Jogulamba District Latest News
-
మట్టి మాఫియాకు కాసుల వర్షం
ఇదిలా ఉంటే మరోవైపు చేనేత పార్కుకు కేటాయించిన స్థలంలో చాలా ప్రాంతం గుట్టలుగా ఉంది. ఈ గుట్టలు మట్టిమాఫియాకు వరంగా మారాయి. నిత్యం వందల లారీలలో మట్టిని అక్రమంగా తవ్వుతూ డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులే మట్టిమాఫియా అవతారం ఎత్తిసొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందులో రెవెనూ, మైనింగ్, పోలీసుశాఖలోని కొందరు అవినీతి అధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా మట్టిదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చేనేత పార్కు స్థలంలో యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టిదందా -
క్రీడలతోనే ఆరోగ్యం పదిలం
గద్వాలటౌన్: ఆటలు ఆడటం ద్వారానే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి వాలీబాల్, తాయిక్వాండో కరాటే, ఖోఖో, అథ్లెటిక్స్, కబడ్డీ, క్రికెట్ క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రీడలతో దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఆరోగ్యకరమైన జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మీతోపాటు మీ ఇంటి దగ్గర ఉండే మీ స్నేహితులను వేసవి శిక్షణ శిబిరానికికి తీసుకురావాలని సూచించారు. ఈ శిబిరం వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడువున నిరంతరం క్రీడలు ఆడేవిధంగా కొనసాగాలని కోరారు. డీవైఎస్ఓ అధికారి జితేందర్ మాట్లాడుతూ గద్వాలలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, వారిని ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సెలవుల్లో క్రీడలు ఆడుతూ ఆనందంగా గడపాలని సూచించారు. ఉదయం, సాయంత్రం సాగే వేసవి శిక్షణా శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన దగ్గర శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో వేసవిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులు వినియోగించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా విభాగాల క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్, నగేష్బాబు, సతీష్, నర్సింహారాజు, కరాటే మాస్టర్ శ్రీహరిలతో పాటు ఆయా క్రీడల శిక్షకులు చందు, రవి, తిరుపతి, రజనికాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా.. అచేతనంగా!
చేనేత పార్కు ఏర్పాటుపై ముందడుగు పడని వైనం ●పార్కు ఏర్పాటు చేయాలి చేనేత పార్కును త్వరగా ఏర్పాటు చేయాలి. దీనిద్వారా ప్రతేక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా పార్కుకు కేటాయించిన స్థలంలో కొందరు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థలాన్ని నాశనం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడి రక్షణ చర్యలు చేపట్టాలి. – రాంలింగేశ్వర్కామ్లీ, గద్వాల చేనేత క్లస్టర్ చైర్మన్ నివేదిక పంపించాం పార్కుకు కేటాయించిన స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం రూ.2.40కోట్లతో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ఇంజినీరింగ్ అధికారుల ద్వారా చేపడుతాం. అదేవిధంగా రూ.50లక్షలలో రూ.8.50లక్షలు ఏపీఐసీసీ వాళ్లు దిమ్మెల ఏర్పాటు, సెక్యూరిటీ గార్డు ఏర్పాటుకు వెచ్చించారు. రెవెన్యూ శాఖ వారు ఫొటోగ్రఫి సర్వే చేయగా ఇందుకు రూ.2.50లక్షలు ఖర్చు చేశారు. ఈనిధులను రాష్ట్ర ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు ఖర్చు చేయడం జరిగింది. మట్టిదందాపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తే పూర్తిస్థాయిలో రక్షణ కల్పించవచ్చు. – గోవిందప్ప, ఏడీ చేనేత శాఖగద్వాల ● నిధులున్నా పట్టించుకోని అధికారులు ● రూ.11లక్షలు ఖర్చు చేసినట్లు అధికారుల కాకిలెక్కలు ● మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్న పార్కుకు కేటాయించిన స్థలం -
నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం
గద్వాల: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల పట్టణ శివారులో నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్తో పనుల తీరుతెన్నులపై అడిగి తెలుసుకున్నారు. కళాశాల వసతులకు అనుగుణంగా జీ ప్లస్ వన్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్మాణం పనులకు సంబంధించిన మ్యాప్ ద్వారా పనుల వివరాలను అఽడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, అదేవిధంగా నిర్దిష్ట కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ హనుమంతమ్మ, డీఈ శ్రీనివాసులు, ఏఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అవాంతరాలు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు
గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని రకాల జగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం యాసంగిలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎస్ఓ స్వామి, డీఎం విమల, పుష్పమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా.. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి నాణ్యతను పరీక్షించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భవనాల్లో రూఫ్ టాఫ్ హార్వెస్టింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పాతబోర్ల రీచార్జింగ్ ద్వారా భూగర్భ జలాలను పెంచుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. సమావేశంలో మిషన్భగీరథ ఇంట్రా ఈఈ శ్రీధర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రావు, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంద్య తదితరులు పాల్గొన్నారు. -
పది ఫలితాల్లో కొంత మెరుగు
32 నుంచి 26వ స్థానానికి చేరిన జిల్లా స్థానం ● 91.74 శాతం ఉత్తీర్ణత ● బాలికలదే పైచేయి.. ● బాలికలు 93.96 శాతం, బాలురు 89.49 శాతం ఉత్తీర్ణత గద్వాలటౌన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 26వ స్థానంతో సరిపెట్టుకోవడం తీవ్ర నిరాశ కల్గించింది. గతంతో పోలిస్తే జిల్లా ర్యాంకు, ఉత్తీర్ణత శాతం కొంత మెరుగుపడింది. గత ఏడాది రాష్ట్రస్థాయిలో 32వ స్థానంలో ఉన్న జిల్లా ర్యాంకు ఈ సారి కాస్త పెరిగింది. ఉత్తీర్ణత ఏకంగా పది శాతానికి పైగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 7,569 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,944 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లా సరాసరి ఉత్తీర్ణత 91.74 శాతంగా నమోదైంది. వీరిలో 3,759 మంది బాలురకు గాను 3,364 మంది ఉత్తీర్ణత సాధించి 89.49 శాతంతో సరిపెట్టుకున్నారు. 3,810 మంది బాలికలు పరీక్షలు రాయగా 3,580 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 93.96 శాతంతో బాలుర కంటే కొంత పైచేయి సాధించారు. అక్షరాస్యతలో వెనకంజలో ఉన్న ఈ జిల్లాలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధించినప్పటికీ సర్దుబాటుతో వాటిని భర్తీ చేయగలిగారు. 61 పాఠశాలలకు ‘వంద’నాలు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. అయితే అందులో 61 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత రావడం జిల్లాకే గర్వకారణం. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకటి, జడ్పీ ఉన్నత పాఠశాలలు 17, రెసిడెన్షియల్ పాఠశాలలు 08, కేజీబీవీలు 05, ప్రైవేటు పాఠశాలలు 30 ఉన్నాయి. మరి కొన్ని పాఠశాలలు ఒకటి, రెండు శాతంతో వందశాతం ఉత్తీర్ణత కోల్పోయాయి. ప్రతిభ చాటిన విద్యార్థులు.. ● గద్వాల విశ్వభారతి హైస్కూల్కు చెందిన విద్యార్థిని అఫ్రానాజ్ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. అయిజ శ్రీకృష్ణవేణి హైస్కూల్కు చెందిన విద్యార్థిని పద్మావతి 585 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో గట్టు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అక్షయ 576 మార్కులు, కేటీదొడ్డి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి చరణ్ 574 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. ● జిల్లాలో 962 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ●సమష్టి కృషికి నిదర్శనం పదో తరగతి ఫలితాలలో జిల్లా విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈ సారి 10.36 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. అందరి సమష్టి కృషి ఫలితంగానే 91 శాతంకు పైగా ఉత్తీర్ణత వచ్చింది. వంద రోజుల ప్రణాళిక, ప్రత్యేక తరగతులను ప్రతి పాఠశాలలో త్రికరణశుద్ధిగా అమలు చేయడంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఇకపై ఇదే ఒరవడి కొనసాగించి, రాబోవు విద్యా సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జిల్లా అధికారులకు అభినందనలు. – సంతోష్, కలెక్టర్ సివిల్స్ సాధించడమే లక్ష్యం తల్లిదండ్రులు యూనిస్పాష (యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు), అమ్మ ఆసిమాబేగం, గురువుల ప్రోత్సహంతో మంచి మార్కులు సాధించాను. 587 మార్కులతో జిల్లా టాపర్గా నిలవడం ఆనందంగా ఉంది. ఐఐటీలో సీటు సంపాదించి, సివిల్స్ సాధించడమే నా లక్ష్యం. – అఫ్రానాజ్, విశ్వభారతి హైస్కూల్, గద్వాల జిల్లాలో గతంలో పదో తరగతి ఫలితాలు ఇలా.. డాక్టర్ అవుతా.. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కష్టపడి చదవడంతో 566 మార్కులు సాధించాను. తల్లిదండ్రులు శివశంకర్, లలిత కష్టం వృథా కాకుండా మంచి మార్కులు సాధించా. వైద్యురాలిగా స్థిరపడి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం. – అక్షయ, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, గద్వాల -
బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి
శాంతినగర్: పోలీస్ స్టేషన్కు వివిధ సమస్యల గురించి వచ్చే బాధితులకు సత్వరం న్యాయం అందేలా ఆయా స్టేషన్ల సిబ్బంది చూడాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం శాంతినగర్ పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులను, స్టేషన్ పరిసరాలను, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 100 నంబర్కు కాల్ వస్తే వెంటనే స్పందించి అక్కడికి చేరుకోవాలని.. బాధితులకు రక్షణ కల్పించాలన్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విసృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని, 24/7 గస్తీ నిర్వహించాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూడనమ్మకా లు, బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో వుంటూ ప్రజా సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. డీఎస్పీ వై.మొగులయ్య, సీఐ టాటా బాబు, ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిగా గట్టు ఆడపడుచు
గట్టు: గట్టు చరిత్రలో తొలిసారిగా ఓ ఆడపడుచు జడ్జిగా ఎంపికయ్యారు. గట్టుకు చెందిన సంఘం స్వర్ణమల్లిక జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. బుధవారం జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో గట్టుకు చెందిన స్వర్ణమల్లిక జడ్జిగా ఎంపికయ్యారు. గట్టుకు చెందిన న్యాయవాది సంఘం సురేష్ కుమార్తెనే స్వర్ణమల్లిక. ఈయన గద్వాల కోర్టులో గత 30 ఏళ్లుగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. స్వర్ణమల్లిక 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గద్వాల సత్యసాయి విద్యామందిర్లో, ఇంటర్ను శ్రీమేధా హైదరాబాద్, డిగ్రీ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. న్యాయవాదిగా నమోదు అయిన తర్వాత కొంత కాలం గద్వాల కోర్టులోనూ, ఆ తర్వాత హై కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. స్వర్ణమల్లిక సోదరుడు సంతోష్ సైతం న్యాయవాదిగా కొనసాగుతున్నాడు. స్వర్ణమల్లిక జడ్జిగా ఎంపిక కావడంపై గట్టు మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కావలి నర్సింహులు, కార్యదర్శి జయసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు ఖాజామోహినోద్దిన్, మాజీ అధ్యక్షుడు రఘురామిరెడ్డిలతో పాటుగా పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జడ్జిగా ఎంపికై న తన కూతురు సంఘం స్వర్ణమల్లికతో సంఘం సురేష్ -
మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి
అలంపూర్: నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మున్సిపాలిటీలోని 3 వార్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీరోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.5 కోట్లతో ఆయా వార్డుల్లో సీసీరోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రక్టార్లు పనులు నాణ్యతగా చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్రావు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఇంతియాజ్ అలీ, సర్దార్, శేఖర్రెడ్డి, పెద్ద ముక్తార్, నాగరాజుయాదవ్, రుక్ముద్దీన్, నాగభూషణం, రఘురెడ్డి తదితరులు పాల్గొన్నారు.మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలిమల్దకల్: మహిళల ఆరోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీప్యూటీ డీఎంహెచ్ఓ సంధ్యాకిరణ్మయి అన్నారు. మంగళవారం మల్దకల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయించుకోవడంతో పాటు పోషకాలు కలిగిన ఆహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెంచడంతో పాటు గ్రామాల్లో 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. పీహెచ్సీతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన రామేశ్వరమ్మను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డా.జయమ్మ, రాజు, సూపర్వైజర్ శ్రీధర్, వెంకటస్వామి, జ్యోతి పాల్గొన్నారు.వేరుశనగ క్వింటాల్ రూ.6,419గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 310 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 6,419, కనిష్టంగా రూ. 2,916, సరాసరి రూ. 4,598 ధరలు వచ్చాయి. క్వింటాల్ కందులు రాగా.. రూ. 5,206 ధర పలికింది. 115 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,939, కనిష్టంగా రూ. 5,629, సరాసరి రూ. 5,929 ధరలు లభించాయి. 2,369 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 1,920, కనిష్టంగా రూ. 1,700, సరాసరి రూ. 1,901 ధరలు వచ్చాయి.రెండు రోజుల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిమహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బోయపల్లి (డివిజన్ నం.16), హనుమానున్నగర్–న్యూగంజి (డివిజన్ నం.47)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. కాగా, ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలాఉండగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎల్–1 కింద 1,400 ఇళ్లు కేటాయించారు. అయితే సుమారు రెండు వేల మంది నుంచి దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఇన్చార్జ్ ఎంఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పాం కష్టాలు తీరేనా?
నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయిల్పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతు లు ఆయిల్పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారు లు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. నారాయణపేట జిల్లాలో 5,907 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్పాం గెలలను తరలించాల్సి వస్తోంది. ఆశించిన స్థాయిలో దిగుబడి.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 29వేల ఎకరాల్లో పంట కోత లు చేపట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 130 టన్నులు, వనపర్తిలో 600, జోగుళాంబ గద్వాలలో 300, మహబూబ్నగర్లో 260 టన్నుల దిగుబడి రాగా.. నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది. లాభసాటిగా ధరలు.. గతేడాది ఆయిల్పాం టన్నుకు రూ. 11వేల నుంచి రూ. 14వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 21వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఆయిల్పాం రైతులకు లాభసాటిగా మారింది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతు లు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వ స్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం.. పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి.. ప్రభుత్వం అందించిన రాయితీ ప్రోత్సాహం, అధికారుల సహకారంతో 7 ఎకరాల్లో ఆయిల్పాం సాగుచేశాను. ఇటీవల గెలలను కోసి అశ్వారావుపేటకు తరలించాను. స్థానికంగానే పరిశ్రమ ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్, రైతు, గూడెబల్లూరు, మాగనూర్ మండలం త్వరలో ఇబ్బందులు తీరుతాయి.. ఆయిల్ఫెడ్ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం, జిల్లా ఆయిల్ఫెడ్ ఇన్చార్జి, నారాయణపేట రైతులను ప్రోత్సహిస్తున్నాం.. జిల్లాలో ప్రస్తుతం 6వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. మరో 4వేల ఎకరాల్లో సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. 10వేల ఎకరాలు పూర్తిచేస్తే మన జిల్లాలోనే పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇటీవల ధర భాగా పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆయిల్పాం సాగుపై దృష్టిసారించాలి. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. – చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, నారాయణపేట ఉమ్మడి జిల్లాలో పంట కోతలు షురూ గెలల విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే.. స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం ఉమ్మడి జిల్లాలో 28,999 ఎకరాల్లో సాగు చిగురిస్తున్న ఆశలు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్ఫెడ్ కార్పొరేషన్కు చైర్మన్ను నియమించింది. అయితే కొత్త పాలకవర్గం ఆయిల్పాం సాగుకు కొత్త జనసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల నారాయణపేట జిల్లాలో చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం
అయిజ: రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం అయిజ తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి స్థానంలో భూ భారతి చట్టం రూపొందించినట్లు చెప్పారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు చేస్తారన్నారు. తద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. భూ భారతి చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నాయని వివరించారు. ధరణి వ్యవస్థలో కేవలం వ్యవసాయ భూములే నమోదు అవుతుండగా.. భూ భారతి వ్యవస్థలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ చట్టంలో అన్ని రకాల అప్లికేషన్లు ఉన్నాయని.. హక్కుల రికార్డుల్లో తప్పులను సవరించుకోవచ్చని అన్నారు. రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుదని పేర్కొన్నారు. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతుల దరఖాస్తులపై ఆర్డీఓలు విచారించి.. ఆర్హత కలిగిన వారికి పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేస్తారన్నారు. వారసత్వ భూముల మార్పిడికి ముందు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసే విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. లైసెన్స్ కలిగిన సర్వేయర్లతో భూ సర్వే చేసి.. మ్యాప్తో సహా పట్టాదారు పాస్పుస్తకాల్లో వివరాలను చేర్చే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ధరణి వ్యవస్థలో భూ సమస్యలపై నేరుగా సివిల్ కోర్టుకే వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు భూ భారతి చట్టంలో అధికారుల ఉత్తర్వ్లుపై అసంతృప్తి ఉంటే తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టర్ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగాభూ వివాదాలను పరిష్కరించేందుకు గాను ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందని తెలిపారు. జిల్లాలోనే అయిజ మండలంలో ఎక్కువ ఎకరాల భూములు ఉన్నాయని.. 6,500 సమస్యలను తహసీల్దార్ పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడెప్ప, వైస్చైర్మన్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఏఓ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కలెక్టర్ బీఎం సంతోష్ -
మల్లమ్మకుంటతోనే మేలు..
తుమ్మిళ్ల లిఫ్ట్ నిర్మాణం వల్ల చాలా వరకు నీటి సమస్య తీరింది. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీటిని తోడుకునేందుకు అవకాశం ఉంటుంది. నదిలో నీరు లేని సమయంలో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే వరద ఉన్నప్పుడు రిజర్వాయర్లో నీరు నింపుకోవచ్చు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తేనే మేలు. వేలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. – వీరన్న, ఆయకట్టు రైతు, తనగల రిజర్వాయర్ రద్దు మంచిది కాదు.. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్, ● -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
మానవపాడు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ బాలాజీరెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, ల్యాబ్, పీహెచ్సీ పరిసరాలను పరిశీలించారు. ప్రతిరోజు ఆస్పత్రికి వచ్చే జ్వర పీడితుల వివరాలను తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని సూచించారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప, పీఎచ్సీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసన్నరాణి, డాక్టర్ హేమామనస, తదితరులు పాల్గొన్నారు. -
ఆలస్యం.. అలసత్వం!
నేటికీ ప్రారంభం కాని జొన్న కొనుగోళ్లురాజోళి: అసలే జొన్న కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించగా.. దీనికితోడు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో జిల్లాలో జొన్న సాగు చేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సీజన్లో సాగు చేసిన జొన్నలను కొనుగోలు చేసేందుకు ఈ నెల 24న ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మిగతా చోట్ల సైతం మరో మూడు కేంద్రాలు ప్రారంభించిన అనంతరమే జొన్న కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. అకాల వర్షాలతో పంటను కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో... జిల్లాలో 2532 మంది రైతులు 5300 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. యాసంగిలో పండించిన జొన్నలకు కొనేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 14శాతం తేమ శాతం ఉంటే క్వింటాకు రూ.3371 అందించనుంది. ఈ సీజన్లో 28వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఈ క్రమంలో ఈ నెల 24న మండల కేంద్రం రాజోళిలో కేంద్రాన్ని ప్రారంభించింది. కానీ నేటి వరకు ఎలాంటి కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో పాటుగా వడ్డేపల్లి మండలం కొంకలలో శనివారం ప్రారంభం కాగా.. రాజోళి మండలం తుమ్మిళ్ల, పచ్చర్ల గ్రామాల్లో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. వీటి మొత్తానికి కాను సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినా.. ఆదివారం అకాల వర్షం కురవడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదు. జిల్లాలో అధికంగా అలంపూర్ నియోజకవర్గంలోనే జొన్న సాగు ఎక్కువగా చేపట్టడంతో నియోజకవర్గంలోనే నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. టోకెన్లు కోసం తంటాలు ఇదిలాఉండగా, ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తమ భూమిలో ఏ పంట సాగు చేస్తున్నారనే విషయాన్ని రైతులు గతంలోనే వ్యవసాయ శాఖలో ఆన్లైన్ చేసి ఉండటంతో, నిజమైన రైతులకే విక్రయించే విధంగా టోకెన్ ద్వారా అవకాాశం కల్పిస్తారు. దీంతో రైతులు ఈ టోకెన్లు తీసుకునేందుకు వ్యవసాయ అధికారులను సంప్రదించడం, కార్యాలయానికి వెళ్లడం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం చేశారని, ఇప్పటి వరకే రైతులు ఆర్థిక అవసరాల దృష్ట్యా ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, కేంద్రాలను ప్రారంభించాక కూడా కొనుగోలులో జాప్యం జరిగితే రైతులు మళ్లీ వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుందని, దీన్ని వ్యాపారులు అదునుగా చేసుకునే అవకాశముందని రైతులు అంటున్నారు. పంట సాగుకు ఆపసోపాలు ఈ ఏడాది జొన్నల సాగును రైతులు అతి కష్టం మీద పూర్తి చేశారు. పెట్టుబడి కోసం అప్పులు తీసుకురాగా.. అనుకున్నంత స్థాయిలో పంట చేతికి రాలేదని వాపోయారు. ప్రధాన కారణంగా ఆర్డీఎస్ కెనాల్పై పరిస్థితిని చూపుతున్నారు. పంటకు సరిగ్గా నీరు అవసరమున్న సమయంలో కెనాల్లో నీరు నిలిచిపోవడం, ఇండెంట్ నీరు రాకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. అతి కష్టం మీద నీరు వచ్చినప్పటికీ అదే నీటితో పంటలకు తడులు అందించారు. కెనాల్లో నీరు లేని సమయంలో పొలాల పక్కనే ఉన్న బోర్లు, బావుల దగ్గర నీటిని తీసుకుని పంటలకు తడులు అందించారు. ఇలా అతికష్టం మీద ఆపసోపాలు పడి పంటను సాగు చేవరి దాకా తీసుకువస్తే, విక్రయించే సమయంలో కష్టాలు తప్పడంలేదని వాపోతున్నరు. ఈ కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేసి ఉంటే అప్పుడు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించిన రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే వారని అంటున్నారు. కాగా గత ఏడాది ఇవే కేంద్రాల నుంచి 25వేల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయగా.. ఈ ఏడాది 28 వేల క్వింటాళ్ల వరకు కొంటామని అధికారులు అంటున్నారు. కేంద్రం ప్రారంభమయ్యాక సంచులు లేకపోయినప్పటికీ శనివారానికి 28వేల సంచులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆలస్యంగా కొనుగోలు ప్రారంభించినా రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొంటారా లేదా ఎదురుచూడాలి. చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం ప్రస్తుతం రాజోళి, కొంకల కేంద్రాలను ప్రారంభించాం. పచ్చర్ల, తుమ్మిళ్ల కూడా కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరలో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. రైతులకు ఇబ్బందులు రాకుండా సంచులు అందుబాటులో ఉంచాం. రైతుల నుండి చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం. కొనుగోళ్లకు సంబంధించి వారి ఏఈఓలకు వివరాలు అందిస్తాం. – రవికుమార్, సీఈఓ, వడ్డేపల్లి పీఏసీఎస్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో రెండు కేంద్రాల ఏర్పాటు 24న ప్రారంభమైనా.. కొనుగోళ్లు చేపట్టని వైనం ఇబ్బందుల్లో రైతులు -
ప్రజావాణికి 25 ఫిర్యాదులు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీఓ శ్రీనివాస్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై మంది 25 ఫిర్యాదులు వచ్చిన్నట్లు తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో నరెందర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మేడేను జయపద్రం చేయండి గద్వాల: మేడే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జయపద్రం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అమెరికాలోని చికాగో నగరంలో 1886లో మే 1వ తేదీని పనిగంటల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె సందర్భంగా ఆనాటి పాలకుల ఆదేశాలతో చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించినట్లు, అనేక మంది కార్మికులు రక్తం చిందించినట్లు తెలిపారు. ఫలితంగా 1989లో మే1వ తేదీని కార్మిక వర్గం దీక్షా దినంగా పాటిస్తూ ఉన్నారన్నారు. మే 1వ తేదీన ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు అడ్డాల వద్ద కార్మిక జెండాలు ఎగురవేసి దీక్షా దినంగా జరుపుకోవాలని కోరారు. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు గద్వాల: నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం కింద గద్వాల జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు కోరుతున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకనటలో తెలిపారు. ఈప్రోగ్రాం కింద బస్తి దవాఖానాలలో మూడు ఖాళీ మెడికల్ ఆఫీసర్లు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తులను పూర్తి చేసి మే 3వ తేదీ సాయంత్రం 5గంటల వరకు డీఎంహెచ్వో ఆఫీసులో అందజేయాలని, పూర్తి వివరాలకు https/gadwal.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్లో చైర్మన్ సత్తు భూపాల్రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్లో సాఫ్ట్వేర్ సమస్యలతో ఓటీఎస్ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్, టెస్కాబ్ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు పాల్గొన్నారు. -
రైతులకు అండగా ఉంటాం
ధరూరు: యాసంగిలో వరి ధాన్యం పండించి కొనుగోలు సెంటర్కు తీసుకువచ్చిన ప్రతి రైతుకు అండగా ఉంటామని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఐకేపీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా వారాల తరబడిగా ధాన్యం తీసుకువచ్చి ఇబ్బంది పడుతున్నామని రైతులు వివరించగా.. ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే గన్నీ బ్యాగులు పంపించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. ఆదివారం కురిసిన వానకు కొంత వరకు ధాన్యం తడిసిందని, బ్యాగులు త్వరగా అందిస్తే తమకు ఇబ్బంది ఉండదని రైతులు వాపోయారు. అకాల వర్షంతో మండలంలో మామిడి తోటలు, మునగ ఇతర పంటలు సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, ఇంకా ఎక్కడెక్కడ రైతులు నష్టపోయారో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. అకాల వర్షాలు, ఉరుముల కారణంగా మూగ జీవాలు మృతిచెందాయని, ఈ విషయాన్ని సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రాజశేఖర్, రామకృష్ణ నాయుడు, శ్రీనివాస్రెడ్డి, రాములు, ఉరుకుందు, ఏకేపీ ఏపీఎం శోభారాణి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ అందజేస్తున్నాం. 25 శాతం రాయితీ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే దరఖాస్తుదారులకు లెటర్లు పంపించడం, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ● -
పకడ్బందీగా భూభారతి చట్టం అమలు
రాజోళి: ప్రభుత్వం రైతుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బీఎం.సంతోష్ తెలిపారు. మండల కేంద్రం రాజోళిలోని రైతు వేదికలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. గతంలో ఉన్న ధరణి వల్ల పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించి, వారికి సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. దీని వల్ల సాదా బైనామాలు, హద్దు పంచాయతీలు, సర్వే ఇబ్బందులు తదిదర అంశాలకు సంబందించిన సమస్యలను పరిష్కరించే విధంగా చట్టం తయారు చేయబడిందని తెలిపారు. మేధావులు, విద్యావంతులు రూపొందించిన ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉందని, తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్డీఓ, కలెక్టర్ వద్దకు వెళ్లి అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించబడిందన్నారు. వారసత్వ భూమి మార్పిడిలో సర్వేయర్ ఇచ్చే కమతం నక్షను జత చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయని, అలాంటి అంశాలను ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. భూముల విరాసత్ సమయంలో కుటుంబ సభ్యులు అందరికీ నోటీసులు అందించి, రిజిష్ట్రేషన్ సమయంలో ఆటంకాలు తలెత్తకుండా చూసే విధంగా చర్యలుంటాయన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ భూ బారతి చట్టం ద్వారా రైతులు తమకు ఉన్న సమస్యలను స్థానిక అధికారుల దగ్గరకు తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప,వైస్ చైర్మన్ కుమార్,తహసీల్దార్ పి.రామ్మోహన్,ఎంపీడీఓ ఖాజా మెయినుద్దీన్,వ్యవసాయ అధికారి సురేఖ ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. పాత సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం కలెక్టర్ బీఎం.సంతోష్ -
రజతోత్సవ సభకు తరలిన నేతలు
అలంపూర్: వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని నేతలు భారీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత నేతృత్వంలో సభ జరగనుండటంతో ఈ ప్రాంతం నుంచి పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. అలంపూర్ పట్టణంలోని బ్రహ్మాణ వీధిలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఆదేశాలతో మండలంలోని నేతలు చలో వరంగల్ సభకు తరలివెళ్తున్నట్లు తెలిపారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో సాధించిన విజయాలను వివరించారు. నియోజకవర్గంలోని బీచుపల్లిలో ఎమ్మెల్యే విజయుడు జెండా ఊపి కాన్వాయిని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు బుక్కాపురం శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మురళి గౌడ్, సింగవరం నాగభూషణం, చిలుకూరి శ్రీనివాసులు, రాంబాబు, రఘు, వీరసేన ఉన్నారు. -
పోలీసులు అప్రమత్తం
జిల్లా పోలీసులు గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ప్రమాదకర బావులు, చెరువులు, నీటి గుంతలను గుర్తించారు. వ్యవసాయ బావుల వద్ద పిల్లలు ఈతకు వచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా పెద్దలు ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ప్రతి రోజు కళాజాత బృంద సభ్యులచే అవగహన సదస్సులు, సూచనలు, స్వీయజాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈత ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అవసరమైతే ఈత నేర్చుకునేందుకు ప్రస్తుతం మార్కెట్లలో దొరికే ట్యూబ్లు, రక్షణ జాకెట్లను ధరించాలని సూచిస్తున్నారు. ప్రతి చోటా పోలీసు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదకరమైన బావుల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. -
వినోదం.. కారాదు విషాదం
వేసవి సెలవుల వేళ చెరువులు, బావుల వద్దకు పిల్లల పరుగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఈతకు వెళ్లనివ్వొద్దు ● పెద్దలు, శిక్షకుల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలి ● గాలి ట్యూబులు, ఇతర రక్షణ కవచాలను నడుముకు, హ్యాండ్ ట్యూబులు కట్టుకోవాలి ● నీటి అడుగులో మట్టి, నాణేలు తెచ్చే, ఎక్కువ సేపు నీటిలో మునిగి ఉంటారనే ఆటలు ఆడొద్దు ● నదులు, కాల్వలు, ప్రాజెక్టుల వద్ద తవ్విన గుంతల్లో ఈత కొట్టొద్దు ● హృద్రోగులు, మూర్చ, హైబీపీ ఉన్న వారు నీటిలోకి వెళ్లొద్దు ● నీటిలో ఎవరైనా మునిగిపోతుంటే సమీపంలో ఉన్న పెద్దవారిని పిలవాలి. ● ఈత నేర్చుకునే క్రమంలో ప్రమాదాల బారిన.. ● ఏటా పదుల సంఖ్యలో గాలిలో కలుస్తున్న ప్రాణాలు ● తల్లిదండ్రుల అప్రమత్తం.. స్వీయ జాగ్రత్తలే రక్షణ గద్వాల క్రైం: విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా ఉత్సాహంతో సొంతూళ్లకు పయనమయ్యారు. సెలవుల్లో వారు చేసే వినోదం అంతా ఇంతా కాదు. కానీ, వేసవి తాపం నుంచి ఉపశమనానికి, ఈత నేర్చుకుందామనే ఉత్సాహంతోనో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతేడాది వేసవిలో జిల్లాలో ఈతకు వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెరువులు, బావులు, నీటి గుంతల పరిసర ప్రాంతాల్లో పోలీసుశాఖ నిఘా ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఈత కోసం వెళ్తే తప్పనిసరిగా వారి వెంట వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు.. ● 3.22.2024 మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి (14) గ్రామంలోని తోటి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ● 16.03.2024 అయిజ మండలం మూగోనిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి (10) గ్రామ సమీపంలోని బావిలో ఈత కోట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి పై నుంచి దూకగా.. నీటిలో ఉన్న కర్ర ముక్క గొంతుకు గుచ్చుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ● 20.03.2024 అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి (17) సమీపంలోని బావి ఉండడంతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి ఈత నేర్చుకునే క్రమంలో గతంలో పిల్లలు ప్రమాదాల బారిన పడ్డారు. వీటి నివారణకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వీయ జాగ్రత్తలపై గ్రామాల్లో కళాకారులచే అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ బావులు, రిజర్వాయర్లు, నీటి కుంటల వద్ద పిల్లలను అటు వైపు రాకుండా గ్రామ పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నిరూపయోగంగా ఉన్న బోరు వెల్స్ను మూపివేసేలా ఆదేశాలు జారీ చేశాం. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖ చెప్పే స్వీయ జాగ్రత్తలు పాటించాలి. బావులు, చెరువులు, నీటి కుంటల వద్ద ప్రహరీ గోడలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ప్రమాదాల నివారణకు సిబ్బందిని అప్రమత్తం చేశాం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
