Jogulamba District Latest News
-
హిందూ ధర్మం కోసం పాటుపడాలి
ఎర్రవల్లి: హిందూ ధర్మం, సంస్కృతిని కాపాడటం కోసం ప్రతి హిందువు పాటుపడాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఫణి మోహన్రావు అన్నారు. బుధవారం మండల పరిదిలోని బీచుపల్లిలో వివిద మండలాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై వీహెచ్పి నిర్వహిస్తున్న వివిధ అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడంతో పాటుగా సేవ చేయడం కోసం 1964లో వీహెచ్పిని స్థాపించడం జరిగిందన్నారు. దీని ద్వారా 1966లో కుంభమేళా సందర్భంగా ప్రయాగ్లో హిందువుల ప్రపంచ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి రాష్ట్రంలోని ప్రతి మండలంలో హిందూ సమాజం కోసం వీహెచ్పి పనిచేస్తూ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుందని అన్నారు. హిందూ దేవాలయాల పుణరుద్ధరణ మరియు నిర్మాణం కోసం, మతమార్పిడితో పాటు గోహత్యలను అడ్డుకునేందుకు కృషిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రసార ప్రముఖ్ సత్యం, మదన్ మోహన్, నర్సింహా, వివిద మండలాలకు చెందిన ప్రముఖ్లు, సహ ప్రముఖ్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో సివిల్ జడ్జి పూజలు
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గద్వాల సివిల్ జడ్జి గంట కవిత ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయానికి జడ్జి చేరుకోగా.. ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేరుశనగ క్వింటా రూ.6,159 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు బుధవారం 708 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6159, కనిష్టం రూ.3150, సరాసరి రూ.5919 ధరలు పలికాయి. అలాగే, 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4013 ధర వచ్చింది. దీంతోపాటు 38 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5980, కనిష్టం రూ. 4557, సరాసరి రూ. 5950 ధరలు వచ్చాయి. 262 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2057, కనిష్టం రూ. 1737, సరాసరి రూ.2026 ధరలు లభించాయి. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు– మహబూబ్నగర్), (పురుషులు–నాగర్కర్నూల్)లలో విద్యార్థులకు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని టీడబ్ల్యూ గురుకులం మహబూబ్నగర్ రీజియన్ కో–ఆర్డినేటర్ పీఎస్ కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీలో నాలుగు, ఫిజిక్స్లో రెండు, హిస్టరీ, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే ఆయా సబ్జెక్టులలో సెట్, నెట్, పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 16వ తేదీలోగా మహబూబ్నగర్ శివారు తిరుమల హిల్స్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (మహిళలు) ప్రిన్సిపాల్కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే కళాశాలలో నిర్వహించే డెమోకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.7901097704, 9848616564లను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ యా దయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెరుగైన విద్య అందించాలి తిమ్మాజిపేట/తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుదవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలకపల్లి సీఎల్ఆర్ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుపై కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు అత్యాధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చైర్మన్ను సత్కరించారు. ఆయన వెంట అధికారులు రాధాకృష్ణ, శివరాం, రామరాజు, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంఈఓలు శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణశెట్టి, సీఎల్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, రాజమహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సమృద్ధి వర్షాలతోనే..
2024–25 ఆర్థిక సంంవత్సరానికి గాను గద్వాల, అలంపూర్ యార్డులు నిర్ధేశించిన లక్ష్యానికి మించి ఆదాయాన్ని అందుకున్నాయి. ఈసారి వర్షాలు బాగా కురుసి, పంట ఉత్పత్తులు బాగా రావడంతోనే యార్డులకు ఆదాయం బాగా సమకూరింది. గద్వాల యార్డుకు నిత్యం వేరుశనగ వస్తోంది. దీనివల్ల సెస్ బాగా వచ్చింది. అలంపూర్ యార్డుకు చెక్పోస్టులతో పాటు, మిల్లులు, అయిజ సంత నుంచి బాగా ఆదాయం లభించింది. – పుష్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి ● -
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
గద్వాల: యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ముందస్తు సన్నద్ధం కావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశం హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 యాసంగిలో రైతులు పండించిన ప్రతీగింజను కొనుగోలు చేయాలన్నారు. యాసంగిలో సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో అన్ని రకాల ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు వ్యవహారం సక్రమంగా కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎస్వో స్వామి, డీఎం విమల, డీఏవో సక్రియ నాయక్, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, ఏవోలు తదితరులు పాల్గొన్నారు. -
‘వికాసానికి ’ విఘ్నాలు..!
