీటీలు శ్రీకాంత్రెడ్డి, ప్రశాంత్గౌడ్, ఆర్ఐ సర్ధార్, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,289 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 1,265 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,289, కనిష్టంగా రూ. 3,019, సరాసరి రూ. 4,789 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,369, కనిష్టంగా రూ. 5,116, సరాసరి రూ. 6,369 ధరలు లభించాయి. 116 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,361, సరాసరి రూ. 6,091 ధరలు పలికాయి. 75 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,016, కనిష్టం రూ. 1,911, సరాసరి రూ. 1,982 ధరలు వచ్చాయి. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మెల్బోర్న్లోని బియాండ్ యువర్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సరోజ గుల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం పీయూలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పక్షుల ఎదుగుదల, జీవితంతో పోరాటం తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. వ్యక్తి అభిరుచికి అనుగుణంగా స్వేచ్ఛను అనుభవించాలని, ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో కొత్త అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, సిద్ధరామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. యువతులతో ఉద్యోగి అసభ్యకర ప్రవర్తన కేటీదొడ్డి: ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఓ యువకుడు మండలంలోని యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న యువతుల తల్లిదండ్రులు సదరు ఉద్యోగిని నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
రాయితీ రాబడి
బల్దియాల్లో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం సబ్సిడీ గద్వాలటౌన్: ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం తాజాగా ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరు వరకు పన్ను బకాయిలు చెల్లించిన యజమానులు.. 2025–26 ఆర్థిక సంవత్సవానికి సంబంధించిన ఆస్తిపన్ను ఈ నెలాఖరు వరకు చెల్లించి రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో క్రమంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. ● 2025–26 ఆర్థిక సంవత్సరంచెల్లింపుదారులకు ప్రోత్సాహకం ● ఈ నెలాఖరు వరకు గడువు ● మున్సిపల్ ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం -
సీతమ్మకు కీలక పదవి
రాజకీయరంగ ప్రస్థానం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె.. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీచేసి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్రెడ్డిపై 19,034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఆల వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఆమె పరాజయం పొందారు. ● 2023 సెప్టెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో సీతా దయాకర్రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి భార్యాభర్తలిద్దరూ కలిసి అసెంబ్లీలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. నారాయణపేట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్తకోట దయాకర్రెడ్డి కుటుంబానికి పదవి వరించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్రెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 45 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీతా దయాకర్రెడ్డి హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కొనసాగనున్నారు. సీతా దయాకర్రెడ్డికి కీలక పదవి రావడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దయాకర్రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం.. కుటుంబ నేపథ్యం సీతాదయాకర్ రెడ్డి 1961 అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో జన్మించారు. ఆర్బీవీఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ (1977–79), బీఏ (1979–82) పూర్తిచేశారు. 1982–84లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివారు. 1984 ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు. మక్తల్ టికెట్ ఆశించిన సమయంలో భరోసా.. దయాకర్రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్దఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు సీతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కాంగ్రెస్ టికెట్ మక్తల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి టికెట్ ఇస్తూ.. గెలిపించుకొని రావాలని, భవిష్యత్లో కీలక పదవి అప్పగిస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఎలాంటి రాజకీయ తప్పిదాలు జరగకుండా వాకిటి శ్రీహరి గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. టీడీపీని వీడుతూ కంటతడి.. సుదీర్ఘకాలం దయాకర్రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే 2022లో వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపించడంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే 2023 జూన్లో దయాకర్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. రాజకీయ పరిణమాలతో రేవంత్రెడ్డి సమక్షంలో సీతమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్రెడ్డి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి దయాకర్రెడ్డి కుటుంబానికి పెద్దపీట -
బీచుపల్లిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఎర్రవలి: బీచుపల్లి పుణ్య క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆలయంలో గరుడ పటంతో గ్రామ ప్రదక్షిణ, ద్వజస్తంభ స్నపనం, ధ్వజారోహణం, అష్టదిగ్భందనం, యాగశాలలో ప్రధాన కుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ట, మూర్తి మంత్ర హోమం, లఘుపూర్ణాహులి, తీర్థప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పలువురు దంపతులు సంతానం కోసం గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
రాయితీ రాబడి
బల్దియాల్లో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం సబ్సిడీ గద్వాలటౌన్: ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం తాజాగా ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరు వరకు పన్ను బకాయిలు చెల్లించిన యజమానులు.. 2025–26 ఆర్థిక సంవత్సవానికి సంబంధించిన ఆస్తిపన్ను ఈ నెలాఖరు వరకు చెల్లించి రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో క్రమంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. ● 2025–26 ఆర్థిక సంవత్సరంచెల్లింపుదారులకు ప్రోత్సాహకం ● ఈ నెలాఖరు వరకు గడువు ● మున్సిపల్ ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం -
సద్వినియోగం చేసుకోవాలి
రాజోళి/శాంతినగర్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. రాజోళి మండల కేంద్రం, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళారుల మాటలు నమ్మి సన్నబియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. అదే విధంగా రాజోళిలో కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పి.రామ్మోహన్, వీరభద్రప్ప, డీటీలు శ్రీకాంత్రెడ్డి, ప్రశాంత్గౌడ్, ఆర్ఐ సర్ధార్, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,289 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 1,265 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,289, కనిష్టంగా రూ. 3,019, సరాసరి రూ. 4,789 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,369, కనిష్టంగా రూ. 5,116, సరాసరి రూ. 6,369 ధరలు లభించాయి. 116 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,361, సరాసరి రూ. 6,091 ధరలు పలికాయి. 75 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,016, కనిష్టం రూ. 1,911, సరాసరి రూ. 1,982 ధరలు వచ్చాయి. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మెల్బోర్న్లోని బియాండ్ యువర్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సరోజ గుల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం పీయూలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పక్షుల ఎదుగుదల, జీవితంతో పోరాటం తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. వ్యక్తి అభిరుచికి అనుగుణంగా స్వేచ్ఛను అనుభవించాలని, ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో కొత్త అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, సిద్ధరామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. యువతులతో ఉద్యోగి అసభ్యకర ప్రవర్తన కేటీదొడ్డి: ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఓ యువకుడు మండలంలోని యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న యువతుల తల్లిదండ్రులు సదరు ఉద్యోగిని నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
గద్వాల క్రైం: కేసుల నమోదు విషయంలో ఏస్థాయి అధికారి అయినా నిర్లక్ష్యం.. అవినీతి, అక్రమ దందాల వ్యవహారంలో అంటకాగినట్లు బహిర్గతమైతే ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ప్రజలకు, యువతకు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఉండాలని జిల్లా పోలీసు శాఖకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై ప్రత్యేక బృందం విచారణకు శ్రీకారం చుట్టిందన్నారు. యువత బెట్టింగ్ యాప్ల ద్వారా తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న ఘటనలు ప్రతి చోట వెలుగులోకి వస్తున్నాయని.. ఈ కేసుల విచారణకు సీట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నడిగడ్డలో నమోదైన బెట్టింగ్ కేసుల నివేదికలను అందించాలని డీజీపీ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో నిషేధిత మత్తు పదార్థాలు, ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు నిఘా పెంచాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాధ్యమైనంత వేగంగా నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి.. రౌడీ షిట్ ఓపెన్ చేయాలన్నారు. మావోయిస్టు, ప్రభుత్వ వ్యతిరేకత అంశాలపై ద్వేషం, హింసాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని సూచించారు. ● జిల్లాలో బాలికలు, మహిళలను ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే అలసత్వం వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రార్థనా మందిరాలు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, సంత బజారుల వద్ద షీ టీం, బ్లూకోర్టు, నిఘా బృందాలతో గస్తీ పెంచాలని సూచించారు. బాధితులకు భరోసా కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యం నింపాలన్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు మేము సైతం కార్యక్రమం ద్వారా చేయూత అందించాలని అన్నారు. నమోదైన కేసులపై ఆరా.. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి అంశాలపై ఎస్పీ శ్రీనివాసరావును డీజీపీ అడిగి తెలుసుకున్నారు. చీటింగ్, సైబర్ క్రైం, ఉద్యోగాల పేరుతో మోసం, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద కేసులు, చోరీలు, పేకాట, మత ఘర్షణలు తదితర కేసుల నమోదు విషయంలో సిబ్బంది సాంకేతిక ఆధారాలు, అవసరమైన సాక్షుల వాగ్మూలంతో నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. సమావేశంలో మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, ఐజీ ఎల్ఎస్ చౌహాన్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రమేశ్, డీఎస్పీ మొగులయ్య, సీఐలు శ్రీను, టాటాబాబు, రవిబాబు, నాగేశ్వరెడ్డి, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, నాగశేఖర్రెడ్డి, శ్రీనివాసరావు, జగదీశ్, నందికార్ తదితరులు ఉన్నారు. యువతకు దిక్సూచిగా వ్యవహరించండి ఆన్లైన్ బెట్టింగ్లపై ప్రత్యేక విచారణ మహిళలపై వేధింపుల విషయంలో అలసత్వం వద్దు రాష్ట్ర సరిహద్దులో నిఘా పెంచండి డీజీపీ జితేందర్ -
జోరుగా మెడికల్ దందా!
వైద్యుల చీటీ లేకుండానే మాత్రల విక్రయాలురెండేళ్లుగా తనిఖీల జాడేది..? 2023 ఫిబ్రవరి 7, 9వ తేదిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు దినేష్, మహ్మద్రఫీ, రబీయా, రేష్మ జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ దుకాణాలు, సర్జీకల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఫార్మసిస్ట్లు లేకుండా మందులు విక్రయాలు, వైద్యుల చీటీలు లేకుండా మందులు రోగి, బంధువులకు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొందరు యువత దగ్గు సిరప్లను మెడికల్ దుకాణంలో కోనుగోలు చేసినట్లు ధ్రువీకరించారు. మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు, వాటి కాలపరిమితిలను డీ కోడ్ చేసుకున్నారు. అదే రోజు జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ దుకాణ నిర్వాహకుడు ఔషధ నియంత్రణ అధికారుల అనుమతి లేకుండా మందులు విక్రయించినట్లు గుర్తించి యాజమానికి నోటీసులు జారీ చేశారు. 30.12.2023 ముగ్గురిపై డ్రగ్ అండ్ కాస్మోటెక్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసులు జిల్లా కోర్టులో నడుస్తున్నాయి. నాటినుంచి జిల్లాలో అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేకపోయాయి. పలువురు దుకాణాదారులకు లైసెన్స్ లేకుండానే దర్జాగా మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో నాణ్యత లేని మందులు, వివిధ కంపెనీల నిర్వహకులు ఉచితంగా ఇచ్చిన మందులను రోగికి అంటగడుతున్నారు. వైద్యుల చీటీ లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ● మెడికల్ షాపులలో ఇష్టారీతిగా యాంటీబయాటిక్స్, నిద్రమాత్రల అమ్మకాలు ● కానరాని ఫార్మసిస్టులు ● మామ్ముళ్ల మత్తులో ఔషధ నియంత్రణాధికారులు గద్వాల క్రైం: జిల్లాలోని ప్రైవేటు మెడికల్ దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘన జోరుగా సాగుతోంది. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్ లేకుండానే నొప్పుల నివారణ, నిద్రమాత్రలు, యాంటీ బయాటిక్ మందులు విక్రయిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఆర్ఎంపీలు సైతం ఎలాంటి అనుమతి లేకుండా మెడికల్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిన కొందరు యువత సరిపడా డబ్బులు లేకపోవడంతో అదేతరహా మత్తును కలిగించే కొన్ని రకాల సిరప్లను మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేసి ఇష్టారీతిగా తాగుతున్నట్లు సమాచారం. మెడికల్ దుకాణాల నిర్వాహకులు ఇచ్చే మాముళ్లకు అలవాటు పాడి గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు చేయడమే మరిచారు అన్న ఆరోపణలు వినవస్తున్నాయి. జిల్లాలో 300 మెడికల్ దుకాణాలు, 8 సర్జికల్ ఏజెన్సీలు ఓ మాఫియాగా ఏర్పడ్డాయి. మందులు విక్రయించాలంటే నిబంధనల మేరకు ప్రతి మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ తప్పనిసరి. అయితే నడిగడ్డలో ఔషధ నియంత్రణ అధికారులు.. కార్యాలయం లేకపోవడం.. ఓ వ్యక్తిని నియమించుకుని అక్రమ సంపాదనకు తెర తీశారని సమాచారం. అంతా ప్రైవేటు వ్యక్తే.. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో వెలసిన మెడికల్ దుకాణాలను తనిఖీలు చేయాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్లకు అలవాటుపడడంతో ఓ ప్రైవేటు వ్యక్తే అంతా తానై నడిపిస్తున్నట్లు సమాచారం. నిత్యం మెడికల్ దుకాణాల నిర్వాహకులకు అందుబాటులో ఉంటూ.. ఎవరైనా తనిఖీలకు వస్తున్నట్లు తెలిస్తే ముందస్తుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నూతన దుకాణాల అనుమతి.. రెన్యూవల్ వివిధ అనుమతుల కోసం సదరు వ్యక్తిని సంప్రదిస్తే చాలు పనులు పూర్తి అవుతాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ సదరు ప్రైవేటు వ్యక్తిని ఆరా తీయగా.. గత కొన్నేళ్లుగా వారితో పని చేయడంతో నిర్వాహకులు కలవడం వాస్తవామే అన్నారు. -
లైంగిక దాడులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
గద్వాల క్రైం: లైంగిక దాడుల విషయంలో ఎవరూ అధైర్యపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళల హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుతోనే సమ్యలపై విజయం సాధిస్తుందన్నారు. ఇంటా, బైటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల హక్కులు, లైంగిక దోపిడీలాంటి సమస్యల వలయంలో ఎందరో మహిళలు ఉన్నారన్నారు. ఇలాంటి వాటిపై ప్రతి ఒక్కరు చైతన్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. సామాజిక మార్పులతో ప్రతి క్షణం లింగ వివక్ష లేకుండా అందరు సమానమేనని గుర్తించాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం, భరోసా సభ్యులు ఇప్పటికే పలువురి పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బాధింపడ్డ మహిళలు, విద్యార్థినుల కోసం భరోసా కేంద్ర సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆయా శాఖల సిబ్భంది సమన్వయంతో సహాయ సహకరాలు అందించాలన్నారు. మైనర్లపై జరిగిన దాడుల విషయంలో నిందితులకు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మొగిలయ్య, శ్రీధర్బాబు, సీఐలు శ్రీను, టాటాబాబు, రవిబాబు, ఏపీపీ రేచల్ సంజనజాషువ, షీ టీం ఎస్ఐ రజిత, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, భరోసా, డీడబ్లూఓ, సీడబ్లూసీ సిబ్బంది శివాని, సునంద, స్వాతి, సహాదేవుడు, శిరిష తదితరులు ఉన్నారు. -
సూరాపూర్లో మరో రైతు..