ఈదురుగాలుల బీభత్సం
ధరూరు: మండలంలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు భారీ ఎత్తున ఈదురు గాలులు వీచడంతో చెట్లు నేలకొరిగాయి. గార్లపాడు గ్రామానికి చెందిన పాలెం నర్సింహులుకు చెందిన రెండు కాడెద్దులు పిడుగు పాటుకు గురై మృతి చెందాయి. వీటి విలువ 1.50లక్షలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు మండల పరిదిలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది.అలాగే, ధరూరులో ఇటీవల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లతో లోతట్టు ప్రాంతాల్లోని ముస్లిం కాలనీ, ఎస్సీ కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మసీదుపై పిడుగు.. తప్పిన ప్రమాదం ఎర్రవల్లి: పిడుగుపాటు మజీద్ మినార్ కూలిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని దువాసిపల్లిలో సాయంత్రం భారీ ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచడంతో ఒక్కసారిగా గ్రామంలోని మసీద్పై పిడుగు పడింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు దాటికి మసీద్ మినార్ (శిఖరం) పాక్షికంగా కూలిపోయింది. గ్రామంలో పక్షం రోజుల్లోనే రెండవసారి పిడుగు పడటంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు. ధరూరులో విరిగిన చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేటు కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా ఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్● 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం ● అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ● ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు ● పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుషెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. ర్యాటిఫికేషన్ కోసం.. పీయూ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ర్యాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఈ నెల 23 చివరి తేదీ కాగా.. 24 నుంచి 30 వరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను అధికారులకు సమర్పించాలని ఈ నెల 7న యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు కళాశాలల్లో వసతులపై ఇన్స్పెక్షన్ చేయించుకోవాలని సూచించింది. అయితే అధికారుల సూచనల ప్రకారం కొన్ని కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల అప్లియేషన్ చివరిసారిగా 2022లో నిర్వహించగా.. తర్వాత గత వీసీ హయాంలో ప్రైవేటు కళాశాలలు అప్లియేషన్, ర్యాటిఫికేషన్ వంటి వాటి జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త వీసీ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించినా.. గతంలో మాదిరిగానే వాటిని మూలకు పెట్టినట్లు తెలుస్తోంది. -
ఉత్సాహంగా నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్స్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల రాష్ట్రస్థాయి బాల, బాలికల నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న జాతీయస్థాయి టోర్నమెంట్లకు సంబంధించి రాష్ట్రంలోని పలుచోట్ల సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో రాణించిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక కోచింగ్ క్యాంపులు నిర్వహించి ప్రతిభచాటిన వారిని తుది రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్య, సాదత్ఖాన్, ఖాజాఖాన్, అంజద్అలీ, షరీఫ్, షకీల్, అక్రం పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామదాసు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పెన్షనర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు అధికారంలోకి వచ్చిన తక్షణమే పరిష్కరిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ కరువు భత్యాల మంజూరు, పీఆర్సీ అమలు చేయకపోవడం, ఈ–కుబేర్లో బిల్లులు పెండింగ్లో ఉండటం ఇలా అనేక సమస్యలతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన వారి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, ఎల్ఎఫ్ ఇతర ఏరియర్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించాలన్నారు. వీటిపై ప్రభుత్వ స్పందన లేకపోవడంతోనే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. మూడో దశ పోరాటంలో భాగంగా నిర్వహించే ధర్నాలో పెన్షనర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ‘బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలి’ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని అఖిల భారత బీసీ సంఘటన సమితి జాతీయ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహబూబ్నగర్ మేయర్ సీటును బీసీ మహిళకు రిజర్వు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విశ్వకర్మ, రాజు యువశక్తి, ముద్ర వంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. మెలికలు పెట్టకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చి బీసీల సాధికారతకు, జీవనోపాధికి దోహదపడాలన్నారు. బీసీలు అంకితభావంతో సమకాలీన రాజకీయాలను గమనిస్తూ మన ఓటు మనకే అన్న నినాదంతో పోటీ చేయకుండా బీసీలకే వేసుకొని రాజ్యాధికారం సాధించాలన్నారు. సమావేశంలో ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి బ్రహ్మయ్యచారి, బీసీ సంఘటన సమితి ప్రధాన కార్యదర్శి ప్రదీప్, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంశ్రీనివాస్, అంజయ్య, లక్ష్మీనారాయణయాదవ్, రజక సంఘం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మశాలీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్, బవసార్ సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్, వీరశైవ సంఘం అధ్యక్షుడు సిద్ధిరామప్ప, మహేంద్ర సంఘం అధ్యక్షుడు రాములు, నాయీ బ్రాహ్మణ అధ్యక్షుడు సత్యం, సంఘాల నాయకులు హరిప్రకాష్గౌడ్, సుబ్రహ్మణ్యం, రాజసింహుడు, నర్సింహ, కందమూరి, మంజుల, ఉమామాధవి, రమాదేవి, పుష్ప, రాధ పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావుల చెర్వు గట్టు తిమ్మ ప్పస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ,శేషంపల్లి శివసీతారామస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అమావాస్యను పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని కాకతీయటెక్నో స్కూల్ యజమాన్యం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, నాయకులు మధు, నారాయణ, అరగిద్ద రాముడు, వాల్మీకి పూజరులు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు గద్వాల ిసీనియర్ ిసివిల్జడ్జి వి శ్రీనివాస్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ నిర్వహకుడు అరవిందరావు, అర్చకులు జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి జడ్జి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆలయ విశిష్టతలను వివరించి జడ్జి దంపతులను శాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు. -
పండ్లు.. జ్యూస్లకు డిమాండ్..
వేసవిలో కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, మామిడిపండ్ల, ఇతర జ్యూస్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ● ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతో మేలైనది. ప్రత్యేకంగా వేసవిలో చెరుకురసం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీనిని తీసుకోవడం వల్ల ఎండల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతిచోటా చెరుకు రసం సెంటర్లు వెలుస్తున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలో దాదాపు 50 చెరుకు రసం కేంద్రాలు ఉన్నాయి. చెరుకు రసం ఫుల్గ్లాస్ రూ.30, ఆఫ్ గ్లాస్ రూ.20 ధరలు ఉన్నాయి. ● ఈ సీజన్లో ప్రతిచోట లస్సీ సెంటర్లు వెలుస్తాయి. కొన్నేళ్ల నుంచి లస్సీ (పెరుగు)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణ లస్సీ రూ.20, స్పెషల్ లస్సీని రూ.30కు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఫలుదాకు ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. పాలు, డ్రైఫ్రూట్స్తో తయారు చేసే ఫలుదాకు ఇటీవలే కాలంలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గ్లాసు ఫలుదా రూ.40 చొప్పున అమ్ముతున్నారు. ● పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ కొబ్బరిబొండాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిచోట ప్రధాన రోడ్ల వెంట వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాలు, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కటి రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. ● మార్కెట్లో తాటిముంజులు, మామిడి పండ్ల సందడి నెలకొంది. కొల్లాపూర్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మామిడిపండ్లను దిగుమతి చేసుకొని కిలో రూ.80 – 100 వరకు విక్రయిస్తున్నారు. ఇక శరీరానికి చలువ చేయడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటిముంజలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. రూ.100కు 12 ముంజలు ఇస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు కా ర్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే పుచ్చకాయలు అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. లస్సీ.. ఇష్టంగా తాగుతా.. లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. – సాయికుమార్, మహబూబ్నగర్ -
బాధితులకు అండగా ఉండాలి
గద్వాల క్రైం: జిల్లాలో పోక్సో కేసుల నమోదు, బాధితులకు అందిస్తున్న సేవలపై శనివారం సాయంత్రం గద్వాల జిల్లా అదనపు సెషన్ కోర్టు, పోక్సో కోర్టు జడ్జి ఎస్ రవికుమార్ భరోసా సెంటర్ను తనిఖీ చేసి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భరోసా సిబ్బంది శిరిష, స్రవంతి పలు విషయాలపై జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. జడ్జి వారితో మాట్లాడుతూ జిల్లాలో లైగింక దాడులకు గురైన మైనర్ బాలికల కేసులు, నిందితులకు శిక్షపడే విధంగా తీసుకున్న చర్యలపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. వేధింపులకు గురైన క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం, నమ్మకం, చట్టాలపై కల్పిస్తున్న విషయాలను ఆరా తీశారు. భరోసా సెంటర్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించి మనోధైర్యం కోల్పోయిన బాధితులకు అండగా ఉండలన్నారు. నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, లాయర్లు, కౌన్సెలింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వం బాధింపపడ్డ బాధితులకు భరోసా ఇవ్వలనే ధృఢసకల్పంతో ఈ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం సెంటర్లోని వివిధ విషయాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో భరోసా సిబ్బంది శ్వేత, కీర్తి, కవిత తదితరులు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన కాంగ్రెస్ గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్కు సముచిత గౌరవం ఇవ్వకపోగా.. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు త్రీవంగా అవమానించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1952 లోక్సభ ఎన్నికల్లో అంబేడ్కర్ను ఓడించేందుకు ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి నారాయణరావ్ కథరోల్కర్ను పోటీకి నిలిపియని, నెహ్రూ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేడ్కర్ ఓటమికి కారకులయ్యారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో అంబేడ్కర్ స్మృతివనం, పంచతీర్థ పేరుతో ఆయన పుట్టిన స్థలం, నివసించిన స్థలం, దహన సంస్కారాలు నిర్వహించిన స్థలాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్రెడ్డి, రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, రవికుమార్ఏక్బోటే, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి పాల్గొన్నారు. డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (ఎస్డీడీజీడబ్ల్యూటీటీఐ) హైదరాబాద్లో మూడేళ్ల పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళాశిశు సంక్షేమ జిల్లా అధికారిణి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మే 19లోపు దరఖాస్తూ చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలు, ఇతర నిరాశ్రయులైన పిల్లలు, చిల్డ్రన్ హోం, మహిళా సంస్థల్లోని బాలబాలికలు, దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. వివరాలకు జిల్లా బాలల సంరక్షణ విభాగం గద్వాలలో సంప్రదించాలని కోరారు. బాల పురస్కార్ అవార్డుకు.. గద్వాల: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ అవార్డుల కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ అధికారిణి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంస్కృతిక కళలు, సాహసం, క్రీడలు,సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలు జూలై 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం మహిళలకు మేలు
గద్వాలటౌన్: వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు. వన్ నేషన్– వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం–2025పై జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన మేధావుల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో వక్ఫ్ చట్టం పక్కదారి పట్టిందని, ధనిక ముస్లింలకు మాత్రమే లబ్ధి చూకూరిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం నేతలు చట్ట సవరణపై భయాందోళనలు రేకెత్తించారని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్బోర్డుల్లో జరిగే అవినీతి, అక్రమాలకు ముగింపు పడి పేద ముస్లింలకు లాభం చూకూరుతుందన్నారు. వక్ఫ్బోర్డు పేరుతో ఇంతకాలం జరిగిన అక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన దేశానికి ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. అభివృద్ధికి సైతం దోహదం చేస్తుందని చెప్పారు. పలువురు ముస్లింలు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వెనకబడిన ముస్లింలకు ఇది ఆర్థికపరమైన ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. పేద ముస్లింలు బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్పాష, బీజేపీ నాయకులు రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్ఏక్టోటే, మాలీం ఇసాక్, మోహిద్ఖాన్, అత ఉర్ రహమాన్, దేవదాసు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
చలో వరంగల్..
బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. సెగ్మెంట్కు 300 వాహనాలు.. 3 వేల మంది జనసమీకరణ వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎ ప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ప ర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. పాలమాకుల లేదంటే శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్కు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వాహనాలు పాలమాకుల దాటిన తర్వాత లేదా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైకి చేరుకుని.. నేరుగా ఘట్కేసర్ వద్ద వరంగల్ హైవేలో దిగుతాయి. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోన్–2లో పార్కింగ్.. రజతోత్సవ సభకు తరలివెళ్లే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ వాహనాలను జోన్–2లో పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ జాతీయ రహదారిలో కరుణాపురం వద్ద ఎన్హెచ్–163 బైపాస్లో టోల్గేట్ నుంచి దేవన్నపేట, మేడిపల్లి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలను అక్కడ పార్కింగ్ చేసి నేరుగా సభావేదిక స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్ వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
కొత్త చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గట్టు: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శనివారం గట్టులో భూ భారతి చట్టం–2025పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కొత్తగా ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు భూమిని సర్వే చేసి, మ్యాప్తోనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు, ఇలా చేయడం ద్వారా 90 శాతం భూముల వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే.. ప్రతి రైతు భూమికి భూదార్ కార్డు ఉండనుందని, ఇక నుంచి భూ ఆక్రమణకు అవకాశం లేదన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్సీ వంటి సేవలు సుభతరం అవుతాయని అన్నారు. భూ సమస్యల పరిష్కారాకి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, నిర్దేశిత సమయంలో సమస్యలను పరిష్కరించడం జరుగుంతుందని తెలిపారు. ధరణి వ్యవస్థలో భూ హక్కులపై తలెత్తే వివాదాలకు అప్పీల్ అవకాశం లేక సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, కొత్త చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ట్రీభ్యునల్ వరకు అప్పీల్ అవకాశం అందుబాటులోకి వచ్చి, సమస్యలకు పరిష్కారం లభించనున్నట్లు వివరించారు. జిల్లాలోనే గట్టు మండలంలోనే అత్యధిక భూ సమస్యలు ఉన్నప్పటికి ఇప్పటికే 90 శాతం సమస్యలు పరిష్కరించామని, త్వరలోనే గ్రామ పాలన అధికారుల నియామకం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల వారిగా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహించి, దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసిల్దార్ సలీముద్దిన్,ఎంపీడీఓ చెన్నయ్య పాల్గొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం, మెరుగైన విద్య అందించాలి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు. శనివారం గట్టులోని సంతబజారు అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని పిల్లలు, తల్లులు, బాలింతలకు అందుతున్న అంగన్వాడీ సేవల గురించి సిబ్బంది ద్వారా వివరాలను తెలుసుకున్నారు. చిన్నారుల ఎత్తు, బరువులను పరిశీలించి,మోబైల్ యాప్లోని వివరాలను చెక్ చేశారు. పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ క్రమంగా చేపట్టి ఖచ్చితమైన ఎత్తులు, బరువులు యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. పిల్లలను అంగ్లం అక్షరమాల, తెలుగు వర్ణమాలపై ప్రశ్నించారు. పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో బలమైన పునాది పడడానికి మరింత మెరుగుగా అంగన్వాడి టీచర్లు పని చేయాలన్నారు.గర్భిణుల ఆరోగ్య స్థితిని ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయాలని, పౌష్టికాహారంపై అవగాహాన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, ఆస్పిరేషన్ బ్లాక్ కోఆర్డీనేటర్ అప్జల్, ఆర్ఐ రాజు, అంగన్వా డి టీచర్ వెంకట్రావమ్మలు పాల్గొన్నారు. -
మలేరియా నిర్మూలనకు సమష్టి కృషి
గద్వాల క్రైం: మలేరియా నిర్మూలన కోసం ప్రజలు, వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా చూసేందుకు ప్రతి ఒక్కరు వైద్యుల సలహాలు పాటిస్తే విజయం సాధిస్తామన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమల నివారణకు ప్రజలు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రధాన శత్రువు దోమలని, వాటి ద్వారా మలేరియా, చికెన్ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులు వస్తాయన్నా రు. కార్యక్రమంలో వైద్యులు రాజు పాల్గొన్నారు. -
రాజ్యాంగ హక్కులతోనే స్వేచ్ఛాయుత జీవనం
అలంపూర్ : రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే దేశంలోని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్లోని జూనియర్ సివిల్ కోర్టులో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిధున్ తేజ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతోపాటు సంరక్షించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతోనే ప్రతి ఒక్కరు సమాజంలో ఆనందంగా జీవిస్తున్నారని, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, న్యాయవాదులు నారాయణరెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాగరాజు యాదవ్, తిమ్మారెడ్డి, నరసింహులు, వెంకటేష్, గజేంద్ర గౌడ్, బీమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్వికాసం పథకాలలో అర్హులైన వారికే అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రాజీవ్యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్లపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించిందని వివరించారు. జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల నుంచి 25,500 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులను సెక్టార్ల వారీగా స్క్రూటిని చేయాలన్నారు. సోమవారం వరకు సంబఽంధిత బ్యాంకు మేనేజర్లకు సమర్పించాలని, జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన మే 28 వరకు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తున్నందున నిర్థేశించిన లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాస్రావు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
సంగమేశ్వరా.. దారి చూపవా..
●కృష్ణాతీరంలోని సంగమేశ్వరుని దర్శనానికి సరిహద్దు పంచాయితీ ● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్న ఏపీ జాలర్లు ● స్వామి దర్శనానికి భక్తులకు తప్పని కష్టాలు ● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే సంగమేశ్వరుడి దర్శనం పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.. కొల్లాపూర్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా) సోమశిల వద్ద కృష్ణాతీరం వద్దకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సంగమేశ్వరుడి దర్శనం కోసం కృష్ణానదిలో బోటులో వెళ్లాల్సి ఉండగా, ఏపీకి చెందిన సిద్దేశ్వరం, సంగమేశ్వర గ్రామాల జాలర్లు బోట్లను రానివ్వడం లేదు. కొద్ది దూరం బోటులో, తర్వాత ఆటోలో, మళ్లీ బోటులో ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారు. పర్యాటకులు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – రామ్మోహన్, సోమశిల, సాక్షి, నాగర్కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సప్త నదుల సంగమం, ఏడాదిలో నాలుగు నెలలే దర్శనం.. కృష్ణానది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో బ్యాక్వాటర్లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గాక ఆలయం కనిపిస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు రిజర్వాయర్లో నీరు లేని సమయంలోని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంటుంది. మిగతా ఏడాదంతా నీటిలోనే మునిగి ఉంటుంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమారథి, భవనాశిని నదులు ప్రవహించే ఏడు నదుల సంగమ క్షేత్రంగా సంగమేశ్వరాన్ని పేర్కొంటారు. ఆలయంలో శివలింగాన్ని పాండవుల్లో ఒకరైన భీముడు రాయితో కాకుండా వేపధారు(చెక్క)తో ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకత. ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం.. సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు అవుతుంది. 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి ఆలయం -
క్రీడలతోనే ఆరోగ్యం పదిలం
గద్వాలటౌన్: ఆటలు ఆడటం ద్వారానే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జితేందర్ అన్నారు. శుక్రవారం స్థానిక సోమనాద్రి స్టేడియంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండాలని, క్రీడలతో దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. నైపుణ్యం గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మీతోపాటు మీ ఇంటి దగ్గర ఉండే మీ స్నేహితులను వేసవి శిక్షణ శిబిరానికి తీసుకు రావాలని సూచించారు. ఈ శిబిరం వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడువునా నిరంతరం క్రీడలు ఆడేవిధంగా కొనసాగాలని కోరారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు మాట్లాడుతూ గద్వాలలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, వారిని ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సెలవుల్లో క్రీడలు ఆడుతూ ఆనందంగా గడపాలని సూచించారు. ఉదయం, సాయంత్రం సాగే వేసవి శిక్షణా శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్కార్ స్కూల్ యాజమాన్యం వారు శిక్షణకు హాజరైన విద్యార్థులకు క్రీడా దుస్తులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్, మాజీ కౌన్సిలర్ బండల పాండు, రాజారెడ్డి, చక్ర, ప్రవీణ్, వంశీ, రాము, సతీష్, పరుశ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలి
ధరూరు: విత్తన నాణ్యతపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే డీలర్ల మోసాల నుంచి బయటపడతారని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ రీజినల్ మేనేజర్ ఆది నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు కార్యాలయంలో మండల సింగిల్ విండో వైస్ చైర్మన్ పరమేష్ అధ్యక్షతన విత్తన నాణ్యతపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన విత్తనాలు తెగుళ్లు, రోగాలు ఇతర ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తాయని అన్నారు. ప్రతి రకంలోనూ ప్రత్యేక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శాస్త్రవేత్తలు తయారు చేస్తారన్నారు. ప్రతి ఒక్క రైతు టీజీ సీడ్స్ విత్తనాలను రైతులు ఎంచుకోవడం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చునని అన్నారు. టీజీ సీడ్స్ విత్తరనాలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంఘాలు ఇతర డీలర్ల ద్వారా అన్ని మండలాలకు సరఫారా చేస్తున్నామని అన్నారు. ప్రతి మండలంలోనూ అందుబాటులో టీజీ సీడ్ విత్తనాలు ఉంటాయని, ముఖ్యంగా వరిలో సన్న రకాలైన ఆర్ఎన్ఆర్ – 15048, బీపీటీ 5204, కేఎన్ఎం – 1638తో పాటు జేజీఎల్ – 27356, ఎంటీయూ 1224 వంటి కొత్త రకాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల బాయంకు సీఈఓ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్ర రక్కసిపై ఆగ్రహజ్వాల
జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ, మృతులకు నివాళిగద్వాలటౌన్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సకల జనులు ముక్త కంఠంతో ఖండించారు. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృత్యువాత పడటంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాత బస్టాండ్ చౌరస్తా నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ప్రధాన రహదారుల వెంట కొవ్వొత్తులు, జాతీయ జెండాలు చేతపట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడారు. ఉగ్ర శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశమంతా ఐక్యంగా ఉందన్నారు. పర్యాటకులపై ఉగ్రమూకల జరిపిన దాడి హేయమైన చర్యఅని మండిపడ్డారు. దేశంపై ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న ఉగ్ర మూకలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్బాబు, ఇసాక్, డీటీడీసీ నర్సింహా, పులిపాటి వెంకటేష్, బాస్కర్యాదవ్, జగదీష్, రాజశేఖర్రెడ్డి, ఆనంద్, తిమ్మోతి, సురేష్, ఆనంద్గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జిలతో ప్రార్థనలు జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా ముస్లింలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని ముస్లింలు నల్ల బ్యాడ్జిలను ధరించి మసీదులలో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు బయట ఫ్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ప్రతి ఒక్కరి మనసును కలచివేసిందన్నారు. దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. మనదేశ శాంతి, ఏకత్వాన్ని బలహీనపరచడానికి విదేశీ శక్తులను అనుమతించేది లేదన్నారు. -
లక్ష్యం మేరకు ఉపాధి పనులు చేపట్టాలి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో జరుగుతున్న వివిధ పనులను ఆయన పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపుదల కోసం రూ.30 వేలతో నిర్మించిన ఇంకుడు గుంత పనులను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. అనంతరం మహిళా సమైఖ్య సంఘం కార్యాలయాన్ని సందర్శించి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను సరైన కొలతలు ప్రకారం కుట్టించి ఆయా పాఠశాలలకు అందజేయాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా రిజిస్టర్లు ఏర్పాటుచేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భద్రప్ప, ఏపీఎం కురుమయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సరైన సమయంలో ఆస్పత్రికి తరలించాలి గద్వాల క్రైం/అలంపూర్: అంబులెన్స్ డ్రైవర్లు క్షత్రగాతులను సరైన సమయంలో ఆస్పత్రికి తరలించాలని రాష్ట్ర ఫ్లీడ్ హెడ్ గిరిబాబు అన్నారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రితోపాటు అలంపూర్లోని 108, 102, పార్థీవ వాహనాలను ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, జిల్లా కో ఆర్డినేటర్ రత్నయ్య తనిఖీ చేశారు. అనంతరం ఆయన డ్రైవర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైన ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో సిబ్బంది, వాహన డ్రైవర్లు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవాలని, బాధితులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆస్పత్రులకు తరలించాలన్నారు. వాహనాల నిర్వహణ ఎప్పటిప్పుడు చూసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలను అందించాలన్నారు. అనంతరం పలు రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,021 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 308 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6021, కనిష్టం రూ.3076, సరాసరి రూ. 4739 ధరలు పలికాయి. అలాగే, 10 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 6329 ధర వచ్చింది. 112 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5921, కనిష్టం రూ. 5455, సరాసరి రూ. 5921 ధరలు పలికాయి. 1680 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2001, కనిష్టం రూ. 1702, సరాసరి రూ.1910 ధరలు లభించాయి. -
రాయితీపై అనాసక్తి
ప్రచారం చేసినా ఫలితం లేదు జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటిల పరిధిలో ఉన్న నివాసగృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి ప్రతి ఏడాది ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఆరు నెలలకు ఒకసారి రెండు విడతలుగా వీటిని చేపడతారు. అయితే చివరి రెండు నెలల పాటు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు బృందాలుగా ఏర్పడి వీటి వసూలును చేపట్టారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు గత ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడానికి తడబడ్డాయి. తాజాగా మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ఏప్రిల్ మాసంలో పన్ను చెల్లించేవారికి రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది మొత్తం చెల్లించాల్సిన పన్నులో ఐదుశాతం మినహాయిస్తామని ప్రకటించింది. ఇందుకు పట్టణాలలో ప్రచారం కోసం ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టారు. బిల్ కలెక్టర్లు కాలనీల వారిగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ జనం నుంచి మాత్రం స్పందన అంతగా రాలేదని చెప్పవచ్చు. గతేడాది సంబంధించిన పూర్తి పన్ను చెల్లించిన వారికే ఇది వర్తించింది. గద్వాలటౌన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ముందస్తు ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం లభించే రాయితీకి ఆదరణ కరువైంది. ఇందుకు ఈ నెల రోజులు సమయం ఇచ్చినా.. చాలా తక్కువ మంది మాత్రమే చెల్లించేందుకు ఆసక్తి చూపించారు. దీంతో అధికారులు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. 2025–26 ఏడాదికి సంబంధించి ఈ నెలలో ఏడాది మొత్తం పన్ను చెల్లించిన వారికి అందులో ఐదుశాతం రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు సైతం దీనిపై ప్రచారం నిర్వహించినా.. ఆశించిన స్పందన రాలేదు. నెల రోజుల గడువు దగ్గర పడుతున్నా.. ప్రజలు నామమాత్రంగానే ఆసక్తి చూపించారు. నాలుగు మున్సిపాలిటీలలో ఓ మోస్తారుగా పన్ను చెల్లించారని చెప్పవచ్చు. జిల్లాలో ఇదీ పరిస్థితి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ జిల్లాలో మున్సిపాలిటీల వివరాలిలా.. కరువైన ఆదరణ.. లక్ష్యం ఆమడదూరం గడువు నాలుగు రోజులే.. వినియోగించుకోవాలి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేస్తున్నాం. ఏడాది చెల్లించే పన్నులో ఐదుశాతం మినహాయించి తీసుకుంటున్నాం. ఇందుకోసం పట్టణంలో ప్రచారం కోసం ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశాం. ఈనెల 30వ తేదీ వరకే అవకాశముంది. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – దశరథ్, కమిషనర్, గద్వాల గద్వాలలో 15,677 అసెస్మెంట్లతో ఐదు శాతం రాయితీకి అర్హులుగాా ఉన్నారు. వీరిలో కేవలం 2,136 మంది పన్ను చెల్లించి రాయితీ పొందారు. అయిజలో 8,116 అసెస్మెంట్లుకు గాను 1,474 మంది రాయితీ మీద పన్ను చెల్లించారు. అదేవిధంగా అలంపూర్లో 3,502 మందికిగాను 375 మంది పన్ను చెల్లించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 4,046 మందికి గాను కేవలం 669 మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందారు. -
కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి
గద్వాలటౌన్: యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. గురువారం గద్వాల ప్రభుత్వ పీజీ సెంటర్లోని కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన సమ్మెకు పలు విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 21 వల్ల కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, పార్ట్ టైం అధ్యాపకులకి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు మంగళగిరి శ్రీనివాసులు, మహేందర్, గోపినాథ్రాథోడ్, వంగూరి గణేష్లతో పాటు విద్యార్థి నాయకులు భాస్కర్, నవీన్కుమార్, శ్రీనునాయక్, కోటి, బలిచక్రవర్తి, మమత, స్పందన, శ్యామల, నిఖిత, మైథిలి తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పెంట్లవెల్లి: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో కొనసాగిన సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నేతలు మన దేశం కనుమరుగు కాకూడదని ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని కొందరు చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరన్నారు. బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనేత అని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ మహనీయుల కృషి ఫలితమే అన్నారు. ప్రతిఒక్కరూ మహనీయుల అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మండలంలోని జటప్రోల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్పర్సన్ వెన్నెల ప్రారంభించారు. కార్యక్రమంలో గోవింద్గౌడ్, రామన్గౌడ్, భీంరెడ్డి, గోపాల్, ఖదీర్, కుమార్ పాల్గొన్నారు. -
‘రియల్’ మోసాలు..