గద్వాల యార్డులో వడ్లు కాంటా వేస్తున్న కార్మికులు ●‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తులకు అడ్డంకులు రేషన్ కార్డు లేకపోవడంతో.. రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్కార్డు అడిగారు. మాకు రేషన్కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం.. యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్నగర్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్నగర్ ● అనేక ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ● ఆన్లైన్లో మండలం, బ్యాంక్, గ్రామాల పేర్లు గల్లంతు ● రేషన్కార్డులో ఒక్కరికే అవకాశం.. కొత్తవి రాక పలువురి ఆందోళన ● కొన్ని చోట్ల కులం, ఆదాయం సర్టిఫికెట్లకూ తప్పని పాట్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ఈ ఏడాది మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. ఈ ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురైన విషయం తెలిసిందే. దీంతో సర్కారు దరఖాస్తుల తుది గడువును మార్చి 30 నుంచి ఈ నెల 14 వరకు పొడిగించింది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు రకాల సాంకేతిక సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సర్కారు నిర్దేశిత గడువుకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. దరఖాస్తుదారుల్లో ఆందోళన గూడు కట్టుకుంది. మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు నిత్యం చక్కర్లు కొడుతున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో అసహనం వ్యక్తమవుతోంది. సమస్యలు.. ఇబ్బందులు ● జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండలాన్ని మహబూబ్నగర్ జిల్లాలో చేర్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గండేడ్ మండలం నుంచి కొత్తగా మహమ్మదాబాద్ మండలం ఏర్పాటైంది. ఈ క్రమంలో ఆయా మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి.. ఆ గ్రామ పరిధిలోని బ్యాంకులు వెబ్సైట్లో కనిపించడం లేదు. ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకులను ఎంపిక చేసుకున్న పక్షంలో వారికి సంబంధం లేని గ్రామాల పేర్లు చూపిస్తోంది. ఈ సమస్య మహమ్మదాబాద్తో పాటు ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఏర్పాటైన కౌకుంట్ల, మూసాపేట, కొత్తపల్లి, గుండుమాల్, ఎర్రవల్లి, పదర, చిన్నంబావి మండల పరిధిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ● మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, చౌదర్పల్లి గ్రామాలకు సంబంధించిన పేర్లు ఒకసారి వెబ్సైట్లో కనపడుతున్నాయి. మరికొన్ని సార్లు చూపించడం లేదు. దీంతో ప్రతిరోజు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లకు క్యూ కట్టాల్సి వస్తోందని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి యువ వికాసం పథకంలో తొలుత అడ్డంకులు వచ్చాయి. వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించలేదు. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను పక్కన బెట్టడమే కాకుండా.. వెబ్సైట్లో వాటిని ఎత్తేసినట్లు సమాచారం. ప్రస్తుతం వారికి ఇబ్బంది లేకున్నా.. గతంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించకపోవడమే ఇందుకు కారణం. ● రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్, పాన్కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలి. అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయం సర్టిఫికెట్ 2024 ఏప్రిల్ తర్వాత తీసినదై ఉండాల్సి రావడంతో ఎక్కువ మంది మీ సేవ సెంటర్లు, రెవెన్యూ కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు. ఐదారు మండలాల్లో మినహా మిగిలిన మండలాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు లేవు. కుల ధ్రువీకరణలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇంటర్వ్యూలకు త్వరలో షెడ్యూల్.. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో ఇంటర్వ్యూ నిర్వహణకు అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకున్న వారి వ్యాపార పెట్టుబడి ఆధారంగా ఆయా బ్యాంకులు సబ్సిడీ రుణాలు అందజేయనున్నాయి. రూ.50 వేలు తీసుకుంటే 100 శాతం సబ్సిడీ రానుంది. రూ.లక్షకు 90 శాతం, రూ.2 లక్షలకు 80 శాతం.. ఆ తర్వాత రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ వర్తించనుంది. జూన్ రెండో తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేసి.. రుణం మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ధ్రువపత్రాల జారీలో ఆలస్యం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు నారాయణపేట జిల్లా నర్వ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవి. ఇతను రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం వారం రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. చాలామంది ఒకే సారి దరఖాస్తు చేసుకోవడంతో కాస్త ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నాడు. దరఖాస్తులను ఆన్లైన్లో కాకుండా మండల పరిషత్ కార్యాలయంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని రవి కోరుతున్నాడు. తప్పని ప‘రేషాన్’.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది కొన్నేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం రేషన్కార్డులో ఉన్న పేర్లలో ఒకరికి మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో రేషన్కార్డులకు కొత్తగా దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్న వారు యువ వికాసంలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా అర్హులై ఉండి రేషన్ కార్డు రానివారిలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలోని రైతులకు ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తేలితే వారిపై క్రిమినల్, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా గ్రామాల్లో రైతులు సాగుకు సన్నద్ధమవుతుంటారని, ఈక్రమంలోనే పలువురు వ్యాపారులు నాసీరకం విత్తనాలు, ఫర్టిలైజర్, యూరియా, పురుగుమందులు తదితర వాటిని రైతులకు విక్రయాలు చేస్తుంటారన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే అవకాశం ఉంటుందని, అలాంటి వారిపై నిఘా ఉంచాలని, విరివిగా వ్యవసాయ, పోలీసుశాఖ సంయుక్తంగా సోదాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర డీజీపీ రెండు రోజులపాటు అన్ని జిల్లా పోలీసు అధికారులతో సమావేశంలో ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బందికి వివరించారు. ఎక్కడైన బెట్టింగ్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా వంటి వాటిపై నిఘా ఉంచాలన్నారు. బాధితులతో సిబ్బంది హుందాగా వ్యవహరించి పోలీసులపై నమ్మకం కలిగేల విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, టాటాబాబు ఉన్నారు. -