లింగాల: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సూరాపూర్కు చెందిన రైతు దేశ పర్వతాలు(40) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి గురువారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో స్టార్టర్ దగ్గర తేలి ఉన్న వైరు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పర్వతాలుకు భార్య చిట్టెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
నేడు జిల్లాకు డీజీపీ జితేందర్ రాక
గద్వాల క్రైం/ధరూరు: రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. నడిగడ్డలో శాంతిభద్రతలు.. విపత్కర కేసులపై ప్రత్యేక సమావేశం నిర్వహించడంతోపాటు కేసుల పురోగతిపై ఆరా తీయనున్నారు. దీంతో జిల్లా అధికారులు గురువారం ఉదయం నుంచే పోలీసు స్టేషన్లోని నమోదైన కేసులు, పురోగతి సాధించిన కేసులు, పెండింగ్ కేసుల అంశాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టారు. మరోవైపు రెండు రాష్ట్రాల సరిహద్దులో అక్రమ దందాలకు అడ్డుకట్ట, నిషేధిత పదార్థాల కట్టడి, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చీటింగ్ కేసులపై సమీక్ష నిర్వహించనున్నారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో అక్రమ దందాల వ్యవహారంలో పోలీసు సిబ్బంది ప్రమేయంపై ఇటీవల నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదికను అందజేయడం వంటి ఫిర్యాదులను వాకబు చేయనున్నారు. నిషేధిత కల్లు విక్రయాలు, పోలీసుల దాడులు, తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు నమోదైన ఎన్డీపీఎస్ యాక్టు కేసుల వివరాల అంశాలపై ఆరా తీసే అకకాశం ఉంది. ధూరూర్ పోలీసుస్టేషన్కు భూమి పూజ అలాగే, ధరూరులోని నూతన పోలీసు స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేయగా.. ఈ నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జీతేందర్ ఉదయం 10.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. జిల్లాలో కేవలం రెండు పోలీసు స్టేషన్లు కేటీదొడ్డి, ఉండవెల్లి మాత్రమే అద్దె భవనంలో కొనసాగుతుండగా త్వరలో వాటికి మోక్షం కలిగించే ప్రక్రియను డీజీపీ దృష్టికి జిల్లా అధికారులు తీసుకెళ్లనున్నారు. అలాగే, ఆయన జిల్లా పోలీసు భవనాల్లో సాయుధ బలగాల బ్యారెక్లు, అధికారులు, సిబ్బంది బస చేసేందుకు చేపట్టిన క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. నూతన కార్యాలయ నిర్మాణ పనుల విషయంలో పోలీసు హౌసింగ్ సొసైటీ ఇంజినీర్లతో సమావేశం, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా, గురువారం డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను తదితరులు ధరూర్ పోలీస్ స్టేషన్నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించారు. డీజీపీ రాక నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతలు.. విపత్కర కేసులపై ఆరా తీసే అవకాశం వివరాల సేకరించడంలో జిల్లా పోలీసుశాఖ తలమునకలు -
పిడుగు పడి ఇద్దరు కూలీలు..
అచ్చంపేట: పదర గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు పదర గ్రామానికి చెందిన రైతు పోగుల వినోద్ పొలంలో వేరుశనగ పంట తీసేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కూలీలు కొంత మంది చెట్ల కింద తలదాచుకోగా.. చెట్ల కింద పిడుగులు పడుతాయనే ఉద్దేశంతో వర్షంలోనే ఒకే దగ్గర నిల్చున్న సుంకరి సైదమ్మ(45), గాజుల వీరమ్మ(55), సుంకరి లక్ష్మమ్మలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను వెంటనే పదర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో కోడోనిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. పదర ఎస్ఐ సర్దామ్, ఆర్ఐ శేఖర్ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. గేదెలు మేపుతుండగా.. మానవపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్నగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) గేదెలను మేపేందుకు గురువారం వెళ్లాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు భార్య లక్ష్మీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ చంద్రకాంత్ను సంప్రదించగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. బుడమొర్సులో మరొకరు.. శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని బుడమర్సు గ్రామానికి చెందిన మాదిగ రాజు, తిమ్మక్కల చిన్న కుమారుడు మహేంద్ర(21) గురువారం గేదెలు మేపడానికి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు మహేంద్ర సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా మహేంద్ర రాకపోవడంతో కుంటుంబ సభ్యులు తుంగభద్ర నదితీరానికి వెళ్లి చూడగా విగతజీవుడై కనిపించడంతో బోరున విలపించారు. -
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు
గద్వాల: ఎల్ఆర్ఎస్ పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ రాయితీ గడువును ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పొడిగించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచాలి అలంపూర్ రూరల్: పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచాలని సీపీఎం మండల కార్యదర్శి జి కే ఈదన్న కోరారు. అలంపూర్ మండలంలో గురువారం కురిసిన వర్షానికి రైతులు పొలాల్లో పొగాకు మండెలను తాటిఫారంతో కప్పేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో ఆయన పలు పొగాకు పంటలను పరిశీలించడంతోపాటు రైతులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ మండల వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పొగాకు పంటను ఐటీసీ, వీఎస్టీ, జీపీఐ, అలయన్స్ తదితర కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుని పొగాకు పంటను కొనుగోలు చేస్తున్నాంటారన్నారు. అయితే పొగాకు కంపెనీలు కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడంతో రైతులు అనేక అవస్థలను పడుతున్నారని, అకాల వర్షాలతో రైతులు మరింత ఆందోళన చెందున్నారని అన్నారు. గురువారం కురిసిన వర్షానికి పొగాకు పంట నాణ్యత తగ్గుతుందేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారని, ఒక వైపు కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వాతావరణం సహకరించకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పొగాకు కంపెనీలు గుర్తించి నూతనంగా కొనుగోలు కేంఽద్రాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రైతుల నుండి పొగాకు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మోస్తరు వర్షం గద్వాలవ్యవసాయం: గద్వాల పట్టణంలో గురువారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చిన్నపాటి జల్లులతో వర్షం పడింది. అయితే రైతులు ఎప్పటిలాగే మార్కెట్ యార్డుకు వేరుశనగ, ఆముదాలు, వడ్లు, కందులు విక్రయానికి తీసుకొచ్చారు. పలువురు రైతులు ధాన్యాన్ని షెడ్లలో పోశారు. పది గంటల ప్రాంతంలో ఎండ ఉండటంతో కొంత మంది రైతులు వేరుశనగను యార్డు ఆవరణలో పోశారు. కాగా ధాన్యం టెండర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, కాంటా చేసే సమయంలో చిన్నపాటి జల్లులతో వర్షం వచ్చింది. వేరుశనగ తడవకుండా వెంటనే హమాలీలు, దడవాయిలు, ఇతర చాట కూలీలు రైతులతో కలిసి కవర్లు కప్పారు. వర్షం బంద్ అయిన తర్వాత కాంటా వేసి మిల్లులకు తరలించారు. వర్షం కారణంగా కొంత వేరుశనగ ధాన్యం తడిసింది. అప్పటికే టెండర్ ప్రక్రియ ముగిసినందున విక్రయించిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని యార్డు అధికారులు తెలిపారు. కొద్దిగా తడిసిన వేరుశనగను.. కొనుగోలు చేసిన వ్యాపారస్తులు మిల్లులో ఆరబెడతారని, వారికి సైతం ఎలాంటి నష్టం జరగదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యార్డు ఆవరణలోని సిమెంట్ ఫ్లోరింగ్కు పలు చోట్ల గుంతలు పడ్డాయని, దీనివల్ల చిన్నపాటి వర్షం వచ్చిన నీరు నిల్వ ఉండి ధాన్యం తడుస్తోందని, ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. వేరుశనగ క్వింటా రూ.6,380 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 1,517 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6380, కనిష్టం రూ.2889, సరాసరి రూ. 5810 ధరలు పలికాయి. అలాగే, 40 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6519, కనిష్టం రూ. 3029, సరాసరి రూ. 6519 ధరలు వచ్చాయి. 51 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.6021, కనిష్టం రూ.5509, సరాసరి రూ. 5979 ధరలు వచ్చాయి. 229 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 1751, సరాసరి ధర రూ.2016 ధరలు లభించాయి. -
గద్వాల చరిత్రను కాపాడతాం
గద్వాల: గద్వాల సంస్థాతనాధీశుల చరిత్రను కాపాడతానని గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ మునిమనవడు కృష్ణరాంభూపాల్ అన్నారు. బుధవారం ఆయన గద్వాల స్వయంభు లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. గద్వాలలో దిగుడు బావులు తాగునీటి కోసం తమ పూర్వీకులు నిర్మించారని, కొత్తబావిని పరిశీలించడం జరిగిందని చాలా బాధపడ్డానని బావి కబ్జా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కలెక్టర్తో మాట్లాడుతామన్నారు. కొత్తబావిని కాపాడాలని కలెక్టర్కు వినతి గద్వాల పట్టణంలోని చింతలపేట వద్ద సంస్థానాధీశుల కాలంలో నిర్మించినటువంటి కొత్తబావి ఆక్రమణకు గురవుతుందని వెంటనే కొత్తబావిని సంరక్షించాలని రాజవంశీయులు కలెక్టర్ బీఎం సంతోష్ను సుహాసినిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, వెంకటాద్రిరెడ్డి, విక్రమ్సింహారెడ్డి కోరారు. ఈమేరకు వారు బుధవారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో వినతిపత్రం అందజేశారు. ఇవ్వడానికి సిద్ధం జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 850లో 2.20 ఎకరాలు 1975లో మా నాన్న కొనుగోలు చేశారని ఇందులో కొత్తబావి కూడా ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ జి.వేణుగోపాల్ అన్నారు. ఆయన విలేకరులతో మాటాడుతూ.. తాను ఎక్కడా ఒక ఇంచు స్థలాన్ని కూడా కబ్జా చేయలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎమ్మెల్యే, ఎవరైన పెద్దలు చెబితే కొత్తబావిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
కౌలుకు తీసుకుని సాగు..
అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతున్నందున ఈసారి 15 ఎకరాలను కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశాను. ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాను. వారంలో రెండు రోజులే సాగునీరు అందడంతో పంట ఎదగలేదు. ఇలాంటి సమయంలో నీటిని పూర్తిగా నిలిపివేయడం వల్ల పంటను పశువులకు వదిలిపెట్టి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. – గుంతల చెన్నప్ప, రైతు, అమరచింత పొట్టదశలో ఉన్నాయి.. జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని పొందుతూ ములమళ్ల శివారులో 10 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నా. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. రెండు తడుల వరకు నీటిని అందిస్తే పంట చేతికందే అవకాశం ఉంది. అధికారులు ముందుగా వారబందీతో సాగునీటిని అందించారు. అంతే కాకుండా గత నెల నుంచి వారంలో రెండు రోజులే సాగునీటిని అందించారు. ఇప్పుడు సైతం అదే విధంగా పంటలు చేతికొచ్చే వరకు సాగునీటిని అందించాలి. – ఆంజనేయులు, రైతు, మస్తీపురం మరో రెండు తడులు అందించాలి.. అమరచింత ఎత్తిపోతలకు జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీటిని పొందుతున్నాం. ఎత్తిపోతల ఆయకట్టు పరిధిలో ములమళ్ల, సింగపేట, ఖానాపురం, మస్తీపురం, అమరచింత, పాంరెడ్డిపల్లె గ్రామాల పరిధిలో ఈసారి యాసంగిలో 800 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాం. ప్రాజెక్టు అధికారులు వారబందీలో కోత పెట్టి కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే సాగునీటిని అందించారు. ప్రస్తుతం వరిపైర్లు పొట్టదశలో ఉన్నాయి. గింజలు గట్టిపడాలంటే మరో రెండు తడులపాటు సాగునీటిని అందించాలి. – ఆంజనేయులు, అమరచింత లిఫ్ట్ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారుల ఆదేశాలతో.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ మట్టం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టుకు ఇదే చివరి తడిగా సాగునీటిని వదిలి.. కాల్వలకు నీటి సరఫరాను నిలిపివేశాం. నీటినిల్వ మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో వారబందీ ద్వారా రైతులకు సాగునీటిని అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సాగుకు నీటిని వినియోగించే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ ● -
రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తిచేసి తీరుతాం
అచ్చంపేట/ఉప్పునుంతల: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)ని రెండున్నరేళ్లలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతనెల 22న ప్రమాదం చోటు చేసుకున్న దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ను బుధవారం సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేకాఽధికారి శివశంకర్ లోతేటి, కలెక్టర్ బదావత్ సంతోష్తో మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మరో 105 నుంచి 110 మీటర్ల వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే సమస్య ఓకొలిక్కి వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన 40 రోజుల్లో వివిధ బృందాలకు చెందిన 700 నుంచి 800 మంది సహాయక సిబ్బంది, నిపుణులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 550 నుంచి 600 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. సొరంగం లోపల భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర పరికరాలు అతుక్కుపోవడంతో అక్కడ బురద తొలగింపు కష్టంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయక సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మరో 15 రోజుల్లో సహాయక చర్యలను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. భవిష్యత్లో సొరంగం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సొరంగం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎన్డీఆర్ఎస్ అధికారి డా.హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిఽధి ఫిరోజ్ ఖరేషి, జీఎస్ఐ అధికారులు రాజశేఖర్, కాడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్ తదితరులు ఉన్నారు. లభించని కార్మికుల ఆచూకీ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 45 రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుల జాడ లభించడం లేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. ఉబ్బికి వచ్చిన నీటితో కూలిన సొరంగం ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్ల తొలగింపునకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే టీబీఎం భాగాలు, శిథిలాలు, మట్టి, రాళ్ల తొలగింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగంలో 10వేల లీటర్లు నీటి ఊట వస్తుండగా.. 2.5 కి.మీ. ఒకటి చొప్పున 150 హెచ్పీ సామర్థ్యం కలిగిన భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. డీ–1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి కాగా.. మరో 105 నుంచి 110 మీటర్ల మేర తవ్వకాలు చేపడితే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సొరంగంలో ప్రమాదం ఘటన బాధాకరం 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల పరిశీలన -
పరీక్షలు ముగిసే.. ఆనందం వెల్లివిరిసే..