●● నడిగడ్డలో స్కీంల పేరిట యథేచ్ఛగా దందా ● కాలపరిమితి ముగిసినాస్థలాలు రిజిస్ట్రేషన్ చేయని వైనం ● రీ క్రియేషనల్ స్థలంలోనూవెంచర్లు ఏర్పాటు ● లబోదిబోమంటున్న బాధితులు ● నాలుగు నెలల్లో 93 ఫిర్యాదులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జిల్లాలో పలు రియల్ ఏస్టేట్ వ్యాపారులపై గ్రీవెన్స్లో ఫిర్యాదులు వస్తున్నాయి. మోసం చేసిన వ్యక్తులపై వివిధ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎవరైన వెంచర్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రభుత్వ అనుమతి పొంది ఉండాలి. వెంచర్ అనుమతుల విషయంలో రెవెన్యూ, నగరపాలక, గ్రామీణ స్థాయిలో పంచాయతీ అధికారులు ధృవీకరించాలి. మొత్తం డబ్బు చెల్లించినా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకున్నా.. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి వెంచర్లు వేసినా వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ గద్వాల క్రైం: సొంతిళ్లు నిర్మించుకోవాలనేది ప్రతిఒక్కరి కల. దీనిని అవకాశంగా మార్చుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయక ప్రజలే లక్ష్యంగా కొత్త కొత్త స్కీంల పేరిట దందా నిర్వహిస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇస్తామంటూ స్కీంల పేరిట వాయిదాల రూపంలో డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా స్థలాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. వారి కబంధ హస్తాల్లో చిక్కుకుని న్యాయం కోసం బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పార్కులు, విశ్రాంతి స్థలాల ఏర్పాటుకు కేటాయించిన రీ క్రియేషన్ స్థలాలు సైతం కబ్జా చేసి వీటిని కూడా వెంచర్లుగా చేసి ప్రభుత్వ ఆస్తులను సొంతం చేసుకునే కుట్రలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవల వచ్చిన ఫిర్యాదులు.. ● 3.02.2025 తేదీన గద్వాల పట్టణానికి చెందిన ఓ రిటైర్డు ప్రొఫెసర్ 2000 సంవత్సరం నుంచి 2003 వరకు ఓం సాయి ప్రియ రియల్ ఏస్టేట్లో స్కీం పేరిట నెల వారిగా డబ్బులు చెల్లించాడు. వెంచర్లో సభ్యుడుగా కాలపరిమితి స్కీం డబ్బులు చెల్లించాడు. అయితే సదరు రియల్ ఏస్టేట్ వ్యాపారులు మాత్రం ఆ ఉద్యోగికి స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదు. దీనిపై పలుమార్లు పంచాయితీలు చోటు చేసుకున్నాయి. నేడు రేపు అంటూ సాగదీశారు. మోసపోయినట్లు గుర్తించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. ● 14.02.2025 తేదీన గట్టు మండలానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురు తాము పూర్తిగా స్కీం డబ్బులు చెల్లించినా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. వీరికి రియల్ ఏస్టేట్ వ్యాపారి స్వయాన బంధువు కావడంతో ముబారక్ నైన్ రియల్ ఏస్టేట్లో 2013 నుంచి 2018 వరకు స్కీంలో ప్లాట్ కోసం డబ్బులు చెల్లించారు. కాలపరిమితి ముగియగా వారికి ఇవ్వాల్సిన ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించాల్సిందిగా రియల్ ఎస్టేట్ సభ్యులను కోరారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తామని నమ్మించారు. నేటికీ ఎలాంటి పురోగతి రాలేదు. ● 19.03.2025 తేదీన అయిజకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి న్యాయం చేయాలని పోలీసులను సంప్రదించారు. ఈయన అగ్రిగోల్డ్ రియల్ ఏస్టేట్లో 2012లో స్కీంలో ప్లాట్ కోసం డబ్బులు చెల్లించాడు. అయితే కాలపరిమితి ముగిసిన క్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు బోర్డు తీప్పేయడంతో అయోమయంలో పడ్డాడు. ● 23.01.2025 తేదీన ఇటిక్యాల మండలానికి చెందిన ప్రైవేటు వ్యాపారులు సలీం, కలీం పోలీసులను ఆశ్రయించారు. వీరు ప్లాట్ల స్కీంలో భాగంగా 2014లో డబ్బులు చెల్లించారు. అయితే కాలపరిమితి ముగిసినా సదరు వ్యాపారులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతూ వచ్చారు. నేటికి స్థలం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో చివరికి వారు పోలీసులను ఆశ్రయించారు. ఇలా గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో గడచిన నాలుగు నెలల వ్యవధిలోనే 93 ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. ఈ ఫిర్యాదులు సైతం జిల్లా పోలీసుశాఖ నిర్వహించిన ప్రజావాణిలో అందాయి. రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన డబ్బును నెల నెలా చెల్లించామని, తీరా ఇన్నాళ్లకు స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే నేడు రేపు అంటూ తిప్పుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా.. గద్వాల జిల్లా కేంద్రంలో పార్కులు, విశ్రాంతి లేదా వినోదాల కోసం (రీ క్రియేషన్) కేటాయించిన భూములను సైతం రియల్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో 57, 103, 413, 414, 415, 416, 419, 421, 422, 423, 424, 425, 426, 427, 431, 460 –494 వరకు, 671, 691, 707, 710,723, 745, 749, 758, 803, 906, 1091, 1090, 1039, 1079, 1031, 1035, 995,994, 993, 991 తదితర సర్వే నంబర్లలో 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందుల్లో పార్కులు, క్రీడా మైదానాలు, క్యాంపసైట్లు, హైకింగ్, క్యాంపింగ్, ఈత కొలనులు తది తర వాటి కోసం భూములు కేటాయిస్తే వీటిని సైతం రియల్ ఏస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా మార్చేశారు. ఈమేరకు పలువురు ఫిర్యాదులు సైతం చేశారు. -
జూరాల.. భద్రమేనా?
జూరాల జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు 62 రేడియల్ క్రస్ట్ గేట్లు.. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఈ 62 రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్(పైకెత్తడం) చేయడం ద్వారా నీటిని దిగువనకు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో రేడియల్ క్రస్ట్గేట్లు ఏర్పాటు చేశారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీల్స్, అడుగు భాగాన ఒక రబ్బర్ సీల్ ఉన్నాయి. ఆపరేట్ చేసేందుకు అవసరమైన ఇనుప రోప్లు గేటుకు ఇరువైపులా, కింది భాగాన రెండు చొప్పున ఇనుప రోపుల నిర్మాణం ఉంటాయి. వీటి సాయంతోనే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకి ఎత్తడం, దించడం చేస్తారు. భారీ వరద వస్తే.. 2009 సంవత్సరం మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కర్ణాటకలోని టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం, తాజాగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీ గేట్లు దెబ్బతినడం ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జూరాల ప్రాజెక్టు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు.. కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. జూలై నాటికి పూర్తి.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల కిందట రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. కానీ, 2023లో గ్యాంటీక్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం గ్యాంటీక్రేన్ను పూర్తిస్థాయిలో రిపేరు చేశాం. శుక్రవారం నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – జుబేర్, ఈఈ జూరాల డ్యాం 18 చోట్ల రబ్బర్సీల్ దెబ్బతినడంతో లీకేజీలు మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి -
భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం
మల్దకల్: ఎంతో కాలంగా భూసమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ బీఎం సంతోష్ రైతులకు సూచించారు. గురువారం మల్దకల్లో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధరణిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల కారణంగా రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం కొత్తగా వచ్చిన భూభారతిలో ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక చట్టం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులు భూసమస్యలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కారం కానీ సమస్యలు ఆర్డీఓ కార్యాలయంలో పరిష్కరించబడతాయన్నారు. భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్తో పాటు సర్వే నంబరు, వ్యవసాయ భూమికి సంబంధించిన నక్ష ఉంటుందన్నారు. అదే విధంగా వారసత్వ భూములు, పెండింగ్ సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించవచ్చన్నారు. మనిషికి ఆధార్కార్డు లాగే భూమికి భూదార్ సంఖ్యను కేటాయింపు చేస్తారని, భూ అక్రమాలకు అవకాశం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటుందని, అలాగే గ్రామాలలో ప్రజలకు భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టరు లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహశీల్దార్ షాహేదాబేగం, ఏఓ రాజశేఖర్, డిటీ ఝాన్సీరాణి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి
ధరూరు: ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య సభ్యులతో మాట్లాడి కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేయాలని, మ్యాచర్ మిషన్ ఆధారంగా వచ్చిన తేమ వివరాలను తీసుకుని ధాన్యం సేకరించాలని మండల అధికారి శ్రీలత, ఐకేపీ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి తీసుకునే ఆధార్, పట్టాదార్ పాస్ బుక్, అకౌంట్ నంబర్ల జిరాక్స్ కాపీలను సరిచూసుకుని ధాన్యం సేకరించాలన్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి గద్వాల క్రైం: పోలీసుస్టేషన్ పరిధిలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం వివిధ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్స్గా విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలతో వచ్చిన బాధితులకు స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్స్ మాట్లాడి వాటిని పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కోర్టు కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సీసీఎస్ సీఐ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,339 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 299 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6339, కనిష్టం రూ. 3099, సరాసరి రూ. 5699 ధరలు పలికాయి. 6 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ 6300, కనిష్టం రూ 5869. సరాసరి రూ. 6308 ధరలు వచ్చాయి. 94 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5921, కనిష్టం రూ. 4607, సరాసరి రూ. 5921 ధరలు పలికాయి. 1665 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1980, కనిష్టం రూ. 1709, సరాసరి రూ.1960 ధరలు లభించాయి. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,271 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో గురువారం మొక్కజొన్నకు క్వింటాల్ గరిష్టంగా రూ.2,271, కనిష్టంగా రూ.1,409 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,191, కనిష్టంగా రూ.4,000, ఆముదాలు గరిష్టంగా రూ.6,510, కనిష్టంగా రూ.5,841, జొన్నలు గరిష్టంగా రూ.4,355, కనిష్టంగా రూ.3,627, కందులు రూ.6,480, ధాన్యం హంస రూ.1,869, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.1,802, రాజేంద్ర రకం రూ.1,916 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.,2212, కనిష్టంగా రూ.1,806, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,639, ఆముదాల గరిష్టంగా రూ.5950గా ఒకే ధర నమోదైంది. నేడు డయల్ యువర్ ఏటీఎం లాజిస్టిక్ స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ లాజిస్టిక్ సమస్యల కోసం శుక్రవారం డయుల్ యువల్ ఏటీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇసాక్ బిన్ మహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ కార్గో సంబంధిత సమస్యలను 8125456978 నంబర్కు ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్పాడులో 1,015 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,015 అడుగులు ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో జలాశయంలోని ఎన్టీఆర్ కాల్వ ద్వారా 2 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల నుంచి 18, తాగునీటికి 20 క్యూసెక్కుల నీటిని వదిలారు. -
‘ఉపాధి’ కూలీలకు అధిక వేతనం వచ్చేలా చూడాలి
ఎర్రవల్లి/ఇటిక్యాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకంలో పనిచేసే కూలీలతో సరైన కొలతల ప్రకారం పనులను చేయించి అధిక వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. గురువారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో పలు చోట్ల జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంత రైతుల యొక్క రవాణా సౌకర్యాల మెరుగుదలకు అవసరమయ్యే పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు అబ్దుల్ సయ్యద్ఖాన్, అజార్ మెహియుద్దీన్, టిఎలు కృష్ణ, పురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రిపేర్లతో లీకేజీలు..
ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 18 గేట్ల నుంచి ఏడాదిగా నీరు లీకేజీ అవుతోంది. ప్రధానంగా గేట్లు దెబ్బతినకుండా, రాపిడికి గురికాకుండా రక్షణ కల్పించే రబ్బర్ సీల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు సహాయపడుతున్న ఇనుప రోప్లు పూర్తిగా దెబ్బతిని 8 గేట్లను ఆపరేటింగ్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు మొత్తం 62 గేట్లు మొదలుకొని రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెంథనింగ్ వంటివి మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఒప్పందం గడువు ముగిసి.. మరోసారి పొడిగించిన గడువు ముగిసిపోయినా పట్టుమని 50 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ● ప్రస్తుతం డ్యాం పైభాగాన ఉన్న హయిస్ట్ బ్రిడ్జి, గేట్ల వద్ద ఉన్న వాక్వే బ్రిడ్జికి సంబంధించి సాండ్ బ్లాస్టింగ్ పనులు పూర్తి చేయగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. రబ్బర్ సీల్ దెబ్బతినడంతో గేటు ద్వారా లీకేజీ అవుతున్న నీరు -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
గద్వాల: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిరుపేదలైన అర్హులకు మాత్రమే అందించాలన్నారు. ఎల్–1 జాబితాలో ఉన్న 50వేల మంది లబ్ధిదారుల నుంచి నియోజకవర్గానికి 3500 చొప్పున ఏడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో బేస్మెంట్ స్థాయి పూర్తి చేసుకున్న 20 మందికి మొదటి విడతగా రూ.1లక్ష చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. పనులు వేగవంతంగా పూర్వయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30వ తేదీన ముగుస్తుందని గడువు పెంచే అవకాశం లేనందున అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో నిర్ణీత లక్ష్యం మేరకు పన్ను వసూళ్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు హౌసింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల నియామకం.. గద్వాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కాలేజీలో అవసరమైన ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు, అసోసియోట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర నియామకానికి సంబంధించిన వివరాలను శనివారం నాటికి అందజేయాలన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఈసమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్ ఇందిర, కాలేజీ ప్రిన్సిపల్ నాగేశ్వర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
అలంపూర్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించారు. కర్నూల్లోని నివాసంలో వారు ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇంట్రా, వాటర్ గ్రిడ్ అధికారులతో మంగళవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జీవనదులైన కృష్ణా, తుంగభద్ర నదుల్లో ప్రస్తుతం నీటి నిల్వలపై ఆరా తీశారు. నదుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కు చేరుకునే సమయంలో కలుషితమయ్యే అవకాశం ఉందని, నీటి నిల్వలు అడుగంటిన సమయాల్లో ఫిల్టరైజేషన్ సరిగ్గా నిర్వహించాలని సూచించారు. వేసవిలో నీటి నిల్వలు తగ్గిన సమయాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సాధారణ సమయంలో తాగునీటి కష్టాలు పడే గ్రామాల్లో వేసవిలో మరింత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అలాంటి గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు నీటిని అందించాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని అధికారులను సూచించారు. సమావేశంలో అధికారులు వెంకటరమణ, శ్రీధర్ రెడ్డి, పరమేశ్వరి, డీఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు. -
భూ భారతితో రైతులకు మేలు
కేటీదొడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం కేటీదొడ్డిలోని రైతువేదికలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందని, భూ పరిపాలన వ్యవస్ధ అనేక దశల్లో అభివృద్ధి చెందిందని గతంలో జరిగిన కొన్ని చట్టాలు, సర్వేలు, పాసుబుక్లు, ఆర్.ఓ.ఆర్ చట్టం వంటి చర్యలను గుర్తుచేశారు. అనేక సమస్యలకు భూ భారతి చట్టం ద్వార పరిష్కారం లభించనుందని, ఇందులో ఆరు మాడ్యూల్స్ మాత్రమే ఉండడంతో దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, గ్రందాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, తహసీల్ధార్ హరికృష్ణ, నాయబ్ తహసీల్ధార్ శివశంకర్, ఏఓ సాజీద్ రెహమ్మాన్, ఆర్ఐ దేవెందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. -
ఉగ్రదాడిపై పెల్లుబికిన నిరసనలు
గద్వాలటౌన్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ఆగ్రహావేశాలు పెల్లుబిక్కాయి. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృత్యువాత పడటంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ బుధవారం వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు వేర్వేరుగా నిరసనలు వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ వీహెచ్పీ, బీజేపీ తదితర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోట నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ప్రధాన రహదారుల వెంట భారీ కాగాడాలు, కొవ్వొత్తులు, జాతీయ జెండాలు చేతపట్టి ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్పాష, జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ధర్మ ప్రసార సమితి ప్రాంత సంయోజక్ జగదీశ్వర్రెడ్డి, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కరేంద్రనాథ్, మాట్లాడారు. ఉగ్ర శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశమంతా ఐక్యంగా ఉందన్నారు. పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడులకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశంపై ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న ఉగ్ర మూకలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడులకు ప్రభుత్వం నుంచి ప్రతిచర్యను దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు గోపాల్రావు ఏక్బోటే, వైండింగ్ రాములు, దేవదాసు, రజక నర్సింహా, విజయ్కుమార్, ప్రభాకర్గౌడ్, గంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగడాలతో ర్యాలీ, మృతులకు నివాళి -
ఎందుకీ వెనుకంజ..?
ఫలితాలపై పునశ్చరణ జరిగేనా..? ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు, ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. వీటితో పాటు ప్రధానంగా జిల్లాలో సుమారు 200 –250 మంది విద్యార్థుల వరకు పరీక్షలకు గైర్హాజరయ్యారు. వీటి వలన ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా, డీఐఈఓ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉండటం, కళాశాల ప్రిన్సిపల్కే అదనపు బాధ్యతలు అప్పగించి విద్యా సంవత్సరాలు నెట్టుకొస్తున్నారు. కళాశాలల తనిఖీకి వెళ్లి అక్కడ లోటుపాట్లు కన్పించినా అక్కడ సహచర ప్రిన్సిపల్ ఉండటంతో వారిపై చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తుండటంతో ఆ ప్రభావమూ విద్యార్థుల భవిష్యత్తుపై చూపుతోంది. నాణ్యమైన విద్య అందించినప్పుడే ఫలితాలు సైతం మరింత మెరుగ్గా ఉంటాయి. ఆ దిశగా ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఫలితాలపై పునశ్చరణ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ● ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో జిల్లా 20, 21వ స్థానం ● కొరవడుతున్న కార్యాచరణ, పర్యవేక్షణ ● ఫలితాల మెరుగుపై దృష్టి సారించని అధికారులు గద్వాలటౌన్: విద్యార్థుల ఉజ్వల భవితకు పునాదిగా భావించే ఇంటర్ ఫలితాలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెండింటా విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గతేడాది కన్నా ఈ సారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగినా రాష్ట్రంలో 20, 21వ స్థానాలలో జిల్లా ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రత్యేక కార్యచరణ లోపించడం, పర్యవేక్షణ కొరవడటం పిల్లల చదువులపై దుష్ప్రభావం చూపుతుందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ కళాశాలలు, 14 ప్రభుత్వ గురుకుల కళాశాలలు, ఆరు కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, 13 ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ విద్య కొనసాగుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం 3,260 మంది విద్యార్థులకుగాను 1,864 మంది విద్యార్థులు మాత్రమే (57.18శాతం) ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,963 మంది విద్యార్థులకుగాను 2,017 మంది విద్యార్థులు మాత్రమే (68.07 శాతం) ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలోనే 20వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కళాశాలల్లో ఇలా.. జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో సైతం ఫలితాలు నిరుత్సాహ పర్చాయి. మొదటి సంవత్సరంలో 1,360 మంది విద్యార్థులకు గాను 706 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 41.91 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,208 మంది విద్యార్థులకుగాను 872 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే 72.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడా దితో పోల్చితే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.. ● ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయి. ఒక్క కళాశాలలో మినహా మిగిలిన ఏడు కళాశాలలో 60 శాతం ఉత్తీర్ణత దాటలేదు. మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫలితాలు మరి అధ్వానంగా వచ్చాయి. ఫస్టియర్లో కేవలం 20 శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి. అలంపూర్లో 31 శాతం, మానవపాడులో 37 శాతం మాత్రమే ఉత్తీర్ణత రావడం ఆందోళన కలిగిస్తుంది. గట్టు, ధరూర్ ప్రభుత్వ కళాశాల ఫలితాలు సైతం నిరాశజనకంగా ఉన్నాయి. సెకండియర్లో అలంపూర్ మినహా మిగిలిన అన్ని కళాశాలలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో గట్టు, అయిజ, అలంపూర్ కళాశాలల ఫలితాలు ఫర్వాలేదనిపిచ్చాయి. సీఈసీలో మరి దారుణం.. ప్రభుత్వ కళాశాలల సీఈసీ విభాగంలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. గట్టు ప్రభుత్వ కళాశాల సీఈసీ ప్రథమ సంవత్సరం తెలుగు మీడియంలో జీరో ఫలితాలు వచ్చాయి. 11 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందరూ ఫెయిల్ అయ్యారు. సెకండియర్లో 19 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం ఒక్కరే ఉత్తీర్ణులయ్యారు. మల్దకల్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 24 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే కేవలం ఇద్దరూ మాత్రమే పాస్ అయ్యారు. మానవపాడు కళాశాలలో తెలుగు మీడియంలో పది మందికి ఇద్దరూ, ఇంగ్లీష్ మీడియంలో 14 మందికి నలుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అలంపూర్లో ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిది మందికి గాను కేవలం ఒక్కరే పాస్ అయ్యారు. గట్టు, ధరూర్లలో హెచ్ఈసీ ప్రథమ సంవత్సరం ఫలితాలు సైతం నిరాశపర్చాయి. ● ధరూర్ కళాశాల రెండో సంవత్సరం బైపీసీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 22 మంది విద్యార్థులకు గాను 22 మంది ఉత్తీర్ణత సాధించారు. గద్వాల ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్ కళాశాల ద్వితీయ సంవత్సరం సీఈసీ విభఈగంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 31 మంది విద్యార్థులకు 31 మంది పాస్ అయ్యారు. కళాశాల ప్రథమ ద్వితీయ సం. సం. గద్వాల ప్రభుత్వ కళాశాల 59 74.8 గద్వాల బాలికల కళాశాల 57 70 ధరూరు కళాశాల 54 77 అలంపూర్ కళాశాల 31 56 గట్టు కళాశాల 46 64 మానవపాడు కళాశాల 37 70 మల్దకల్ కళాశాల 20 86 అయిజ కళాశాల 62.16 73.3 ఇంటర్లో నిరాశపరిచిన ఉత్తీర్ణత శాతం కారణాలెన్నో.. ఇంటర్ ఫలితాల్లో ఆశించిన ఉత్తీర్ణత రాకపోవడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. జిల్లాలో ఇంటర్ విద్యపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కళాశాలలకు సరైన దిశానిర్దేశం చేయకపోవడం, తరచూ బోధన తీరును సమీక్షించకపోవడం వంటి కారణాల వల్ల ఫలితాలపై ప్రభావం పడిందన్న భావన విద్యావేత్తల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తరగతులు నిర్వహించినా విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలపై దృష్టి సారించకపోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి వచ్చే వారంతా పేద కుటుంబాలకు చెందిన వారే. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పూర్తిగా తరగతులకు హాజరు కాకుండా మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్లిపోయే వారు. దీంతో వారికి అన్ని సబ్జెక్టులపై పట్టు లేకుండా పోయింది. విద్యార్థులు గైర్హాజరవుతున్నా అధ్యాపకులు చూసీ చూడనట్లు వ్యవహరించ డం మౌళిక వసతులేమి వంటివి ఫలితాలను దెబ్బతీశాయనే భావన వ్యక్తమవుతుంది. -
కల్తీ కల్లుతో బేజారు
కల్లుకు బానిసై తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం ఏడాదిన్నర కిందట కల్తీ కల్లు సేవించి మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి, కోయినగర్, దొడ్లోనిపల్లి గ్రామాలకు చెందిన 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్తీ కల్లు వినియోగిస్తూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి క్రమంగా పెరుగుతోంది. ‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లక్ష్మయ్య. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా కల్తీ కల్లు తాగుతుండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడు దెబ్బతిని నోటమాట రాని పరిస్థితికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మెంటల్ హెల్త్ విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని, తనలాంటి బాధితులు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వాపోయాడు.’ -
రైతు సంబరాలను అడ్డుకున్న పోలీసులు
గట్టు: మండలంలోని బల్గెరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించాల్సిన రైతు సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గట్టు ఎస్ఐ మల్లేష్,మల్దకల్ ఎస్ఐ నందికర్, కేటిదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్తోపాటు భారీగా పోలీసు బలగాలు బల్గెరకు చేరుకున్నాయి. రైతు సంబరాలను నిర్వహించే బీఆర్ఎస్ నేత బల్గెర హనుమంతును అతని ఇంటి దగ్గరే హౌస్ అరెస్టు చేశారు. రైతు సంబరాలను నిర్వహించడానికి వీలు లేదని, అలా కాదని ఎవరైనా ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున హనుమంతునాయుడు ఇంటికి చేరుకున్నారు. కొంత సేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా నిర్వహిస్తున్న రైతు సంబరాలను ఇప్పుడు అడ్డుకోవడం ఏమిటని, రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరితంగా అడ్డుకుంటున్నట్లు హనుమంతునాయుడు ఆరోపించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎద్దుల యజయానులను పంపించేశారు. రాత్రి వరకు పోలీసులు బల్గెరలో పికెట్ ఏర్పాటు చేశారు. -
నాసిరకం మట్టితో రైల్వే స్టేషన్ పనులు
అలంపూర్: జోగుళాంబ రైల్వే స్టేషన్ వద్ద నాసీరకం మట్టితో పనులు చేపడుతున్నారని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్ వద్ద చేపడుతున్న పనులను ఆయనతోపాటు నాయకులు మంగళవారం సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెంట్రల్ రైల్వే అధికారులు రెండేళ్లుగా పనులు చేపడుతున్నారని, అయితే, అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ట్రాక్ల పక్కన ఎర్రమట్టికి బదులుగా సుద్ద మట్టితో పనులు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలంలో ట్రాక్ పక్కన వేసిన సుద్ద మట్టి జిగురుగా మారి ప్రయాణికులు జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాసీరకం మట్టిని తరలించి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని రాజగోపాల్, పిడుగు వెంకటేష్, రాజశేఖర్ శర్మ, నాగేశ్వరరెడ్డి, సుధాకర్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, రవి, సుంకన్న, ఉపేంద్ర తదితరులు ఉన్నారు. -
‘వాగ్దేవి’ విద్యార్థుల విజయ దుందుభి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో అమీనా 468, అక్షయశ్రీ 466, అమృత వర్షిణి 465, వైశాలి 465 మార్కులు సాధించగా.. బైపీసీ విభాగంలో సంజన 436, అలానే ఫరీహ 435, పాయల్ సింగ్ 435, మదియా తరహా 435 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నవనీత్గౌడ్ 992, బైపీసీ విభాగంలో రబ్షా 991, సఫూరా 989 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆయన పేర్కొన్నారు. కళాశాలలో ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రొచ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు సాధించారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించేందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి, అకాడమిక్ ఇన్చార్జి పావని, కోట్ల శివకుమార్, రాఘవేందర్రావు, నాగేందర్, సతీశ్రెడ్డి, బాబుల్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, జ్యోతినందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో ‘రిషి’ సంచలనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సంచలనం సృష్టించారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటినట్లు కళాశాల చైర్పర్సన్ చంద్రకళా వెంకటయ్య తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో భావన 468 మార్కులు సాధించగా.. మరో ఏడుగురు విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు. బైపీసీలో మలిహా కహేకశ 438 మార్కులు సాధించగా.. ముగ్గురు 437, మరో ముగ్గురు 436 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో మేఘన 993తో పాటు మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. బైపీసీలో మలిహ తహనీయత్ 992 మార్కులు, మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల అడ్వైజర్ వెంకటయ్య, అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ పనుల పరిశీలన
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు సమీపంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ పనులను ఈఎన్సీ అనిల్ కుమార్తో పాటు ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా 1, 2, 3 ప్యాకేజీల పనుల పురోగతిని తెలుసుకున్నారు. 3వ ప్యాకేజీ పనులను డ్రోన్ కెమెరాలతో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు ప్రధాన కాల్వ పనులను పరిశీలించారు. పంప్హౌజ్, ప్రధాన కాల్వ హెడ్ రెగ్యులెటరీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కేఎల్ఐ మొదటి లిఫ్ట్ను సందర్శించి.. పంప్హౌజ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్సీ మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 817 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కరివెన, వట్టెం రిజర్వాయర్ల పనులను త్వరగా పూర్తిచేసి.. 50 టీఎంసీల నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు, జేఈలు పాల్గొన్నారు. -
అనవసర భయం విద్యార్థి ప్రాణం తీసింది..
● ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత సాధించిన మల్లెందొడ్డి విద్యార్థి మల్దకల్: ఇంటర్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో మల్దకల్ మండలంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వినోద్ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ వార్షిక పరీక్షల అనంతరం విద్యార్థి తాను రాసిన పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ పాస్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనవసర భయమే తమ బిడ్డ ప్రాణం తీసిందని వాపోయారు. తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి రాజోళి: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మాన్దొడ్డికి చెందిన నడిపి ఆంజనేయులు (52) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. ప్రస్తుతం తాటిముంజల సీజన్ కావడంతో, వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గ్రామ సమీపంలో తాటికాయలు తెంచేందుకు చెట్టుపైకి ఎక్కిన ఆయన.. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రేపు జాబ్ మేళా గద్వాల: నిరుద్యోగ యువతకు గద్వాల, హైదారాబాదు కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈ నెల 24న జాబ్మేళా నిర్వహించునున్నట్లు ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండి ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు 24వ తేదీన గద్వాల పట్టణంలో బీసీ స్టడీసర్కిల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగే పాల్గొనాలని సూచించారు. నవభారత్ ఫర్టిలైజర్స్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుందని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.5,939 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు మంగళవారం 409 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 5939, కనిష్టం రూ. 2899, సరాసరి రూ. 3669 ధరలు పలికాయి. అలాగే, 20 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6319, కనిష్టం రూ. 5806, సరాసరి రూ. 3669 ధరలు వచ్చాయి. 117 క్వింటాళ్ళ ఆముదాలు రాగా గరిష్టం రూ. 5939, కనిష్టం రూ. 5639, సరాసరి రూ. 5879 ధరలు పలికాయి. 2294 క్వింటాళ్ళ వరి (సోన) రాగా గరిష్టం రూ.2046, కనిష్టం రూ. 1701, సరాసరి రూ.1945 ధరలు లభించాయి. -
‘ప్రతిభ’ విద్యార్థుల విజయఢంకా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో వైష్ణవి 468, ఉపేంద్ర 468, విజయలక్ష్మి 467, గణేశ్ 467, అక్షితారెడ్డి 467, సాయిచరణ్ 467, కీర్తి 466, భవనేష్ 466, అయిసా తహరీన్ 466, హర్షిత 466, వర్షిణి 466, హూరియా రశీద్ 466, విశాల్ 466, శోభారాణి 466, నవీన్కుమార్ 466, శ్రీనితీన్ 466, త్రిష 466 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో నెక్కొండ హాసి 436, వైష్ణవి 436, సుప్రజ 435 మార్కులతో ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అక్షిత 994, అమోఘ్ 993, భవిత 992, శివజ్యోతిక 992, అమిమ ఫాతిమా 992, వర్షిత్గౌడ్ 992 మార్కులు సాధించగా.. బైపీసీ విభాగంలో అక్షిత 994, అజీం కౌసర్ 991, జైన్బిన్ మొహమ్మద్ 990, భూమిక 990 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో 400 పైగా 514మంది, ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులకు పైగా 432 మంది సాధించినట్లు యాజమాన్యం పేర్కొంది. -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డలు
సాక్షి, నాగర్కర్నూల్/వెల్దండ/వంగూరు/అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. నల్లమలలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మండలి సాయికిరణ్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 298 ర్యాంకు సాధించారు. హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసిన సాయికిరణ్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం విశేషం. సాయికిరణ్ తల్లి పుష్పమ్మ గృహిణి కాగా.. తండ్రి మండలి లింగమయ్య ప్రస్తుతం పెద్దకొత్తపల్లి మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్నారు. ● వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్యావత్ యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించారు. ఆయన గతేడాది యూపీఎస్సీ ఫలితాల్లో 627వ ర్యాంక్ సాధించి ఐపీఎస్గా మహారాష్ట్రకు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి యూపీఎస్సీ పరీక్ష రాసి.. మెరుగైన 432వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని యశ్వంత్ నాయక్ చెప్పారు. కాగా, యశ్వంత్ తండ్రి ఉమాపతి హైదరాబాద్లో ఎస్పీఐ ఏజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్, ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ● వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన గోకమొల్ల ఆంజనేయులు పట్టుదలతో చదివి ఆలిండియా 934వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆంజనేయులు.. 1నుంచి 7వ తరగతి వరకు స్వగ్రామమైన తిప్పారెడ్డిపల్లిలో.. 8నుంచి 10వ తరగతి వరకు గాజరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, ఐఐటీని కడప జిల్లా ఇడుపులపాయలో పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. సివిల్స్లో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసులు, కృష్ణమ్మతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. ●ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నా.. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ సాధించాలని లక్ష్యం ఉండేది. హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశాక.. ఎంబీఏ చేస్తూనే సివిల్స్కు సన్నద్ధం అయ్యాను. ఏడాదిపాటు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అయ్యాను. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఆనందంగా ఉంది. – సాయికిరణ్, మన్ననూర్ ● మూసాపేట మండలం నిజాలాపూర్కు చెందిన మునుగల్చేడ్ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడు ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ జాతీయ స్థాయిలో 700 ర్యాంకు సాధించారు. గత మార్చి 30న విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన అతడు.. ఈసారి యూపీఎస్సీ ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్), పీజీ పూర్తి చేశారు. మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాసి 700 ర్యాంకు సాధించారు. ఇదిలా ఉంటే, వెంకటేశ్ ప్రసాద్ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తుండగా.. తల్లి యశోద గృహిణి. పదేళ్లుగా సత్యయ్య కుటుంబంతో కలిసి మహబూబ్నగర్లోని శేషాద్రినగర్లో నివాసముంటున్నారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం.. అమ్మా, నాన్న పోత్సాహంతో చదువులో రాణించాను. దూర ప్రాంతాల్లో నా విద్యాభ్యాసం పూర్తిచేశాను. యూపీఎస్సీ పరీక్ష కోసం ఢిల్లీలోని వాజీరాం కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా. 15 నెలలపాటు కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే 700 ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఇందుకోసం మరోసారి ప్రయత్నం చేస్తాను. – ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ ,నిజాలాపూర్ -
భూ భారతి చట్టం రైతులకు వరంలాంటిది
లింగాల/ బల్మూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం–2025 రైతులకు వరం లాంటిదని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం లింగాల, బల్మూరులోని రైతువేదికల్లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు ఎంపీతోపాటు అదనపు కలెక్టర్ అమరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి ధరణి వల్ల పేద రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని, భూములు కోల్పోయారని దానిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మార్పులతో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. అధికారులు వచ్చే నెలలో గ్రామాల వారిగా పర్యటించి సదస్సులు నిర్వహిస్తారని, ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని, ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించడానికి కసరత్తు జరుగుతుందని చెప్పారు. ఆధార్ కార్డు తరహాలో భూమికి భూదార్ సంఖ్య కేటాయించడం జరుగుతుందని, దీనివల్ల భూములు ఆక్రమణకు గురయ్యే అవకాశాలు ఉండవన్నారు. ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకోవడానికి ముఖ్యమంత్రిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా వారి ఆటలు సాగవని, అలా చేస్తే ప్రజలే బట్టలూడదీసి ఉరికించి కొడతారన్నారు. అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ సాదాబైనామాలు, వారసత్వ, అసైన్డ్, పొరంబోకు భూములలో ఉన్న లోపాలను సరి చేసుకోవచ్చన్నారు. భూ భారతి పోర్టల్లో పొందుపర్చిన రికార్డుల ఆధారంగా బ్యాంక్లు రుణాలు ఇస్తాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ రజిత, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, తహసీల్దార్లు పాండునాయక్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు రంగినేని శ్రీనివాస్రావు, నాగేశ్వర్రావు, వెంకట్రెడ్డి, కాశన్నయాదవ్, రాంప్రసాద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఆలయ భూమి కౌలు వేలం
అలంపూర్: పట్టణంలోని ఆలయ సముదాయంలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామికి చెందిన భూముల వేలాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అదనపు కమిషనర్ మధనేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించినట్లు ఈఓ పురేందర్కుమార్ తెలిపారు. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో 34 సర్వే నెంబర్లలో 28 సర్వే నంబర్ల ద్వారా వేలంలో రూ.39.59లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. మిగిలిన 6 సర్వే నంబర్లకు సరైన ధర రాకపోవడంతో మే 2న రెండో సారి కౌలు వేలం నిర్వహిస్తామని తెలిపారు. శ్రీసూర్య నారాయణస్వామి ఆలయానికి చెందిన 2 సర్వే నంబర్లకు నిర్వహించిన వేలంలో రూ.6.77లక్షలు, కాశీపురం ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 2 సర్వే నంబర్ల భూములకు రూ.2.11 లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. ఆలయ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, ధర్మకర్తలు నాగశిరోమణి, జగదీశ్వర్గౌడ్, ఎ.వెంకటేశ్వర్లు, జగన్మోహన్ నాయుడు, జి.వెంకటేశ్వర్లు, గోపాల్ తదితరులు ఉన్నారు. -
అధికారులు పట్టించుకోవాలి..
కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి. – అంబ్రెష్. మాజీ సర్పంచ్, గుడెబల్లూరు, కృష్ణా నా దృష్టికి రాలేదు.. నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు. – వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా.. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్, ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్నగర్ ● -
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం
గద్వాల టౌన్: కేంద్రం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, సంఘటిత ఉద్యమాలతోనే దీన్ని తిప్పికొట్టాలని ముస్లిం మతపెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఈద్గా చౌరస్తా నుంచి ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీ తీశారు. వీరికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ప్రజా సంఘాల నాయకుడు మోహన్ తదితరులు సంఘీభావం తెలిపి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తుందని విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. వక్ఫ్బోర్డు ఆస్తులను కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. దేశంలో మరో విభజనకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు అబ్బాస్, ఉస్మాన్, ఫయీమ్, జబ్బార్, ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఖలీల్, న్యాయవాది షఫీఉల్లా, అతికుర్ రహమాన్, దౌలత్, సీరాజుద్దీన్, మక్బూల్, ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ తర్వాత వేరే చోట..
తొలుత మట్టి రోడ్డు వేసి బెంజ్ వంటి వాహనాల్లో ఇసుక తరలించడంపై పలువురు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఎవరు కూడా అటు వైపు చూడకపోవడంతో ఇసుక మాఫియా రాత్రిళ్లూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అదే ఆశ్రమం నుంచి కొద్దిదూరంలో వేరే చోట మట్టి రోడ్డు వేసి.. భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతోంది. రోజుకు వందలాది ట్రిప్పుల చొప్పున ఇసుకను కర్ణాటకలోని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. బెంజ్ ఇసుకను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. -
భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం
అలంపూర్/ ఉండవెల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో అన్నిరకాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. అలంపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో, ఉండవెల్లిలోని రైతువేదికలో భూ భారతి చట్టంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎంపీతోపాటు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతిగా భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చారన్నారు. గతంలో ధరణి పోర్టల్తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరిగినా పరిష్కారం చూపేవారు కాదన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి, పేద రైతుల కన్నీళ్లను తుడిచేందుకు భూ భారతి చట్టం రూపొందించామన్నారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో మేధోమథనం చేసి సమగ్ర అంశాలతో భూ భారతి చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. ప్రతి వారం కలెక్టర్, తహసీల్దార్ సహా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి భూ సమస్యల పరిష్కారంపై పర్యవేక్షణ చేస్తామన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి వ్యవస్థ అమల్లోకి వచ్చిందని, భూ భారతి చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నట్లు చెప్పారు. ముందుగా తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తు చేసుకోవచ్చని, అక్కడ న్యాయం జరగకపోతే ఆర్డీఓ, కలెక్టర్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. భూ భారతితో భూమికి సంబంధించిన సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. వారసత్వ మ్యుటేషన్, హక్కుల సంక్రమణ గడువులోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ఆధార్ తరహాలో భవిష్యత్లో భూములకు సంబంధించి సర్వే చేసి, హద్దులు, కొలతలు, భూముల వివరాలు ఒకే పుస్తకంలో ఉండేలా భూధార్ రూపొందించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ గ్రామాల ప్రజలు భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి అలంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అలంపూర్ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం ఆయన ఆలయాన్ని సందర్శించగా.. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మ, స్వామివార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శక్తిపీఠం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతానన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించడానికి కృషి చేస్తానన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. -
చర్యలు చేపడుతున్నాం
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రవాణా శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరు సీట్బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి, నిద్రలేమితో, వాహనంపై అవగాహన లేనివారు డ్రైవింగ్ చేయరాదు. గూడ్స్ వాహనాల్లో సరుకులు మాత్రమే తీసుకెళ్లాలి. ప్రజలను ఎక్కించుకోరాదు. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా ఆదేశిస్తాం. హిట్ అండ్ రన్ ఘటనలపై ప్రత్యేక నిఘా ఉంచాం. రోడ్డు నిబంధనలు పాటించని వారిని తనిఖీల్లో పట్టుకొని కేసులు నమోదు చేస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
‘సంవిధాన్’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొల్లాపూర్ రూరల్: జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలాని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్లోని క్యాంపు కార్యాలయంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశం మంత్రి పాల్గొని మాట్లాడారు. నాగర్కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది.. వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తుంది.. అప్రజాస్వామిక నిర్ణయాలు, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. అంబేడ్కర్ను స్ఫూర్తిగా తీసుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా రూ.5 కోట్ల నియోజకవర్గ నిధుల నుంచి రూ.2 కోట్లు గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి వెచ్చిస్తానని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రూ.లక్ష చొప్పున గ్రంథాలయాలకు కేటాయించామన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మగాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు తెలిపే పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’
●● త్వరలో మూడు పిచ్లు అందుబాటులోకి.. ● మైదానం మొత్తం గ్రీనరీ ఏర్పాటు ● భవిష్యత్లో రంజీ మ్యాచ్లకు వేదిక కానున్న పాలమూరు చురుగ్గా సాగుతున్న పనులు.. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతేడాది హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు టర్ఫ్ వికెట్ కోసం విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. మైదానంలో టర్ఫ్ వికెట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. క్రీడాకారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ లభిస్తుంది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్ పిచ్లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఈ మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం చాలా వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు ఉన్న ఏకై క క్రీడా మైదానమిది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం దాతల సహకారంతో నెట్, రెండు బౌలింగ్ యంత్రాలతో పాటు పెవిలియన్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ● క్రికెట్లో టర్ఫ్ వికెట్(పిచ్)లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ ఉండాల్సిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు కల నెరవేరనుంది. గతేడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో పలువురు హెచ్సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు కోసం ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్సీఏ రూ.60 లక్షలు కేటాయించగా.. కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా మైదానం మొత్తం పచ్చగడ్డి (గ్రీనరీ)ని ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో వర్షపు నీరు నిలువకుండా ఎత్తు పెంచి చుట్టూ అండర్గ్రౌండ్ పైప్లైన్ వేస్తున్నారు. త్వరలో ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్లు అందుబాటులోకి రానున్నాయి. ● టర్ఫ్ వికెట్ పిచ్పైనే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మ్యాచ్లు ఆడుతారు. ఇంతకాలం మ్యాట్పై ఆడే జిల్లా క్రీడాకారులు టర్ఫ్ వికెట్ అందుబాటులోకి వస్తే వారి ఆటతీరు మరింత మెరుగు పడే అవకాశం ఉంటుంది. హెచ్సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు మరింతగా రాణించవచ్చు. రంజీస్థాయిలో ఆడేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటయితే భవిష్యత్లో రాష్ట్రస్థాయి మ్యాచ్లతో పాటు రంజీ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. -
నెత్తురోడుతున్నాయి..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదు ● ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించి జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాలి ● ప్రయాణం చేసే కంటే ముందే వాహనం కండిషన్ చెక్ చేసుకోవాలి ● రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి ● ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని అతివేగంగా నడపరాదు ● వర్షం, ఈదురుగాలులు వస్తున్న సమయంలో నెమ్మదిగా వెళ్లాలి ● మద్యం సేవించి, నిద్ర మత్తులో వాహనాలు నడుపొద్దు● 70 నుంచి 100 మంది గాయాలపాలు ● అతి వేగం, నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం ● నడిగడ్డలో కలవరపెడుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ● జాతీయ రహదారిపైకి రావాలంటేనేజంకుతున్న వైనం ●జిల్లాలో నాలుగు నెలల్లో 45 మంది మృతి -
పాపుల రక్షణకు జీవితం అంకితం
గద్వాలటౌన్: పాపుల రక్షణకు క్రీస్తు జీవితం అంకితం చేశాడని హైదరాబాద్కు చెందిన రెవ. శ్యామ్రావ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని చర్చిలలో ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంబీ మిస్పాచర్చి, ఒలీవ చర్చి, కర్మెలు చర్చి, హోసన్నా మందిరం, జమ్మిచేడు ఎంబీ చర్చి, జియోన్ చర్చి, హోలీ మినిస్ట్రీస్, ఎల్ఈఎఫ్, తదితర చర్చిలలో ఈస్టర్ పండగను పురస్కరించుకొని ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై యేసయ్యను స్వాగతిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. క్రీస్తును ఆరాధించారు. వాక్యోపదేశాలు, బైబుల్ సూక్తులు విన్నారు. స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో జరిగిన పునరుత్థానం కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న శ్యామ్రావ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవులకు దైవసందేశం ఇచ్చారు. లోక రక్షకుడు, మన పాపాలను తన రక్తంతో కడిగారని, ఆ యేసు ప్రభువు మరణించాక సమాధి చేసిన మూడు రోజుల అనంతరం మళ్లీ తిరిగి లేచాడని వివరించారు. దయామయుడు చల్లనిచూపు ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. కష్టసుఖాలను సమపాళ్లలో స్వీకరిస్తూనే.. లోకమంతా శాంతి స్థాపించాలన్నదే ఏసు ప్రభువు మార్గమని, అదే అందరికీ అనుసరణీయమని అన్నారు. స్థానిక జమ్మిచేడు ఎంబీ చర్చిలో సైతం ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రార్థనలకు హాజరైన మహిళలు, యువతులు భక్తిగీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వేరువేరుగా ఈస్టర్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. -
భూ సమస్యల పరిష్కారానికే చట్టం
ఎర్రవల్లి: భవిష్యత్లో ప్రతి భూమికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కల్పించేలా సర్వే ద్వారా కొలతలు, హద్దులు వంటి సమగ్ర వివరాలతో భూధార్ను ప్రవేశ పెట్టనున్నట్లు, భూభారతి చట్టం ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసుకునే అవకాశం కల్పించబడుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కును కల్పించడంతో పాటు భూ సంబంధిత వివాదాలను పూర్తిగా నివారించేలా ప్రభుత్వం అనేక కీలక అంశాలను సమన్వయపరిచి నూతన భూభారతి ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. ఈచట్టంలో మొత్తం 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉండటం ద్వారా భూ పరిపాలన మరింత స్పష్టతతో, శాసీ్త్రయంగా అమలవుతుందని వెల్లడించారు. భూమి రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూ సర్వే నిర్వహించి మ్యాప్ సిద్దం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాదా బైనామాల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్దమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని, భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కలగనుందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డిసిసిబి చైర్మెన్ విష్ణువర్దన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నీలి శ్రీనివాసులు, పిఎసిఎస్ చైర్మెన్ రంగారెడ్డి, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ ఖాన్, ఏఓ రవికుమార్, ఏఈఓలు, జీపీ కార్యదర్శులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
రజతోత్సవ సభకు సైన్యంలా కదలాలి
కేటీదొడ్డి: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాసు హనుమంతు నాయుడు అధ్యక్షతన కేటీదొడ్డి మండలం వెంకటాపురంలో రజతోత్సవ సభకు సంబందించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం మాజీ సీఎం కేసీఆర్.. పదవులనే లెక్కచేయలేదని, చావుదాక వెళ్లి రాష్ట్రాన్ని సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ సార్కారు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం పాత సీసాలో కొత్తసారా..లాగానే ఉందన్నారు. రైతుల భూముల పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి ఫొర్టల్ను తిట్టిపోసిన కాంగ్రెస్కు ఇప్పుడు ఆ ధరణి మార్గదర్శకాలే దిక్కయ్యాయని అన్నారు. అంతకుముందు మండలంలోని వెంకటాపురం శ్రీపాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, చక్రదర్రావు, వెంకటేష్ నాయుడు, మోనేష్, శేఖర్ నాయుడు, రామునాయుడు, మాక్బూల్, తిరుమల్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు. -
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్
అలంపూర్: రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అలంపూర్ పట్టణంలో బీజేపీ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారంలో పురోగతి లేదన్నారు. రూ.50 కోట్లు ఖర్చు చేసి చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే 24 గ్రామాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉందన్నారు. తుమిళ్లకు అనుసంధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం, వేముల వద్ద జూరాల లింకును కలిపితే ఆర్డీఎస్ డీ–40 వరకు సాగునీటిని అందించవచ్చన్నారు. అధికారుంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదన్నారు. గద్వాలలోని ర్యాలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికి నిధులు కేటాయించి నిర్వహణ చేపట్టకపోవడంతో 2 టీఎంసీల నీళ్లు అందడం లేదన్నారు. నెట్టెంపాడు కింద ఉన్న 104, 107, 99 ప్యాకేజీలు పూర్తి చేయకపోవంతో కృష్ణా, తుంగభద్ర వంటి జీవనదులు ఉన్నప్పటికి రైతులు సాగు నీటికి కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిలో సిబ్బంది లేక వైద్య సేవలు అందడం లేదన్నారు. గద్వాలలో మెడికల్ కళాశాలలో సరైన సౌకర్యాలు, సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్, ఈశ్వర్, శరత్ బాబు, సంజీవ రెడ్డి, జగదీశ్, నాగేశ్వరరెడ్డి, నాగమ్లయ్య, రంగస్వామి, నరేష్, మద్దిలేటి, రాజశేఖర్, దాన రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్, రవికుమార్ తదితరులు ఉన్నారు. -
మంత్రి పర్యటన సైడ్లైట్స్
● ఉదయం 10.45 గంటలకు ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ధరూరుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.15 గంటలకు చేరుకోవాల్సి ఉండగా గంటన్నర ఆలస్యమైంది. ● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయుల మధ్య వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. సరిత వర్గీయులు మంత్రి గో బ్యాక్.. పొంగులేటి గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ● ప్రోటోకాల్ ప్రకారం కొందరినే సభపైకి పిలవడంతో.. మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరితను సైతం స్టేజీ పైకి పిలవకపోవడంతో ఆమె వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ● ఎంపీ మల్లు రవిని స్టేజీపైకి వెళ్లకుండా సరిత వర్గీయులు అడ్డుకోవడంతో ఆయన స్టేజీ కిందనే కూర్చున్నారు. కాసేపటి తర్వాత వెళ్లారు. ● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రసంగిస్తుండగా సరిత వర్గీయులు.. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేవి కాంగ్రెస్ కండువా వేసుకుని మాట్లాడాలని అడ్డుతగిలారు. ● 11.24 గంటలకు మంత్రి పొంగులేటి ప్రసంగం ప్రారంభం. ● 11.50 గంటలకు ప్రసంగాన్ని ముగించి కాన్వాయ్ వద్దకు మంత్రి చేరుకుంటుండగా మరోసారి తోపులాట జరిగింది. కారులో కూర్చున్న మంత్రితో సరిత రెండు నిమిషాలు మాట్లాడారు. ● గంట పాటు జరిగిన మంత్రి పర్యటన ఆసాంతం అరుపులు, కేకలు, వాగ్వాదాలతోనే ముగిసింది. -
ప్రతి రైతుకు భద్రత
జోగుళాంబ గద్వాలభూ భారతితో ప్రాణాలు తీసిన అతివేగం ఎన్హెచ్–44పై వేముల స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు.ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు IIలో uగద్వాల/ధరూరు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి– 2025 చట్టం రైతులకు పూర్తి భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం భూభారతి చట్టం గురించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ధరూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ధరణి వలన రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. ఆ ఇబ్బందులను విముక్తి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం–2025ను తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, ఈచట్టం గురించి ప్రజలకు, రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. 26వేల సాదాబైనామా దరఖాస్తులు, పరిష్కరించనున్నట్లు వివరించారు. అలాగే, ఆధార్ తరహాలో భూధార్ నంబర్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు వినియోగించుకోవాలి ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు భూభారతి చట్టాన్ని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేసినట్లు వాటిని అర్హులైన పేదలకు అందిస్తామన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ గతంలో భూసమస్యలకు అడ్డంకులు ఉండేవని తాజా చట్టం ద్వారా నేరుగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం లభిస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 45678 ద్వారా ఆర్ఓఆర్ దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. వారసత్వం సక్షెన్ సెక్షన్8లో కోర్టు, లోక్ అదాలత్ సమస్యల నుంచి ఈచట్టం ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. ప్రతిగ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూసమస్యలు పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో టీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నీలిశ్రీనివాసులు, మార్కెట్యార్డు చైర్మన్ హనుమంతు, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ ఆధార్లాగే త్వరలోనే భూధార్ నంబర్ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