బీచుపల్లిలో ముగిసిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: శ్రీరామ నవమిని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, యాగశాల చతుస్థానార్చన, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ వంటి పూజలు చేశారు. సాయంత్రం ద్వాదశారాధన, శ్రీపుష్పయాగం, ధ్వజావరోహణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి గద్వాలటౌన్: పాలమూరు యూనివర్సిటీ పరిఽఽధిలోని గద్వాల ప్రభుత్వ పీజీ సెంటర్లో మంగళవారం కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీఓ 21ని వ్యతిరేకిస్తూ తరగతులను బహిష్కరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రిన్సిపల్ వెంకటరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 21తో కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని.. పార్ట్టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంగళగిరి శ్రీనివాసులు, మహేందర్, గోపినాథ్ రాథోడ్, వంగూరి గణేశ్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,949 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 1,695 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 5,949, కనిష్టంగా రూ. 3,069, సరాసరి రూ. 5,199 ధరలు వచ్చాయి. 36 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,529, కనిష్టంగా రూ. 6,009, సరాసరి రూ. 6,529 ధరలు లభించాయి. 40 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,009, కనిష్టంగా రూ. 5,661 ధర పలికింది. 424 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,030, కనిష్టంగా రూ. 1,759, సరాసరి రూ. 2,019 ధరలు లభించాయి. -
ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్
అయిజ/మల్దకల్: విద్యార్థులు శ్రద్ధగా ఉన్నత విద్య అభ్యసిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి గంట కవితాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని పులికల్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, మధ్యాహ్న భోజనం వంట సరుకులను న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని.. ఎక్కడైనా బాల్యవివాహం చేసేందుకు సిద్ధమైతే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలకు 5 కి.మీ. దూరంలోని బైనపల్లి, కిసాన్ నగర్, రాజాపురం గ్రామాల నుంచి వస్తున్నామని, తమకు సైకిళ్లు ఇప్పించాలని విద్యార్థులు కోరగా.. దాతలతో మాట్లాడి సైకిళ్ల పంపిణీకి కృషిచేస్తానని న్యాయమూర్తి హామీ ఇచ్చారు. ● మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామిని సీనియర్ సివిల్జడ్జి కవితాదేవి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తిని శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవిచారి, చంద్రశేఖర్రావు, మధుసూదనాచారి పాల్గొన్నారు. -
రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకోండి
ఇటిక్యాల: ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకానికి అర్హులైన యువత దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ ఉన్నారు. కేటగిరీల వారీగా కేటాయింపులు గద్వాల: రాజీవ్ యువవికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం, ఒంటరి మహిళలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్, ఆదాయం, కుల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాన్స్పోర్ట్ పథకం కోసం), పట్టాదారు పుస్తకం (వ్యవసాయ సంబంధిత పథకానికి), సదరం ధ్రువపత్రం, వితంతు, ఒంటరి మహిళల ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జతపరిచి మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందించాలని సూచించారు. -
పొగాకు రైతు పరేషాన్
అకాల వర్షాలకు నల్లబారుతున్న పొగాకు మండెలు ●న్యాయం చేయాలి పొగాకు మండలను తిప్పి తిప్పి చేతులు అరిగి పోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి పంటను సాగు చేశాం. తీరా పంట విక్రయిద్దామంటే ఆయా కంపెనీలు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు గతంలో రైతులను అడిగి మరి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలతో పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. ఎక్కడ పంట నల్లగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం, అధికారులు స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలి. – వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, ఉండవెల్లి కుదేలవుతున్నారు.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలో మాత్రమే పొగాకు పంటను సాగుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతు పొగాకు పండించే ముందు మీరు సాగు చేయండి.. మేం కొంటామంటూ నమ్మబలికారు. తీరా పంట చేతికి వచ్చిన సమయంలో కంపెనీ యజమానులు చేతులెత్తేస్తున్నారు. మొత్తంగా పొగాకు సాగు చేసిన రైతు కుదేలవుతున్నారు. జిల్లా అధికారులు రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కంపెనీల యజమానులతో మాట్లాడి రైతులకు న్యాయం అందేలా చూడాలి. – ఈదన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉండవెల్లి: ఓ వైపు అకాల వర్షాల భయం.. మరోవైపు డిమాండ్ ఉన్న రకాలను మాత్రమే కొంటామంటూ ఆయా కంపెనీల నిర్వాహకులు నిబంధనలు పెడుతుండడం.. మొత్తంగా పొగాకు రైతులు పరేషాన్లో పడ్డారు. పొగాకులో 62 రకాలు ఉండగా.. ప్రధానంగా బీడీ, సిగరెట్, చుక్కబర్లి, బర్లి, అడ్–50, కస్తూరికి డిమాండ్ ఎక్కువ. గత ఏడాది పొగాకు పంటకు అధిక ధర పలకడంతో ఈ సారి కూడా లాభాలు వస్తాయని, విస్తారంగా సాగు చేయాలని ఆయా కంపెనీల నిర్వాహకులు సూచించడంతో రైతులు పొగాకులో ప్రధాన రకాలైన సిగిరేట్, బీడిని అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి అందుతుంది. ఈ పరిస్థితుల్లోనే రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అటు అకాల వర్షాలతో ఎండకు ఆరబెట్టిన పొగాకు మండెలు నల్లబారుతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యమైతే మరింత నష్టపోయే అవకాశం ఉందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు బయటి మార్కెట్లో బీడీకి రకానికి మార్కెట్ లేదంటూ కేవలం సిగరెట్ రకాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో బీడీ రకం పొగాకు సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవల బీడి రకాన్ని సాగు చేసిన రైతులు సదరు ప్రైవేట్ కంపెనీ వద్దకు పంట విక్రయించే నిమిత్తం వెళ్లగా.. కంపెనీ వద్దకు రావద్దని తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో బూజు పడుతోంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడి రకం పొగాకు అధిక మోతాదులో సాగు చేశారు. గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నియోజకవర్గాలలోని గ్రామాలకు చెందిన రైతులు పంటను సాగు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 2 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. జోగుళాంబ గద్వాల వ్యాప్తంగా 3500 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేయగా.. కేవలం అలంపూర్ నియోజకవర్గంలోనే 2500 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది పొగాకు క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ఈ ఏడాది వచ్చేసరికి అమాంతం ధర పడిపోయింది. క్వింటా రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుండడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండు నెలలుగా పొగాకు మండలను దింపడం ప్రారంభించారు. ఇదిలాఉండగా, గత పది రోజులుగా కురుస్తున్న వర్షంతో మండలు నల్లబారి బూజు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు ఆశచూపడంతో విస్తారంగా సాగు తీరా పంట చేతికి వచ్చాక.. ఆ రకానికి మార్కెట్ లేదంటూ వెనుకంజ దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు -
ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి
గద్వాల: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఈ నెల మూడో వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో పొందుపర్చాలని తెలిపారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఎదురైనా ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. సమావేశంలో డీఎస్ఓ స్వామి, డీఎం విమల, డీఏఓ సక్రియ నాయక్ తదితరులు ఉన్నారు. -
వంటింటికి గ్యాస్ సెగ
గద్వాలటౌన్: నిత్యావసరాల ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వంట నూనెలు సలసలమంటుండగా.. కూరగాయలు కంటతడి పెట్టిస్తున్నాయి. వీటికే సామాన్యుల వంటగది ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుండటంతో పేదల నెలవారీ బడ్జెట్ తలకిందలవుతోంది. తాజాగా గృహ వినియోగ 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై రూ.50 పెరగడం మరింత గుదిబండగా మారింది. ● జిల్లాలో మొత్తం 11 ఏజెన్సీలు ఉండగా.. వాటి పరిధిలో వివిధ రకాలకు చెందిన మొత్తం 1,76,578 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,68,637 కనెక్షన్లు గృహ వినియోగానికి సంబంధించినవి ఉన్నాయి. గతంలో వీటిపై ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. రానురాను ఏడాదికి ఆరు సిలిండర్లకే రాయితీని పరిమితం చేశారు. సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో పాటు రాయితీ తగ్గిపోయింది. ప్రస్తుతం సబ్సిడీని కూడా పూర్తిగా ఎత్తేశారు. అయితే ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందిన వారికే మాత్రమే రాయితీ దక్కనుంది. తాజాగా రూ.50 పెరగడంతో ప్రస్తుతం గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.925కు చేరుకుంది. అయితే జిల్లాలో ప్రతినెలా సరాసరి 70వేల గృహవినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. తాజా పెంపుతో గృహ సిలిండర్ వినియోగదారులకు ప్రతినెలా రూ. 35లక్షల వరకు అదనపు భారం పడనుంది. రెండేళ్లుగా తగ్గుతూ.. గ్యాస్ ధరలు రెండేళ్ల క్రితం భారీగా పెరగడంతో ప్రజలు సతమతమయ్యారు. తర్వాత క్రమంగా ధరలు తగ్గుతూ వచ్చాయి. 2023 మార్చి వరకు రూ. 1175 ఉన్న ధర.. నవంబర్లో రూ. 1,125కు చేరింది. తర్వాత నెల రోజులకే రూ.975కు తగ్గింది. ఇలా నాలుగు నెలలపాటు కొనసాగిన ధర 2024 మార్చి లో రూ. 875కు తగ్గింది. అప్పటి నుంచి ఏడాది పాటు ధర స్థిరంగా ఉంటూ వస్తోంది. తాజాగా గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మహాలక్ష్మి, దీపం పథకం లబ్ధిదారులపై మాత్రం పెరిగిన ధర ప్రభావం ఉండదు. భారం మోపడం తగదు.. వంట గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వాలే అలవాటు చేశాయి. సబ్సిడీలు ఇచ్చి మరీ కొనిపించారు. సబ్సిడీ నగదు క్రమేణ ఎత్తేశారు. రవాణా చార్జీలను అదనంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు సిలిండర్పై రూ.50 ధర పెంచడం దారుణం. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెంచేసి జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. సామాన్యులపై మోయలేని భారం మోపడం తగదు. – రేణుక, గృహిణి, గద్వాల వంటావార్పు కష్టమే.. అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయి. ఏం కొనలేం.. తినలేం అనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గ్యాస్ ధర పెరగడంతో వంట వండుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. సిలిండర్ ధర పెరిగిందని.. కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి లేదు. పేదలకు ఈ ధరల పెరుగుదల భారంగా మారుతుంది. – సావిత్రి, గృహిణి, గద్వాల ● గృహ వినియోగ సిలిండర్పై రూ.50 పెంపు సబ్సిడీని పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం జిల్లా వినియోగదారులపై ప్రతినెలా రూ. 35లక్షలకు పైగా భారం -
కొనుగోళ్లకు కంపెనీల అనాసక్తి
పొగాకు కంపెనీలు అయిన వీఎస్టీ, ఐటీసీ, అలియాన్స్, జీపిఐ, బొమ్మిడాల్, డెక్కన్, నూర్, తదితర కంపెనీలు ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లోనే అధికంగా ఉన్నాయి. బీడి రకం పొగాకు, చుక్కబర్లి, రకాలు త్వరగా కొంటారని ఎంతో ఆశపడి రైతులు సాగు చేశారు. ఒక్కో రైతు 10 ఎకరాలకు పైగా పొగాకును సాగు చేశారు. కానీ తీరా పంట చేతికి వచ్చే సమయంలో బయటి మార్కెట్లో ఏ రకానికి డిమాండ్ ఉంటే అదే కొనుగోలు చేస్తామంటూ కేవలం సిగరేట్ రకాన్ని కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో మిగతా రకాలు సాగు చేసిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని కంపెనీలు మీరు ఎంత సాగు చేసినా.. మేం ఇంత మేర మాత్రమే కొంటామని పేర్కొంటున్నాయి. మరికొన్ని ఈ ధర ఇస్తేనే కొనుగోలు చేస్తామని తేల్చి చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పడ్డారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 37మంది ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ ‘రగడ’..!
●మాకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్, పీయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆందోళనలు తీవ్రతరం చేస్తాంయూనివర్సిటీ ప్రారంభం నుంచి పీయూలో లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్ పోస్టుల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. కాంట్రాక్ట్ అధ్యాపకుల స మస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. – శ్రీనివాస్, వీసీ, పాలమూరు యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఊరుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవారం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు. త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్.. యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్, 60 మంది పార్ట్టైం ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొత్తం 58 రెగ్యులర్ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. ఇవి పోను 42 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూలో ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గత తొలగింపుల నేపథ్యంలో.. పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. అనంతరం వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా.. నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, హెచ్ఓడీ కన్వీనర్గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటాయించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కులు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఒక్క సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్ ఫెల్లోషిప్ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్నట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తున్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీయూలో జీఓ 21 లొల్లి శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్లో ఆందోళన దశల వారీగా తమను తొలగిస్తారని బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం మేమెందుకు అర్హులం కాదు ? ఇటీవలి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్చాన్స్లర్ శ్రీనివాస్, నూతన రిజిస్ట్రార్ రమేష్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
కేంద్రం సహకారంతోనే సన్న బియ్యం పంపిణీ
ఎర్రవల్లి: రేషన్ బియ్యం పంపిణీలో సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని..ప్రతి వ్యక్తికి అందిస్తున్న 6 కిలోల సన్నబియ్యంలో కేంద్రం ప్రభుత్వం ఐదు కిలోలు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో మాత్రమే ఇచ్చి ప్రగల్బాలు పలుకుతోందని బిజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మండిపడ్డారు. సోమవారం మండల పరిదిలోని వల్లూరు గ్రామంలో ఆ పార్టీ మండలాద్యక్షుడు జగదీష్రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసి ప్రజలకు ఉచితంగా రేషన్బియ్యం అందిస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఇటీవలె సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటోను పెట్టకుండా కేవలం సిఎం పోటోను పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులుల కే.కే రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజు, గ్రామ పెద్దలు, తదితరులు ఉన్నారు. అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మానవపాడు: అసంక్రమిత వ్యాధులు మానవ జీవితాలను నాశనం చేస్తాయని, అసంక్రమిత వ్యాధులుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశలకు అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం మరణాల్లో సుమారు 74శాతం అసంక్రమిత వ్యాధుల వల్లనే జరుగుతున్నాయని, చాలా ఎన్సీడీలు జీవనశైలి సంబంధిత కారణాలతో కలుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత స్థాయిలో బాధ్యత, సామాజిక, ఆరోగ్య సేవలపై ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమమానస, హెలెన్, చంద్రన్న, అక్కమ్మ, సూపర్వూజర్లు, ఏఎన్ఎమ్లు, ఆశలు తదితరులు పాల్గోన్నారు. గడువు పొడిగింపు గద్వాల: జిల్లాలో నిరుద్యోగ క్రిస్టియన్ యువతకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చుటకు గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 12వ తేదీ వరకు పొడగించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్బాబు ప్రకటనలో తెలిపారు. సాగునీటి కోసం రైతుల ఆందోళన అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలను నిలిపివేయడంతో సోమవారం ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆత్మకూర్ మండలంలోని ఆరెపల్లి, కత్తేపల్లి, తూంపల్లి గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వద్దకు చేరుకొని గద్వాల– అమరచింత రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేతికొచ్చే దశలో ఉన్న యాసంగి పంటలకు సాగునీరు అందించక పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి సాగుకు వారబందీ ద్వారా సాగునీటిని క్రమం తప్పకుండా అందిస్తామన్న అధికారులు.. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. వారబందీ విధానంలో మరో రెండు పర్యాయాలు సాగునీరు వదలాలని డిమాండ్ చేశారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులపాటు సాగునీటిని కాల్వలకు వదులుతామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో రైతులు ధర్నాను విరమించారు. పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు అందించాలని ఏఈ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు. -
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మానవపాడు: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారి గంట కవిత సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో భవిష్య భారత్ ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మద్యం, సిగరెట్, గుట్కా, సారా వంటి వ్యసనాలను నియంత్రించాలని అన్నారు. బాల్యవివాహాలపై గ్రామస్థాయిలో ప్రజలకు ఆశ వర్కర్లు అవగాహన కల్పించాలని, వాటి వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అది చెడిపోతే కుటుంబం నాశనం అవుతుందని పేర్కొన్నారు. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేది ఒక్క వైద్యులు, వైద్య సిబ్బందికేనని, ఆశ కార్యకర్తలు ఆరోగ్య సైనికులని, గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆరోగ్యంపై, వ్యాసనాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అనంతరం జడ్జితోపాటు ప్రాజెక్ట్ మేనేజర్ నాగరాజు క్షయ వ్యాధికి సంబందించి పలువురికి ఆరోగ్య, పోషకకిట్లను అందించారు. ఎస్బీఐ భవిష్య అంబులెన్స్ సేవలను గురించి, బ్లడ్ పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధులు వెంటనే పరీక్షలు వివరలను రోగులకు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి రాజు, నోడల్ అఫీసర్ సాధిక్, డాక్టర్ హేమమానస, సూపర్వైజర్ చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి పట్టాభిషేకం
ఎర్రవల్లి/ఉండవెల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు ఉదయం ఆలయంలో అర్చకులు సుప్రభాతసేవ, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి, తదనంతరం విష్వక్షేనపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, వస్త్రసమర్పన, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల నడుమ కనులపండువగా చేపట్టారు. నేత్రపర్వం.. రథోత్సవం ఉండవెల్లి మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో రాములోరి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఓ వైపు బాలికలు, చిన్నారుల కోలాటాలు.. మహిళల మంగళహారతుల నడుమ కనులపండువగా సాగింది. బీచుపల్లిలో రాములోరికి పట్టాభిషేకం చేస్తున్న అర్చకులు -
బెట్టింగ్ భూతం..!