గద్వాలటౌన్: పదో తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. బుధవారం చివరి పరీక్ష రాసిన అనంతరం కేంద్రాల నుంచి విద్యార్థులంతా సంతోషంగా బయటకు వచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆనందంతో బైబై చెప్పుకొన్నారు. కొంతమంది విద్యార్థులు సెల్ఫీలు దిగారు. చాలా కాలం కలిసి చదివిన వారంత పరీక్షల చివరిరోజు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నవారు సాయంత్రానికే ఇళ్లకు బయలుదేరారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వీరిని తోడ్కని వెళ్లారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలమే కనిపించింది. మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ ఇంటిబాట పట్టారు. ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. దీంతో మొత్తం పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. చివరిరోజు 7,600 మంది రెగ్యులర్ విద్యార్థులకుగాను 7,567 మంది పరీక్షలకు హాజరయ్యారు. 33 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను విద్యాధికారులు తనిఖీ చేశారు. -
పేదలందరికీ సన్నబియ్యం
గద్వాల/ధరూరు/కేటీదొడ్డి: పేదలందరికీ సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల పట్టణంలోని 35,26 వార్డులలో, అలాగే ధరూరు, కేటీదొడ్డిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను మెరుగుపర్చేందుకు ఉగాది పండుగ కానుకగా నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసే ప్రతీష్టాత్మక పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు లావు బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 335 రేషన్షాపులు ఉండగా వాటి ద్వారా 1,62,000పైగా రేషన్కార్డులకు మొత్తం 5,50,000 మందికి పైగా లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరికి నెలకు 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం సేకరించి వాటిని మరఆడించి మార్కెట్లో కిలో బియ్యం రూ.40 ఉన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈసన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించకుండా ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్తో అదనపు ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు. త్వరలోనే కొత రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు. అనంతరం ధరూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మళ్లీఖార్జున్, డీఎస్వో స్వామికుమార్, రేషన్డీలర్లు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న పోరాటాన్ని స్ఫూర్తి తీసుకోవాలి బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ బహుజన రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి యోధుడన్నారు. పన్నుల వసూళ్ల పేరుగా ప్రజలను పీడిస్తున్న మొగలులను అడ్డుకుని పోరాటం చేశారన్నారు. అలాగే, కేటీదొడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
వ్యవసాయ అధికారులకు కొత్త సెల్ నంబర్లు
గద్వాల వ్యవసాయం: వ్యవసాయ శాఖ జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రభుత్వం నూతన సెల్నంబర్లు కేటాయించింది. ఈమేరకు సక్రియానాయక్ డీఏఓ సెల్నం. 8977745995, రమేష్బాబు ఏడీఏ, సెల్నం. 8977745994, భవాని ఏఓ (టెక్నికల్) సెల్నం. 8977745626, మహాలక్ష్మీ ఏఓ (టెక్నికల్ 8977745627, శ్రీలత ఏఓ (టెక్నికల్) 8977745628, చంద్రశేఖర్ ఏఓ (టెక్నికల్) 8977745629, అశ్విని ఏఓ(టెక్నికల్) 8977745630, నాగార్జున రెడ్డి ఎంఏఓ అలంపూర్ 8977745645 సెల్ నంబర్ కేటాయించారు. అలాగే, జనార్ధన్ ఎంఏఓ అయిజ 8977745646, రవికుమార్ ఎంఏఓ ఇటిక్యాల 8977745647, ప్రదీప్కుమార్ ఎంఏఓ మానవపాడు 8977745648, సురేఖ ఎంఏఓ రాజోళి 8977745649, అనిత ఎంఏఓ ఉండవల్లి 8977745650, రాధ ఎంఏఓ వడ్డేపల్లి 8977745657, సంగీతలక్ష్మీ ఏడీఏ గద్వాల రూరల్ 8977745996, శ్రీలత ఎంఏఓ ధరూర్ 8977745658, ప్రతాప్ కుమార్ ఎంఏఓ గద్వాల 8977745659, హనుమంతురెడ్డి ఎంఏఓ గట్టుకు సెల్ నంబర్ 8977745684 కేటాయించారు. దీంతోపాటు సాజిద్ ఉర్ రహమాన్ ఎంఏఓ కెటీదొడ్డి 8977745685, రాజశేఖర్ ఎంఏఓ మల్దకల్ 8977746043, సుబ్బారెడ్డి ఏఓ (టెక్నికల్) అలంపూర్ ఏడీఏ కార్యాలయం 8977746018, చంద్రమౌళి ఏఓ (టెక్నికల్) గద్వాల ఏడీఏ సెల్నం. 8977746019, అయూబ్ ఏఓ (పీడీ అండ్ డీ ఫార్మ్ కొర్విపాడు) 8977745563, నాగేశ్వర్రావ్ ఏఓ (పీడీ అండ్ డీ ఫార్మ్ జులెకల్) సెల్నం. 8977745564 కేటాయించారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్, స్టోర్కీపర్, టెక్నికల్) అగ్నివీర్ ట్రేడ్మెన్ వివిధ కేటగిరీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్కీపర్ పోస్టులకు 10వ తరగతి, ట్రేడ్మెన్కు 8వ తరగతి పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. www.join indiarmy.nic.in వెబ్సైట్లో ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, వీటితోపాటు ఐటీఐ, డిప్లోమా, ఎస్ఎస్సీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయని తెలిపారు. కామన్ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా 13 భాషలలో ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని, మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారని, జూన్లో సంబంధిత వెబ్సైట్లో అడ్మిట్కార్డులు పొందవచ్చని, ఇతర వివరాలకు సికింద్రాబాద్లోని రిక్రూటింగ్ కార్యాలయం ఫోన్ నంబర్ 040–27740205 ను సంప్రదించాలని తెలిపారు. ఉచిత శిక్షణ కార్యక్రమం గద్వాల: స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో హైదరాబాద్లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక నెల నాన్రెసిడెన్సీయల్ ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వనున్నట్లు ఉపాధి కల్పనాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు www.tgbcstudycircle. cgg.gov.in లో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దర ఖాస్తులు చేసుకున్న వారికి ఈనెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా కేం్దద్రంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 040–29303130 నంబర్ను సంప్రదించాలన్నారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థల పరిశీలన కేటీదొడ్డి: మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ప్రజలకు అనువైన స్ధలాన్ని ఎంపిక చేసి త్వరలో నూతన భవన నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆలయాల్లో అడిషనల్ కమిషనర్ విచారణ అలంపూర్ : అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి బుధవారం విచారణ చేపట్టారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాల్లో విచారణ చేపట్టినట్లు ఆమె వివరించారు. ఇటీవల ఆలయాలపై పలు కథనాలు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలతో ఆలయాల్లో అన్ని అంశాలపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలోనూ రెండు సార్లు దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేసినట్లు పేర్కొన్నారు. -
జంటలే లక్ష్యంగా దోపిడీలు
పెట్రోలింగ్ పెంచుతాం : ఐజీ కల్వకుర్తి టౌన్: ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఊర్కొండపేట ఆలయానికి వస్తారని, వీరి రక్షణ కోసం పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్తో కలిసి పరిశీలించారు. ఊర్కొండ పోలీస్స్టేషన్కు సిబ్బందిగా ఎక్కువగా కేటాయించి, ఆలయం వద్ద పికెటింగ్ నిత్యం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. స్థానికులు, ఆలయ పాలక మండలి, ఆలయ పరిసర ప్రాంత ప్రజలతో ఐజీ మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యాచార ఘటనలో పాల్గొన్న ఆలయ ఉద్యోగి గురించి తెలుసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకారం అవసరమని ఐజీ పేర్కొన్నారు. ఐజీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచార కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఏడుగురు నిందితులే ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఇదే తరహాలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత కేసులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఇప్పటికే పలుమార్లు నేరాలకు పాల్పడినట్టుగా తేల్చారు. ఆలయానికి వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకుని బెదిరించి, దోపిడీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు.. ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. చట్టం తెలిసిన నేరస్తులు.. మైనర్ల జోలికి వెళ్లరు మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేశ్గౌడ్తోపాటు ఊర్కొండపేట గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, సాదిక్ బాబా, హరీశ్, వాగుల్దాస్, మణికంఠ ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్నా రు. అయితే వీరు మైనర్లు ఎవరైనా జంటలుగా కనిపిస్తే అప్రమత్తంగా ఉంటారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో ద్వారా కఠిన శిక్షలు అమలు అవుతుండటంతో వారిని బెదిరించి, డబ్బులు మాత్రమే వసూలు చేస్తారు. వివాహిత మహిళలు, మేజర్లు అయితే దోపిడీ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలను తీసుకున్నా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్ప టి వరకు ఎంత మందిపై నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కనీస వసతులకూ దిక్కులేదు.. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. అరకొరగా ఉన్న బాత్రూంలు, టాయిలెట్లను సైతం మూసి వేస్తుండటం, నిర్వహణ లేకపోవడంతో మహిళలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు, టాయిలెట్లు, వసతి గదులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు లేక ఆరుబయటకు వెళ్తున్న మహిళలను బెదిరిస్తూ కొందరు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. నిఘా వైఫల్యమేనా..? ఊర్కొండపేట ఆలయ సమీపంలో గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆలయంలోని సిబ్బంది, గ్రామానికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు, యువకులు ఆలయానికి వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి వద్ద ఉన్న నగదును దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫొటోలు, వీడియోలు బయట పెడుతామంటూ బెదిరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో బ్లాక్మెయిల్ ముఠా వీడియోలు, ఫొటోలతో బెదిరించి డబ్బు వసూలు తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టింది ఈ ముఠానే.. ప్రముఖ ఆలయం వద్ద కరువైన పోలీసుల నిఘా బాధితురాలికి ప్రభుత్వం అండ ఊర్కొండ: ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో అత్యాచార ఘటన జరగడం దారుణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక ఆలయ అధికారులు, పోలీసులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయమై తనతో ఫోన్లో మాట్లాడారని వివరించారు.ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి విచారణ వేగవంతం చేస్తున్నారని, బాధిత కుటుంబానికి అండగా ఉంటా మని చెప్పారు.స్థానికంగా గంజాయి విక్రయాలు జరుగుతుంటే పోలీసులకు ఎందుకు సమాచా రం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అయితే.. రికార్డే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నాలకు మద్దతు ధరతోపాటు ప్రోత్సాహకంగా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో అన్నదాతలు ఈ యాసంగిలోనూ వరిసాగు వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన సన్న రకాల ధాన్యం సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో ఈ సీజన్లో సాధారణ సాగును మించి సుమారు 20 శాతం.. గత యాసంగితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వరి సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 11,36,660 మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం నిర్దేశించారు. 1,61,504 ఎకరాల్లో పెరిగిన సాగు.. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 4,75,264 ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం ఇదే సీజన్లో 6,36,768 ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన 1,61,504 ఎకరాల్లో వరి సాగు పెరగగా.. ఈ మేరకు అదనంగా మరో 30 కొనుగోలు కేంద్రాలను అదనంగా కేటాయించారు. రెండో వారంలో కేంద్రాలు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి కోతలు ప్రారంభం కాగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదటి వారం నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కోతలకు మరింత సమయం పట్టనుండగా.. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మినహా మిగతా జిల్లాల కలెక్టర్లు.. మిల్లర్లు, వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 11.36 లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్లతో పోలిస్తే ఈ యాసంగిలో భారీగా వరిసాగు ఉమ్మడి జిల్లాలో 30 వరకు పెరిగిన కొనుగోలు కేంద్రాలు ఈ నెల రెండో వారంలో అందుబాటులోకి సెంటర్లు ఇప్పటికే అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటుకు ఆదేశాలు -
ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
గద్వాల క్రైం: సమస్యలపై వచ్చే బాధితుల పట్ల సిబ్బంది స్నేహ పూర్వకంగా ఉండాలని, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయనతోపాటు డీఎస్పీ మొగిలయ్య పట్టణ పోలీసు స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలోని వివిధ కాలనీలో నిత్యం గస్తీ, పెట్రోలిం నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైం, మహిళల వేధింపులు, అత్యాచార యత్నం, మిస్సింగ్ కేసులలో ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శివారు ప్రాంతాల్లో నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలని, స్టేషన్ పరిశరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పందించాలని, బాధితులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. సీఐ శ్రీను, ఎస్ఐ కల్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు. నేడు ఉల్లి బహిరంగ వేలం దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు రావడం వల్ల శనివారం నుంచి మంగళవారం వరకు లావాదేవీలు జరగలేదు. తిరిగి బుధవారం మార్కెట్లో లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఉల్లి వేలం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ధాన్యం టెండర్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
మున్సిపల్ బడ్జెట్ రూ.15.29 కోట్లు
గద్వాలటౌన్: మున్సిపల్ బడ్జెట్ అంటే.. గతానికి పేరడీగా, అంకెల గారడీగా.. మొత్తం కాగితాలకే పరిమితమనే విమర్శలున్నాయి. అయితే, ఈ సారి గద్వాల పట్టణ ప్రగతి లక్ష్యంగా లెక్కల పద్దులు తయారు చేశారు. ప్రత్యేక పాలనలో మున్సిపల్ బడ్జెట్ ఏకరీతిలో ఉండేలా లెక్కలు వేశారు. కలెక్టర్ సారథ్యంలో బడ్జెట్ను రూపొందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ బడ్జెట్ రూ.15.29 కోట్లుగా నిర్ణయించి, గత నెల ఆమోదించారు. సొంత నిధులతో.. ఈ సారి బడ్జెట్లో మున్సిపల్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంతోనే బడ్జెట్ తయారు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లను పరిగణలోకి తీసుకుంటుండగా మొదట సొంతంగా వచ్చే నిధులు సమకూర్చుతున్నారు. గద్వాల మున్సిపాలిటీ నుంచి ఏడాదికి రూ.6 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఆస్తిపన్ను, నల్లా పన్ను, ఇంటి అనుమతుల జారీ, దుకాణాల అద్దెలు, ట్రేడ్ లైసెన్స్ తదితర వాటి నుంచి ఈ నిధులు వస్తాయి. వాటిని పక్కాగా ఖర్చు చేసే విధంగా బడ్జెట్ను రూపొందించి ఆమోదించారు. పచ్చదనానికి 10 శాతం.. ఈ ఏడాది ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లోను 10 శాతం గ్రీన్ బడ్జెట్గా రూపొందించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం పచ్చదనానికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, ట్రీ గార్డులు, ట్యాంకర్లు తీసుకోవడం వంటి వాటికి బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టనున్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్తో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించారు. మూడో వంతు విలీన కాలనీల అభివృద్ధికి మున్సిపల్ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. బడ్జెట్లో మూడో వంతు(మూడింట ఒక బాగం) మురికివాడలు, శివారు, విలీన కాలనీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం కల్పించారు. నిధులు పక్కాగా ఖర్చు అయ్యే విధంగా స్థానికంగా ఉండే ఆయా వార్డుల అధికారులు చూడాల్సి ఉంటుంది. వీటికి ప్రాధాన్యం బడ్జెట్ తయారీలో కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. దానికి అనుగుణంగా బడ్జెట్లో పద్దులు పొందుపర్చారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాటికి అవసరమయ్యే వాహనాలు, పరికరాల కొనుగోలు, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా నిమిత్తం విద్యుత్ బిల్లుల చెల్లింపులతో పాటు ఏదైనా రూపంలో రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో రూపొందించారు. రాబోయె ఏడాది కాలంలో ప్రతిపాదిత ఆదాయ, వ్యయాలను బడ్జెట్లో చూపించారు. అలాగే, ప్రత్యేకంగా కొన్ని పనుల నిమిత్తం పలు రకాల పనులకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఉండాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చే నిధులను అందులో పొందుపర్చారు. పార్కులు, వైకుంఠధామాలు, క్రీడా స్థలాల ఏర్పాటు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత మార్కెట్లు, శాసీ్త్రయ పద్దతిలో డంపింగ్ యార్డుల నిర్వహణ వంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చి నిధులను కేటాయింపులు చేశారు. గద్వాల శివారు, విలీన కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం 10 శాతం గ్రీన్ బడ్జెట్ ప్రగతిపైనే ఆశలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ ప్రగతి అక అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఐదేళ్ల పాలకవర్గ హయంలో సుమారు రూ.10 కోట్లతో ఆయా వార్డుల్లో ప్రగతి పనులు జరిగాయి. అయినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం నిధుల కొరతతో కొత్తగా పనులు చేపట్టే ప్రణాళికలు చేపట్టడం లేదు. ఉన్నదాంట్లో సమకూరిన నిధులను కార్మికుల వేతనాలకు వినియోగిస్తున్నారు. అయినా ఇంకా రెండు నెలల జీతాలు బకాయిలున్నాయి. -
మోదం.. ఖేదం