గద్వాల క్రైం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని.. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా జడ్జి కె.కుషా అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 44 మంది విద్యార్థులకు జడ్జి సైకిళ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుతున్న విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలలకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కరించేందుకుగాను సైకిళ్లు అందజేశామన్నారు. వసతులను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని అన్నారు. న్యాయమూర్తులు గంట కవితాదేవి, టీ లక్ష్మీ, ఎన్వీహెచ్ పూజిత, మిథున్తేజ్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు గద్వాలటౌన్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 20 నంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షల కోసం రెండు పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, టెన్త్ పరీక్షలకు 501 మంది విద్యార్థులు, ఇంటర్ పరీక్షలకు 721 మంది హజరవుతున్నారని చెప్పారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంటర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొన సాగుతాయన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు స కాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభివృద్ధిపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం అలంపూర్: ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధిపై ఉన్నతస్థాయి కమిటీ శనివారం సమావేశమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి వల్లీ నాయగం, అడ్వైజర్ గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, శృంగేరి పీఠాధిపతి శిష్య బృందం శనివారం అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో దేవస్థానం చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్తో వారు సమావేశమై భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి గర్బాలయాలను పరిశీలించారు. ఆలయాల్లో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు, సేవలను తెలుసుకున్నారు. ఆలయ ధర్మకర్తలు జగదీశ్వర్గౌడ్, అర్చకులు ఉన్నారు. 23 నుంచి బాలభవన్లో వేసవి శిక్షణ తరగతులు గద్వాలటౌన్: వివిధ కళల పట్ల చిన్నారులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని మరింత ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని బాలభవన్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 23 నుంచి జూన్ 2 తేదీ వరకు వేసవి శిక్షణ తరగతులు కొనసాగుతాయని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ శిబిరం ఉంటుందని చెప్పారు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, వాయిద్యం, కుట్లు, అల్లికలు అంశాలలో శిక్షణ ఇస్తామన్నారు. 05–16 ఏళ్లలోపు వయస్సు గల చిన్నారులు ఉచిత శిక్షణ తరగతులకు అర్హులని, ఆసక్తి గల చిన్నారులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోస్టు సైజ్ ఫొటోతో బాలభవన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేసవి శిబిరాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇతర వివరాలకు సెల నంబర్ : 96668 53335, 94409 81190 సంప్రదించాలని కోరారు. రామన్పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 270 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 34 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
నిషేధిత కల్లు విక్రయాలను ఉపేక్షించేది లేదు
గద్వాల క్రైం: లైసెన్స్ లేకుండా కల్లు, నిషేధిత పదార్ధాలతో తయారు చేసిన కల్లు విక్రయాలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శుక్రవారం కల్లు విక్రేతలతో డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో నిషేధిత కల్లు విక్రయాలపై నార్కోటిక్ డ్రగ్ అధికారులు తనిఖీ చేపట్టిన క్రమంలో కల్తీ కల్లు వెలుగు చూసిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గద్వాల సెగ్మెంట్లలో కల్లు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. లైసెన్స్ పొంది నిషేధిత, అనుమతి లేకుండా కల్లు విక్రయాలు చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కల్లు దుకాణాల వివరాలు, ఈత చెట్ల నుంచి రోజువారీగా ఎన్ని వేల లీటర్లు కల్లు విక్రయాలు చేస్తున్నారు అనే అంశాలపై వారి నుంచి వివరాలు సేకరించామన్నారు. కృతిమ కల్లు పేరిట నిషేధిత కల్లు అమ్మకాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు, ఇందుకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, వారికి సిబ్బంది సహాయ సహకారాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నామని, గీతా కార్మికులు, సొసైటీలు, కల్లు డిపోలు, ఈత వనలు తదితర అంశాలపై మాట్లాడారు. అనుమతి లేని దుకాణాలు ఉన్నట్లు గుర్తిస్తే కట్టడి చేసేందుకు పోలీసు శాఖ సైతం చొరవ తీసుకుంటుందన్నారు. కల్తీ కల్లు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచామని, ఇక నుంచి క్రమం తప్పకుండా కల్లు దుకాణాల విక్రయాలు, నిర్వహణ అంశాలపై నిరంతరం తనిఖీలు ఉంటాయన్నారు. మత్తు పదార్థాల సరఫరా, నిల్వలు ఉన్నట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో సీఐ శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు. -
జోగుళాంబ గద్వాల
సమస్యల పరిష్కారానికి డెడ్లైన్శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 10లో uపోలీసుల అదుపులో యువకులు గద్వాల క్రైం: గుట్టుగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా పోలీసులు.. కొందరు యువకులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన యువకులు గంజాయి, మత్తు కలిగించే పదార్థాలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి జిల్లాలో కొందరు వ్యక్తులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్, గద్వాల కేంద్రంగా విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే పట్టుబడిన వారు గద్వాల జిల్లాకు చెందినవారేనని తెలిసింది. గంజాయి సరఫరా, విక్రయాల నివారణకు ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో నడిగడ్డకు చెందిన యువకులు మత్తు పదార్థాల సరఫరా చేయడం హాట్టాపిక్గా మారింది. కూపీలాగుతున్న ప్రత్యేక బృందం జిల్లాలో ఎవరెవరు గంజాయి తదితర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు, వాటికి బానిసలయ్యారు అనే దానిపై అనుమానాస్పద స్థితిలో పట్టుబడిన యువకుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఇందులో అధికంగా యువకులకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని శివారుకాలనీలో కొందరు యువకులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రాత్రి సమయంలో మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండగా.. ఎకై ్సజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడిన యువకులు ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువులు కావడం, ఓ ముఖ్యనేత ఒత్తిళ్లతో పట్టుబడిన యువకులకు కౌన్సెలింగ్ అందించి విషయాన్ని బయటకు రాకుండా చేశారు. ప్రస్తుతం అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడిన యువకులు సైతం ఎవరికి మత్తు పదార్థాలు విక్రయించారు అనే విషయం తెలియాలిఉంది. ఈ ఘటనపై ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు యువకులను పట్టుకున్నామని, మత్తు పదార్థాల విక్రయ అంశంపై ఆరా తీస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ‘ప్రధానిని విమర్శించే స్థాయి కాదు’ గద్వాల: ప్రపంచ దేశాలన్నీ దేశప్రధానిని గొప్పదార్శనికత ఉన్న నాయకుడని కొనియాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ స్థాయిని మరిచి దేశ ప్రధానినే విమర్శిస్తుండడం వారి దివాళాకోరు తనానికి నిదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలకు పెట్టింది పేరని, వారి కుంభకోణాలు వెలుగు చూసి చట్టం తన పనితాను చేసుకుంటూ పోతుంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ పార్టీ నేతలు, అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించడం సరైన విధానం కాదని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు బండల వెంకట్రాములు, రవి, ఇసాక్, దేవదాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి, నాగర్కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్త్రృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు.. పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్లను మారుస్తారు. భూభారతి పోర్టల్లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు. ధరూరు: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో నూతనంగా అమలులోకి తెచ్చిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ధరూరుకు రానున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ధరూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సభ ఏర్పాటు చేయగా.. ఉదయం 9.15 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి ఉదయం 8.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా గద్వాలకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంగుండా ధరూరుకు చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు సభా స్థలాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. సభ ముగిసిన అనంతరం 11 గంటలకు నాగర్కర్నూలుకు బయలుదేరి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. న్యూస్రీల్మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు.. ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది. గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు. ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన.. భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన భూభారతిపై విస్త్రృత అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు నేడు గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ● -
సర్వ మానవాళికి ఏసుక్రీస్తు రక్ష
గద్వాలటౌన్: జిల్లా వ్యాప్తంగా గుడ్ఫ్రైడేను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సర్వమానవాళికి రక్షణ లభిస్తుందని, పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని పాస్టర్లు సందేశమిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ మిస్పాచర్చి, ఒలీవ చర్చి, కర్మెలు చర్చి, ఎంబీ జియాన్ చర్చి, హోసన్నా మందిరం, హోలీ మినిస్ట్రీస్, ఎల్ఈఎఫ్ తదితర చర్చిలలో గుడ్ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తును ఆరాధించారు. వాక్యోపదేశాలు, బైబుల్ సూక్తులు విన్నారు. క్రీస్తు ప్రవచనాలు ఆచరించాలి మానవాళి శాంతి కోసం ఏసుక్రీస్తు శిలువకు బలయ్యారని, ఆయన ప్రవచనాలు అందరూ ఆచరించాలని పాస్టర్లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంబీ మిస్పా చర్చిలలో జరిగిన గుడ్ఫ్రైడే వేడుకల్లో పాస్టర్ చార్లస్ శాంతిరాజ్ వాక్యోపదేశం చేశారు. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన సమయంలో చెప్పిన ఏడు మాటలను పాస్టర్లు రోస్, ప్రకాశం, శిభాప్రభుదాస్, సాల్మన్ప్రకాష్, అశోక్, వీడీ సోలమాన్, సైమన్ సుధాకర్లు వివరించారు. శాంతికి ప్రతిరూపం ఏసు అని, శత్రువులను సైతం ప్రేమించాలని సూచించారన్నారు. తెలియక చేస్తున్న తప్పును క్షమించాలన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా క్వయిర్ సభ్యులు, మహిళా సమాజం వారు ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆయా చర్చిల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే -
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్నాల్, ఎర్గోల, మినాస్పూర్ బ్లాక్లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
భూ వివాదాలకు ‘భూ భారతి’తో పరిష్కారం
గద్వాల: భూ వివాదాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా భూ భారతి–2025 అనే నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం–2025పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా భూ భారతి చట్టంలోని నూతనంగా పొందుపర్చిన అంశాలపై రైతులకు వివరించారు. ఎలాంటి భూవివాదాలకు తావులేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికే పూర్తి భూ యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక మార్పులు చేస్తూ కొత్త అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. భూభారతి చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలు పొందుపర్చినట్లు తెలిపారు. భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దులు వంటి సమగ్రమైన వివరాలతో తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈచట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడిందని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతో పాటు, వారసత్వ భూముల మ్యూటేషన్లు నిర్ణీత గడువులోపల పూర్తి చేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. చట్టంపై రైతులకు విస్తృత అవగాహన భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ అవకాశం కల్పించినట్లు దీంతో రైతులకు న్యాయబద్దమైన మార్గం కల్పిస్తుందన్నారు. ఇంటి స్థలాలు, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాసీ్త్రయంగా చేస్తూనే మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూములపై హక్కుల పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం కల్పించబడిందన్నారు. భూ భారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందన్నారు. మే 1వ తేదీ నుంచి గ్రామ పాలన అధికారుల నియామకంతో భూ సమస్యలు సులభతరం అవుతుందన్నారు. గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారుల సాయంతో రైతు వేదికల వద్ద చట్టం గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై ప్రతిఒక్కరు అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్రావు, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, సుభాన్, నీలిశ్రీనివాసులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం వేగవంతం కలెక్టర్ బీఎం సంతోష్ -
పశు సంపదను కాపాడేందుకే టీకాలు
ఎర్రవల్లి/ఇటిక్యాల: పశు సంపదను కాపాడేందుకే పశువైద్య, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వైరస్ వల్ల పశువులలో నోరు, కాలి గెట్టెల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే గాలి ద్వార ఇతర పశువులకు వ్యాపిస్తుందని, దీనిని గాలి కుంటు రోగం అంటారన్నారు. జ్వరం అధికంగా ఉండి నోరు, నాలుక భాగములో పుళ్ళు ఏర్పడి మేత తీసుకోవడంలో ఇబ్బందులు, నోటి నుండి నురుగు వస్తూ దగ్గుతుంటాయన్నారు. గిట్టల మధ్య ఎర్రబడి, మెత్తబడి వ్యాధి సోకిన దూడలు 30–40 శాతం వరకు చనిపోతాయన్నారు. అందుకే పాడి రైతులు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని పశు సంపదను కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల పశు వైధ్యాధికారి డాక్టర్ భువనేశ్వరి, వినయ్కుమార్, పశువైద్య సిబ్బంది మాసూమన్న, సబీనా, రామకృష్ణ, విజయ్భాస్కర్, రాజేంద్ర సింహా, భారతీష్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. ● కొండేరులో 80 తెల్ల పశువులు (గోవుజాతి), 186 గేదెలకు టీకాలు వేశామని మూడు నెలలు పైబడిన అన్ని పశువులకు టీకాలను ఖచ్చితంగా వేయించాలని అన్నారు. ఈ వ్యాది సోకిన పశువులు ముడుచుకొని పడుకుంటాయని, జ్వరం 105 డిగ్రీల పైబడి ఉంటుందని, ముందుజాగ్రత్తగా టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాదికారి డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ వినయ్కుమార్, సిబ్బంది మాసూమన్న, సబీనా, రామకృష్ణ, విజయ్ బాస్కర్, రాజేంద్ర సింహా, భారతీషా, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఉమ్మడి నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి గురువారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. అనంతరం వారికి శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి, జిల్లా మాజీ గౌరవ అధ్యక్షుడు వెంకటరామయ్య శెట్టి, జిల్లా అధ్యక్షుడు మచ్చర్ల తిమ్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎన్ వేణుగోపాల్ ఉన్నారు. నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలి అలంపూర్: నర్సరీల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని, మొక్కలు జూన్ నాటికి కనీసం మీటర్ ఎత్తులో ఉండే విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. గురువారం అలంపూర్ మండలం ర్యాలంపాడులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో పశు కొట్టాల నిర్మాణం, నర్సరీ అభివృద్ధి పనులు పరిశీలించారు. పనుల నాణ్యతతోపాటు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం అలంపూర్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంద రోజులు పని దినాలు కల్పించాలి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కూలీలతో డిమాండ్లపై అడిషనల్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని, ప్రతి పనిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామాల వారీగా మైక్రో ప్లాన్లు సిద్ధం చేయాలని, ఈమేరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి. కేజీవీ ప్రన్సిపల్ కృష్ణవేణి. ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎన్.వెంకట్రాంను నాగర్కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. -
దేశంలోనే రోల్ మోడల్గా భూభారతి
నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల వద్దకే అధికారులు.. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మద్దూరు మండలం ఖాజీపూర్లో రెవెన్యూ సదస్సు ప్రారంభం -
బెట్టింగ్ నిర్వాహకుల ఆటకట్టు
విచారణ కొనసాగుతుంది నాలుగు రోజుల క్రితం శాంతినగర్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. బెట్టింగ్ వ్యవహారంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యక్తుల వివరాలపై ఆరా తీస్తున్నాం. ఇందులో ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో కూపీ లాగుతున్నాం. జిల్లాలో ఎవరైన బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. త్వరలో పూర్తి విషయాలను వెల్లడిస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీగద్వాల క్రైం: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్ కాస్తున్న ప్రధాన సూత్రధారిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నమ్మదగిన సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితం శాంతినగర్ పోలీసులు నిఘా ఉంచి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన శాంతినగర్ పోలీసులు వడ్డేపల్లికి చెందిన కుమ్మరి వీరేంద్రచారిని అదుపులోకి తీసుకున్న క్రమంలో బెట్టింగ్ ఎంతమంది నిర్వహిస్తున్నారనే కోణంలో కూపీలాగారు. అయితే అయిజకు చెందిన వడ్ల రాఘవచారి అనే వ్యక్తి బెట్టింగ్ వ్యవహారం మొత్తాన్ని ఓ యాప్ ద్వారా నిర్వహిస్తారని, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇదంతా నిర్వహిస్తారని తెలిసింది. ఈక్రమంలో మొత్తం ఆరుగురు బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. జిల్లాలో ఇటీవల ఇద్దరు యువకులు బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసి, తిరిగి చెల్లించే స్థోమత లేక బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో జిల్లా పోలీసుశాఖ బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రాధాన బూకీ కనుసన్నల్లోనే.. ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయంటే చాలు అయిజకు చెందిన బూకీ వడ్ల రాఘవచారి కనుసన్నల్లోనే బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుంది. 2017, 2018లో గద్వాల, అయిజ, శాంతినగర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదు కావడంతో ప్రాధాన సూత్రధారి విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలు పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయితే జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కోసం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు మరికొందరిని రంగంలోకి దింపినట్లు సమాచారం. అయిజ, గద్వాలకు చెందిన ప్రధాన బూకీలు హైదరాబాద్లోని మణికొండ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో ప్రధాన సూత్రధారి మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు -
ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు..
ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్ ఎస్ఈ జూరాల మరో తడి ఇవ్వండి.. అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత రైతులను ఆదుకోవాలి.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మణ్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
గద్వాలటౌన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులలో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రతి వారం పురోగతిపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వ సూచనల ప్రకారం నిర్వహించాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా చూడాలి వేసవిలో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాపై మండలాల వారీగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పట్టణ, గ్రామాల పరిధిలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకూడదన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నీటి కొరత ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటికి అవకాశం ఉన్న అన్ని మార్గాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల తాగునీటి సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పైపులైన్ లీకేజీలు, మోటర్ల మరమ్మతు చేపట్టాలన్నారు. స్ట్రాంగ్రూం వద్ద పటిష్ట భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంలను కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా కలెక్టర్ తనిఖీ చేపట్టి, భద్రత చర్యలను పరిశీలించారు. స్ట్రాంగ్రూం రికార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న జంటకు సమావేశ మందిరంలో ప్రోత్సహాక బహుమతిని అందజేశారు. పట్టణానికి చెందిన మౌనిక, రమేష్ కులాంతర వివాహం చేసుకోగా.. ప్రభుత్వం కల్పించిన పథకం ద్వారా రూ.2.50 లక్షల ప్రోత్సాహక బహుమతికి సంబంధించిన బాండ్ను కలెక్టర్ వారికి అందజేశారు. సమావేశాల్లో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, సంబంధిత అధికారులు నాగేంద్రం, రమేష్బాబు, శ్రీధర్రెడ్డి, పరమేశ్వరి, సరోజ, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి కలెక్టర్ బీఎం సంతోష్ -
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం. – జీఎన్.శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ఉన్నత విద్యా మండలి సూచనలతో.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం మండలందిలోని కొండేరు గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 17శాతం తేమ వచ్చేలా వడ్లను ఎండబెట్టాలని, తాలు, రాళ్లు, మట్టి పెల్లలు లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. -
నత్తనడకన నిర్మాణాలు
అయిజ: విధిగా పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు మున్సిపాలిటీలలో ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏర్పాటుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అయిజ, బాదేపల్లి, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, వనపర్తి మున్సిపాలిటీల్లో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించేందుకు రూ.18 కోట్లు వెచ్చించారు. ఈ ఖర్చులో సగభాగం ప్రభుత్వం, మిగిలిన సగభాగం పీవీవీ ఎన్ఫ్రాం కంపెనీ వారు ఖర్చు చేయాలనే ఒప్పందం ఉంది. యూనిట్ ఇంచార్జ్లదే బాధ్యత యూనిట్ నిర్మాణం పూర్తయిన అనంతరం 10 ఏళ్లపాటు యూనిట్ నిర్వహణ బాధ్యతలు యూనిట్ ఇంచార్జ్లు తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో సెప్టిక్ ట్యాంక్ యజమానితో మున్సిపాలిటీ అధికారులు ఒప్పందం చేసుకొని సెప్టిక్ ట్యాంక్లనుంచి మానవ విసర్జితాలను ప్లాంట్కు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటారు. అనంతరం ప్లాంట్లో సాంకేతిక పద్ధతిలో మలంను ఎరువుగా మార్చుతారు. ఎఫ్ఎస్టీపీలో తయారైన ఎరువును యూనిట్ నిర్వాహకులు కిలోల చొప్పున లెక్క కట్టి విక్రయిస్తారు. అది వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడుతుంది. శుద్ధిచేసిన నీటిని మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే హరతహారం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. రెండు మున్సిపాలిటీల్లో వినియోగం గద్వాల, అయిజ మున్సిపాలిటీలలో ఎస్ఎఫ్టీపీ ప్లాంట్లు వినియోగంలోకి వచ్చాయి. అయిజ మున్సిపాలిటీలో నిర్మించిన ఎస్ఎఫ్టీపీ ప్లాంట్ 2022 నుంచి ఉపయోగంలోకి తెచ్చారు. గద్వాల మున్సిపాలిటీలో 2023 ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి ఉపయోగంలోకి వచ్చింది. అయితే రెండు మున్సిపాలిటీల్లో కూడా ఇంతవరకు అధికారికంగా ప్లాంట్లను ప్రారంభించలేదు. వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీలో రూ. 55 లక్షల నిధులతో 2022లో ఎఫ్ఎస్టీపీ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కా లేదు. అలంపూర్లో గతంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ ( సివరేజ్ ట్రీటమెంట్ ప్లాంట్) ఉన్నందుకు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ నిర్మాంణం మంజూరును రెండు సంవత్సరాలు హోల్డ్లో పెట్టారు. ఎట్టకేలకు గతేడాది నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతులు లభించాయి. ఉమ్మడి జిల్లాలోనే అయిజ ప్రఽథమం ఉమ్మడి మహబూబ్నగర్లో చేపట్టిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం ముందుగా అయిజ మున్సిపాలిటీలో పూర్తయ్యింది. నివాస గృహాల సెప్టిక్ ట్యాంక్ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేసేందుకు అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం గ్రామం సమీపంలో సుమారు రూ.1.5 కోట్లతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను గతేడాది పూర్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలోని సుమారు 7వేల నివాస కుటుంబాల నుంచి సెప్టిక్ ట్యాంకుల్లోని మానవ విసర్జితాలను తరలించేందుకు ప్లాంట్ నిర్మించారు. విసర్జితాలను శుద్ధీకరుణ యూనిట్ ప్లాంట్లో అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టర్తో మెథనైజేషన్ పద్దతిలో శుద్ధిచేసి విసర్జితం, నీటిని వేరుచేస్తారు. నీటిని పాలిసింగ్ ఫండ్లో పాస్పరేట్, సల్ఫర్ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్ వాటర్గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈప్రక్రియ మెత్తం ఆధునిక సాంకేతిక పద్ధతిలో జరుగుతుంది. ఒకసారికి 10 కేఎల్డీ (10వేల లీటర్ల సామర్ధ్యం) గల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ప్లాంట్ను ప్రారంభించకపోయినా సరే నిర్వహణ మాత్రం సజావుగా సాగుతోంది. అయిజలో నిర్మించిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లపై వీడని నిర్లక్ష్యం వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో కానరాని పురోగతి గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న నిర్వహణ పారిశుద్ధ్యం మెరుగు.. అయిజ మున్సిపాలిటీలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధి చేసేందుకు నిర్మించిన ఎఫ్ఎస్టీ ప్లాంట్ సద్వినియోగం అవుతోంది. ఈ ప్లాంట్లో ద్వారా విసర్జితాలు శుద్ధిచేసి ఎరువుగా మార్చి మొక్కలకు ఉపయోగించడం మంచి విషయం. – రాజశేఖర్, ఏఈ, అయిజ మున్సిపాలిటీ రెండేళ్లుగా కొనసాగుతోంది అయిజ మున్సిపాలిటీలో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ రెండేళ్ల క్రితం నుంచే వినియోగంలోకి వచ్చింది. గద్వాలలో కూడా వినియోగంలో ఉంది. అలంపూర్లో, వడ్డెపల్లిలో ఇంకా పనులు పూర్తి కాలేదు. పనులు వేగవంతం చేసేందుకు కృషిచేస్తాం. – నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్ -
ఫలించిన రైతుల ఆందోళన
జూరాల ఎడమ కాల్వకు నీటి విడుదల అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు తమకు నీరు అందడం లేదని, పంటలు వాడుముఖం పడుతున్నాయంటూ ప్రాజెక్టు రహదారిపై రెండు పర్యాయాలు చేసిన ఆందోళనకు ఫలితం దక్కింది. రైతుల ఆవేదనను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఎట్టకేలకు చివరి తడిగా రెండురోజుల పాటు నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జూరాల ఎడమ కాల్వకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అత్యధికంగా వరి సాగు చేయడంతో ఇరు మండలాల ప్రజలు సాగునీరు కావాలంటూ వారం రోజుల్లో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టారు. మరోతడి అవసరమే.. ఆత్మకూర్ మండలంలోని తూంపల్లి, కత్తేపల్లి, ఆరేపల్లి, మెట్లంపల్లి, జూరాల గ్రామాలతో పాటు ఇతర గ్రామాల ఆయకట్టు రైతులు ఆలస్యంగా వరి సాగుచేయడంతో సమస్య జఠిలంగా మారింది. అధికారుల అంచనా ప్రకారం మార్చి చివరి వారంలోనే పంట చేతికందాల్సి ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో 15 రోజుల తర్వాతే పూర్తిస్థాయిలో వరిపంట చేతికందే పరిస్థితి ఉంది. చివరి తడిగా బుధవారం నుంచి రెండురోజుల పాటు నీటిని వదులుతుండగా.. వచ్చేవారం రెండ్రోజుల పాటు నీటిని అందిస్తే పంటలు చేతికందుతాయంటున్నారు. జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ఇదే చివరితడిగా వదులుతున్నామని, పొదుపుగా వాడుకోవాలని సూచిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎత్తిపోతల రైతులు గట్టెక్కినట్లే.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు చివరిసారిగా అందిస్తున్న నీటితో తమ పంటలు చేతికందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. సాగునీరు వదిలిన వెంటనే ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల, మస్తీపురం, సింగంపేట, ఖానాపురం, అమరచింత, పాంరెడ్డిపల్లిలో రైతులు వెయ్యి ఎకరాల వరి సాగుచేశారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు ప్రస్తుతం అందిస్తున్న సాగునీరు ఊపిరి పోసేలా ఉందని, పంట చేతికందుతుందనే ఆశలో ఉన్నారు. చివరి తడిగా ప్రకటించిన అధికారులు మరో తడి ఇవ్వాలంటున్న రైతన్నలు రెండ్రోజుల పాటు సరఫరా.. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు జూరాల ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సాగునీరు రెండురోజుల పాటు వదులుతున్నాం. రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించాం. – శ్రీనివాస్రెడ్డి ఎస్ఈ, జూరాల జలాశయం -
ముచ్చటగా మూడుసార్లు ప్రారంభం
ఒక్క కొనుగోలు కేంద్రాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా మూడు సార్లు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొండేరులో వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే విజయుడు ప్రారంబించారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 15న మంగళవారం బీఆర్ఎస్ నాయకులు మొదటి సారి ప్రారంభించారు. బుధవారం ఉదయం అలంపూర్ మార్కెట్యార్డు చైర్మెన్ దొడ్డెప్ప రెండవసారి ప్రారంభించారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే స్థానిక ఎమ్మెల్యే విజయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించడం గమనార్హం. దీనిపై ఏపిఎం కుర్మయ్యను వివరణ కోరగా.. మొదటిసారి బీఆర్ఎస్ నాయకులు తమకు సమాచారం లేకుండానే ప్రారంభించారని, రెండవసారి ప్రారంభానికి వచ్చిన అలంపూర్ మార్కెట్యార్డు చైర్మన్ దొడ్డెప్పకు ఎమ్మెల్యే వస్తున్నారన్న విషయాన్ని చెప్పామన్నారు. గంట వ్యవధిలోనే మూడోసారి ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభించారని తెలిపారు. -
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
అమరచింత: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు రహదారిపై సాగునీరు ఇవ్వాలంటూ మండుటెండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని రామన్పాడు వరకే అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత, ఆత్మకూరు మండలాల రైతులు వరిపంట సాగుచేశారు. వారబందితో సాగునీటిని అందించిన అధికారులు పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, తూంపల్లి, గుంటిపల్లి, జూరాల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకొని ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడే ఉన్న బారికేడ్లు, ముళ్లపొదలు అడ్డంగా పెట్టడంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఎస్ఐ, వనపర్తి జిల్లా అమరచింత ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు సాగునీరు అందించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతుల రాస్తారోకో విషయాన్ని సీఐ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వచ్చి ఉన్నతాధికారులతో చర్చించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మండుటెండలో జూరాల ప్రాజెక్టుపై బైఠాయింపు గంటన్నర వరకు కదలని రైతులు నిలిచిన వాహన రాకపోకలు -
కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య..