ఈజీమనీ ఆశతో రూ.లక్షలకు లక్షలు బెట్టింగ్ గద్వాల క్రైం: ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అన్న యువత అత్యాశను కొన్ని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. యువతకు మొదట్లో డబ్బు వస్తున్నట్లు ఆశ చూపించి.. బెట్టింగ్ ఊబిలోకి దింపడం.. తీరా రూ.వేల నుంచి రూ.లక్షలు బెట్టింగ్ వేశాక కోరుకోలేని దెబ్బతీస్తున్నారు. అటు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. వారి ఒత్తిళ్లు భరించలేక.. కుటుంబసభ్యులకు ఏం చేప్పుకోవాలో తెలియక జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కావడంతో నడిగడ్డలో ఆన్లైన్ బెట్టింగ్లకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్లు మొబైల్స్ రాకతో పట్టణ, గ్రామీణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో పందెం ఆట విడుపుగా మారింది. పందెంలో వేసిన డబ్బులు పోగుట్టుకున్న వారంతా అప్పులు చేసి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ఘటనలు ● ఈ ఏడాది మార్చి 30న జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు(25) ఆన్లైన్లో క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లు వేస్తు రూ.6లక్షలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఓ కారును తాకట్టు పెట్టి కొంత మేర అప్పు తీర్చాడు. అయినప్పటికీ మిగతా అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇదే మొదటిసారి కాదు డబ్బులు ఇవ్వడం అంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ● ఈ నెల 5వ తేదీన గద్వాల మండలానికి చెందిన ఓ యువకుడు(22) ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఆన్లైన్లో బెట్టింగ్లు వేశాడు. బెట్టింగ్ ఓడిపోవడంతో వారికి డబ్బు చెల్లించేందుకుగాను తెలిసిన వ్యక్తుల ద్వారా రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారు మందలించారు. దీంతో కలత చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ● జూన్ 2.2023 జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రికెట్ బెట్టింగ్లో రూ. 70లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు క్రికెట్ బెట్టింగ్లో ప్రముఖులు సైతం రూ.కోట్ల పోగొట్టుకున్నారు. కొందరు అప్పులు చెల్లించే దుస్థితి లేకపోవడంతో జిల్లా విడచి పారిపోయారు. ఏజెంట్లపై గద్వాల, శాంతినగర్, రాజోళి, అయిజ, ఉండవెల్లి తదితర పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలి క్రికెట్, ఇతర బెట్టింగ్లకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలి. ఇలా బెట్టింగ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో సిబ్బందికి దిశానిర్ధేశం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటే అనుమానించాల్సిందే. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సైబర్క్రైం వెబ్సైట్, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930, డయల్ 100కు ఫిర్యాదు చేయాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడితో యువత సతమతం జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరి బలవన్మరణం మాయాజాలం టీవీలలో క్రికెట్ చూస్తూ టాస్ మొదలుకుని, వికెట్ల చొప్పున, బంతి, బంతికి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. మ్యాచ్లో తలపడే జట్టులో ఫలానా జట్టు టాస్ గెలుస్తుందని, ఫలానా జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని బెట్టింగ్ చేస్తారు. ఈ బెట్టింగ్లో ఒకటికి రెండింతలు చెల్లించే పద్ధతిని పాటిస్తారు. మొదటి ఓవర్లో వికెట్ పడుతుందని, సిక్సర్ కొడ్తారనే బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. తర్వాతి ఓవర్లలో బంతి, బంతికి... ఫోర్, సిక్సర్ కొడతారని, వికెట్ పడుతుందని, ఎక్స్ట్రా రన్ వస్తుందని, రివ్యూ ఛాయిస్ తీసుకుంటారంటూ పలు రకాలుగా బెట్టింగ్లు చేస్తారు. ఒక్కో సందర్భంలో బెట్టింగ్కు పాల్పడే మొత్తానికి 5 నుంచి 10 రెట్ల వరకు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. -
పల్లెపల్లెన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాలటౌన్: భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా పార్టీ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని బూత్స్థాయిలో పార్టీ జెండాను ఆయా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యకర్తలు సైతం తమ ఇళ్లపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై బీజేపీ ఆవిర్భవించిందని చెప్పారు. ఒకేదేశం, ఒకే ప్రజలు, ఒకే మతం కావాలని కోరిన ఘనత తమ పార్టీదేనని పేర్కొన్నారు. మహనీయుల అవిశ్రాంత సేవ, కృషి ఫలితంగానే జనసంఘ్ నుంచి భారతీయ జనతాపార్టీ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలు, నయవంచక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్సర్పాష, డీకే స్నిగ్దారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్ఏక్బోటే, బండల పద్మావతి, జయశ్రీ, సంజీవ్ భరద్వాజ్, వెంకటేశ్వర్రెడ్డి, నర్సింహా, దేవదాసు, అనిల్, చిత్తారికిరణ్, మమత తదితరులు పాల్గొన్నారు. -
పల్లె వనం.. కళావిహీనం