90 శాతం ఆస్తి పన్ను వసూళ్లతో అయిజ, అలంపూర్, వడ్డేపల్లి ముందంజ గద్వాలలో ఎందుకీ పరిస్థితి ఎనిమిది నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన కమిషనర్కు పాలకవర్గానికి మొదటి నుంచి పోసక లేదు. పాలకవర్గం కనుసన్నల మధ్య నడిచే సిబ్బంది మొదట్లో పన్ను వసూళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పాలకవర్గం గడువు ముగిసిన తరువాత కఠినంగా వ్యహరించిన కమిషనర్కు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. బకాయిలు ఎక్కువగా ఉండటం, వీటితో పాటు సిబ్బంది అరకొరగా ఉండటం వలన పన్నులు సకాలంలో వసూలు చేయలేకపోయారు. కొత్తగా వచ్చిన వార్డు అధికారులకు సర్వేలు, ఎల్ఆర్ఎస్ తదితరమైన బాధ్యతలు అప్పగించడంతో వారు సైతం పన్ను వసూళ్లపై దృష్టి సారించలేదు. ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ ఇచ్చిన చాలా మంది ప్రజలు వినియోగించలేకపోయారు. చివరలో వడ్డీమాఫీ రావడం వలన బడా బకాయిదారులు ముందుకు రాలేదు. ఫలితంగా పన్నుల వసూళ్ల మందగించింది. ● 56 శాతంతో లక్ష్యానికి దూరంగా గద్వాల మున్సిపాలిటీ.. ● ప్రభుత్వ కార్యాలయాల నుంచి నామమాత్రంగాపన్ను వసూలు ● ముగిసిన ఆర్థిక సంవత్సరం వసూలు గడువు గద్వాలటౌన్: ఈ ఏడాది ఎలాగైనా వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని సంకల్పించిన అధికారులు.. గద్వాల మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో మేర సఫలమయ్యారు. ఆశించిన స్థాయిలో పన్ను వసూళ్లు రాబట్టారు. గద్వాలలో మాత్రం లక్ష్యానికి దూరంగా నిలిచారు. ఉన్నతాధికారుల నుంచి పదే పదే ఒత్తిళ్లు రావడంతో అధికారులు ఈ మార్చిలో వసూళ్ల ప్రక్రియను కొంత వేగవంతం చేశారు. బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి పన్ను వసూలు చేశారు. అయినప్పటికి జిల్లా కేంద్రమైన గద్వాలలో పన్నుల వసూళ్లు పేలవంగా ఉన్నాయి. అటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి చాలా ఏళ్లుగా పెండింగ్ బకాయిలు అరకొరే వసూలు కావడంతో అధికారులను నిరాశ కలిగించింది. అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు వందశాతం లక్ష్యానికి స్వల్ప దూరంలో నిలిచాయి. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపుతో పన్ను వసూళ్లకు అడ్డుకట్ట పడింది. ఇప్పటి వరకు జిల్లాలోని గద్వాల మినహా.. అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆశించిన మేర పన్ను వసూలయ్యాయి. అవరోధాలు ఎన్నో.. ఏటా ఆస్తిపన్ను వసూళ్లను చేపట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతుంటారు. పట్టణంలోని ప్రతి నివాసగృహం, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి వాటి వైశాల్యాన్ని బట్టి పన్నును నిర్ధారిస్తారు. భువన్ సర్వే ద్వారా ప్రతి ఇంటిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తించడంతో ఆయా గృహాల పరిణామాలకు చాలావరకు పన్ను పెరిగింది. వీటిని రాబట్టేందుకు అధికారులు గత రెండు నెలల నుంచి వసూళ్ల ప్రక్రియను చేపట్టారు. మొదట రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మాత్రమే వీటిని వసూలు చేశారు. కానీ లక్ష్యం పెద్దగా ఉండటం.. గృహాలు అధిక సంఖ్యలో ఉండటంతో గతనెల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచారు. గద్వాల, అయిజలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూలు ప్రక్రియను చేపట్టారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పన్ను వసూలు చేశారు. పెండింగ్లో ఉన్న వాటికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరల్లో ఆస్తిపన్నుపై హడావిడి చేయడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయారు. గద్వాలలో 56.53 శాతానికే పన్ను వసూళ్లు పరిమితం కాగా.. మిగిలిన మూడు మున్సిపాలిటీలలో 90 శాతం మార్కును దాటాయి. గద్వాల పట్టణ వ్యూ జిల్లా కేంద్రంలో చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలు, అయిజలో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు రూ.2 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు నామమాత్రంగానే పన్ను వసూళ్లు జరిగింది. మొదటి నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్ను వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం కూడా వాటి నుంచి ఆస్తిపన్ను వసూళ్లు కాకపోయిన పెద్దగా పట్టించుకోవడం లేదు. పన్ను వసూలు వివరాలిలా.. మున్సిపాలిటీ అసెస్మెంట్లు పన్ను వసూలైంది శాతం డిమాండ్ (రూ.కోట్లలో) గద్వాల 15,896 7.17 4.05 56.53 అయిజ 8,051 1.82 1.62 90.03 ప్రభుత్వ కార్యాలయాల పన్ను వసూళ్లు నాస్తి -
ఆస్తిపన్ను వసూళ్లలో ‘అయిజ’ రికార్డు
అయిజ: మున్సిపాలిటీలకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులో 95 శాతం వసూలు చేసి అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో టాప్ ఫైవ్లో ఒకటిగా నిలిచింది. సోమవారం ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు కావడంతో చివరి రోజు వసూలు చేసిన దానితో కలిపి అయిజ టాప్ ఫైవ్లో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో గత సంవత్సరం కంటే 12.09 శాతం ఆస్తిపన్ను ఎక్కువగా వసూలు చేయడంతో అయిజ మున్సిపాలిటీ 15 ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించింది. దీంతో 15వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.2కోట్లు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులు మాట్లాడుతూ.. పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ఆస్తిపన్ను 95 శాతం వసూలు చేశామని అన్నారు. మొత్తం 1.82 కోట్లు డిమాండ్ ఉండగా 1.62 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆర్ఐ, ఆర్ఓ, బిల్ కలెక్టర్లను అభినందించారు. మున్సిపాలిటీ సిబ్బంది సంబరాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఆర్ఓ లక్ష్మన్న, ఆర్ఐ విజయ్, వార్డు ఆఫీసర్లు భరత్, రామకృష్ణ, బిల్ కలెక్టర్లు అజ్మీర్ ఖాజా, అడివన్న, మహేంద్రనాథ్, నరేష్, నాగరాజు, ఆంజనేయులు, వీరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్కు చెక్
అడవిలోకి రాకముందే.. హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీదుగా శ్రీశైలం చేరుకునే ప్రయాణికులు సుమారు 60 కి.మీ., దట్టమైన నల్లమల అటవీప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అడవి మధ్యలో విసిరేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల మనుగడకే ముప్పుగా మారుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రహదారి వెంట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. పండుగలు, సెలవు రోజుల్లో వాహనాల రద్దీతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం పెరుగుతున్నాయి. అడవిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేస్తూ.. అడవిలోకి రాకముందే చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ను సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మన్ననూర్ చెక్పోస్టు వద్ద, శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను దోమలపెంట చెక్పోస్టు వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు. నల్లమలలో పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం అమలు ●● వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చర్యలు ● మన్ననూరు, దోమలపెంట చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు ● అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 80 శాతం వరకు తగ్గిన వ్యర్థాలు ● ఇప్పటి వరకు 34 వేల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తి సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేస్తోంది. నల్లమల గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోలకు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు వేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ కట్టడిపై చర్యలు కట్టుదిట్టం చేసింది. దట్టమైన నల్లమల అడవిలోకి రాకముందే ముఖద్వారం వద్ద వాహనదారుల నుంచి ప్లాస్టిక్ను సేకరించడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ప్లాస్టిక్ వేయవద్దని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖ చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధంతోపాటు అవగాహన కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఏటా అడవిలో పోగవుతున్న చెత్తలో సుమారు 80 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించగలిగారు. అనూహ్య స్పందన.. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, వ్యర్థాలను అడవిలో పడేయకుండా ఉండేందుకు స్థానికులు, వాహనదారులకు అటవీశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నల్లమలలోని మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందిస్తున్నారు. 16 మంది స్వచ్ఛ సేవకులు అడవిలోకి ప్రవేశించే వాహనాల్లో అత్యవసరంగా వినియోగించే వాటర్ బాటిళ్లను 2 లీటర్లు, అంతకన్నా పెద్ద సైజులో ఉండే సీసాలనే అనుమతిస్తున్నారు. ఖాళీ అయిన బాటిళ్లను అడవిలో ఎక్కడా పడవేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే అడవిలోకి పంపుతున్నారు. ఫలితంగా చాలావరకు అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. ఎక్కడైనా రోడ్డుకు ఇరువైపులా ఉండే వ్యర్థాలను 16 మంది స్వచ్ఛ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. చెక్పోస్టులు, అడవిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మన్ననూర్లోని ప్లాస్టిక్ బేయిలింగ్ కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని తుక్కుగూడలో ఉన్న హైపర్ ప్లాస్టిక్ పార్క్ రీసైక్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 34 వేల కిలోల ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తుండగా.. ఇకముందు చిప్స్, ఇతర కవర్లను సైతం రీసైక్లింగ్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందరి సహకారంతో.. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలుచేస్తున్నాం. అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో ఏటా పోగవుతున్న ప్లాస్టిక్ చెత్తలో 80 శాతం తగ్గింది. స్థానిక ప్రజలు, వ్యాపారులతోపాటు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి సహకారం లభిస్తోంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీ శాఖ అధికారి -
ఊర్కొండపేటలో కలకలం
సాక్షి, నాగర్కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రు లు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువు తో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏ డుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడు గు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పో లీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజా యి, మ ద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడు గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికై నా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి సోమవారం ఉదయం ఫిర్యా దు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పార్టీకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరానన్నారు. ఆలయానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం ఒళ్లు జలదరించే రీతిలో చిత్రహింసలు జిల్లాలోని దర్శనీయ ప్రదేశాల్లో కొరవడిన భద్రత యథేచ్ఛగా మద్యపానం, గంజాయి వినియోగం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని వైనం -
భక్తిశ్రద్ధలతో ఈద్–ఉల్–ఫితర్
గద్వాలటౌన్: పవిత్ర రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షక్షలు చేపట్టి ప్రార్థనలతో ముగించారు. సోమవారం ఉదయం ముస్లింలు ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలకు తరలివెళ్లారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాకు ముస్లింలు ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా అబ్దుల్ హకీం నమాజ్ చేయించారు. ప్రార్థనల అనంతరం ఈద్గా దగ్గర శ్మశాన వాటికలోని తమ పెద్దల సమాదుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చుట్టు పక్కల గ్రామాల ముస్లింలు సైతం గద్వాల ఈద్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ యాదయ్య ఆధ్వర్యంలో సీఐ టంగుటూరి శ్రీను గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలపడానికి వివిధ పార్టీల నాయకులు ఈద్గా దగ్గరకు వచ్చారు. ప్రార్థనల అనంతరం ముస్లింలకు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్కుమార్, బీఆర్ఎస్ నాయకుడు హనుంమతునాయుడు, ఎంఐఎం జిల్లా కన్వీనర్ మున్నాబాషలతో పాటు పలువరు నాయకులు ఈద్ ముబారక్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం వారు ముస్లింనుద్దేశించి మాట్లాడారు. హిందూ ముస్లింల ఐక్యతకు గద్వాల నిదర్శనమని పేర్కొన్నారు. గద్వాల సర్వమత సమైక్యతకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కిటకిటలాడిన ఈద్గాలు, మసీదులు ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ పార్టీల నాయకులు -
తొలి పండుగ.. ఆనందమే నిండుగా
గద్వాలటౌన్: నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఉగాది పచ్చడి.. పండితుల పంచాంగ శ్రవణం.. కిటకిటలాడిన ఆలయాలు.. మొత్తంగా కోలాహాలంతో శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి ఆదివారం జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. ఎన్నో అనుభూతుల్ని పంచిన శ్రీక్రోధీనామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పారు. ఎక్కడ చూసినా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోలాహాలంగా తిరుగుతున్న యువకుల సందడితో విశ్వావసు నామ ఉగాది సందడి కనిపించింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు తెలుగు వారి తొలి పండుగ ఉగాది సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అందరికీ విజయం చేకూర్చాలని, ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని పంచారు. స్థానిక గాంధీచౌక్ నుంచి రాజవీధి వరకు దేవాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం ట్రాఫిక్ రద్దీ పెరిగింది. సాయిబాబ దేవాలయం, గంజిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, క్రిష్ణమందిరం, వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం, కోటలోని చెన్నకేశవ స్వామి ఆలయం, పెద్ద అగ్రహారంలోని అహోబిల మఠం వద్ద భక్తులు అధిక సంఖ్యలో దైవ దర్శనం చేసుకున్నారు. స్థానిక సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పించారు. పలు దేవాలయాల వద్ద పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా అరటి బోదెలు, మామిడి తోరణాలు, ఉగాది పచ్చళ్లతో పాటు పంచాంగ శ్రవణం, వివిధ వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు తదితరమైనవి విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీక్రోధీ నామ సంవత్సరం చేదు అనుభవాలు మిగిల్చగా శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందోనని తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం పట్ల అనేక మంది ఆకర్షితులయ్యారు. భక్తి శ్రద్దలతో రాబోయే సంవత్సరం రాశిఫలాలను తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఎద్దుల బండలాగుడు పోటీలను నిర్వహించి రైతులను ఉత్సాహపరిచారు. దక్షిణ కాశీలో పంచాంగ శ్రవణం అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో తెలుగు తొలి పండగ ఉగాదిని పురస్కరించుకొని బ్రహ్మశ్రీ శ్రీకాంత్శర్మ పంచాంగ శ్రావణం వినిపించారు. అంతా మంచే జరుగుతుందని ప్రవచించారు. ఆలయ ఈఓ పురేందర్ కుమార్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య అర్చకులతో కలిసి పంచాంగ శ్రావణ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం శ్రీకాంత్శర్మ పంచాంగ శ్రావణంలో ఏడాదంతా మంచి పరిణామాలే ఉంటాయని వివరించారు. అలాగే ఏఏ రంగాల్లో అభివృద్ధి ఉంటుందో, రాశులవారీగా ఆదాయం, వ్యయం వివరాలు తెలిపారు. ఆలయాల్లో ఉగాది ప్రత్యేక పూజలు పలుచోట్ల పంచాంగ శ్రవణాలు -
రంజాన్కి సర్వం సిద్ధం
● ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గాలు ముస్తాబు ● ముగిసిన నెలరోజుల ఉపవాస దీక్షలు గద్వాలటౌన్: ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. నెలరోజుల ఉపవాస దీక్షలు అనంతరం జరుపుకొనే రంజాన్ పర్వదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా నిర్వహించుకుంటారు. సోమవారం పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రం, అయిజ, అలంపూర్, మానవపాడు, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అన్ని మసీదులు ముస్తాబయ్యాయి. రంగులు వేసి రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యాపార కేంద్రాలన్నీ జనంతో కిటకిటలాడాయి. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గద్వాలలో ఏటా రంజాన్ చివరి వారం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా కూరగాయలు మార్కెట్ చౌరస్తాలో ఉన్న సేమ్యాల దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. టోపీలు, అత్తర్ల కొనుగోలు కోసం యువకులు ఉత్సాహం చూపారు. ఫ్యాన్సీ, బ్యాంగిల్స్టోర్స్ దుకాణాలు మహిళలు, యువతులతో కిక్కిరిశాయి. చిన్నారులను సైతం ఆకట్టుకునే విధంగా కొత్త తరహా దుస్తులు రంజాన్లో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్ల దగ్గర రంజాన్ పండగ శోభ కనిపించింది. పండగను పురస్కరించుకొని స్థానిక ఈద్గావద్ద కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పండగ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. -
ఎత్తిపోతలు జరిగేనా..?
‘పాలమూరు’ ద్వారా 4 టీఎంసీల నీటి పంపింగ్కు అనుమతులు మోటార్ల బిగింపు పూర్తి.. పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు అయిన ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటి వరకు నాలుగు మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రెండు మోటార్లకు విద్యుత్ సరఫరా, చార్జింగ్ వంటి పనులన్నీ పూర్తిచేశారు. డెలివరీ మెయిన్స్ కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలే ఎత్తిపోతలు పెండింగ్లో పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా.. నిర్మాణం, విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్కో మోటారు సామర్థ్యం 145 మెగావాట్లు పాలమూరు ప్రాజెక్టు పంప్హౌజ్లో ఏర్పాటుచేసే మోటార్లు 9 ● పంప్హౌజ్లో కొనసాగుతున్న పనులు ● పూర్తికాని విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం ● గతేడాది అక్టోబర్ నుంచి వాయిదా పడుతున్న వైనం ● వచ్చే నెలలో తప్పనిసరిగాచేపడతామంటున్న అధికారులు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నా నీటి ఎత్తిపోతలు మాత్రం నోచుకోవడం లేదు. అయితే ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా నీటి ఎత్తిపోతలు చేపడుతామని సంబంధిత అధికారులు చెబుతుండగా ఆచరణలో అమలుకు నోచుకుంటుందా.. లేదా.. అనేది సందేహంగా మారింది. 4 టీఎంసీలకు అవకాశం.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లూరు సమీపంలోని మొదటి లిఫ్ట్ను ప్రారంభించగా.. ఒక మోటారు ద్వారా రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. తాగునీటి అవసరాల కోసం ఈ సీజన్లో నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్లోనే కృష్ణానది పరవళ్లు తొక్కగా.. నాటి నుంచి ఎత్తిపోతలు చేపడతామని అధికారులు చెబుతూ వస్తుండగా.. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిసారిస్తేనే.. పాలమూరు ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం జరగడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా నీటి ఎత్తిపోతలు జరిగితే.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీరుతాయి. కేఎల్ఐ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న భారం కూడా తగ్గుతుంది. తగ్గుతున్న నీటి నిల్వలు.. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్వాటర్ ఫుల్గేజ్ లెవెల్ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్వాటర్ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. ఒక మోటారుతో రోజు ఎత్తిపోసే నీరు 3,000 క్యూసెక్కులు నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు ఈ సీజన్లో తాగునీటి అవసరాలకు అనుమతి ఉన్న నీటి వాటా 4 టీఎంసీలు తుది దశకు పనులు.. ఎల్లూరు లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల బిగింపు పూర్తయింది. సివిల్ వర్క్స్, డెలివరీ మెయిన్స్ పనులు తుది దశకు చేరాయి. అక్టోబర్ తర్వాత ఎత్తిపోతలు చేపట్టాలని భావించినా.. మోటార్ల బిగింపు, విద్యుత్ సరఫరా పనులు కొనసాగుతున్నందున సాధ్యం కాలేదు. తాగునీటి అవసరాలకు ఈ సీజన్లో 4 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్లో తప్పనిసరిగా ఎత్తిపోతలు చేపడుతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటి పారుదలశాఖ -
మనమెంత భద్రం..?
జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు పాత ఇళ్లపైనే నిర్మాణాలు.. చాలామంది మధ్య తరగతి ప్రజలు ఇళ్ల స్థలాలు లేక పెరుగుతున్న కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి పాత ఇళ్లపైనే అదనంగా గదులు నిర్మించుకుంటున్నారు. కొందరైతే పిల్లర్లు లేని ఇళ్లపై ప్రమాదకరంగా నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొంత మంది అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు ఉల్లంఘించి బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారు. ఈ విషయంలో భవన యజమానులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అధికారులు సైతం క్షేత్రస్థాయి పరిశీలన చేసి భవన సామర్థ్యానికనుగుణంగా అనుమతులు ఇచ్చి దిశానిర్ధేశం చేయాలి. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గద్వాలలో భిన్నమైన పరిస్థితులున్నాయి. గద్వాలటౌన్: ‘ఐదు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పోతులవారి వీధిలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందిన తీరు అందరిని కలిచివేసింది.’ ఈ సంఘటనను చూస్తే.. మరి గద్వాల జిల్లా పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల ఎదుట కనిపిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సంబఽంధిత అధికారులు స్థానికంగా ఉన్న భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. బహుళ అంతస్తులు, పురాతన భవనాలు, కట్టడాల విషయంలో అధికారులు, పాలకులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించటంలేదు. ‘చేతులు కాలే దాకా కళ్లు తెరుచుకోరు... కాళ్లు కదలవు’ అన్నట్లుగా జిల్లా కేంద్రంలోని ఆయా శాఖల అధికారుల పనితీరు కనిపిస్తుంది. ఈ స్థితిలో గద్వాలలో బహుళ అంతస్తుల నిర్మాణాల భద్రత, నాణ్యత ఎంతమాత్రం అన్న ప్రశ్న రేకెత్తించింది. పర్యవేక్షణ అంతంతే నోటీసులతో సరిపెడుతున్న అధికారులు గుర్తించినా.. పట్టించుకోని వైనం ఏటా వానాకాలం ముందు జిల్లాలో పాత భవనాల ఇళ్లను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపడతారు. పట్టణాలు, గ్రామాల్లో అప్రమత్తం చేసినా ఇంటి యజమానుల్లో అవగాహన కలగటం లేదు. కొంతమంది ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. కానీ కొందరు ఇళ్ల యజమానులు మాత్రం తమకేమి పట్టనట్లు ఉండిపోయారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే చాలా మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
పురాతన బావి కబ్జాపై స్పందించాలి
గద్వాలటౌన్: సంస్థానాధీశుల కాలం నాటి పురాతన బావి కబ్జాపై ఎమ్మెల్యే స్పందించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం కబ్జాకు గురైన పురాతన బావిని వివిధ ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. చరిత్రాత్మకమైన పురాతన బావి అన్యాక్రాంతమవుతున్న అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమన్నారు. పురాతన కొత్తబావిని ఆక్రమించుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్పై చర్యలు తీసుకోవడానికి అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన బావిని తక్షణమే పునరుద్దరించి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురాతన బావిని పునరుద్దరించకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. బావి పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాన్ని చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కుర్వ పల్లయ్య, ఉప్పేర్ సుభాన్, వాల్మీకి, కృష్ణ, నాగన్న తదితరులు పాల్గొన్నారు. యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి పెద్దకొత్తపల్లి: గ్రామీణ యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకొని జాతీయస్థాయిలో రాణించాలని ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి గ్రామంలో ఆదివారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ యువతలో కబడ్డీ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి.. క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్గౌడ్, వెంకటేశ్వర్రావు, దండు నర్సింహ, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, సింగిల్విండో మాజీ చైర్మన్ బాలస్వామి, సుధాకర్ పాల్గొన్నారు. రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి ఆదివారం విశేషాలంకరణ చేశారు. అర్చకులు వివిధ రకాల పూలతో గర్భగుడిని, శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఉగాది పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తర్వాత ఆలయ ఆవరణలో ఉన్న కల్పవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఆలయం బయట ఉన్న దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. ఆయిల్పాం ఫ్యాక్టరీ పనులు అడ్డుకున్న గ్రామస్తులు కొత్తకోట రూరల్: మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ సైతం మాజీ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కాగా.. ఆదివారం ఉగాది రోజన ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం యంత్రాలతో రాగా, గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. ఎస్ఐ ఆనంద్ సిబ్బందితో అక్కడకు చేరుకొని నచ్చజెప్పారు. -
18వ శతాబ్దం నుంచి పంచాంగ శ్రవణం
గద్వాల: ఉగాది పండుగను.. పంచాంగ శ్రవణాన్ని దాదాపు నాలుగు తరాలుగా ఆ కుటుంబసభ్యులు వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. వారే.. గద్వాలకు చెందిన బోరవెల్లి కుటుంబసభ్యులు. జిల్లా కేంద్రంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయాన్ని 18వ శతాబ్దంలో భీమ్రెడ్డి, నాంచారమ్మ దంపతులు నిర్మించారు. భీమ్రెడ్డి సోదరుడైన రామన్న గద్వాల సంస్థానానికి దత్తతగా వెళ్లి రాంభూపాలుడు–2 పేరుతో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అక్కడి నుంచి ప్రతి ఉగాది పండుగ సాయంత్రం సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయానికి బోరవెల్లి కేశవాచార్యులు నుంచి మొదలై 19వ శతాబ్దంలో వారి కుమారుడు బోరవెల్లి ప్రకాశమాచార్యులు, వారి కుమారులు బోరవెల్లి రాఘవాచార్యులు, మరియు బోరవెల్లి పవన్కుమార్ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ భక్తులకు పంచాంగ శ్రవణం చేస్తూ వస్తున్నారు. -
54 ఏళ్లుగా జ్యోతిష్యం.. పంచాంగం
మానవపాడు: మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మేళ్ల చెరువు రేవతీనాథ్శర్మ 54 ఏళ్లుగా జ్యోతిష్యం.. పంచాంగ శ్రవణం వినిపిస్తూ వస్తున్నారు. రాష్ట్రం నుంచేగాక ఆంధప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పంచాంగం, జ్యోతిష్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. మానవపాడు మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన ఆఫీస్ నాగిరెడ్డితోపాటు దత్రాత్రేయశాసీ్త్ర, విజయవాడ నాగేశ్వరశాస్త్రీ వద్ద రేవతీనాథ్శర్మ పంచాంగం, జ్యోతిష్యం నేర్చుకున్నారు. నాటి నుంచి ప్రజలకు జ్యోతిష్యం, పంచాంగం వివరిస్తూ వస్తున్నారు. అలాగే, ఉత్తమ అర్చకుడిగా ఉమ్మడి మహబూబ్నగర్ కలెక్టర్ శ్రీదేవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
అంతటా పండుగ సందడి
గద్వాలటౌన్: జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదివారం పండగను జరుపుకోనుండటంతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు శనివారం గద్వాలకు వచ్చి పండగ వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో గద్వాల పాతబస్టాండ్, రథశాల, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. గద్వాలతో పాటు అయిజ, శాంతినగర్, అలంపూర్ పట్టణాలలో సైతం ఉగాది హడావుడి కనిపించింది. ఉదయం మందకొడిగా సాగిన విక్రయాలు సాయంత్రం ఒక్కసారిగా ఊపందుకోవడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. గద్వాలలో మామిడి కాయాలు, పచ్చి ఇస్తరాకులు, బంతిపూలు, టెంకాయల కొనుగోళ్లకు డిమాండ్ నెలకొంది. మార్కెట్తో పాటు ప్రధాన చౌరస్తాలలో పూల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు. పూలు, పండ్లు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నా కొనుగోలు దారులు ఏమాత్రం రాజీ పడలేదు. అన్ని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మామిడి తోరణాలు పెద్దమొత్తంలో తీసుకొచ్చి అమ్మకాలు జరిపారు. ఆలయాల ముస్తాబు ఉగాదిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో కోళ్లను బలిస్తారు. అందుకుగాను ఆలయ నిర్వహకులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయం, అహోబిల మఠం, శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం, నది ఆగ్రహారంలోని ఆలయాల దగ్గర పంచాంగం శ్రవణం నిర్వహించనున్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన అలంపూర్, బీచుపల్లి, మల్థకల్, పాంగుంట, చింతరేవుల తదితర ఆలయాలలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఉన్న ఆలయ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
ఆలయాల్లో ప్రముఖుల ప్రత్యేక పూజలు
అలంపూర్/ఎర్రవల్లి: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓ పురేందర్కుమార్, ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా జోగుళాంబ అమ్మవారి, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. భక్తిశ్రద్ధలతో చండీహోమం అమావాస్యను పురస్కరించుకొని జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం చండీ హోమాలు నిర్వహించగా 178 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులతో కిక్కిరిసిన బీచుపల్లి పుణ్యక్షేత్రం ఎర్రవల్లి: అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని పలు ఆలయాలు శనివారం భక్తులతో రద్దీగా మారాయి. అభయాంనేయస్వామికి ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవితో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. -
‘ఉపాధి’ కూలీలకు అధిక వేతనం వచ్చేలా చూడాలి
ఎర్రవల్లి: ఉపాధి హామీ పఽథకంలో కూలీలతో సరైన కొలతల ప్రకారం పనులను చేయించి అధిక వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని, పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి పనిలో మహిళ సమాఖ్య సంఘం సభ్యులు కూడా పాల్గొని వివిధ శాఖలకు ఉపయోగపడే పనులను పూర్తిచేసి పథకాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ ఖాన్, ఎపిఎం శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్దన్రెడ్డి, టిఎ ప్రవీన్, తదితరులు పాల్గొన్నారు.పురాతన బావి కబ్జాపై నిరసనగద్వాలటౌన్: సంస్థానాధీశుల కాలం నాటి పురాతన బావులను పునరుద్ధ్దరించలేని పాలకులు, అధికార యంత్రాంగం.. కనీసం వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోలేకపోవడం దారుణమని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. పురాతన కొత్తబావిని పునరుద్దరించడంతో పాటు ఆక్రమించుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పురాతన బావి కబ్జాపై ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఆందోళనలు చేస్తున్న ఎమ్మెల్యే స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పూడ్చిన బావిలో మట్టి తొలగించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే, వారిపై అధికార పార్టీ నేత బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనుమతులు లేకుండా సుమారు రెండు వందల టిప్పర్ల మట్టిని తరలించి బావిని పూడ్చిన సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. దీక్ష శిబిరంలో బీజేపీ నాయకులు బండల వెంకట్రాములు, జయశ్రీ, కేకే రె డ్డి, దేవదాసు, చిత్తారికిరణ్, నర్సింహా, మాలీంఇసాక్, కృష్ణ, మదుగౌడ్, వాసు, శంకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.విద్యతోనే ఉజ్వల భవిష్యత్అచ్చంపేట రూరల్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. బీసీలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో బుడుబుక్కుల కులస్తులతో ఆయన సమావేశమై వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు చెందిన కొన్ని జాతుల వారు వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నా.. తమ కులం పేరు బయట చెప్పేందుకు సిగ్గుపడే స్థితిలో ఉన్నారన్నారు. బీసీలలోని కొన్ని కులాల్లో పేర్లు బయటకు చెప్పుకోలేనంత అభ్యంతరకరంగా ఉండటంతోనే కుల పేర్ల మార్పిడీపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. పేరు మార్పిడీపై వారి సలహాలను స్వీకరించారు. -
దాశరథి ఆత్మలో తెలంగాణ
వనపర్తిటౌన్: నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అని వెలుగెత్తి చాటిన దాశరథిని జైలులో నిర్బంధించినా గర్జించే రచనలు చేశారని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్హాల్లో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకలను సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించగా.. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దాశరథి ఆత్మలో తెలంగాణ భాగమైందని కొనియాడారు. ఆయన రచనలు బీఆర్ఎస్ ఆవిర్భావంతో గోడలపై నినాదాలుగా వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. మహనీయులకు జన్మనిచ్చిన గడ్డ.. సాహిత్య శిఖరం సురవరం ప్రతాపరెడ్డి పుట్టిన గడ్డ వనపర్తి అని ప్రశంసించారు. సంక్లిష్ట సమాజంలో నిలబడి నిజాం పోకడలను ఎత్తిచూపారని గుర్తుచేశారు. రైతాంగ పోరాట ఉద్యమం వెలుగులోకి రావడంతో తెలంగాణ గురించి ప్రపంచానికి తెలిసిందన్నారు. బీఆర్ఎస్ పాలన పాలమూరును పచ్చని పంటల కల్పవల్లిగా తీర్చిదిద్దిందని వివరించారు. నిరంజన్రెడ్డి మళ్లీ వస్తేనే వనపర్తిలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉన్నంత కాలం చరిత్రలో దాశరథి పేరు చిరస్థాయిగా ఉంటుందని, అనతి కాలంలోనే ప్రభావితమైన రచనలు చేసిన కవిగా దాశరథి తెలంగాణలో గుర్తుండిపోయారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంతో దాశరథికి నిజమైన నివాళులర్పించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు కవులను దేశపతి శ్రీనివాస్, నిరంజన్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్గౌడ్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్, కవులు, వీరయ్య, నాగవరం బలరాం, బైరోజు చంద్రశేఖర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు. జైలులో నిర్బంధించినా రచనలు ఆపలేదు ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ -
విశ్వావసు నామ శుభాకాంక్షలు
‘వి’శాల విశ్వంలో అందరూ..వి ‘శ్వా’ సముతో ధైర్యంగా జీవిస్తూ ‘వ’సుదైక కుటుంబంలో భాగమవుతూ ‘సు’గుణాల సంపదలను పంచుతూ అరమరికలు లేని సంసారమున షడ్రుచులతో కష్టసుఖాలను సమరీతిన భావించే శక్తి అందించాలని సర్వాంగ సుందరంగా తయారై విశ్వకాంతులను పంచాలని వస్తోన్న ‘విశ్వావసు‘ నూతన వత్సరానికి స్వాగతం... శుభస్వాగతం... – ఇల్లూరి వెంకట్రామయ్య శెట్టి రిటైర్డు తెలుగు ఉపాధ్యాయుడు, అలంపూర్ -
నాలుగు తరాలుగా..