మాకు కేటాయించిన బస్సును మార్చి 20 నుంచి కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలతో ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి అప్పగించింది. ఆర్టీసీ వారు నెలకు రూ.77,220 అద్దె చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య జిల్లాలోనే ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎంపికై ంది. – అరుణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పెద్దకొత్తపల్లి జిల్లాకు ఏడు బస్సులు.. నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు గాను ఏడింటికి మొదటి విడతలో ఏడు బస్సులు మంజూరయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా పెద్దకొత్తపల్లికి చెందిన సమాఖ్య బస్సు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాగా మహిళా సంఘాల అకౌంట్లో జమ అయ్యాయి. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ, నాగర్కర్నూల్ ● -
పాలమూరు పనుల్లో కదలిక
వివరాలు 8లో u● నార్లాపూర్– ఏదుల ప్రధాన కాల్వ పెండింగ్ పనులకు రూ.780.63 కోట్లు మంజూరు ● డిసెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేసేలా కార్యచరణ ● విడతల వారీగా పనులను పూర్తిచేయనున్న ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు నిధులు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాల్వకు 1.725 కి.మీ. పాయింట్ నుంచి 2.125 పాయింట్ కాల్వ తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 6.325 కి.మీ. పాయింట్ నుంచి 6.650 కి.మీ. పాయింట్ నడుమ కాల్వ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్యాకేజీ 3 పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.780.63 కోట్లు కేటాయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్య పెండింగ్లో ఉన్న అప్రోచ్ కెనాల్, ఓపెన్ కెనాల్ నిర్మాణంతో పాటు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కుడికిళ్ల సమీపంలో ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అక్కడ హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలకు ఇబ్బందిగా ఉందని చెబుతుండగా, తాజాగా ప్రభుత్వం అంచనాలను సవరించి నిధులను విడుదల చేసింది. గతంలో ఈ ప్యాకేజీ కింద పనులకు రూ.416.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఈ పనుల విలువను రూ.780.63 కోట్లకు చేరింది. -
నల్లమల ప్రాణ వాయువుతో సమానం
మన్ననూర్: నల్లమల ప్రాంతం నాకు ప్రాణ వాయువుతో సమానం అని, ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు నాకు ఎంతగానో ప్రేరణ కలిగిస్తాయని వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు, కాళోజీ పురస్కారం గ్రహీత జయరాజ్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పదరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నల్లమల ప్రాంతం అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబాటుకు గురైందని, అయినప్పటికీ ఇక్కడి ప్రజల్లో రాష్ట్రం నలుమూల గుర్తుండిపోయేంత మంచితనం ఉందని, అందుకే నాకు ఈ ప్రాంతం అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా ఎంతో ఇష్టం అన్నారు. దళిత బహుజనులు అంబేడ్కర్ మార్గంలో పయనిస్తూ.. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసేసి తిరిగి రాచరికాన్ని తీసుకువచ్చే కుట్ర జరుగుతుందన్నారు. అంబేడ్కర్ వారసులమైన మనం అగ్రకుల భావాజాలాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో చదువుకు ఉన్న విలువ మరొక దానికి లేదని గమనించి తమ పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ గడుదాస్ వెంకటేశ్వర్లు, కళాకారుడు జక్కా గోపాల్, నాయకులు సత్యనారాయణ, రామలింగం, చిన్న చంద్రయ్య, వెంకటయ్య, ప్రవీణ్కుమార్, రాయుడు, బాలింగం, బాలాకుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో ఆర్థికశాస్త్రం కీలకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికశాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలోఎకానామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ ఎకానామిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎకానామిక్స్ పూర్తిస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు వ్యాపార, వాణిజ్య విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీ రాఘవేందర్రావు, జిమ్మికార్టన్, శివలింగం, రాజునాయక్ తదితరుల పాల్గొన్నారు. -
జిల్లా నూతన జడ్జిల నియామకం
గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లా జడ్జిగా ఎన్.ప్రేమలత, అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా ఎస్.రవికుమార్ను నియమిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇక్కడ జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న కె.కుషాను హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ చేశారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రేమలతను గద్వాల జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అయిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.రవికుమార్ను గద్వాల అదనపు సెషన్ కోర్టు జడ్జిగా రానున్నారు. వీరు త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. . నష్టపోయిన మామిడి రైతుల వివరాలు పంపండి నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో వర్షాలు, ఈదురు గాలుల వల్ల నష్టపోయిన మామిడి రైతుల వివరాలను నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు ఎంపీ మల్లురవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి రైతులు కూడా తమకు జరిగిన నష్టం వివరాలను కలెక్టర్తోపాటు ఆయా మండలాల్లో తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 1,070 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు మంగళవారం 1,070 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.6,089, కనిష్టంగా రూ.3,019, సరాసరిగా రూ.4,926 చొప్పున ధరలు వచ్చాయి. అలాగే 25 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,409, కనిష్టంగా రూ.2,219, సరాసరిగా రూ.6,406, 284 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,001, కనిష్టంగా రూ.3,561, సరాసరిగా రూ.5,909, 2,245 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,069, కనిష్టంగా రూ.1,739, సరాసరిగా రూ.1,889 చొప్పున ధరలు లభించాయి. సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు రిజిస్ట్రార్ రమేష్బాబుకు మంగళవారం సమ్మె నోటీస్ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులు ఏళ్లుగా యూనివర్సిటీలో పని చేస్తున్నారని, అలాంటి వారిని రెగ్యులరైజ్ చేయాలని, బడ్జెట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల గొంతు నొక్కవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీధర్రెడ్డి, భూమయ్య, రవికుమర్, విజయ్భాస్కర్, ప్రభాకర్రెడ్డి, సోమేశ్వర్, సుదర్శన్రెడ్డి, రవికుమార్, మృదుల తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కృషి
కేటీదొడ్డి/ ధరూరు: పేద ప్రజల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులతో సమానంగా సన్న బియ్యం అందిస్తోందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి మండలంలోని మల్లాపురం గ్రామంలో లబ్ధిదారుడు సురేష్నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడితో సన్నబియ్యం ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందిస్తామన్నారు. ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. సన్న బియ్యాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంటికి కలెక్టర్ను ఆహ్వానించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, తహసీల్దార్ హరికృష్ణ, నాయకులు రాజశేఖర్, రామకృష్ణనాయుడు, విజయ్, రమేష్నాయుడు, టీచర్ గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం పరిశీలన ధరూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణ పనులను కలెక్టర్ బీఎం సంతో్ష్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందించడంతోపాటు ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కుల, ఆదాయ, ఏబీసీ, రెసిడెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భూపాల్రెడ్డి, డీటీ మంగమ్మ, ఆర్ఐ తేజ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల చేతికి ప్రగతి చక్రాలు
అచ్చంపేట: మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో మొత్తం ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేట 5, కల్వకుర్తి 4, నాగర్కర్నూల్ 2, కొల్లాపూర్ 2, గద్వాల 4, వనపర్తి 7, మహబూబ్నగర్ 5, నారాయణపేట 2, కోస్గి 1, షాద్నగర్ 17 చొప్పున 49 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసరమయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ– సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. రద్దీ నేపథ్యంలో 64 కొత్త బస్సుల కోసం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ల కిందటివి కావడంతో తరుచుగా మరమ్మతుకు గురవుతున్నాయి. పండుగలు, జాతర్లు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్భవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బస్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేటకు (2 ఎక్స్ప్రెస్లు), కల్వకుర్తికి (2 ఎక్స్ప్రెస్లు) నాగర్కర్నూల్కు (3 పల్లె వెలుగులు), గద్వాలకు (7 ఎక్స్ప్రెస్లు, 12 పల్లె వెలుగులు, 2 డీలక్స్లు), వనపర్తికి (4 ఎక్స్ప్రెస్లు, 4 పల్లె వెలుగులు), మహబూబ్నగర్కు (11 ఎక్స్ప్రెస్లు, 6 పల్లె వెలుగులు), నారాయణపేటకు (1 ఎక్స్ప్రెస్, 1 పల్లెవెలుగు), షాద్నగర్కు (6 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు) చొప్పున మొత్తం 64 బస్సుల కోసం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి. అద్దె ప్రాతిపదికన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకై నా సమస్య తీరనుంది. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.77,220 అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్య సొంతం కానుంది. మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 49 బస్సుల కోసం ప్రతిపాదనలు ప్రతినెలా ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లింపు మహిళలూ ఆర్థిక పరిపుష్టి సాధించే సదావకాశం ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చేయూత -
నెరవేరిన ఉపాధి లక్ష్యం
శాశ్వత పనులకు అధిక ప్రాధాన్యం జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2025–26)లో చేపట్టాల్సిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది చేత ప్రత్యేకంగా గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గడిచిన అక్టోబర్, నవంబర్ నెలలో పనుల గుర్తింపు చేపట్టారు. ఆయా గ్రామాల్లో రైతులు, కూలీలు, ప్రజలతో కలిసి పనులను గుర్తించారు. పనులను గుర్తించిన అనంతరం గ్రామాల వారీగా ప్రణాళికను తయారు చేశారు. శాశ్వత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పంటపొలాల్లో చిన్న కుంటలు, వ్యవసాయ పొలాలకు బాటలు, పంట కాల్వల పూడికతీతల పనులతో పాటు, నీటి సంరక్షణ (పాంపాండ్స్, బావుల పూడికతీత, వాలుకట్టలు) ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్లు, నాడేక్ కంపోస్ట్ పిట్లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, గొర్రెల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని చేయాల్సిన పనులు, కూలీల డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నారు. వ్యవసాయ సీజన్ ఉన్నప్పుడు, లేనప్పుడు ఆయా పంచాయతీల పరిధుల్లో ఏరకమైన పనులు చేపట్టవచ్చో ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని పనులను గుర్తించారు. పనులను గుర్తించిన అధికారులు అందుకు అవసరమయ్యే పనిదినాల సంఖ్య, బడ్జెట్ను (కూలీల వేతనాలు, మెటిరియల్కు అయ్యే ఖర్చు) పంచాయతీల వారీగా అంచనా వేసి రికార్డుల్లో నమోదు చేశారు. ఈవివరాలను మండలాల వారీగా క్రోడీకరించి డీఆర్డీఏ కార్యాలయానికి కొద్దిరోజుల క్రితం నివేదించారు. అక్కడి అధికారులు మరోసారి మండలాల వారీగా గుర్తించిన పనులను, పనిదినాల వివరాలను పరిశీలించనున్నారు. ఇక్కడ పరిశీలించిన అనంతరం కలెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. మరో పదిరోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాల లక్ష్యం.. బడ్జెట్ కేటాయింపులు నిర్ధేశితమవుతాయని అధికారులు తెలిపారు. గద్వాల న్యూటౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో పనిదినాల లక్ష్యం పూర్తి అయ్యింది. అంతేగాక, ఈ ఏడాది (2025–26) చేపట్టే వాటిలో వ్యవసాయ ఆధారిత పనులకు ఎక్కువ ప్రాధాన్యతను కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి సిబ్బంది పనులను గుర్తించారు. ప్రత్యేక దృష్టితో పనిదినాలు పూర్తి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేందుకు గాను 23,22,812 పనిదినాల సంఖ్య లక్ష్యంగా నిర్ధేశించారు. లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించడంతో పనిదినాల లక్ష్యం నేరవేరింది. ఇందుకోసం గడిచిన ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం లక్ష్యాన్ని ఆయా మండలాలకు నెల వారీగా లక్ష్యాన్ని విభజించారు. దీంతోపాటు ప్రతి నెల ఆయా మండలాల్లో జరిగే పనులు, హాజరవుతున్న కూలీలు, పనిదినాల సంఖ్యపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎక్కడైతే పనులు జరగలేదో అక్కడ ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో లక్ష్యం నెరవేరింది. ప్రతి కూలీకి పని కల్పించాం 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హమీ కింద చేపట్టాల్సిన పనిదినాల లక్ష్యం నెరవేరింది. నడిగడ్డలో వలసలు పూర్తిగా నివారించి, ప్రతి కూలీకి ఉపాధిహామీ పథకం కింద పని కల్పిస్తాం. ఈ ఏడాదిలో (2025–26) వ్యవసాయ ఆధారిత పనులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నాం. పనులను సైతం గుర్తించాం. 2025–26లో పనిదినాల లక్ష్యం నెరవేరేలా ఆరంభం నుంచి చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావ్, డీఆర్డీఓ 2024 –25లో 23.22 లక్షల పనిదినాలు పూర్తి కూలీలకు వంద శాతం పని కల్పించిన వైనం 2025–26 లో వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యం ఇప్పటికే పనులను గుర్తించిన ఉపాధి సిబ్బంది -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన జాతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాడు మహనీయుడు అంబేద్కర్కు కనీస అవసరాలు లేకున్నా ఉన్నత చదువులు చదివి భావి భారత తరాలకు ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ఆయన కృషితోనే మనం రిజర్వేషన్లు, ఉద్యోగాలు అనుభవిస్తున్నామన్నారు. మహనీయుల ఆశయాలు విద్య ద్వారానే సాకారం చేయవచ్చన్నారు. వారి ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ముఖ్యంగా యువత, విద్యార్థులపై ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఏఓ నరేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి సరోజ తదితరులు పాల్గొన్నారు. ● ఎర్రవల్లి: భారత రాజ్యాంగ వ్యవస్థకు రూపకల్పన చేయడంతోపాటు విలువలకు, చట్టబద్దమైన పాలనకోసం ఎంతో కష్టపడి బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని పదో బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంటరానితనంపై అనేక ఉద్యమాలు చేయడంతో పాటు వ్యవస్థలో ఉన్న రుగ్మతకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో మార్పులను తీసుసుకువచ్చిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, ఆర్ఐలు రాజు, రాజారావు, పటాలం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● గద్వాల క్రైం: రాజ్యాంగ నిర్మాతగా, న్యాయవాదిగా, వెనకబడిన కులాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాలులర్పించారు. నిరక్షరాస్యత, అంటారానితనం, పేదరికం రూపుమాపడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అదే విధంగా గద్వాల రవాణాశాఖ, అగ్నిమాపక, ఎకై ్సజ్, వైద్యశాఖ ఆర్టీసీ తదితర ప్రభుత్వ కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. -
‘భూ భారతి’కి మద్దూరు ఎంపిక
నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. రెవెన్యూ గ్రామాలు 17.. భూమి 30,621 ఎకరాలు మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్దిన్నె దమ్గన్పూర్ దొరెపల్లి, జాదరావ్పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
జిల్లాలో ఉపాధి హామీ పనుల వివరాలిలా..
మండలం పూర్తి అయిన పనిదినాలు ధరూర్ 2,94,933 కేటీదొడ్డి 2,43,474 మల్దకల్ 2,41,972 ఇటిక్యాల 2,36,536 గట్టు 2,34,871 అయిజ 2,24,439 గద్వాల 1,95,942 ఉండవల్లి 1,58,893 మానవపాడు 1,56,806 అలంపూర్ 1,33,352 రాజోళి 1,26,295 వడ్డేపల్లి 75,299 -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని సోమవారం పలువురు ప్రముఖలు దర్శించుకున్నారు. అడిషనల్ డీజీపీ అభిలాష బిష్త్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే, ఎంల్సీ సురభివాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులతో కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధప్రసాదాలు అందించగా.. అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. క్రికెట్ బెట్టింగ్.. పోలీసుల అదుపులో వ్యక్తి శాంతినగర్: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడని వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నాడనే సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు గత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో వున్న వ్యక్తిని విచారణ నిమిత్తం తీసుకువెళ్లినట్లు తెలిసింది. 24 గంటలపాటు విచారణ చేసినప్పటికీ సమాచారం గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయమై శాంతినగర్ పోలీసులను వివరణ కోరగా.. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం వాస్తవమని, విచారణ పూర్తి అయిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సమగ్ర విచారణ జరిగేనా? ● వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటంతో కలకలం కల్వకుర్తి రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. వినియోగదారులు సైతం దొడ్డు బియ్యం తినలేమనే ఉద్దేశంతో వచ్చిన ధరకు మధ్యవర్తులకు విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వినియోగదారుని వద్దకు వెళ్లిన బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరుకోవడం అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి వెళ్లి మళ్లీ రేషన్ షాపుల ద్వారా వినియోదారులకు రావడం ఒక రీసైక్లింగ్ వ్యవహారంగా కొనసాగింది. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్ప్రయోజనంగా మారిపోయాయి. తలా పాపం తిలా పిడికేడు అన్న చందంగా రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి అధికారులు తదితరవి రేషన్ బియ్యం చుట్టూ తిరగడంతో అక్రమ రవాణాకు అడ్డు, అదుపు లేకుండా చేశాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్న బియ్యం సైతం పక్కదారి పట్టి అధికారులకు పట్టుబడిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి మండలంలోని మార్చాల రైస్ మిల్లులో ఏకంగా వెయ్యికిపైగా క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటం కలకలం రేపింది. మిల్లులో 90 శాతం.. అధికారులు దాడి చేసిన రైస్ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎంఆర్ ధాన్యం ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు. అయితే సీఎంఆర్ కేటాయించని మిల్లులో రేషన్ బియ్యం ఎలా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం ఈ మిల్లుకు ఎలా వచ్చాయనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది. సదరు మిల్లులో ఏకంగా 90 శాతం రేషన్ బియ్యం ఉండటం గమనార్హం. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మరికొన్ని మిల్లుల భాగోతం బయటకు వస్తుందని పలువురు చెబుతున్నారు. కొన్ని బ్రాండ్ల కవర్లను తొడిగి రేషన్ బియ్యం కల్వకుర్తిలోని కొందరికి అమ్మేందుకు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఆదివారం సైతం దాడులు నిర్వహించడం పక్కా సమాచారంతోనే అంటున్నారు. అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకున్న కొన్ని మిల్లుల యజమానులు తమ వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించారని తెలుస్తుంది. రేషన్ బియ్యం వ్యవహారంపై మరిన్ని నిజాలు తెలిసే విధంగా అధికారులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
అలంపూర్: అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమని అలంపూర్ ఫైర్స్టేషన్ ఇన్చార్జ్ కురుమూర్తి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఫైర్ స్టేషన్లో అగ్ని మాపక వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధ్వర్యంలో ఫైర్ సిబ్బంది 1944లో విక్టోరియాలో జరిగిన నౌకా ప్రమాదంలో మృతి చెందిన ఫైర్స్టేషన్ సిబ్బందికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. వారోత్సవాల్లో భాగంగా తొలి రోజు అగ్ని ప్రమాదాల నివారణలో వినియోగించే సామగ్రితో స్టాల్స్ నిర్వహించారు. స్టాల్స్ సందర్శనకు విచ్చేసిన ప్రజలకు వాటి వినియోగం గురించి వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రవిప్రకాష్, రవీందర్, నవీన్ గౌడు, అమరనాథ్, వినీత్ కుమార్ రెడ్డి, సాయికుమార్, జగదీశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాలటౌన్: ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై సమరం సాగించాల్సి ఉంటుందని ఎస్జీటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ఎస్జీటీ యూనియన్ ఛలో ఇందిరాపార్కు చేపట్టింది. అందులో భాగంగా ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎస్జీటీ యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరాపార్కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న అయిదు డీఏలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలన్నారు. పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేయాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. వీటితో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్జీటీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్కొండ, మహబూబ్నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. బస్తాకు 3 కిలోల వరకు తక్కువగా వస్తున్నాయి.. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు పలువురు అక్కడే రేషన్ బియ్యం తీసుకునేవాళ్లు. అక్కడ ఎమ్మెల్సీ కోడ్ కారణంగా సన్న బియ్యం అమలు కాలేదట. దీంతో వారు ఈ నెల ఇక్కడకు వచ్చి తీసుకెళ్తున్నారు. మరోవైపు సివిల్ సప్లయ్ గోదాంల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న 50 కేజీల బస్తాల్లో ఒక్కో దాంట్లో ఒక్క కేజీ నుంచి మూడు కేజీల వరకు బియ్యం తక్కువగా వచ్చాయి. దీంతో కొంత ఇబ్బందిగా ఉంది. అధికారులు ఈ సమస్య రాకుండా చూడాలి. – బాలస్వామి, రేషన్ డీలర్, ఖానాపూర్, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల నాణ్యతపై రాజీ పడొద్దు.. మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – కాసింబీ, గోప్లాపూర్, దేవరకద్ర, మహబూబ్నగర్ 3 రోజుల్లోనే అయిపోయాయి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షాపుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం సరఫరా జరిగిపోయింది. కోటా అయిపోయిన కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం. – సంజీవరెడ్డి, డీలర్, రేషన్షాప్ నంబర్–3, మద్దూరు, నారాయణపేటఅవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ ల.ప.అ మహబూబ్నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్షాపులు,రే.కా: రేషన్కార్డులు, రే.షా.ప.అ: రేషన్షాపులకు పంపిణీ అయింది, ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
రాజ్యాంగ నిర్మాతను అవమానించిన కాంగ్రెస్
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సముచిత గౌరవం ఇవ్వకపోగా.. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు త్రీవంగా అవమానించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ ఆరోపించారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక గంజిపేట కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1952 లోక్సభ ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించేందుకు ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి నారాయణరావ్ కథరోల్కర్ను పోటీకి నిలిపాయని, నెహ్రూ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేద్కర్ ఓటమికి కారకులయ్యారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ హయాంలో అంబేద్కర్ స్మృతివనం, పంచతీర్థ పేరుతో ఆయన పుట్టిన, నివసించిన, దహన సంస్కారాలు నిర్వహించిన స్థలాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని 75 సార్లు సవరించిందన్నారు. బీజేపీ మాత్రమే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. అంబేద్కర్ చూపిన బాటలోనే ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పారు. అంబేడ్కర్ లాంటి మహనీయులను స్మరించుకోవాలని, వారు కలలుకన్న నవభారతాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రవికుమార్ఏక్బోటే, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, దేవాదాస్, శివారెడ్డి, స్వప్న, చిత్తారి కిరణ్, తిమ్మన్న, శంకర్, నర్సింహా, శ్యామ్రావు, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతుచిక్కట్లేదు..!
జిల్లాలో వరుస బలవన్మరణాలు వీడని మిస్టరీ.. పై నాలుగు కేసుల్లోనూ కుటుంబసభ్యులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి కేసు విషయానికి వస్తే.. మల్దకల్కు చెందిన యువకుడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న గద్వాలకు చెందిన ట్రాన్స్జెండర్, మరికొంత మంది అతని ఇంట్లోకి వెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతూ.. ట్రాన్స్జెండర్తోపాటు వెళ్లిన వ్యక్తులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. రెండో ట్రాన్స్జెండర్ కేసు విషయానికి వస్తే.. గద్వాలకు చెందిన యువకుడు, ట్రాన్స్జెండర్ రహస్యంగా ప్రేమించుకుంటుండగా.. ట్రాన్స్జెండర్ సోదరుడు, మరొకరు యువకుడి ఇంటి వద్దకు వచ్చి బైక్పై అతడిని ఎక్కించుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. గంటల వ్యవధిలోనే యువకుడు అతని తండ్రి సమాధి వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం తరలించినా లాభం లేకుండా పోయింది. పోలీసులు ట్రాన్స్జెండర్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పడం గమనార్హం. మృతుడి ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయని పోలీసులు విచారించగా.. అవి ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపినట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరో రెండు మృతి కేసుల్లోనూ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయగా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. గద్వాల క్రైం: నడిగడ్డలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అనుమానాస్పద మృతి కేసులు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. నిజంగా వారిది ఆత్మహత్యనా.. లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది అంతుచిక్కట్లేదు. అనుమానం.. అవమాన భారం.. వ్యక్తిగత సమస్యలు.. వివాహేతర సంబంధాల కారణంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ క్షణికావేశంలో తనువు చాలిస్తున్న వారే అధికం. దీనికితోడు మల్దకల్ మండలంలో ఓ యువకుడు ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందడం.. అంతకుముందు జిల్లా కేంద్రంలో మరో యువకుడు సైతం ట్రాన్స్జెండర్తో స్నేహంగా ఉన్న క్రమంలోనే అనుమానాస్పదంగా మృతిచెందడం జిల్లాలో కలకలం రేపింది. ఈ మరణాలపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. మృతికి గల కారణాలు, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా ఎదురుచూస్తున్నారు. ●● 2025 మార్చి 27న...హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు చెందిన యువతీ యువకుడు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని జీవనోపాధి నిమిత్తం గద్వాలకు వచ్చారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే దంపతుల మధ్య డబ్బు విషయమై తరచూ విభేదాలు వచ్చేవి. ఈక్రమంలో మార్చి 27న భర్త పని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాకు వెళ్లగా.. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య (35) ఫ్యాన్కు ఉరేసుకుని అత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీన మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు.. ● 2025 ఏప్రిల్ 11న.. మల్దకల్ మండలానికి చెందిన ఓ యువకుడు (35) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే సదరు యువకుడు గతకొంత కాలంగా గద్వాలకు చెందిన ఓ ట్రాన్స్జెండర్తో చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల నేపథ్యంలో యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనపై మల్దకల్ పోలీసు స్టేషన్లో అనుమానాస్పద కేసు నమోదైంది. త్వరలో కేసులు ఛేదిస్తాం ఎంతటి విపత్కర కేసులైన పోలీసుశాఖ పూర్తి ఆధారాలతో నిందితులను గుర్తిస్తాం. సాంకేతిక పరమైన అంశాలే కీలకంగా ఉంటాయి. ఏ చిన్న తప్పిదం జరిగినా పోలీసుశాఖపై విమర్శలు ఉంటాయి. బలవన్మరణాలు లేక హత్య చేయబడ్డారనే విషయాలపై ప్రత్యేక బృందంచే విచారణ జరిపిస్తున్నాం. కేసుల మిస్టరీలను త్వరలో ఛేదిస్తాం. అన్ని నివేదికలు, సాక్షుల వాంగ్మూలం మేరకు దోషులకు చట్టపరమైన చర్యలు ఉంటాయి. – శ్రీనివాసరావు, ఎస్పీ● 2024 డిసెంబర్ 11న.. మల్దకల్ మండలానికి చెందిన యువతీ యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్త గద్వాలలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుండగా, భార్య హైద్రాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేది. కొన్నాళ్లకు భార్య.. గద్వాలలో భర్త ఉంటున్న ఇంటికి వచ్చింది. రెండు రోజులు ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే డిసెంబర్ 11న ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా భార్య ఫ్యాన్కు ఉరేసుకొని మృతిచెందింది. ఈ సంఘటనపై యువతి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ● 2025 ఫిబ్రవరి 4న.. గద్వాలకు చెందిన ఓ యువకుడు (25) అదే కాలనీకి చెందిన ఓ ట్రాన్స్జెండర్తో కొంతకాలంగా స్నేహంగా ఉన్నాడు. ఈక్రమంలోనే స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అంతలోనే.. ఫిబ్రవరి 4న సదరు యువకుడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మూడురోజుల అనంతరం మృతి చెందాడు. అయితే యువకుడి శరీరంపై కాలిన గాయాలు ఉండడంతో తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హత్యనా.. ఆత్మహత్యనా తేలని మిస్టరీ ట్రాన్స్జెండర్లతో చనువు.. ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి కేసుల్లో పోలీసులు పురోగతి సాధించేనా ? -
అంజన్న జయంతి.. భక్తజన సందడి
గద్వాలటౌన్: శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుడి జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో చేపట్టిన వీర హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు ధరూర్, బీచుపల్లి, చింతరేవుల, మల్దకల్, అయిజ, అలంపూర్, శాంతినగర్, బిజ్వారం తదితర ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజులు నిర్వహించారు. మండల కేంద్రాలలో భారీ ఊరేగింపులు నిర్వహించారు. జయంతి సందర్భంగా దీక్షా పరులు అర్థరాత్రి నుంచే హనుమాన్ భజనలు, పాటలుతో హోరెత్తించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్మోగిన నామస్మరణం జిల్లా కేంద్రంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్దళ్, విశ్వహిందు పరిషత్, దర్మ ప్రసార సమితి నాయకులతో పాటు వివేకానంద సేవాదళ్, హనుమాన్ దీక్షపరులతో గద్వాల పట్టణం కాషాయరంగును సంతరించుకుంది. ‘రామలక్ష్మణ జానకి.. జై భోలో హనుమాన్కీ’ అని కీర్తిస్తూ, పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ నాయకులు అయ్యప్పురెడ్డి, డీకే స్నిగ్దారెడ్డి తదితరులు హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. డీఎస్పీ మొగలయ్య హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. శోభాయమానంగా హనుమాన్ శోభయాత్ర -
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ జాగ్రత్తలు పాటిస్తున్నాం జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్లు, కూలింగ్ గ్లాస్లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. – భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్నగర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి.. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే ఘటన స్థలానికి వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మయ్య, ఏఎస్ఐ, మహబూబ్నగర్ టోపీలు, కళ్లద్దాలతో మేలు.. దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది. – రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్నగర్ ఎండతో ఇబ్బందికరం.. ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. – శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్కర్నూల్ ● -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి క ల్యాణోత్సవం శనివారం వేదపండితు ల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, రవిచారి, మధుసూదనాచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా మహాహోమం నిర్వహించి స్వామి వారి ఉ త్సవమూర్తులకు కల్యాణం జరిపించా రు. ఈ వేడుకను తిలకించేందుకు భ క్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఈఓ సత్యచంద్రారెడ్డి, ఆలయచైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,270 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శనివారం 459 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6270, కనిష్టం రూ.3500, సరాసరి రూ.5400 ధరలు పలికాయి. అలాగే, 12 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6409, కనిష్టం రూ.6206, సరాసరి రూ.6409 ధరలు వచ్చాయి. 129 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.6030, కనిష్టం రూ.4670, సరాసరి రూ.6030 ధరలు పలికాయి. 1117 క్వింటాళ్ల వ రి (సోన) రాగా గరిష్టం రూ.2067, కనిష్టం రూ. 1740, సరాసరి రూ.1986 ధరలు లభించాయి. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్లో శనివారం ఎంఎస్ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎస్ఎన్ అర్జున్కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. పయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్రెడ్డి, హెచ్ఆర్ సుబ్బారావు పాల్గొన్నారు. రామన్పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం వరకు పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులకు చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 63 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వివరించారు. -
హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు
గద్వాల క్రైం: నా భర్తను ఓ ట్రాన్స్జెండర్, మరికొందరు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలంటూ మృతుడి భార్య కృష్ణవేణి ఆందోళనకు దిగింది. మల్దకల్ మండలానికి చెందిన కుర్వ రామక్రిష్ణ (24) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే శనివారం ఉదయం అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మృతుడి భార్య, వారి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కంటే ముందు హత్య చేసిన ట్రాన్స్జెండర్ శ్రీవాణితో పాటు మరి కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజేప్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలోనే మృతుడి భార్య కృష్ణవేణి, తన చిన్నారితో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతానని పెట్రోల్ బాటిల్ తీసుకురావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వెంటనే వారించి పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. ఆ వెంటనే చిన్నారితో కలిసి సదరు మహిళ ఆసుపత్రి బయటికి పరుగులు తీసి రోడ్డుపై వెళ్తున్న బస్సు కింద పడేందుకు ప్రయత్నం చేసింది. గుర్తించిన బస్సు డ్రైవర్ క్షణాల్లో బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఉద్రిక్త వాతావరణం దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై మండిపడ్డారు. న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న తమపై ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీను అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని బాధిత కుటుంబసభ్యులను శాంతింపజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేకురుస్తామని భరోసా కల్పించారు. వారిని పట్టుకునేందుకు ఇప్పటికే పలు బృందాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు పంపించామని, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే పని లో ఉన్నామన్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దోషులను శిక్షించాలని మృతుడి భార్య ఆందోళన చిన్నారితో కలిసి పెట్రోల్ పోసుకొని.. బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం -
తప్పని వెతలు
ఎండలో విధులు.. వడగాలుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ.. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా.. వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. – మహబూబ్నగర్ క్రైం ఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్స్టేషన్ మహబూబ్నగర్లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెడ్కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్ఐ, ఏఎస్ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్కర్నూల్లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను బట్టి రెండు షిఫ్ట్లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్నగర్లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్గేట్, ఔట్గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు పాలమూరులో క్యాప్లు, కూలింగ్ అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ -
బీచుపల్లిలో ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ భక్తుడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆకుపూజ, అభిషేకంతో పాటు వివిధ ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో అభయాంజనేయస్వామిని దర్శించుకుకొని ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వికాస తరంగిని, విశ్వ హిందూ పరిషత్ మరియు ధర్మ ప్రసార సమితి ఆధ్వర్యంలో సభ్యులు ఆలయంలో 41సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాల గురించి భక్తులకు వివరించారు. ఈఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు, వివిద హిందూ సంఘాల సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ ర్యాంకు దక్కేనా?
స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు, సమావేశాలు మున్సిపల్ గత పాలకవర్గంతో పాటు ప్రత్యేక అధికారి నర్సింగరావు, కమిషనర్ దశరథ్ పర్యవేక్షణలో మెప్మా అధికారులు, ఆర్పీల సహకారంతో మహిళ సంఘం సభ్యులతో ఆయా పట్టణాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కాలనీల్లో సమావేశాలు జరిపి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి మున్పిపల్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు అన్ని విధాలా సహకారం అందించారు. మున్సిపాలిటీలకు మంచి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు వస్తుందని భావిస్తున్నారు. ఉత్తమ ర్యాంకే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి. ఆ దిశగా మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో మున్సిపాలిటీ ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా కృషి చేశాం. – దశరథ్, కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఇటీవల ముగిసింది. పట్టణాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అంశాలు, వాస్తవ పరిస్థితిపై వివిధ కోణాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఏ ర్యాంకు వస్తుందోనని సర్వత్రా ఆసిక్తి నెలకొంది. అన్ని అంశాలను పరిగణలోకి.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలో సర్వే నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించేందుకు రహస్య తనిఖీలు నిర్వహించాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ బృందాలు జిల్లాలోని నాలుగు మున్సిపల్ పట్టణాలకు వచ్చి పరిస్థితిని పరిశీలించాయి. స్థానికంగా ఎవరికి తెలియకుండా పట్టణాలలో పర్యటించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాయని సమాచారం. ఆయా మున్సిపల్ పరిధిలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, వినియోగం తీరు తెన్నులను, ఫ్లాస్టిక్ కవర్ల వినియోగం, చెత్త సేకరణ తదితర అంశాలను కేంద్ర బృందాలు పరిశీలించినట్లు తెలిసింది. మున్సిపల్ పనితీరుపై ఫోన్ ద్వారా (టోల్ ఫ్రీ నెంబరు)కు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ స్వచ్ఛ సర్వేక్షన్ యాప్ ద్వారా పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ప్రజలకు ప్రశ్నలు వేసి సమాధానాలను సేకరించి రికార్డు చేశారు. గద్వాలలో చాలా మంది ప్రజలు ఆన్లైన్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం విశేషం. ఆన్లైన్లో అభిప్రాయాలు వెల్లడించిన ప్రజల సంఖ్యను బట్టి రాష్ట్రంలో గద్వాలకు మెరుగైన ర్యాంకు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ముగిసిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై కేంద్ర బృందాల రహస్య తనిఖీలు ఏ మున్సిపాలిటీకి ఏ ర్యాంకు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి -
కేంద్ర పథకాలను సద్వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం మండలంలోని కోదండాపురంలో మండలాద్యక్షుడు జగదీష్రెడ్డి ఆధ్వర్యంలో గావ్ చలో గర్ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసి ఎంతో కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణం వీధిలైట్లను ఏర్పాటు చేసిందని, కరోనా కాలం నుంచి ఉచితంగా రేషన్ బియ్యం, ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తుందన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, ప్రదానమంత్రి ఆవాస్యోజన, ఫసల్ బీమా యోజన, గ్రామ సడక్ యోజన, జన్ధన్ యోజన, కౌశల్ వికాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ముద్ర యోజన, ఉజ్వల యోజన వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టి పేద, మధ్యతరగతి ప్రజలకు చేయూతను అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు కే.కే రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయ్, నరేష్, పరుశరామ్, రాముడు, రామకృష్ణ, మహేష్, నారాయణ పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో సిటీస్కాన్ సేవలు ప్రారంభం
గద్వాల క్రైం: రోగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ సంతోష్కుమార్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలోని నూతనంగా మంజూరైన సిటీ స్కాన్ మిషన్ను వారు ప్రారంభించి మాట్లాడారు. రోగ నిర్ధారణ సేవలు వేగవంతం కానున్నాయని, వివిధ సందర్భాల్లో రోగులకు అత్యాధునిక స్కానింగ్ పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లి పరీక్షలు చేయించుకునేవారని అన్నారు. ఇక నుంచి ప్రభుత్వాసుపత్రిలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, రూ.2.5 కోట్లు సిటీ స్కాన్ నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రిలో సేవలు కల్పించడం జరిగిందన్నారు. రోగులు, గర్భిణుల సమస్యలను గుర్తించి సత్వర సేవలు అందించడం ఇక నుంచి సులువవుతుందని వివరించారు. అనంతరం సిటీ స్కాన్ మిషన్ వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ ఇందిరా, ఆర్ఎం విగ్నేష్ సిబ్బంది ఉన్నారు. పకడ్బందీగా పోషణ్ పక్వాడ గద్వాల: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో సమీక్షించారు. పోషణ్ పక్వాడ 2025ను ఏప్రిల్ 8–22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల అభివృద్ధిలో అత్యంత కీలకమైన వెయ్యి రోజులు గర్భాధారణ ప్రారంభం నుంచి రెండవ పుట్టినరోజు వరకు ప్రత్యేక దృష్టి సారించబడుతుందన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, కౌమరదశలో ఉన్న బాలికలలో బలహీనంగా, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పోషకాహార లోపంతో ఉన్న గర్భిణులు వి వరాలను సేకరించి వారికి సరైన పోషకాహారం అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సి ంగ్రావు, సంక్షేమశాఖ జిల్లా ఽఅధికారి సునంద, వివి ధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పాలెం డిగ్రీ కళాశాలలో సమూల మార్పులు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (అటానమస్)లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అకాడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు, యూనివర్సిటీ అకాడమిక్ డీన్లు, ప్రొఫెసర్లు, సబ్జెక్టు నిపుణులు, ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరై అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన, సిలబస్ను అభివృద్ధి చేశారు. అంతేకాక పాఠ్యాంశాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం, సవరించడం, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష ఫీజుల నిర్ణయం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, మాడరేషన్, డిటెండ్ నియమాలు, వివిధ ప్రోగ్రాంల వివరణ, విద్యా సంబంధిత నిబంధనలు, ఇతర మార్గ దర్శకాలను రూపొందించారు. సమావేశంలో ప్రొఫెసర్లు చెన్నప్ప, జయపాల్రెడ్డి, పాలెం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాములు, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, పెబ్బేరు కళాశాల ప్రిన్సిపల్ వెంకటప్రసాద్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు పద్మజ, శ్రీనివాసులు, నాగరాజు, సుష్మ పాల్గొన్నారు. -
శనేశ్వరుడికి శతకుంభ తిలతైలాభిషేకం
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో వెలసిన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామివారికి శతకుంభ తిలతైలాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శుక్రవారం గణపతి పూజానంతరం జేష్ట్యాదేవి సమేత శనేశ్వరులకు వెయ్యి కుంభాలతో నువ్వుల నూనెతో ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక అష్టోత్తర సహిత అభిషేక పూజలు జరిపారు. కాగా.. శనివారం ఉదయం 9 గంటలకు ఉమామహేశ్వరస్వామి వ్రతం, శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి, సాయంత్ర ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రావు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు వీరశేఖర్, పుల్లయ్య, ప్రభాకరచారి, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, మల్లికార్జున్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వేరుశనగ క్వింటా రూ.6,289
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 765 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6289, కనిష్టం రూ.3459, సరాసరి రూ.5313 ధరలు పలికాయి. అలాగే, 21 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6509, కనిష్టం రూ. 6226, సరాసరి రూ. 6419 ధరలు వచ్చాయి. 98 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6021, కనిష్టం రూ. 5201, సరాసరి రూ. 6001 ధరలు పలికాయి. 787 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2062, కనిష్టం రూ. 1709, సరాసరి రూ.2009 ధరలు లభించాయి. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా భవానీప్రసాద్ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వచ్చారు. ఖమ్మం రీజియన్లో డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తున్న ఈయన ఇటీవల బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా పనిచేసిన శ్యామల హైదరాబాద్లోని మియాపూర్కు బదిలీపై వెళ్లారు. ముగిసిన జాబ్మేళా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్మేళాకు 380 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటిరోజు గురువారం టీఎస్కేసీ, సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో లెన్స్కార్, ట్రెండ్జ్ ఐటీ, గ్రావిటీ, అన్నపూర్ణ ఫైనాన్స్, ఫ్యూచర్ ప్రాపర్టీ, ఎంపవర్మెంట్, ధ్రువంత్, హెచ్ఆర్హెచ్ నెక్ట్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 300 మంది ఉద్యోగార్థులు రాగా వంద మందిని ఎంపిక చేశారు. అలాగే శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు నిర్వహించగా 80 మంది పాల్గొంటే 20 మందిని ఎంపిక చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని, అందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐక్యూసీ కో–ఆర్డినేటర్ డా.జె.శ్రీదేవి, టీఎస్కేసీ కో–ఆర్డినేటర్ డా.హరిబాబు, మెంటర్ పి.స్వరూప, సైంట్, టీఎంఐ ప్రాజెక్టు మేనేజర్ వికాస్, ఐసీఐసీఐ బ్యాంకు హెచ్ఆర్ కిరణ్ పాల్గొన్నారు. రామయ్యకు ఏకాంత సేవ చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామికి శుక్రవారం రాత్రి పల్లకీసేవ, చక్రతీర్థం, ఏకాంతసేవ, ద్వాదశ ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చనాథులు, శివదత్తాత్రేయ, పరశురామ, ముక్కిడిపోచమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు మురళీధర్శర్మ, లక్ష్మణ్, గోపి, వేణు, ఆనంద్, భాస్కర్, ప్రవీణ్, భక్తులు పాల్గొన్నారు. కనులపండువగా పంబ ఆరట్టు వనపర్తిటౌన్: అయ్యప్ప జన్మదినం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో పంబ ఆరట్టు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించి పంబ ఆరట్టులో భాగంగా పవిత్ర జలాలతో చక్రస్నానం చేయించారు. భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. చక్రస్నానం అనంతరం మేళతాళాలు, వాయిద్యాలతో స్వామివారిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చి పల్లకీసేవ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమై లక్ష్మీ గణపతి హోమం, మూల విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్శర్మ అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తికి 3 గంటల పాటు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఆలయంలోని మూలమూర్తికి సహస్ర నామార్చన, మహా మంగళహారతి, భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
వంద రోజులు పని కల్పించండి
గద్వాల: ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలోని కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబిలైజ్ చేయాలని వందరోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ప్రతిపనికి సంబంధించి అన్ని రిజిస్ట్రర్లు, ప్రాథమిక రికార్డులు పూర్తిగా ఖచ్చితంగా ఉండాలన్నారు. గత మూడు సంవత్సరాల పనుల వివరాలు, సంవత్సరాల వారిగా ప్రతిపని పూర్తయిందా లేదా అనే వివరాలను ప్రతి పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. కేవలం ప్రజలకు పనులు కల్పించడమే కాకుండా తోటలు, చెరువులు, నీటినిల్వలు, రోడ్లు వంటి పనులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. కూలీ రేటు రూ.300–307పెంచినట్లు తెలిపారు. డిమాండ్కు తగ్గట్లు పనులు జరిగేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. ఉపాధి హామి పథకం కింద నిర్వహించే ఏడు రిజిస్టర్లను ఖచ్చితంగా తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఉపాధి పనుల్లో తోటలు, చెరువులు, రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
కదలిక వచ్చేనా?
‘ర్యాలంపాడు’ లీకేజీలను పరిశీలించిన నిపుణుల బృందం ●మరమ్మతు చేయాలి ర్యాలంపాడు రిజర్వాయర్ కింద మాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా వరిపంట సాగుచేస్తాను. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడడంతో రిజర్వాయర్లో సగానికే నీటిని నింపుతున్నారు. దీంతో తమ పంటలకు పూర్తిగా నీరు అందడంలేదు. రెండేళ్లుగా ఖరీఫ్ సీజన్లో వారబంధి విధానంతో నీటిని వదిలారు. పంటలకు పూర్తిగా నీరుపారక ఇబ్బందిపడ్డాను. ఈసారైన రిజర్వాయర్కు రిపేర్లు చేయాలి. – రాముడు, రైతు దోర్నాల, ధరూరు మండలం పంటలకు నీరు అందించాలి రిజర్వాయర్ కింద 4ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండెకరాలలో వరి, మరో రెండెకరాలలో పత్తిపంటను పండిస్తాం. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు పడి రిపేర్లు చేయకపోవడంతో మూడేళ్లుగా ఒక్క పంటనే పండించుకుంటున్నాను. కొత్త ప్రభుత్వమైనా స్పందించి త్వరగా రిపేర్లు చేసి తమ పంటలకు నీరు అందించి ఆదుకోవాలి. – తాయప్ప, రైతు, కేటీదొడ్డి నిధులు విడుదల చేస్తేనే.. మరమ్మత్తులకు సంబంధించి నివేదిక హైదరాబాదులోని సీఈ కార్యాలయం టెక్నికల్ విభాగం పరిశీలనలో ఉంది. దీనిపై తుది నిర్ణయం వెలువడి, నిధులు విడుదల చేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తాం. అప్పటి వరకు జలాశయం రక్షణలో భాగంగా సగానికే నీటిని నిల్వ చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్శాఖ వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ.వేల కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కొందరు కాంట్రాక్టర్ల స్వార్థం.. అధికారుల అవినీతి మూలంగా వాటి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. లోపభూయిష్టమైన నిర్మాణాల కారణంగా ఒకటి కాదు రెండు కాదు ర్యాలంపాడు జలాశయం కుడి, ఎడమ అడుగు భాగాలు, రాక్టోల్ ప్రాంతాలు.. మొత్తం లీకేజీలమయంగా మారింది. రూ.కోట్లాది ప్రజాధనం మట్టికొట్టుకుపోతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ర్యాలంపాడు జలాశయం ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. తాజాగా గురువారం లీకేజీలను పూణె నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దీంతోనైనా ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు పనుల్లో కదలిక వస్తుందేమో.. మా పంటలకు నీటి కష్టాలు తీరుతాయేమోనని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. – గద్వాలనడిగడ్డ ప్రాంతంలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టులో ర్యాలంపాడు జలాశయం గుండెకాయ లాంటిది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నెట్టెంపాడు ప్రాజెక్టులో ఏడు జలాశయాలు నిర్మించారు. ఇందులో సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలు స్టాండ్బై కింద కేవలం నీటిని నిల్వ చేసుకునేందకు నిర్మించగా, మరో 5 జలాశయాలు ఆయకట్టుకు నీరు పారించేలా నిర్మించారు. ఇందులో ర్యాలంపాడు జలాశయం కింద 1.05లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4టీఎంసీలుగా నిర్మాణం చేశారు. ఈ జలాశయం ద్వారా, ధరూరు, కేటీదొడ్డి, మల్దకల్ మండలాల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు పారుతుండగా మరోవైపు 2.80టీఎంసీల సామర్థ్యంతో 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు పారించేలా రూ.580కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతలకు కూడా అవసరమైన 2.80టీఎంసీల నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచే ఎత్తిపోసేలా నిర్మాణం చేపట్టారు. అందుకే సాగునీటి నిపుణులు ఈ ర్యాలంపాడు జలాశయాన్ని ప్రాజెక్టుకు గుండెకాయగా పిలుస్తారు. సమగ్ర వివరాలు సేకరణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం జలాశయానికి కుడి, ఎడమ అడుగు భాగాలు, రాక్టోల్ ప్రాంతాల్లో పలుచోట్ల లీకేజీల గుర్తింపు మరమ్మతులకు రూ.137 కోట్ల అంచనా నివేదిక జలాశయం నిండక.. ఆయకట్టు రైతుల అష్టకష్టాలు -
‘ర్యాలంపాడు’ లీకేజీల పరిశీలన
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలను సీడబ్ల్యూపీఆర్ఎస్ పూణెకు చెందిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. ఉదయం11.30 గంటలకు రిజర్వాయర్ వద్దకు చేరుకున్న డాక్టర్ సంజీవ్ బరేలే, సునీల్ పిల్లై (కేరళ), కే. నర్సయ్య (ఏపీ కాకినాడ), మందిర ముజుకుదార్, తనుశ్రీ సమంత తదితరుల బృందం సభ్యులు దాదాపు 3 గంటల పాటు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఎడమ కాల్వ వద్ద నీటి లెవెల్స్, ప్రాజెక్టు బండ్ అండ్ గ్రౌండ్ లెవెల్లను పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్తో పలు విషయాలు ఆరా తీశారు. ప్రాజెక్టు డిజైన్ మ్యాప్స్, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి మెటీరియల్ వాడారు, ప్రాజెక్టు డిజైన్ను ఏ సంస్థ చేపట్టింది, ముందుగా సమస్య ఎక్కడ ఏర్పడింది అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత, లీకేజీల తరువాత ఎంత మేర నీటిని నిల్వ చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. అక్కడి నుంచి లీకేజీలు ఏర్పడిన మూడు ప్రాంతాలను బండ్ ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలించారు. ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటి లెవెల్ కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఉండడంతో లీకేజీ ప్రాంతాల వద్ద ఊట లేకపోవడంపై చర్చించారు. ప్రాజెక్టుపై భాగంలో ఎలాంటి సమస్య లేదని, కేవలం తగ్గు ప్రాంతాల వద్ద మాత్రమే లీకేజీ సమస్య వచ్చినట్లు గుర్తించామని బృందం సభ్యులు తెలియజేశారు. లీకేజీలు ఏర్పడటానికి గల కారణాలను అధ్యయనం చేసందుకు ఇక్కడి నుంచి కొంత మెటీరియల్ను తీసుకు వెళ్లి టెస్టులు నిర్వహించి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను సంబంధిత సీఈకి అందిస్తామని బృందం సభ్యులు తెలియజేశారు. రిజర్వాయర్ ప్రధాన కాలువల వెంట చేపట్టాల్సిన పనులపై ఎస్ఈకి వివరించారు. ఈ ప్రాజెక్టు పరిదిలోని మిగతా రిజర్వాయర్ల గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నోనిపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. -
ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి
కేటీదొడ్డి: మండలంలోని మీ సేవ కేంద్రాలను మీసేవ ఈ మేనేజర్ శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ఆయన మండల పరిదిలోని కుచినెర్ల గ్రామంలో మీ సేవ కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. సిటిజన్ చాటర్ట్, నోటీస్ బోర్డు, సర్టిఫికేట్, రిజిష్టర్ టోల్ ప్రీ నంబర్లు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలందించాలని సూచించారు. మీ సేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకుంటే కేంద్రాలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మీ సేవ లక్ష్యమన్నారు. ధరల పట్టి కూడా కేంద్రాల్లో విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సురేష్, వెంకటేష్ నాయుడు తదితరులు ఉన్నారు. -
హిందూ ధర్మం కోసం పాటుపడాలి
ఎర్రవల్లి: హిందూ ధర్మం, సంస్కృతిని కాపాడటం కోసం ప్రతి హిందువు పాటుపడాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఫణి మోహన్రావు అన్నారు. బుధవారం మండల పరిదిలోని బీచుపల్లిలో వివిద మండలాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై వీహెచ్పి నిర్వహిస్తున్న వివిధ అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడంతో పాటుగా సేవ చేయడం కోసం 1964లో వీహెచ్పిని స్థాపించడం జరిగిందన్నారు. దీని ద్వారా 1966లో కుంభమేళా సందర్భంగా ప్రయాగ్లో హిందువుల ప్రపంచ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి రాష్ట్రంలోని ప్రతి మండలంలో హిందూ సమాజం కోసం వీహెచ్పి పనిచేస్తూ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుందని అన్నారు. హిందూ దేవాలయాల పుణరుద్ధరణ మరియు నిర్మాణం కోసం, మతమార్పిడితో పాటు గోహత్యలను అడ్డుకునేందుకు కృషిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రసార ప్రముఖ్ సత్యం, మదన్ మోహన్, నర్సింహా, వివిద మండలాలకు చెందిన ప్రముఖ్లు, సహ ప్రముఖ్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో సివిల్ జడ్జి పూజలు
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గద్వాల సివిల్ జడ్జి గంట కవిత ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయానికి జడ్జి చేరుకోగా.. ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేరుశనగ క్వింటా రూ.6,159 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు బుధవారం 708 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6159, కనిష్టం రూ.3150, సరాసరి రూ.5919 ధరలు పలికాయి. అలాగే, 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4013 ధర వచ్చింది. దీంతోపాటు 38 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5980, కనిష్టం రూ. 4557, సరాసరి రూ. 5950 ధరలు వచ్చాయి. 262 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2057, కనిష్టం రూ. 1737, సరాసరి రూ.2026 ధరలు లభించాయి. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు– మహబూబ్నగర్), (పురుషులు–నాగర్కర్నూల్)లలో విద్యార్థులకు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని టీడబ్ల్యూ గురుకులం మహబూబ్నగర్ రీజియన్ కో–ఆర్డినేటర్ పీఎస్ కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీలో నాలుగు, ఫిజిక్స్లో రెండు, హిస్టరీ, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే ఆయా సబ్జెక్టులలో సెట్, నెట్, పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 16వ తేదీలోగా మహబూబ్నగర్ శివారు తిరుమల హిల్స్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (మహిళలు) ప్రిన్సిపాల్కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే కళాశాలలో నిర్వహించే డెమోకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.7901097704, 9848616564లను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ యా దయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెరుగైన విద్య అందించాలి తిమ్మాజిపేట/తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుదవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలకపల్లి సీఎల్ఆర్ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుపై కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు అత్యాధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చైర్మన్ను సత్కరించారు. ఆయన వెంట అధికారులు రాధాకృష్ణ, శివరాం, రామరాజు, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంఈఓలు శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణశెట్టి, సీఎల్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, రాజమహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సమృద్ధి వర్షాలతోనే..
2024–25 ఆర్థిక సంంవత్సరానికి గాను గద్వాల, అలంపూర్ యార్డులు నిర్ధేశించిన లక్ష్యానికి మించి ఆదాయాన్ని అందుకున్నాయి. ఈసారి వర్షాలు బాగా కురుసి, పంట ఉత్పత్తులు బాగా రావడంతోనే యార్డులకు ఆదాయం బాగా సమకూరింది. గద్వాల యార్డుకు నిత్యం వేరుశనగ వస్తోంది. దీనివల్ల సెస్ బాగా వచ్చింది. అలంపూర్ యార్డుకు చెక్పోస్టులతో పాటు, మిల్లులు, అయిజ సంత నుంచి బాగా ఆదాయం లభించింది. – పుష్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి ● -
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
గద్వాల: యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ముందస్తు సన్నద్ధం కావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశం హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 యాసంగిలో రైతులు పండించిన ప్రతీగింజను కొనుగోలు చేయాలన్నారు. యాసంగిలో సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో అన్ని రకాల ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు వ్యవహారం సక్రమంగా కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎస్వో స్వామి, డీఎం విమల, డీఏవో సక్రియ నాయక్, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, ఏవోలు తదితరులు పాల్గొన్నారు. -
‘వికాసానికి ’ విఘ్నాలు..!