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా మా తాత బోరవెల్లి కేశవాచార్యులు కొనసాగారు. తదనంతరం మా తండ్రి బోరవెల్లి ప్రకాషమాచార్యులు, వారి తర్వాత నాతో పాటు మా సోదరుడు రాఘవాచార్యులు ఆలయంలో భక్తులకు ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా ఉగాది విశిష్టతను వివరిస్తూ వస్తున్నాం. ఈ ఏడాది వచ్చే ఉగాదిని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటల స్థితిగతులు, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలోని యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలను వివరిస్తాం. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుపుతాం. – బోరవెల్లి పవన్కుమార్ ఆచార్యులు, గద్వాల -
షడ్రుచుల ఉగాది
క్రోధీకి వందనం.. ఆశల విశ్వావసు నామకు ఆహ్వానం తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్లో కాలానికి ఒక ప్రమాణం ఉంది. కాలాన్ని లెక్కించడానికి నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. అందులో భాగంగానే నెలలకు, సంవత్సరాలకు పేర్లను నిర్దేశించారు. ఛైత్రం నుంచి ప్రారంభమయ్యే నెలలు ఫాల్గుణంతో ముగిస్తాయి. కొత్త పూత, కొత్త కాత, కొత్త రుచులతో నూతన సంవత్సరం ఆరంభమవుతూ కొంగొత్త ఆలోచనలకు తెరతీస్తుంది. ద్వాపర యుగంలో తన అవతారాన్ని శ్రీకృష్ణుడు చాలించగా కలియుగం ప్రారంభమయ్యే సమయంగా దీన్ని యుగాదిగా పరిగణించారనే వాదన ఉంది. యుగాది కాలక్రమంలో ఉగాదిగా వాడుకలోకి వచ్చింది. పంచాంగ పఠనం తర్వాత నిర్వహించే కవి సమ్మేళనం ఆకట్టుకునేలా ఉంటుంది. ‘హితేన సహితం సాహిత్యం’ అంటారు. మేలుచేసేదే సాహిత్యం అని అర్థం. వసంతరుతువు కావడంతో లేత చిగుళ్లు తిన్న కోయిలలు మాధుర్యంతో కూసే కూత కవిలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. ఈ సమ్మేళనాల్లో ఔత్సాహిక కవులు జనహితం కోరుతూ రచించిన కవితలను షడ్రుచులతోపాటు మాతృబాషపై మాధుర్యాన్ని జోడించి ఇందులో చదివి వినిపిస్తారు. ఇలాంటి కవి సమ్మేళనాలకు చిన్నారులను తీసుకెళ్లడం వల్ల వారికి మాతృభాషపై మరింత అవగాహన పెరిగే వీలుంటుంది. కవితా రచనప్రక్రియపై అవగాహన పెరుగుతుంది. ఇతరభాషల పట్ల మోజుతో ఉన్నవారికి సైతం మాతృభాషపై ఆసక్తిని కలిగిస్తుంది. కవితల రూపంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరానికి పరిచయం చేయొచ్చు. ప్రపంచ భాషల్లో తెలుగు మాధుర్యమైంది. ఎందుకంటే తెలుగులో ప్రతి పదం చివర అచ్చుతో ముగుస్తుంది. అచ్చుతో పదాలు ముగిసే భాష కాబ ట్టి అజంతభాష అనే పేరువచ్చింది. తెలుగుభాష మాధుర్యాన్ని చాట డానికి కవి సమ్మేళనం ఒక చక్కని వేదిక. ● తెలుగు సంస్కృతికి ప్రతీక ఈ పండుగ ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు ఉగాది పర్వదినం తెలుగుజాతికి మాత్రమే ప్రత్యేకం. ఉగాది రోజున ఒంటికి పసుపు కలిపిన సున్ని పిండితో నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేస్తారు. కొత్త దుస్తులు ధరిస్తారు. షడ్రుచుల పచ్చడి సేవిస్తారు. పచ్చడిలో పులుపు (ఆమ్లం), తీపి (మధురం), వగరు (కషాయం), చేదు (పిత్తం), కారం (కటువు), ఉప్పు (లవణం) గుణాలతో కూడిన వేపపువ్వు, లేత మామిడి కాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, కారంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పండుగ రోజున సాయంత్రం వేళ ఆలయాల్లో, గ్రామకూడలిలో పంచాంగ పఠనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పంచాంగం పూర్వ కాలంనుంచి ఒక శాస్త్రంగా భావిస్తూ వస్తున్నారు. గ్రామ పురోహితుడు హాజరై గ్రామ పెద్దలు, పుర ప్రముఖుల మధ్య పంచాంగం వివరాలను చదివి వినిపిస్తారు. పంచాంగం రానున్న ఏడాది కాలంలో వ్యక్తుల వ్యక్తిగత ఆదాయ, వ్యయాలు, పోకడలతో పాటు దేశప్రాంత సామాజిక పరిస్థితులు, వాతావరణం వంటి విషయాల్లోనూ అప్రమత్తం చేస్తుంది. వర్షాలు, కరవు కాటకాలు, అరిష్టాల గురించి ఇందులో వివరిస్తారు. నమ్మకాన్ని బట్టి ఈ వివరాలను విశ్వసిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంశాలతో కూడిన పంచాంగ పఠనం వింటే సంపద, ఆయుష్షు, పాపపరిహారం, రోగాలు తొలగడం, చేసే ప్రయత్నాలు ఫలించడం వంటి ఐదు ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు. మనిషికి, ప్రకృతికి సంబంధం చలికాలంలో మనిషి శరీరంపై కాలం తీరిన చర్మం పొరలుగా రాలిపోతుంది. వెంట్రుకలు కూడా అలాగే రాలిపోతుంటాయి. ప్రకృతిలో కూడా హేమంతరుతువు (చలికాలం ప్రారంభం)లో చెట్ల ఆకులు ఎండిపోతుంటాయి. శిశిరుతువు (చలికాలం ముగింపు)లో కొత్త చిగుళ్లు వేస్తుంటాయి. ఇలా ఒకే కాలం మనిషికి, ప్రకృతికి సంబంధాన్ని కలిపింది. ఆకట్టుకునే కవి సమ్మేళనం తెలుగుజాతికి ప్రత్యేకం తెలుగు అజంత భాష భవిష్యత్తుపై అప్రమత్తత.. పంచాంగం -
రైతులు జాగ్రత్తగా ఉండాలి
చాలా మంది ప్రజలు మాపై నమ్మకంతో అమరవాయి గ్రామానికి వచ్చి జ్యోతిష్యం, పంచాంగం చెప్పించుకుంటారు. మా గురువుల నుంచి నేర్చుకున్న జ్యోతిష్యం, పంచాంగ శ్రవణాన్ని ఏళ్లుగా ప్రజలకు వివరిస్తూ వస్తున్నా. ఇక.. ఈ విశ్వవాసు నామ సంవత్సరం విషయానికి వస్తే ప్రేమ వివాహలు ఎక్కువగా జరుగుతాయి. రెండు తుమ్ముల వాన, ఒక తుమ్ము గాలి విస్తాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి రెండు సార్లు ఆలోచించి పంట సాగు చేయాలి. పంట చేతికి వచ్చే సమయంలో ధర రాదు.. ధర వచ్చినప్పుడు పంట చేతిలో ఉండదు. నలుపు, తెలుపు, ఎరుపు పంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అగ్ని, వాహన ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. – మేళ్ల చెరువు రేవతీనాథ్శర్మ, అమరవాయి, మానవపాడు మండలం -
నత్తనడకన ఎల్ఆర్ఎస్
26 వేల దరఖాస్తులు.. 6 శాతంలోపే పరిష్కారం గతంలో అలా.. ప్రస్తుతం ఇలా.. గతంలో భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎల్ఆర్ఎస్కు అనుమతిస్తేనే సదరు స్థలం మార్కెట్ విలువను బట్టి దరఖాస్తుదారు ఫీజు చెల్లించేవారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనకు ముందే ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో చాలామంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా రాయితీ వర్తించాలంటే మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించాల్సి రావటం దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారుతోంది. వాయిదా పద్దతిలో చెల్లించేందుకు అవకాశం లేకపోవడం, కొందరి ప్లాట్లు నిషేదిత జాబితాలోకి వెళ్లటంతో ఫీజు చెల్లింపులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గద్వాలటౌన్: అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ కరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీని ఈ నెలాఖరు వరకు వర్తింపజేసింది. సమయం సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో దరఖాస్తుదారులు స్పందిస్తేనే వారికి ఉపయుక్తంగా మారనుంది. మించిపోతే పూర్తిస్థాయిలో చెల్లించాల్సిన పరిస్థితి. ప్రత్యేక రాయితీపై అధికారులు విస్తృత అవగాహన చేపడుతున్నా.. పలువురు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడంతో భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొననున్నాయి. ఆరు శాతంలోపే.. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నత్తను తలపిస్తోంది. గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో 26,691 దరఖాస్తులు రాగా.. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1,506 మాత్రమే పరిష్కరించి ప్రొసీడింగ్స్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 31వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి మాత్రమే రాయితీ ఇవ్వనుండటంతో చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే ప్రక్రియ వేగంగా సాగకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారు. సాంకేతిక సమస్యలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని అధికారులే చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్తో భారీ ఆదాయం సమకూరుతుందని భావించిన మున్సిపల్ అధికారులకు నిరాశే ఎదురవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో ఎల్ఆర్ఎస్పై ప్రభావం పడుతుంది. క్షేత్రస్థాయిలో సమీక్ష సైతం మొక్కబడిగా ఉంది. క్రమబద్ధీకరణ ఫీజు కంటే ఖాళీ స్థలం ఫీజు ఎక్కవగా ఉండటంతో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కొందరైతే తర్వాత చూద్దాంలే అని విరమించుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 5.64 శాతం మంది మాత్రమే ఫీజులు చెల్లించారంటే స్పందన ఎంత దారణంగా ఉందో అర్థమవుతోంది. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఇప్పటికే వార్డు ఆఫీసర్ల ద్వారా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వివరాలు తెలియజేశాం. నెలాఖరు వరకు రాయితీ అవకాశం ఉన్నందున దరఖాస్తుదారులు ఫీజు చెల్లించి ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి. – నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్ మొరాయిస్తున్న సర్వర్ ఎల్ఆర్ఎస్ సర్వర్ మొరాయిస్తుండటంతో ఇంటి వద్ద, మీసేవ, ఈసేవా ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించే వారు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వినియోగిస్తుండటంతో వేగం తగ్గుతుందని అంటున్నారు. సర్వర్ వచ్చిపోతుండటంతో అసహనానికి గురవుతున్నారు. కొందరు ఫీజు చెల్లించిన తర్వాత రషీదు రావడంలేదు. మరి కొందరికి ఫీజు చూపించడంలేదు. ఇంకొందరికి అయితే దరఖాస్తు ఆన్లైన్లోనే కనిపించడం లేదు. జిల్లా వివరాలిలా.. సాంకేతిక సమస్యలతో పరేషాన్ రాయితీకి రెండు రోజులే గడువు -
ఉన్నత విద్యకు బాటలు
అభివృద్ధి వైపు పాలమూరు యూనివర్సిటీ పయనం ●● ఒకే విద్యా సంవత్సరంలో రూ.150 కోట్లు మంజూరు ● పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు విడుదల చేసిన కేంద్రం ● రాష్ట్ర బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయింపు ● లా, ఇంజినీరింగ్ కళాశాలల భవనాల నిర్మాణంపై దృష్టి ● హాస్టల్స్, ల్యాబ్స్ భవనాలను నిర్మాణానికి శ్రీకారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు గతంలో కేవలం వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ, ఈ సంవత్సరం వేతనాలతో పాటు అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడంతో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్, ల్యాబ్స్ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. లా, ఇంజినీరింగ్ కళాశాల కోసం కూడా భవనాల నిర్మాణం చేపడతాం. విద్యార్థుల చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే విధంగా కొత్త కోర్సులు ప్రారంభించేలా చూస్తాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ ●యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయింపు ఇలా.. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నూతన భవనాలు, అధునాతన ల్యాబ్లు, వినూత్న కోర్సులతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యూనివర్సిటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో నిధులు కేటాయింపులు చేయడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి విద్యార్థులకు హాస్టళ్లు, తరగతి, గదులు, ల్యాబ్లు, గ్రౌండ్స్ వంటివి లేక సతమతమవయ్యే వారు. కానీ, ఈ సంవత్సరం పెద్దమొత్తంలో నిధుల కేటాయింపుతో భవనాల నిర్మాణానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం ద్వారా ఇచ్చిన నిధులతో పెద్దఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్మాణాల కోసం రూ.35 కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులతో మరిన్ని భవనాల నిర్మాణాలకు అంచనాలు రూపొందిస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. రూ.150 కోట్లు కేటాయింపు.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేవలం సిబ్బంది వేతనాల కోసమే కేటాయింపులు జరిగివి. 2018లో పీయూలో న్యాక్ గ్రేడింగ్ రావడంతో ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేయగా.. పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో సిబ్బంది వేతనాల కోసం గతేడాది రూ.11 కోట్లు, ఈ సంవత్సరం రూ.15 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు కూడా ఇచ్చారు. గతేడాదితో పోల్చితే రూ.4 కోట్లు అదనంగా ఇవ్వడంతో యూనివర్సిటీపై వేతనాల భారం తగ్గనుంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు కేటాయించనప్పటికీ అధికారులు యూనివర్సిటీ అంతర్గత నిధులు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి నిధులు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా కేంద్ర ప్రభు త్వం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఒకేసారి కేటాయించడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతాయని భావిస్తున్నారు. సంవత్సరం ప్రతిపాదనలు కేటాయింపులు (రూ.కోట్లలో..) 2019– 20 119 6.63 2020– 21 216 7.39 2021– 22 137 7.58 2022– 23 75 9.58 2023– 24 84 10.91 2024– 25 200 50 వసతుల కల్పనపై దృష్టి.. యూనివర్సిటీలో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రస్తుతం అవసరమైన నిధులు అందుబాటులో ఉండడంతో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఇంజినీరింగ్, లా కళాశాలల భవనాల నిర్మాణం కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారు. ఈ రెండు కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం రెండు బాలుర, బాలికల హాస్టళ్లు, ఒక అకామిక్ బ్లాక్ను నిర్మించనున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో రీసెర్చ్ కోసం రూ.11 కోట్లతో రీసెర్చ్ఫెసిలిటీ భవనం, విద్యార్థులను అథ్లెటిక్స్ ప్రోత్సహించేందుకు సింథెటిక్ ట్రాక్, సందర్శకుల కోసం గ్యాలరీ నిర్మిస్తున్నారు. త్వరలో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
గద్వాల: పేదింటి ఆడపడచులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్రెడ్డి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గద్వాల పట్టణం, ధరూరు, మల్దకల్, గట్టు, కెటి.దొడ్డి మండలాలకు చెందిన 40మంది మహిళలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు బాబర్, మురళి, ప్రభాకర్రెడ్డి రామన్గౌడ తదితరులు పాల్గొన్నారు. అలాగే, పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ఫండు నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. జములమ్మ హుండీ ఆదాయం రూ.27.78 లక్షలు గద్వాల న్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్దిగాంచిన జములమ్మ, పరుశరామస్వామి ఆలయ హుండీని శుక్రవారం ఆలయంలో లెక్కించారు. గడిచిన 65రోజులకు గాను హుండీని లెక్కించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ డివిజన్ పరిశీలకురాలు వెంకటేశ్వరీ, ఈఓ పురందర్కుమార్, చైర్మన్ వెంకట్రాములు, యూబీఐ అధికారులు శ్రీకాంత్రెడ్డి, సుధాకర్ సమక్షంలో సిబ్బంది, భక్తులు లెక్కించారు. నగదు రూ.27,78,778, మిశ్రమ బంగారం 27గ్రాములు, మిశ్రమ వెండి 640 గ్రాములు ఆదాయంగా వచ్చింది. గడిచిన ఏడాది ఇదే సమయానికి జరిగిన లెక్కింపుతో పోల్చితే రూ.50,739 అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, ఆలయాన్ని గద్వాల సంస్థాన వంశస్థులు శ్రీకృష్ణరాంభూల్ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఆయన అమ్మవారికి పూజలు జరిపించారు. అనంతరం అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,969 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 1388 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5969, కనిష్టం రూ.3119, సరాసరి రూ.5619 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6404, కనిష్టం రూ.6289, సరాసరి రూ.6289 ధరలు వచ్చాయి. 65 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6091, కనిష్టం రూ. 5669, సరాసరి రూ. 6059 ధరలు వచ్చాయి. 7 క్వింటాళ్ళ వరి (సోన) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ.1964 ధర లభించింది. -
కూలీల రక్షణపై పట్టింపేది?