గద్వాల యార్డులో వడ్లు కాంటా వేస్తున్న కార్మికులు ●‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తులకు అడ్డంకులు రేషన్ కార్డు లేకపోవడంతో.. రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్కార్డు అడిగారు. మాకు రేషన్కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం.. యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్నగర్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్నగర్ ● అనేక ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ● ఆన్లైన్లో మండలం, బ్యాంక్, గ్రామాల పేర్లు గల్లంతు ● రేషన్కార్డులో ఒక్కరికే అవకాశం.. కొత్తవి రాక పలువురి ఆందోళన ● కొన్ని చోట్ల కులం, ఆదాయం సర్టిఫికెట్లకూ తప్పని పాట్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ఈ ఏడాది మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. ఈ ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురైన విషయం తెలిసిందే. దీంతో సర్కారు దరఖాస్తుల తుది గడువును మార్చి 30 నుంచి ఈ నెల 14 వరకు పొడిగించింది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు రకాల సాంకేతిక సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సర్కారు నిర్దేశిత గడువుకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. దరఖాస్తుదారుల్లో ఆందోళన గూడు కట్టుకుంది. మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు నిత్యం చక్కర్లు కొడుతున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో అసహనం వ్యక్తమవుతోంది. సమస్యలు.. ఇబ్బందులు ● జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండలాన్ని మహబూబ్నగర్ జిల్లాలో చేర్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గండేడ్ మండలం నుంచి కొత్తగా మహమ్మదాబాద్ మండలం ఏర్పాటైంది. ఈ క్రమంలో ఆయా మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి.. ఆ గ్రామ పరిధిలోని బ్యాంకులు వెబ్సైట్లో కనిపించడం లేదు. ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకులను ఎంపిక చేసుకున్న పక్షంలో వారికి సంబంధం లేని గ్రామాల పేర్లు చూపిస్తోంది. ఈ సమస్య మహమ్మదాబాద్తో పాటు ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఏర్పాటైన కౌకుంట్ల, మూసాపేట, కొత్తపల్లి, గుండుమాల్, ఎర్రవల్లి, పదర, చిన్నంబావి మండల పరిధిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ● మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, చౌదర్పల్లి గ్రామాలకు సంబంధించిన పేర్లు ఒకసారి వెబ్సైట్లో కనపడుతున్నాయి. మరికొన్ని సార్లు చూపించడం లేదు. దీంతో ప్రతిరోజు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లకు క్యూ కట్టాల్సి వస్తోందని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి యువ వికాసం పథకంలో తొలుత అడ్డంకులు వచ్చాయి. వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించలేదు. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను పక్కన బెట్టడమే కాకుండా.. వెబ్సైట్లో వాటిని ఎత్తేసినట్లు సమాచారం. ప్రస్తుతం వారికి ఇబ్బంది లేకున్నా.. గతంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించకపోవడమే ఇందుకు కారణం. ● రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్, పాన్కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలి. అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయం సర్టిఫికెట్ 2024 ఏప్రిల్ తర్వాత తీసినదై ఉండాల్సి రావడంతో ఎక్కువ మంది మీ సేవ సెంటర్లు, రెవెన్యూ కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు. ఐదారు మండలాల్లో మినహా మిగిలిన మండలాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు లేవు. కుల ధ్రువీకరణలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇంటర్వ్యూలకు త్వరలో షెడ్యూల్.. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో ఇంటర్వ్యూ నిర్వహణకు అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకున్న వారి వ్యాపార పెట్టుబడి ఆధారంగా ఆయా బ్యాంకులు సబ్సిడీ రుణాలు అందజేయనున్నాయి. రూ.50 వేలు తీసుకుంటే 100 శాతం సబ్సిడీ రానుంది. రూ.లక్షకు 90 శాతం, రూ.2 లక్షలకు 80 శాతం.. ఆ తర్వాత రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ వర్తించనుంది. జూన్ రెండో తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేసి.. రుణం మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ధ్రువపత్రాల జారీలో ఆలస్యం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు నారాయణపేట జిల్లా నర్వ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవి. ఇతను రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం వారం రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. చాలామంది ఒకే సారి దరఖాస్తు చేసుకోవడంతో కాస్త ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నాడు. దరఖాస్తులను ఆన్లైన్లో కాకుండా మండల పరిషత్ కార్యాలయంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని రవి కోరుతున్నాడు. తప్పని ప‘రేషాన్’.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది కొన్నేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం రేషన్కార్డులో ఉన్న పేర్లలో ఒకరికి మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో రేషన్కార్డులకు కొత్తగా దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్న వారు యువ వికాసంలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా అర్హులై ఉండి రేషన్ కార్డు రానివారిలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలోని రైతులకు ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తేలితే వారిపై క్రిమినల్, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా గ్రామాల్లో రైతులు సాగుకు సన్నద్ధమవుతుంటారని, ఈక్రమంలోనే పలువురు వ్యాపారులు నాసీరకం విత్తనాలు, ఫర్టిలైజర్, యూరియా, పురుగుమందులు తదితర వాటిని రైతులకు విక్రయాలు చేస్తుంటారన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే అవకాశం ఉంటుందని, అలాంటి వారిపై నిఘా ఉంచాలని, విరివిగా వ్యవసాయ, పోలీసుశాఖ సంయుక్తంగా సోదాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర డీజీపీ రెండు రోజులపాటు అన్ని జిల్లా పోలీసు అధికారులతో సమావేశంలో ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బందికి వివరించారు. ఎక్కడైన బెట్టింగ్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా వంటి వాటిపై నిఘా ఉంచాలన్నారు. బాధితులతో సిబ్బంది హుందాగా వ్యవహరించి పోలీసులపై నమ్మకం కలిగేల విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, టాటాబాబు ఉన్నారు. -
బీచుపల్లిలో ముగిసిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: శ్రీరామ నవమిని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, యాగశాల చతుస్థానార్చన, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ వంటి పూజలు చేశారు. సాయంత్రం ద్వాదశారాధన, శ్రీపుష్పయాగం, ధ్వజావరోహణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి గద్వాలటౌన్: పాలమూరు యూనివర్సిటీ పరిఽఽధిలోని గద్వాల ప్రభుత్వ పీజీ సెంటర్లో మంగళవారం కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీఓ 21ని వ్యతిరేకిస్తూ తరగతులను బహిష్కరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రిన్సిపల్ వెంకటరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 21తో కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని.. పార్ట్టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంగళగిరి శ్రీనివాసులు, మహేందర్, గోపినాథ్ రాథోడ్, వంగూరి గణేశ్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,949 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 1,695 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 5,949, కనిష్టంగా రూ. 3,069, సరాసరి రూ. 5,199 ధరలు వచ్చాయి. 36 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,529, కనిష్టంగా రూ. 6,009, సరాసరి రూ. 6,529 ధరలు లభించాయి. 40 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,009, కనిష్టంగా రూ. 5,661 ధర పలికింది. 424 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,030, కనిష్టంగా రూ. 1,759, సరాసరి రూ. 2,019 ధరలు లభించాయి. -
ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్
అయిజ/మల్దకల్: విద్యార్థులు శ్రద్ధగా ఉన్నత విద్య అభ్యసిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి గంట కవితాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని పులికల్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, మధ్యాహ్న భోజనం వంట సరుకులను న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని.. ఎక్కడైనా బాల్యవివాహం చేసేందుకు సిద్ధమైతే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలకు 5 కి.మీ. దూరంలోని బైనపల్లి, కిసాన్ నగర్, రాజాపురం గ్రామాల నుంచి వస్తున్నామని, తమకు సైకిళ్లు ఇప్పించాలని విద్యార్థులు కోరగా.. దాతలతో మాట్లాడి సైకిళ్ల పంపిణీకి కృషిచేస్తానని న్యాయమూర్తి హామీ ఇచ్చారు. ● మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామిని సీనియర్ సివిల్జడ్జి కవితాదేవి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తిని శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవిచారి, చంద్రశేఖర్రావు, మధుసూదనాచారి పాల్గొన్నారు. -
రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకోండి
ఇటిక్యాల: ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకానికి అర్హులైన యువత దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ ఉన్నారు. కేటగిరీల వారీగా కేటాయింపులు గద్వాల: రాజీవ్ యువవికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం, ఒంటరి మహిళలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్, ఆదాయం, కుల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాన్స్పోర్ట్ పథకం కోసం), పట్టాదారు పుస్తకం (వ్యవసాయ సంబంధిత పథకానికి), సదరం ధ్రువపత్రం, వితంతు, ఒంటరి మహిళల ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జతపరిచి మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందించాలని సూచించారు. -
పొగాకు రైతు పరేషాన్
అకాల వర్షాలకు నల్లబారుతున్న పొగాకు మండెలు ●న్యాయం చేయాలి పొగాకు మండలను తిప్పి తిప్పి చేతులు అరిగి పోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి పంటను సాగు చేశాం. తీరా పంట విక్రయిద్దామంటే ఆయా కంపెనీలు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు గతంలో రైతులను అడిగి మరి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలతో పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. ఎక్కడ పంట నల్లగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం, అధికారులు స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలి. – వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, ఉండవెల్లి కుదేలవుతున్నారు.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలో మాత్రమే పొగాకు పంటను సాగుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతు పొగాకు పండించే ముందు మీరు సాగు చేయండి.. మేం కొంటామంటూ నమ్మబలికారు. తీరా పంట చేతికి వచ్చిన సమయంలో కంపెనీ యజమానులు చేతులెత్తేస్తున్నారు. మొత్తంగా పొగాకు సాగు చేసిన రైతు కుదేలవుతున్నారు. జిల్లా అధికారులు రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కంపెనీల యజమానులతో మాట్లాడి రైతులకు న్యాయం అందేలా చూడాలి. – ఈదన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉండవెల్లి: ఓ వైపు అకాల వర్షాల భయం.. మరోవైపు డిమాండ్ ఉన్న రకాలను మాత్రమే కొంటామంటూ ఆయా కంపెనీల నిర్వాహకులు నిబంధనలు పెడుతుండడం.. మొత్తంగా పొగాకు రైతులు పరేషాన్లో పడ్డారు. పొగాకులో 62 రకాలు ఉండగా.. ప్రధానంగా బీడీ, సిగరెట్, చుక్కబర్లి, బర్లి, అడ్–50, కస్తూరికి డిమాండ్ ఎక్కువ. గత ఏడాది పొగాకు పంటకు అధిక ధర పలకడంతో ఈ సారి కూడా లాభాలు వస్తాయని, విస్తారంగా సాగు చేయాలని ఆయా కంపెనీల నిర్వాహకులు సూచించడంతో రైతులు పొగాకులో ప్రధాన రకాలైన సిగిరేట్, బీడిని అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి అందుతుంది. ఈ పరిస్థితుల్లోనే రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అటు అకాల వర్షాలతో ఎండకు ఆరబెట్టిన పొగాకు మండెలు నల్లబారుతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యమైతే మరింత నష్టపోయే అవకాశం ఉందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు బయటి మార్కెట్లో బీడీకి రకానికి మార్కెట్ లేదంటూ కేవలం సిగరెట్ రకాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో బీడీ రకం పొగాకు సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవల బీడి రకాన్ని సాగు చేసిన రైతులు సదరు ప్రైవేట్ కంపెనీ వద్దకు పంట విక్రయించే నిమిత్తం వెళ్లగా.. కంపెనీ వద్దకు రావద్దని తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో బూజు పడుతోంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడి రకం పొగాకు అధిక మోతాదులో సాగు చేశారు. గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నియోజకవర్గాలలోని గ్రామాలకు చెందిన రైతులు పంటను సాగు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 2 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. జోగుళాంబ గద్వాల వ్యాప్తంగా 3500 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేయగా.. కేవలం అలంపూర్ నియోజకవర్గంలోనే 2500 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది పొగాకు క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ఈ ఏడాది వచ్చేసరికి అమాంతం ధర పడిపోయింది. క్వింటా రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుండడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండు నెలలుగా పొగాకు మండలను దింపడం ప్రారంభించారు. ఇదిలాఉండగా, గత పది రోజులుగా కురుస్తున్న వర్షంతో మండలు నల్లబారి బూజు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు ఆశచూపడంతో విస్తారంగా సాగు తీరా పంట చేతికి వచ్చాక.. ఆ రకానికి మార్కెట్ లేదంటూ వెనుకంజ దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు -
ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి
గద్వాల: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఈ నెల మూడో వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో పొందుపర్చాలని తెలిపారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఎదురైనా ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. సమావేశంలో డీఎస్ఓ స్వామి, డీఎం విమల, డీఏఓ సక్రియ నాయక్ తదితరులు ఉన్నారు. -
వంటింటికి గ్యాస్ సెగ
గద్వాలటౌన్: నిత్యావసరాల ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వంట నూనెలు సలసలమంటుండగా.. కూరగాయలు కంటతడి పెట్టిస్తున్నాయి. వీటికే సామాన్యుల వంటగది ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుండటంతో పేదల నెలవారీ బడ్జెట్ తలకిందలవుతోంది. తాజాగా గృహ వినియోగ 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై రూ.50 పెరగడం మరింత గుదిబండగా మారింది. ● జిల్లాలో మొత్తం 11 ఏజెన్సీలు ఉండగా.. వాటి పరిధిలో వివిధ రకాలకు చెందిన మొత్తం 1,76,578 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,68,637 కనెక్షన్లు గృహ వినియోగానికి సంబంధించినవి ఉన్నాయి. గతంలో వీటిపై ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. రానురాను ఏడాదికి ఆరు సిలిండర్లకే రాయితీని పరిమితం చేశారు. సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో పాటు రాయితీ తగ్గిపోయింది. ప్రస్తుతం సబ్సిడీని కూడా పూర్తిగా ఎత్తేశారు. అయితే ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందిన వారికే మాత్రమే రాయితీ దక్కనుంది. తాజాగా రూ.50 పెరగడంతో ప్రస్తుతం గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.925కు చేరుకుంది. అయితే జిల్లాలో ప్రతినెలా సరాసరి 70వేల గృహవినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. తాజా పెంపుతో గృహ సిలిండర్ వినియోగదారులకు ప్రతినెలా రూ. 35లక్షల వరకు అదనపు భారం పడనుంది. రెండేళ్లుగా తగ్గుతూ.. గ్యాస్ ధరలు రెండేళ్ల క్రితం భారీగా పెరగడంతో ప్రజలు సతమతమయ్యారు. తర్వాత క్రమంగా ధరలు తగ్గుతూ వచ్చాయి. 2023 మార్చి వరకు రూ. 1175 ఉన్న ధర.. నవంబర్లో రూ. 1,125కు చేరింది. తర్వాత నెల రోజులకే రూ.975కు తగ్గింది. ఇలా నాలుగు నెలలపాటు కొనసాగిన ధర 2024 మార్చి లో రూ. 875కు తగ్గింది. అప్పటి నుంచి ఏడాది పాటు ధర స్థిరంగా ఉంటూ వస్తోంది. తాజాగా గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మహాలక్ష్మి, దీపం పథకం లబ్ధిదారులపై మాత్రం పెరిగిన ధర ప్రభావం ఉండదు. భారం మోపడం తగదు.. వంట గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వాలే అలవాటు చేశాయి. సబ్సిడీలు ఇచ్చి మరీ కొనిపించారు. సబ్సిడీ నగదు క్రమేణ ఎత్తేశారు. రవాణా చార్జీలను అదనంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు సిలిండర్పై రూ.50 ధర పెంచడం దారుణం. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెంచేసి జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. సామాన్యులపై మోయలేని భారం మోపడం తగదు. – రేణుక, గృహిణి, గద్వాల వంటావార్పు కష్టమే.. అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయి. ఏం కొనలేం.. తినలేం అనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గ్యాస్ ధర పెరగడంతో వంట వండుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. సిలిండర్ ధర పెరిగిందని.. కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి లేదు. పేదలకు ఈ ధరల పెరుగుదల భారంగా మారుతుంది. – సావిత్రి, గృహిణి, గద్వాల ● గృహ వినియోగ సిలిండర్పై రూ.50 పెంపు సబ్సిడీని పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం జిల్లా వినియోగదారులపై ప్రతినెలా రూ. 35లక్షలకు పైగా భారం -
కొనుగోళ్లకు కంపెనీల అనాసక్తి
పొగాకు కంపెనీలు అయిన వీఎస్టీ, ఐటీసీ, అలియాన్స్, జీపిఐ, బొమ్మిడాల్, డెక్కన్, నూర్, తదితర కంపెనీలు ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లోనే అధికంగా ఉన్నాయి. బీడి రకం పొగాకు, చుక్కబర్లి, రకాలు త్వరగా కొంటారని ఎంతో ఆశపడి రైతులు సాగు చేశారు. ఒక్కో రైతు 10 ఎకరాలకు పైగా పొగాకును సాగు చేశారు. కానీ తీరా పంట చేతికి వచ్చే సమయంలో బయటి మార్కెట్లో ఏ రకానికి డిమాండ్ ఉంటే అదే కొనుగోలు చేస్తామంటూ కేవలం సిగరేట్ రకాన్ని కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో మిగతా రకాలు సాగు చేసిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని కంపెనీలు మీరు ఎంత సాగు చేసినా.. మేం ఇంత మేర మాత్రమే కొంటామని పేర్కొంటున్నాయి. మరికొన్ని ఈ ధర ఇస్తేనే కొనుగోలు చేస్తామని తేల్చి చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పడ్డారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 37మంది ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ ‘రగడ’..!
●మాకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్, పీయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆందోళనలు తీవ్రతరం చేస్తాంయూనివర్సిటీ ప్రారంభం నుంచి పీయూలో లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్ పోస్టుల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. కాంట్రాక్ట్ అధ్యాపకుల స మస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. – శ్రీనివాస్, వీసీ, పాలమూరు యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఊరుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవారం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు. త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్.. యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్, 60 మంది పార్ట్టైం ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొత్తం 58 రెగ్యులర్ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. ఇవి పోను 42 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూలో ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గత తొలగింపుల నేపథ్యంలో.. పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. అనంతరం వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా.. నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, హెచ్ఓడీ కన్వీనర్గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటాయించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కులు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఒక్క సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్ ఫెల్లోషిప్ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్నట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తున్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీయూలో జీఓ 21 లొల్లి శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్లో ఆందోళన దశల వారీగా తమను తొలగిస్తారని బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం మేమెందుకు అర్హులం కాదు ? ఇటీవలి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్చాన్స్లర్ శ్రీనివాస్, నూతన రిజిస్ట్రార్ రమేష్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
కేంద్రం సహకారంతోనే సన్న బియ్యం పంపిణీ
ఎర్రవల్లి: రేషన్ బియ్యం పంపిణీలో సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని..ప్రతి వ్యక్తికి అందిస్తున్న 6 కిలోల సన్నబియ్యంలో కేంద్రం ప్రభుత్వం ఐదు కిలోలు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో మాత్రమే ఇచ్చి ప్రగల్బాలు పలుకుతోందని బిజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మండిపడ్డారు. సోమవారం మండల పరిదిలోని వల్లూరు గ్రామంలో ఆ పార్టీ మండలాద్యక్షుడు జగదీష్రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసి ప్రజలకు ఉచితంగా రేషన్బియ్యం అందిస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఇటీవలె సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటోను పెట్టకుండా కేవలం సిఎం పోటోను పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులుల కే.కే రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజు, గ్రామ పెద్దలు, తదితరులు ఉన్నారు. అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మానవపాడు: అసంక్రమిత వ్యాధులు మానవ జీవితాలను నాశనం చేస్తాయని, అసంక్రమిత వ్యాధులుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశలకు అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం మరణాల్లో సుమారు 74శాతం అసంక్రమిత వ్యాధుల వల్లనే జరుగుతున్నాయని, చాలా ఎన్సీడీలు జీవనశైలి సంబంధిత కారణాలతో కలుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత స్థాయిలో బాధ్యత, సామాజిక, ఆరోగ్య సేవలపై ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమమానస, హెలెన్, చంద్రన్న, అక్కమ్మ, సూపర్వూజర్లు, ఏఎన్ఎమ్లు, ఆశలు తదితరులు పాల్గోన్నారు. గడువు పొడిగింపు గద్వాల: జిల్లాలో నిరుద్యోగ క్రిస్టియన్ యువతకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చుటకు గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 12వ తేదీ వరకు పొడగించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్బాబు ప్రకటనలో తెలిపారు. సాగునీటి కోసం రైతుల ఆందోళన అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలను నిలిపివేయడంతో సోమవారం ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆత్మకూర్ మండలంలోని ఆరెపల్లి, కత్తేపల్లి, తూంపల్లి గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వద్దకు చేరుకొని గద్వాల– అమరచింత రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేతికొచ్చే దశలో ఉన్న యాసంగి పంటలకు సాగునీరు అందించక పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి సాగుకు వారబందీ ద్వారా సాగునీటిని క్రమం తప్పకుండా అందిస్తామన్న అధికారులు.. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. వారబందీ విధానంలో మరో రెండు పర్యాయాలు సాగునీరు వదలాలని డిమాండ్ చేశారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులపాటు సాగునీటిని కాల్వలకు వదులుతామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో రైతులు ధర్నాను విరమించారు. పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు అందించాలని ఏఈ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు. -
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మానవపాడు: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారి గంట కవిత సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో భవిష్య భారత్ ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మద్యం, సిగరెట్, గుట్కా, సారా వంటి వ్యసనాలను నియంత్రించాలని అన్నారు. బాల్యవివాహాలపై గ్రామస్థాయిలో ప్రజలకు ఆశ వర్కర్లు అవగాహన కల్పించాలని, వాటి వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అది చెడిపోతే కుటుంబం నాశనం అవుతుందని పేర్కొన్నారు. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేది ఒక్క వైద్యులు, వైద్య సిబ్బందికేనని, ఆశ కార్యకర్తలు ఆరోగ్య సైనికులని, గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆరోగ్యంపై, వ్యాసనాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అనంతరం జడ్జితోపాటు ప్రాజెక్ట్ మేనేజర్ నాగరాజు క్షయ వ్యాధికి సంబందించి పలువురికి ఆరోగ్య, పోషకకిట్లను అందించారు. ఎస్బీఐ భవిష్య అంబులెన్స్ సేవలను గురించి, బ్లడ్ పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధులు వెంటనే పరీక్షలు వివరలను రోగులకు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి రాజు, నోడల్ అఫీసర్ సాధిక్, డాక్టర్ హేమమానస, సూపర్వైజర్ చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి పట్టాభిషేకం
ఎర్రవల్లి/ఉండవెల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు ఉదయం ఆలయంలో అర్చకులు సుప్రభాతసేవ, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి, తదనంతరం విష్వక్షేనపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, వస్త్రసమర్పన, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల నడుమ కనులపండువగా చేపట్టారు. నేత్రపర్వం.. రథోత్సవం ఉండవెల్లి మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో రాములోరి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఓ వైపు బాలికలు, చిన్నారుల కోలాటాలు.. మహిళల మంగళహారతుల నడుమ కనులపండువగా సాగింది. బీచుపల్లిలో రాములోరికి పట్టాభిషేకం చేస్తున్న అర్చకులు -
బెట్టింగ్ భూతం..!
ఈజీమనీ ఆశతో రూ.లక్షలకు లక్షలు బెట్టింగ్ గద్వాల క్రైం: ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అన్న యువత అత్యాశను కొన్ని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. యువతకు మొదట్లో డబ్బు వస్తున్నట్లు ఆశ చూపించి.. బెట్టింగ్ ఊబిలోకి దింపడం.. తీరా రూ.వేల నుంచి రూ.లక్షలు బెట్టింగ్ వేశాక కోరుకోలేని దెబ్బతీస్తున్నారు. అటు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. వారి ఒత్తిళ్లు భరించలేక.. కుటుంబసభ్యులకు ఏం చేప్పుకోవాలో తెలియక జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కావడంతో నడిగడ్డలో ఆన్లైన్ బెట్టింగ్లకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్లు మొబైల్స్ రాకతో పట్టణ, గ్రామీణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో పందెం ఆట విడుపుగా మారింది. పందెంలో వేసిన డబ్బులు పోగుట్టుకున్న వారంతా అప్పులు చేసి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ఘటనలు ● ఈ ఏడాది మార్చి 30న జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు(25) ఆన్లైన్లో క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లు వేస్తు రూ.6లక్షలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఓ కారును తాకట్టు పెట్టి కొంత మేర అప్పు తీర్చాడు. అయినప్పటికీ మిగతా అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇదే మొదటిసారి కాదు డబ్బులు ఇవ్వడం అంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ● ఈ నెల 5వ తేదీన గద్వాల మండలానికి చెందిన ఓ యువకుడు(22) ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఆన్లైన్లో బెట్టింగ్లు వేశాడు. బెట్టింగ్ ఓడిపోవడంతో వారికి డబ్బు చెల్లించేందుకుగాను తెలిసిన వ్యక్తుల ద్వారా రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారు మందలించారు. దీంతో కలత చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ● జూన్ 2.2023 జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రికెట్ బెట్టింగ్లో రూ. 70లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు క్రికెట్ బెట్టింగ్లో ప్రముఖులు సైతం రూ.కోట్ల పోగొట్టుకున్నారు. కొందరు అప్పులు చెల్లించే దుస్థితి లేకపోవడంతో జిల్లా విడచి పారిపోయారు. ఏజెంట్లపై గద్వాల, శాంతినగర్, రాజోళి, అయిజ, ఉండవెల్లి తదితర పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలి క్రికెట్, ఇతర బెట్టింగ్లకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలి. ఇలా బెట్టింగ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో సిబ్బందికి దిశానిర్ధేశం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటే అనుమానించాల్సిందే. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సైబర్క్రైం వెబ్సైట్, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930, డయల్ 100కు ఫిర్యాదు చేయాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడితో యువత సతమతం జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరి బలవన్మరణం మాయాజాలం టీవీలలో క్రికెట్ చూస్తూ టాస్ మొదలుకుని, వికెట్ల చొప్పున, బంతి, బంతికి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. మ్యాచ్లో తలపడే జట్టులో ఫలానా జట్టు టాస్ గెలుస్తుందని, ఫలానా జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని బెట్టింగ్ చేస్తారు. ఈ బెట్టింగ్లో ఒకటికి రెండింతలు చెల్లించే పద్ధతిని పాటిస్తారు. మొదటి ఓవర్లో వికెట్ పడుతుందని, సిక్సర్ కొడ్తారనే బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. తర్వాతి ఓవర్లలో బంతి, బంతికి... ఫోర్, సిక్సర్ కొడతారని, వికెట్ పడుతుందని, ఎక్స్ట్రా రన్ వస్తుందని, రివ్యూ ఛాయిస్ తీసుకుంటారంటూ పలు రకాలుగా బెట్టింగ్లు చేస్తారు. ఒక్కో సందర్భంలో బెట్టింగ్కు పాల్పడే మొత్తానికి 5 నుంచి 10 రెట్ల వరకు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. -
పల్లెపల్లెన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాలటౌన్: భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా పార్టీ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని బూత్స్థాయిలో పార్టీ జెండాను ఆయా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యకర్తలు సైతం తమ ఇళ్లపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై బీజేపీ ఆవిర్భవించిందని చెప్పారు. ఒకేదేశం, ఒకే ప్రజలు, ఒకే మతం కావాలని కోరిన ఘనత తమ పార్టీదేనని పేర్కొన్నారు. మహనీయుల అవిశ్రాంత సేవ, కృషి ఫలితంగానే జనసంఘ్ నుంచి భారతీయ జనతాపార్టీ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలు, నయవంచక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్సర్పాష, డీకే స్నిగ్దారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్ఏక్బోటే, బండల పద్మావతి, జయశ్రీ, సంజీవ్ భరద్వాజ్, వెంకటేశ్వర్రెడ్డి, నర్సింహా, దేవదాసు, అనిల్, చిత్తారికిరణ్, మమత తదితరులు పాల్గొన్నారు. -
పల్లె వనం.. కళావిహీనం
మొక్కలను కాపాడతాం పల్లె ప్రకృతి వనాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం. నీటి సాదుపాయం అందించేలా చూస్తాం. మొక్కలు ఎండకుండా కాపాడతాం. – నాగేంద్రం, జిల్లా పంచాయతీ అధికారి నిర్వహణ ముఖ్యం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే పల్లె ప్రకృతి వనాల ముఖ్య ఉద్దేశం. నిర్వహణ లేకనే లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు స్పందించి మొక్కలు ఎండకుండా ప్రతి రోజు నీరందించాలి. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచాలి. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటుచేయాలి. – విజయ్కుమార్, మాజీ సర్పంచ్, బోరవెల్లి ● నీటి సౌకర్యం లేక వాడుతున్న మొక్కలు ● ఆహ్లాదానికి దూరమవుతున్న ప్రజలు ● మందుబాబులకు అడ్డాగా మారుతున్న వైనం ●మానవపాడు: పల్లె ప్రజలకు ప్రకృతి అందాలు పంచేందుకు దాదాపు రూ.లక్షలు వెచ్చించి పెంచిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేక వృథాగా మారాయి. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని.. ఎన్నో ఔషధ మొక్కలకు నెలవుగా మారాలని.. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పల్లె ప్రకృతి వనాలు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి.. మందుబాబులకు అడ్డాగా మారాయి. మొత్తంగా పల్లె ప్రకృతి వనాలు కళతప్పాయి. జిల్లాలోని 13 మండలాల్లో 254 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో పల్లెప్రకృతివనం నిర్మించారు. రెండేళ్ల పాటు ఈజీఎస్, ఆ తర్వాత జీపీలు నిర్వహణ బాధ్యతలు చూశాయి. అయితే, గ్రామాలకు దూరంగా ఉండటం, కొన్ని గ్రామాల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, నీటి సౌకర్యం లేకపోవడం.. వీటికి తోడు వేసవి ఎండలకు మొక్కలు ఎండిపోతున్నాయి. ఊరికి దూరంగా ఉండడంతో రాత్రివేళ్లలో మద్యం బాబులు అడ్డాలుగా వాడుకుంటున్నారు.