రాజోళి: ఉపాధి హామీలో పని చేసే కూలీలకు రక్షణ కరువైంది. మండే ఎండలో పని చేసే వారికి చేయాల్సిన రక్షణ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి గ్రామాల్లో ఉపాధి పనుల్లో పాల్గొని కుటుంబ పోషణ చేసుకునే వారికి వేసవి కాలం వచ్చిందంటే గాల్లో ప్రాణాలు పెట్టి పనులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం జాగ్రత్తలు వహిస్తూ పనులు చేయండని చెబుతున్నప్పటికీ, నిర్ధేశించిన పనులను చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో కల్పించలేకపోతున్నారు. వసతుల్లేక ఇబ్బందులు ప్రస్తుతం పాంపాండ్స్, గుట్టల్లో గుంతలు తీయడం, నర్సరీల్లో మొక్కల పనులు జరుగుతున్నాయి. పని చేసే ప్రదేశంలో కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేదతీరడానికి ప్రభుత్వం గుడారాలు పంపిణీ చేసేది. ఏళ్లుగా వాటి పంపిణీ నిలిచింది. కనీసం కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా వాటిని అందిస్తే ప్రయోజనం చేకూరుతోంది. గతంలో మెడికల్ కిట్లు పంపిణీ చేసేది. గాయాలపాలైనా, ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కిట్లను పంపిణీ చేయాల్సింది. ఓఆర్ఎస్ ప్యాకెట్, బ్యాండెడ్, దూది, అయోడిన్ సీసా, కొన్ని రకాల మందులు ఉండేవి తొమ్మిదేళ్లుగా కిట్లను కూడా పంపిణీ చేయడం లేదు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పని చేయటం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ముంది. తాగునీరు సక్రమంగా తాగకపోతే నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవటంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతారు. ఈక్రమంలో కూలీలు తగినంత నీరు తాగుతూ.. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, పని ప్రవేశాల్లో ఓఆర్ఎస్ ద్రావణం లేదా నిమ్మకాయ నీళ్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, 12 నుంచి 3 గంటల వరకు పనిచేయటం మానుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముందే అప్రమత్తమవ్వాలి ప్రమాదాలు జరిగాక రక్షణ చర్యలు, ఆసుపత్రులకు పరుగులు తీసే బదులు ముందుగానే రక్షణ చర్యలు చేపడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎండలో కూలీలు పనులు చేసే దగ్గర కనీసం మెడికల్ కిట్లు, టెంట్లు ఉండటం లేదు. తాగునీరు కూడా సక్రమంగా లేదు. గ్రామానికి దూరంలో పని కల్పించినప్పుడు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. – విజయ్, రాజోళి ఏర్పాట్లు చేస్తాం గ్రామ పంచాయతీలకు బాధ్యత ఉన్నప్పటికీ, మా పర్యవేక్షణ నిత్యం ఉంటుంది. గ్రామానికి దూరంగా పనులు జరిగే సమయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఎక్కడ పనులు చేపట్టినా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా వసతులు లేకపోతే కూలీలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత సిబ్బందితో మాట్లాడి వెంటనే చర్యలు చేపడుతున్నాం. – ప్రసాద్, ఏపీఓ, రాజోళి ●గ్రామపంచాతీలపైనే.. ఉపాధి కూలీలకు రక్షణ చర్యలు కల్పించాలంటూ గ్రామ పంచాయతీలపైనే ప్రభుత్వాలు భారం వేస్తుండటంతో జీపీలు పూర్తి స్థాయిలో కూలీలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. బడ్జెట్ లేమి, నిధుల కొరత కారణంగా ఉపాది కూలీలకు కల్పించాల్సిన వసతుల్లో చాలా వరకు గాలికొదిలేస్తున్నాయి. తరుచూ జిల్లా అధికారుల తనిఖీలు, పనులు ఎక్కువగా జరిగే గ్రామాల్లో వసతుల కల్పన ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో కనీసం రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో కూలీలు ఉసూరుమంటున్నారు. ఉదయమే పనులకు వెళ్లి ఎండ పడకముందే ఇళ్లకు తిరిగి వచ్చేయాలంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పనులు నిర్ణయించే చోటుకు వెళ్లే సరికే ఎండ పడుతుందని, అక్కడ పని ప్రారంభించేలోగానే ఎండ ముదురుతుందని, అదే ఎండలోనే ఇంటికి రావడం తప్పడం లేదని కూలీలు అంటున్నారు. పనులు చేసి ఇంటికి వచ్చేలోగానే వడదెబ్బలు తగిలి అనారోగ్యానికి గురైన కూలీలు ఎందరో ఉన్నారని, ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఎండలు ఎక్కువగా ఉండగా..మున్ముందు ఇంకా ఎక్కువగా ముదిరే అవకాశముందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని కూలీలు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షణతో కనీస సౌకర్యాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మండుటెండల్లో ఉపాధి కూలీల అవస్థలు క్షేత్ర స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ కనీస సౌకర్యాలు కరువు రక్షణ చర్యలు గాలికొదిలేసిన అధికారులు -
అనుమానిత వ్యక్తుల సమాచారం అందించాలి
గద్వాల క్రైం: గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ శ్రీను సూచించారు. గురువారం సాయంత్రం గద్వాల పట్టణంలోని బీసీ కాలనీ, తెలుగు పేట, శివాలయం, రవీంద్ర పాఠశాల కాలనీలో ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ, ఎస్ఐలు కళ్యాణ్కుమార్తో పాటు సిబ్బంది కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ఘటనలు జరగకుండా ముందుస్తుగా ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కాలనీలో ఎవరికై న ఇళ్లు అద్దెకు ఇచ్చే క్రమంలో వారి వ్యక్తిగత సమాచారం, శాశ్వాత చిరునామా, ఆధార్ కార్డు తదితర వివరాలు సేకరించాలని, అలాగే ఎవరైన శుభకార్యాలు, దూర ప్రయాణాలకు వెళ్లే క్రమంలో దగ్గరలోని పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. అనంతరం కాలనీలోని పలు ఇళ్లలోని వ్యక్తుల సమాచారం ఆరా తీశారు. సీసీ కెమెరాలను కాలనీలో ఏర్పాటు చేసుకోవాలని, అత్యవసర సమయంలో డయల్ 100కు సంప్రదించాలన్నారు. 160 వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్టేషన్కు తరలించారు. ఎవరైన క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
గద్వాల: డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా గత రెండేళ్లుగా వాళ్ల సహనాన్ని పరీక్షించవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులతో కలిసి డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలలో కొన్నింటికి విద్యుత్ కనెక్షన్లన్లు, వాటర్ సరఫరా, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు వంటి మౌళిక వసతులు కల్పించకుండా లబ్ధిదారులను మోసం చేస్తున్నట్లు ఆరోపణ చేశారు. ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా ఆలస్యం చేయడంతో కిటికీలు, తలుపులు, ధ్వసం అయ్యాయని దీనిపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలన్నారు. అదేవిధంగా ధ్వంసమైన ఇళ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలన్నారు. రెండేళ్ల కిందట లక్కీడిప్పు విధానంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి లబ్ధిదారులను ఎంపిక చేశారని తరువాత 99మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం దారుణమన్నారు. ఉద్దేశపూర్వకంగానే పేర్లు తొలగిస్తూ, కాలయాపన చేయడం సరైన విధానం కాదని మండిపడ్డారు. లక్కీడిప్ విధానంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించాలని లేదంటే లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహా, లబ్ధిదారులు లక్ష్మీ, శమిన్, పావని, రాజేష్, అంజి, రఘు, నాగరాజు, సురేష్, నరేష్, రాజు పాల్గొన్నారు. -
బకాయిదారులకు ఊరట
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ఈ నెల 31 వరకే అవకాశం మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను ఏటా రెండు అర్ధ వార్షికాల్లో చెల్లించవచ్చు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు, అక్టోబరు నుంచి మార్చి వరకు చెల్లించాల్సిన పన్నును ఏడాదికోసారి చెల్లించడం పరిపాటిగా మారింది. అయితే మొండి బకాయిల వసూలుకు, మున్సిపాలిటీ ఖజానాను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. గతేడాది వరకు ఉన్న పన్ను బకాయిని ఏక మొత్తంలో చెల్లించే వారికి, బకాయిలపై విధించే (వడ్డీ) జరిమానాలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు. కేవలం పది శాతం చెల్లిస్తే చాలని, ఈ అవకాశం ఈ నెల చివరి వరకు ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికే పన్ను బకాయిలను పూర్తి వడ్డీతో పాటు కలిపి చెల్లించి ఉంటే.. అలాంటి వారికి రాబోవు పన్ను చెల్లింపులో వడ్డీ రాయితీ వర్తింపచేయనున్నారు. గద్వాలటౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీలలో ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని మొండి బకాయిదారులకు ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పించింది. మార్చి 2024–25 నాటికి ఆస్తిపన్ను మొత్తం బకాయిలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ కానుంది. కేవలం పది శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. ఈ అవకాశం ఈ నెల 31వ తేదీ వరకు ఉంటుంది. జిల్లాలో గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పాతవి కాగా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినవి. గద్వాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోయాయి. గతేడాది ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి వడ్డీమాఫీ ప్రకటించింది. మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను వసూళ్లు చాలా వరకు మందగించాయి. పలు రాయితీలు ఇచ్చినప్పటికి ఆశించిన స్థాయిలో పన్నులు వసూళ్లు కాలేదు. దీంతో పాత బకాయిలు వసూలు చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ కొత్త ఎత్తుగడ వేసింది. వన్ టైం స్కీం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వన్ టైం స్కీం ద్వారా పాత బకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్దమవుతున్నారు. చెల్లింపులు జరిగితే ఆయా శాఖలకు భారం తగ్గే అవకాశం ఉంది. వన్ టైం సెటిల్మెంట్తో వంద శాతం వసూలు చేయాలని అధికారుల కసరత్తు 31 వరకు చెల్లించేవారికి మాత్రమే వర్తింపు -
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
మల్దకల్: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సునంద అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో గట్టు అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే పౌష్టికాహారంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. నెలనెలా వైద్యపరీక్షలు చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు సంధ్యారాణి, నాగరాణి, తెల్లమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మానవుడి ఆయుష్షు పెంచడమే ఉగాది ఉద్దేశం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో జీవిస్తున్న మానవుడి ఆయుష్షు పెంచడమే పండగ ఉద్దేశం అని, షడ్రుచులను వివిధ ప్రకృతి ప్రసాదాలతో తయారు చేసిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుందన్నారు. చేదు, తీపిలు జీవితంలో మంచి చెడులను ఆస్వాధించడమే అన్నారు. వక్త గుంత లక్ష్మణ్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ముఖ్యమని, సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని సూచించారు. ప్రపంచ విపత్తులకు భారతదేశ యువత మార్గాలను చూపాలని, చెడు వ్యసనాలకు బానిసై నిర్వీర్యం కాకుండా, తన కుటుంబంతో పాటు దేశసేవలో భాగం కావాలని, వసుదైక ఉమ్మడి కుటుంబ విలువను పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కవితలు, జానపద గేయాలు, జానపద నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ రాజ్కుమార్, తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సంధ్యరాణి, ప్రిన్సిపాళ్లు రవికాంత్, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతు..
జోగుళాంబ గద్వాల‘జూరాల’కురూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025రామన్పాడు గేట్లకు లీకేజీలు.. రామన్పాడు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు ఆయా గేట్లను పూర్తిస్థాయిలో మూసివేసినా లీకేజీలు ఏర్పడి ముందుకు పారుతోంది. అంతేగాకుండా ఎప్పుడో చేసిన కాల్వల లైనింగ్ దెబ్బతినడంతో ఎప్పుడు తెగిపోయాయోనన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం రామన్పాడు రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తుంటారు. కాల్వల గేట్లు దెబ్బతినడంతో నీటి తాకిడికి ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు, అక్కడక్కడ దెబ్బతిన్న కాల్వ లైనింగ్, చిన్న చిన్న మరమ్మతులు వేసవిలో చేపట్టేందుకు అధికారులు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం కాల్వల్లో సాగు, తాగునీరు వదులుతున్నామని పంట కోతలు పూర్తయిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. వేసవి పూర్తయ్యే నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామన్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడుతోందని.. వేసవిలో మరమ్మతులు పూర్తిచేసి సకాలంలో సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఉన్న జూరాల ఎడమకాల్వ వెంట ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని గండ్లు ఉన్నాయో గుర్తించే పనుల్లో వర్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ వెంట మరమ్మతులు చేసిన అధికారులు ప్రస్తుతం రూ.1.20 కోట్లతో గేట్లు, లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలుగా ఉండగా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలం వరకు సుమారు 75 కిలోమీటర్ల పొడవున కాల్వ ఉంది. ఆయా మండలాలను కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీరు ఎడమకాల్వ ద్వారానే విడుదల చేస్తున్నారు. ఆరు కిలోమీటర్లు.. ఎనిమిది రంధ్రాలు... మూలమళ్ల నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది ప్రదేశాల్లో కాల్వ దెబ్బతింది. వీటి మరమ్మతులు చేపట్టకపోతే వచ్చే వర్షాకాలం వరదల నీటి ఉధృతికి లైనింగ్ దెబ్బతిని గండ్లుపడే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా.. జూరాల ప్రధాన ఎడమకాల్వకు ఏర్పడిన రంధ్రాలను పూడ్చడంతో పాటు దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. రెండేళ్లుగా కాల్వ పనులు, చేపట్టకపోగా.. కనీసం పూడికతీత, ముళ్లపొదలు కూడా తొలగించడం లేదు. – వెంకటేష్, నందిమళ్ల ప్రతిపాదనలు పంపించాం.. జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చడంతో పాటు చిన్న చిన్న మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని గతేడాది ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ఈ ఏడాది జూరాల ఎడమ కాల్వ, రామన్పాడు కుడికాల్వ గేట్ల మరమ్మతులు, చిన్న చిన్న పనుల కోసం రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు మంజూరైతే పంట కోతలు పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ సబ్ డివిజన్ దెబ్బతిన్న జూరాల ఎడమ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు.. లైనింగ్ వేసవిలో పనులు చేపట్టేందుకు అధికారుల సన్నాహాలు -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ట్రాఫిక్ సిబ్బందికి నూతనంగా వచ్చిన పరికరాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని వాహనదారులు సామర్థ్యానికి మించి స్పీడ్తో వాహనాలు నడుపుతూ వారు ప్రమాదాలకు గురవుతూ.. ఇతరులను వాటి బారిన పడేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ పలు అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు 10 ఫ్లెక్సిబుల్ ఐరన్ బారికేడ్స్, 10 రిఫ్లెక్ట్ జాకెట్స్, 10 బ్రీత్ అనలైజర్స్ తదితర వాటిని ట్రాఫిక్ సిబ్బందికి అందజేశామన్నారు. జిల్లాలోని ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ట్రాఫి క్ ఎస్ఐ బాలచంద్రుడికి పరికరాలను అందజేశారు. -
గడువు లేక.. పరికరాలు పొందక !
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాయితీపై పరికరాలు అయిజ: రైతులకు సాగులో ఎంతో అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే సమయం ఇవ్వడంతో అర్హులైన రైతులు ఎంతోమంది పథకానికి దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం పడుతుండడంతో ఇక రెండు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక.. అందులోనూ కేవలం మహిళా రైతులే అర్హులని తెలపడంతో అయోమయంలో పడ్డారు. గడువు పెంచి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు. సబ్సిడీపై పరికరాలు వ్యవసాయదారులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభించి రైతులకు అవసరమైన వివిధ రకాల పరికరాలు, యంత్రాలు 50 శాతం సబ్సిడీతో అందించేందుకు వ్యవసాయ శాఖ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కేవలం మహిళా రైతులకు మాత్రమే ఈ పథకానికి అర్హులను చేస్తోంది. దరఖాస్తు చేసేందుకు కేవలం రెండు, మూడు రోజుల గడువు ఇవ్వడంతో సర్వత్రా అయోమయం నెలకొంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అందిస్తోంది. సన్న, చిన్నకారు, ఇతర వర్గాలకు చెందిన మహిళా రైతులు దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసిన మహిళా రైతులకు సబ్సిడీలో అవసరమైన వ్యవసాయ పరికరాలు సరఫరా చేస్తారు. రెండు రోజులు.. 58 దరఖాస్తులు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా యూనిట్లు, నిధులు మంజూరు చేసింది. ఈ నెల 24న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దశాబ్ద కాలంపాటు ఆగిన ఈ యాంత్రీకరణ పథకం మళ్లీ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం, కేవలం మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఉండటంతో భూములున్నప్పటికీ మహిళల పేరుతో భూమి లేకపోవడంతో అర్హులైన చిన్నకారు, సన్నకారు రైతులు సైతం ఈ పథకానికి దూరమవుతున్నారు. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 58 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలతో ఇబ్బందులు.. ట్రాక్టర్కు సంబంధించిన యంత్రాలు ఇచ్చేందుకు భూమి మహిళల పేరుతో ఉండాలని, ట్రాక్టర్ ఆర్సీ మహిళల పేరుతో ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం నిబంధనలు కొంతమేర సడలిస్తూ దరఖాస్తు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, 2016–17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ శాఖలో యాంత్రీకరణ పథకాన్ని నిలిపేసింది. దీంతో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు సంఘాల ప్రతినిధులు ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి జిల్లాల వారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాకు సంబందించి 234 యూనిట్లు కేటాయించి, రూ.56.88 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో వ్యవసాయశాఖ అధికారులు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే వివిధ కంపెనీలకు చెందిన తయారీదారులు సంబంధిత పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. సబ్ మిషన్ ఆఫ్ ఫామ్ మెకలైజేషన్ పథకం కింద ఎంపికై న రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందజేస్తారు. ప్రభుత్వం పేర్కొన్న ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాకు మంజూరైన యూనిట్ల వివరాలిలా.. పరికరాలు యూనిట్లు ట్రాక్టర్లు 3 రోటవేటర్లు 30 పవర్ స్ప్రేయర్లు 73 బ్యాటరీ స్ప్రేయర్లు 73 సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 5 డిస్క్ హారో కేజ్ వీల్స్ 39 పవర్ టిల్లర్ 2 స్ట్రా వేలర్లు 2 బండ్ ఫార్మర్ 3 బ్రష్ కట్టర్లు 2 పవర్ వీడర్లు 2 గడువు పెంచాలి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మూడురోజులు గడువు మాత్రమే విధించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు వారి వారి కుల ధ్రువీకరణ పత్రాలను ధరఖాస్తులకు జత చేయాల్సి ఉంటుంది. సరైన సమయానికి కుల ధ్రువీకరణ పత్రం అందకపోవడంతోదరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పెద్దలు ఆలోచించి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాలి. – ఆంజనేయులు, అయిజ అర్హులందరికీ అందజేయాలి ఏడేళ్ల తర్వాత ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తుంది. మహిళల పేరుతో రాయితీ పరికరాలు అందించడం బాగుంది. అయితే చాలా తక్కువ పరికరాలు జిల్లాకు కేటాయించారు. అవి ఏమాత్రం సరిపోవు. అర్హులైన రైతులందరికీ సరిపడా పరికరాలు మంజూరు చేయాలి. – వెంకటమ్మ, అయిజ త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం ఉన్నతాధికారుల ఆదేశానుసారం మహిళా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరించాం. ఈనెలాఖరు వరకు లబ్ధిదారులను గుర్తించి త్వరలో అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలను అందిస్తాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లాకు 234 యూనిట్లు.. రూ.56.88 లక్షలు మంజూరు దరఖాస్తుకు తక్కువ సమయం ఇవ్వడంతో రైతుల ఇబ్బందులు చాలా మంది అర్హులు పథకానికి దూరం 26న ముగిసిన సమయం.. జిల్లాలో కేవలం 58 దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచి లబ్ధి చేకూర్చాలని రైతుల వినతి -
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
ఎర్రవల్లి: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే ప్రశ్నించడంతో పాటు మన హక్కులను సాధించగలుగుతున్నామని.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లిలో ఏర్పాటు చేసిన జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్మన్ వెన్నెల, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్జాన్తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ.. రాజ్యాంగాన్ని కాపాడుతూ.. దేశ ప్రజలను మభ్యపెడుతూ మనువాద సిద్దాంతాన్ని ప్రజలపైన రుద్దుతున్న బీజేపీ పార్టీని ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించే దిశగా గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ నాయకులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందీని జాతీయ భాష చేయాలని కుట్ర పన్నుతుందని, తెలుగు ప్రాంత ప్రజలకు అన్యాయం చేసే ఈ చర్యను అడుగడుగునా అడ్డుకోవాలని అన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన వాళ్లకి చివరికి అన్యాయం జరిగిందని, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడితే సొంత పార్టీ వాల్లే తమ కష్టాన్ని గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నాయకులు పలు సమస్యలపై ఒకరికొకరు ప్రశ్నించుకొని మాటలతో వాగ్వాదాలకు దిగగా.. ఏఐసిసి కార్యదర్శి ఇరువురికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్మన్ వెన్నెల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, మార్కెట్యార్డు చైర్మెన్ దొడ్డెప్ప, వైస్ చైర్మెన్ కుమార్, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీచుపల్లిలో ప్రత్యేక పూజలు మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని బుధవారం ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్పర్సన్ వెన్నెల, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్జాన్ సందర్శించారు. అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
కేటీదొడ్డి: రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె, ఉమిత్యాల గ్రామాలలో ర్యాలంపాడు రిజర్వాయర్ 104 ప్యాకేజీ కాల్వ ద్వారా నీరందక పంటలు ఎండగా.. వరి పంటలను ఆయన పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ సంతోష్, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్కు పోన్ చేసి సాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడింది శూన్యమన్నారు. జూరాల, నెట్టెంపాడు, రిజర్వాయర్ ఆయకట్టు కింద సాగునీరందకపోవడంతో పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని విమర్శించారు. యాసంగి సాగుకు ముందు ప్రభుత్వం ఐఏబీ సమావేశం నిర్వహించకుండా పంటల ప్రణాళిక రూపొందిందని అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అయినా సీఎం రేవంత్రెడ్డి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఓ వైపు పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించడానికి కూడా మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధులకు తీరిక లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలోపు ఎప్పుడు కూడా రైతుల పంటలు ఎండకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పంటలు ఎండడానికి కారణమయ్యాడని ఆరోపించారు. రాప్ట్రంలో ఇప్పటి వరకు 448 మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్వాకం వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, మోనేష్, అంగడి బస్వరాజ్, వెంకటేష్ నాయుడు, ఎస్ రాము, తిరుమలేష్, కామేష్, తదితరులు ఉన్నారు. -
గద్వాల డిపో మేనేజర్గా సునీత
గద్వాల క్రైం: ఆర్టీసీ గద్వాల డిపో మేనేజర్గా సునీత బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరిస్తానని, సంస్థ అభివృద్ధికి ప్రతిఒక్క రూ సహకరించాలన్నారు. మేనేజర్కు సిబ్బంది పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి గద్వాల: ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి నిర్ధేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆదేశించారు. బుధవారం గద్వాల మండల పరిదిలోని చెనుగోనిపల్లి గ్రామంలోని ఉపాధి హమీ పనులను ఆయన పరిశీలించి కీలక సూచనలు అందించారు. అనంతరం గ్రామంలోని కోళ్ల షెడ్, పశువుల షెడ్ పరిశీలించి, నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్, కనీస వసతులు కల్పించాలని అన్నారు. సీఎంను కలిసిన అర్చక సంఘం నాయకులు అలంపూర్: హైదరాబాద్లోని అసెంబ్లీ వద్ద అర్చక ఉద్యోగ సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మేశ్వర జోగుళాంబ అమ్మవా రి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ అర్చక సంఘం నాయకులతో కలిసి సీఎంను శాలువాతో సత్కరించారు. అర్చక ఉద్యోగ జేఏసీ డైరీని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు వారు తెలిపారు. -
ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి
అలంపూర్: సాగుభూములను ప్రమాదకరంగా మార్చే ఇథనాల్ ప్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. హైదరాబాద్లోని శాసన మండలిలో సమావేశాల్లో ఎమ్మెల్సీ పలు సమస్యలను బుధవారం ప్రస్తావించారు. అలంపూర్ నియోజకవర్గంలో ప్రజలు వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్నారని వివరించారు. రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామం వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పంట పొలాలకు ప్రమాదకరంగా మార్చే ఈ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని, ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మా ప్రాంతంలో వ్యవసాయ భూములకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉన్న ఫ్యాక్టరీలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీతో 12 గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా రైతులు, ప్రజలు పోరాటం చేస్తున్నారని, పంట పొలాలను, భూగర్భ జలాలను కలుషితం చేసే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల సర్పంచ్ల పాలన ముగిసి ఏడాది కావస్తుండటంతో గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. త్వరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలకు రాష్ట్రంతోపాటు కేంద్ర నిధులు వస్తాయని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీల్లో పన్నుల భారం తగ్గించాలని కోరారు. మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గం వచ్చేలోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 5 కి.మీ, 8 కి.మీ దూరంలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటిల్లో కలిపారని పేర్కొన్నారు. ఇకనైనా వాటిని విడదీసి పంచాయతీలుగా మార్చాని విజ్ఞప్తి చేశారు. -
పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండండి
అయిజ: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇతరులను ఎవరినీ కేంద్రాల వద్దకు రానివ్వకూడదని, పరీక్ష సమయం ముగిసేవరకు జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఉత్తనూరులోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఏ విద్యార్థి, సెంటర్ సిబ్బంది సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన సందరించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పని తీరును ఎస్సై శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క ఉద్యోగి నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని న్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వై. మోగిలయ్య, శాంతినగర్ సీఐ టాటా బాబు తదితరులు ఉన్నారు. -
డామిట్.. కథ అడ్డంతిరిగింది!
అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మకై ్క వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. -
శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసుల విచారణలో వేగం పెంచాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జాకు పాల్పడినట్లు వచ్చే ఫిర్యాదులపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. పోలీసు సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తప్పవన్నారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషిట్ దాఖలు చేసి.. న్యాయస్థానంలో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్ల్లో నమోదైన కేసుల విచారణ వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి ఉన్నారు. -
జోగుళాంబ క్షేత్రం అభివృద్ధికి చర్యలు
గద్వాల: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జోగుళాంబ దేవస్థానం అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ పునరుద్ధరణ ప్రణాళికను ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏకై క శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దేవాలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆలయ పరిసరాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రసాద్ స్కీం భవనానికి నీటి సరఫరాకు సంబంధించి మున్సిపల్ కమిషనర్, ఇంట్రా ఈఈ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు నది నీటి శుద్ధి విషయంలో ఫీల్డ్ విజిట్ నిర్వహించి.. 15 రోజుల్లో వ్యయ అంచనాలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసాద్ స్కీం భవనాన్ని టూరిజం శాఖ అధికారులు వెంటనే దేవాదాయశాఖకు అప్పగించాలన్నారు. దేవాలయానికి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, గాంధీ జంక్షన్ నుంచి ఆలయం వరకు రహదారి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. హైదరాబాద్, కర్నూలు నుంచి అలంపూర్ మార్గాల్లో దిశానిర్దేశిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రాంతంలో మొక్కలు పెంచాలని, టాయిలెట్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి అన్నిశాఖల అఽధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాలయం వద్ద చేపట్టే అభివృద్ధి పనులపై శాఖల వారీగా వారం రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు, అసిస్టెంట్ స్థాపతి గణేశ్, టెంపుల్ డిజైనర్ గోవిందహరి, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈఓ పురేందర్, డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ వనజారెడ్డి తదితరులు ఉన్నారు. -
సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..
అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు. – మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.. ఎల్ఆర్ఎస్పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం. – వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ● -
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
గద్వాల క్రైం: ‘‘రానున్నది 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రత సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. జిల్లాలో ప్రస్తుతం ఎండల తీవ్రత 43 డిగ్రీలు దాటుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగడంతో పాటు ఉదయం 10 గంటల నుంచే వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలే రక్షణ గొడుగుగా నిలుస్తాయి.’’ అని జిల్లా ఇన్చార్జి వైద్యారోగ్యశాఖ అధికారి సిద్దప్ప వెల్లడించారు. వేసవిలో మండే ఎండలతో ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు వైద్యారోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రి, పల్లె దవాఖానల్లో వడదెబ్బకు గురైన వారికి అవసరమైన మందులు, లక్షకు పైగా ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఇన్చార్జి డీఎంహెచ్ఓ చెప్పారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రశ్న: ఉదయం నుంచే ఎండలు పెరుగుతున్నాయి. స్కూల్ నుంచి వచ్చిన చిన్నారులు ఉక్కపోతకు గురై ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీకాంత్, పాత హౌసింగ్ బోర్డు, గద్వాల వైద్యాధికారి: సాధారణంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు వేడిని తట్టుకునే సామర్థ్యం కోల్పోతారు. యూనిఫాం ధరించడం వల్ల వారికి అవసరమయ్యే గాలి చేకూరాదు. పైగా సిల్క్ దుస్తులు కావడం, షూ ధరించడం సమస్యగా ఉంటుంది. అవసరమైన పోషకాహారం, నీరు తీసుకోరు. బయట చిరుతిండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. వేడి గాలుల వల్ల ఉక్కపోతకు గురవుతారు. సిల్క్ దుస్తులు, షూ లాంటి వాటికి విరామం ఇవ్వాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి. ప్రశ్న: ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – రాముడు, ఉండవెల్లి వైద్యాధికారి: ప్రతి ఒక్కరూ తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు నిమ్మ, చెరుకు, పండ్ల రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే క్రమంలో చలువ అద్దాలు, గొడుగు, తలపాగ, టోపీ ధరించాలి. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్ధాలనే తీసుకోవాలి. అందులో మసాలాలు, నూనె వంటివి తక్కువగా ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, కల్తీ ఐస్తో తయారు చేసిన పండ్ల రసాలు తీసుకోవద్దు. శరీరంలో మార్పులు వచ్చినట్లు గమనిస్తే సమీపంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలోని వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే ఓఆర్ఎస్, ఐవీ ప్లూయిడ్స్, మందులు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటించాలి. ప్రశ్న: వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రసాద్, రెండవ రైల్వేగేట్, గద్వాల వైద్యాధికారి: ఎండల తీవ్రత పెరిగినందున ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి. చిన్నారులు, వృద్ధులను చల్లని ప్రదేశాల్లో ఉండాలి. బయటకు వచ్చే క్రమంలో కాటన్ దుస్తులు, గొడుగు లేదా తలపాగ, టోపీ ధరించాలి. బయట మాసాల ఫుడ్, బేకరి ఫుడ్, నూనె వంటి వంటకాల జోలికి వెళ్లరాదు. తేలికపాటి ఆహారం రాగిజావ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేని వారు పిడికెడు చక్కెర, చిటికెడు ఉప్పు కలిపిన నీటిని గంటకోసారి తాగాలి. ప్రశ్న: వ్యవసాయ, కూలీ పనులు చేసే వారు వడదెబ్బ బారిన పడకుండా ఏ జాగ్రత్తలు పాటించాలి? – పరశురాముడు లైఫ్ చేంజ్ సంస్థ నిర్వాహకుడు, గద్వాల ౖవెద్యాధికారి: కూలీలు, రైతులు వీలైనంత వరకు ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి పనులు చేసుకోవాలి. ఎక్కువగా చెట్ల నీడలో ఉండాలి. ఎండలో ప నులు చేయడం వల్ల శరీరంలో వేడి ఉష్ణోగ్రత లు పెరిగిపోయి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలి. ఉపాఽధి హామీ పనులు చేసే కూలీలకు కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యసిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. అవసరమైతే స మీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి. రానున్న రోజుల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అత్యవసరమైతేనే బయటకు రావాలి బయటి ఆహారానికి దూరంగా ఉండాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలకు ప్రత్యేక చర్యలు ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సిద్దప్ప -
ఉపాధి హామీ కూలీలకు మేలు చేకూర్చండి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు మేలు చేకూర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం ఇటిక్యాల నుంచి పెద్దదిన్నె రోడ్డు వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, రైతుల పొలాలకు వెళ్లే నక్ష దారి గురించి కొందరు అభ్యంతరం తెలుపగా.. అదనపు కలెక్టర్ వారితో నేరుగా మాట్లాడి నచ్చజెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఎం శివజ్యోతి, ఆర్ఐ భీంసేన్రావు, సర్వేయర్ దౌలమ్మ, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఏ పురేందర్ పాల్గొన్నారు. కోర్టు భవనానికి రూ. 81కోట్లు మంజూరు గద్వాల: జిల్లా కేంద్రంలో కోర్టు భవన సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తూ జీఓ జారీ చేసినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంగళవారం తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోర్టు భవన సముదాయం నిర్మాణానికి రూ. 81కోట్లను మంజూరు చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు హుండీ లెక్కింపు అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో బుధవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలతో పాటు అన్నదాన సత్రంలోని హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,150 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డుకు మంగళవారం 1242 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,150, కనిష్టంగా రూ. 3,011, సరాసరి రూ. 4,589 ధరలు వచ్చాయి. 18 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,513, కనిష్టంగా రూ. 3,819, సరాసరి రూ. 6,296 ధరలు లభించాయి. 46 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 3,361, సరాసరి రూ. 6,091 ధరలు వచ్చాయి. హైవేలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అలంపూర్: ఉండవెల్లి మండలం పుల్లూరు శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం అదికారులు తొలగించారు. పుల్లూరు టోల్ప్లాజా వద్ద నేషనల్ హైవే అథారిటీ కార్యాలయానికి సమీపంలోని 448 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోర్టు ద్వారా మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఎలాంటి స్పందన లేకపోవడంతో, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉండవెల్లి తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ శ్రీవాణి, సర్వేయర్ రాఘవేంద్ర, ఏఎస్ఐ సుబ్బారెడ్డి, రెవెన్యూ, పోలీసు, నేషనల్ హైవే ఆధికారులు మంగళవారం అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. నవోదయ ఫలితాలు విడుదల బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
సకాలంలో పన్నులు చెల్లించాలి
కలెక్టర్కు తమ సమస్య విన్నవిస్తున్న రైతులు అలంపూర్ : మున్సిపాలిటీలో పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ చంద్రశేఖర్ రావు అన్నారు. అలంపూర్లో వార్డు అధికారులతో కలిసి కమిషనర్ సోమవారం దుకాణదారుల వద్ద పన్ను వసూలు చేశారు. నివాసగృహ యజమానులు, దుకాణదారులు పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారికి నోటీసులు అందించనున్నట్లు, పెండింగ్లో ఉన్న వారందరూ వెంటనే పన్నులు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.