మొక్కలను కాపాడతాం పల్లె ప్రకృతి వనాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం. నీటి సాదుపాయం అందించేలా చూస్తాం. మొక్కలు ఎండకుండా కాపాడతాం. – నాగేంద్రం, జిల్లా పంచాయతీ అధికారి నిర్వహణ ముఖ్యం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే పల్లె ప్రకృతి వనాల ముఖ్య ఉద్దేశం. నిర్వహణ లేకనే లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు స్పందించి మొక్కలు ఎండకుండా ప్రతి రోజు నీరందించాలి. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచాలి. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటుచేయాలి. – విజయ్కుమార్, మాజీ సర్పంచ్, బోరవెల్లి ● నీటి సౌకర్యం లేక వాడుతున్న మొక్కలు ● ఆహ్లాదానికి దూరమవుతున్న ప్రజలు ● మందుబాబులకు అడ్డాగా మారుతున్న వైనం ●మానవపాడు: పల్లె ప్రజలకు ప్రకృతి అందాలు పంచేందుకు దాదాపు రూ.లక్షలు వెచ్చించి పెంచిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేక వృథాగా మారాయి. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని.. ఎన్నో ఔషధ మొక్కలకు నెలవుగా మారాలని.. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పల్లె ప్రకృతి వనాలు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి.. మందుబాబులకు అడ్డాగా మారాయి. మొత్తంగా పల్లె ప్రకృతి వనాలు కళతప్పాయి. జిల్లాలోని 13 మండలాల్లో 254 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో పల్లెప్రకృతివనం నిర్మించారు. రెండేళ్ల పాటు ఈజీఎస్, ఆ తర్వాత జీపీలు నిర్వహణ బాధ్యతలు చూశాయి. అయితే, గ్రామాలకు దూరంగా ఉండటం, కొన్ని గ్రామాల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, నీటి సౌకర్యం లేకపోవడం.. వీటికి తోడు వేసవి ఎండలకు మొక్కలు ఎండిపోతున్నాయి. ఊరికి దూరంగా ఉండడంతో రాత్రివేళ్లలో మద్యం బాబులు అడ్డాలుగా వాడుకుంటున్నారు. -
జగమంతా రామమయం
జోగుళాంబ గద్వాలకనుల పండువగా సీతారాముల కల్యాణ మహోత్సవం వాతావరణం ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది. ఆకాశం స్వల్పంగా మేఘావృతమై ఉంటుంది. సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 8లో u● జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగిన కల్యాణోత్సవాలు ● తరలివచ్చిన భక్తజనం గద్వాలటౌన్: ఆకాశమంత పెళ్లిపందిరి.. భూలోకమంత కల్యాణ వేదిక.. అష్టదిక్కులా మార్మోగుతున్న మంత్రోచ్ఛరణల నడుమ జగదాభిరాముడు జానకి మెడలో మాంగల్యధారణ చేశారు. అంగరంగ వైభవంగా కోదండరాముని కల్యాణం జరిగింది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు నిర్వహించారు. అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయ ప్రాంగంణంలో, బీచుపల్లిలోని శ్రీ కోదండరామాలయంలో, ధరూర్ పాగుంట లక్ష్మివెంకటేశ్వరస్వామి ఆలయం, మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం, గద్వాల మండలంలోని చెనుగోనిపల్లి, సంగాల, కొండపల్లి, గోనుపాడు, పరుమాల గ్రామాల్లో కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కోటలోని రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని మంత్రాలయ మఠం ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతల ప్రత్యేక పూజలు. శ్రీరామనవమి వేడుకలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ తదితరులు వివిధ ఆలయాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల, మల్దకల్, ధరూర్, కేటీదొడ్డి మండలాల్లోని ఆలయాలలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడు సుగుణాభిరాముడు, ఆయన జీవితం మానవలోకానికి ఆదర్శమని ఆయన అన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత జిల్లా కేంద్రంలోని ఆలయాలతో పాటు గద్వాల మండలంలో పలు గ్రామాలలో జరిగిన కల్యాణత్సవ ఘట్టానికి ముందు జరిగే పూజా కార్యక్రమాలలో ఆమె శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భారతీయ సమిష్టి కుటుంబంలో పెద్ద కొడుకు, భర్త, అన్న, ప్రభువు, ఎలా ఉండాలో ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతుడు కోదండరాముడన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుఖశాంతలతో జీవించాలని ఆ కల్యాణరాముడ్ని కోరుకున్నానని చెప్పారు. మార్మోగిన రామనమం.. గద్వాలటౌన్: రామ నామంతో గద్వాల పట్టణ పురువీధులు మార్మోగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సాయంత్రం చేపట్టిన శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్దళ్, విశ్వహిందు పరిషత్, దర్మ ప్రసార సమితి, బీజేపీ నాయకులతో పాటు ఏబీవీపీ విద్యార్థులు, వివేకానంద సేవాదళ్, హిందూ ధార్మిక సంఘాలతో గద్వాల పట్టణం కాషాయరంగును సంతరించుకుంది. శ్రీరాముని పాటలు, ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎస్పీ మొగిలయ్య ఆధ్వర్యంలో యాత్రను ఎప్పటికప్పుడు సీఐ శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు. ఆరుగురు ఎస్సైలు, 50మంది పోలీసు సిబ్బంది శోభయాత్ర గస్తీలో పాల్గొన్నారు. చారకొండ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో ఆదివారం సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జగదభిరాముడి కల్యాణ వైభోగాన్ని భక్తజనం కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీతారామచంద్రస్వామిని పట్టువస్త్రాలతో చూడముచ్చటగా అలంకరించి.. మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా జరిపించారు. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులుగా.. జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలైన వేళ సిర్సనగండ్ల క్షేత్రం భక్తిపారవశ్యంతో ఉప్పొంగింది. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో గంటల తరబడి బారులుదీరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిర్సనగండ్ల దేవాలయం అభివృద్ధికి టూరిజం, సాంస్కృతికశాఖ నుంచి తక్షణమే రూ.2 కోట్లు విడుదల చేస్తామన్నారు. అలాగే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మరో రూ.50 కోట్ల మంజూరుకు కృషిచేస్తానన్నారు. దేవాలయ అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవానికి దాదాపుగా 30 వేల మంది భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు. గద్వాలలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అపర భద్రాద్రి సిర్సనగండ్లలో ఉప్పొంగిన భక్తిపారవశ్యం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ భవన్లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కల్పించబడిన చట్టబద్ధ హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక కర్షక ఫాసిస్ట్ విధానాలపై మే రెండో వారంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. -
జగ్జీవన్రాం జీవితం.. ఆదర్శనీయం
గొప్ప విప్లవకారుడు.. సమాజంలో అసమానతలపై పోరాటం సలిపిన గొప్ప విప్లవకారుడు బాబు జగ్జీవన్రాం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బోయ వెంకట్రాములు, గడ్డం కృష్ణారెడ్డి, బండారి భాస్కర్, శ్రీధర్గౌడ్, మురళి, కురుమన్న పాల్గొన్నారు. గద్వాల: సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవిత పర్యాంతం శ్రమించిన గొప్ప మహనీయుడు దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రాం అని కలెక్టర్ బీఎం సంతోష్ కొనియాడారు. శనివారం బాబు జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రాం స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా.. స్వాతంత్య్రం అనంతరం దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్నారు. రక్షణశాఖ మంత్రిగా ఇండో, పాక్ యుద్ధ సమయంలో దేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో నాయకత్వం వహించినట్లు తెలిపారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్రాం జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సరోజ, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రమేశ్బాబు, ఇన్చార్జి డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్ మల్లిఖార్జున్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ఊరట
2025–26 ఆర్థిక సంవత్సరం పంట రుణపరిమితి పెంపు వివరాలు 8లో u●ఆదేశాలు జారీ.. పంట రుణాల పరిమితిని పెంచుతూ ఎస్ఎల్టీసీ నుంచి ఇటీవలే ఉత్తర్వులు అందాయి. ఈ వివరాలను జిల్లాలోని అన్ని బ్యాంకులకు పంపించాం. 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లలో పెంచిన రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు అందించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ మేరకు బ్యాంకర్లు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – అయ్యపురెడ్డి, ఎల్డీఎం గద్వాలన్యూటౌన్: బ్యాంకుల ద్వారా రైతులకు అందించే పంట రుణాల పరిమితి పెరిగింది. వివిధ రకాల పంటలకు ఇచ్చే రుణాల పరిమితిని పెంచుతూ జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్టీసీ) చేసిన ప్రతిపాదనలను ఎస్ఎల్టీసీ ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఏటా పంట రుణాలు పొందుతున్న అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెంపు.. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు డీసీసీబీ ఆద్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయిలో బ్యాంకర్లు, వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో వివిధ రకాల పంటలకు అయ్యే పెట్టుబడులు, ఇతరాత్ర అయ్యే ఖర్చులు, గడిచిన ఆర్థిక సంవత్సరం ఆయా పంటలకు ఇచ్చిన రుణాల గురించి చర్చిస్తారు. ఆయా పంటలకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన రుణాలు ఎంతమేర పెంచాలో చర్చించి, ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఇందులో భాగంగా 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో పంట రుణ పరిమితిపై గత మార్చిలో నిర్వహించిన డీఎల్టీసీ సమావేశంలో పంట రుణపరిమితిపై ప్రతిపాదనలు రూపొందించి స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ)కి నివేదించారు. అధికారులు అక్కడ మరోసారి చర్చించి.. పంట రుణపరిమితిని పెంచుతూ మార్చి 26న నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు రూ. వెయ్యి నుంచి రూ. 2వేల వరకు పెంచారు. అదే విధంగా కూరగాయల తోటలకు సంబంధించి సాధారణ సాగుకు రూ. వెయ్యి నుంచి రూ. 2వేల వరకు, మల్చింగ్ పద్ధతిన సాగుకు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు రుణపరిమితిని పెంచారు. గతేడాది ఎకరాకు ఇచ్చిన, ఈఏడాది ఇవ్వనున్న రుణ వివరాలు (రూ.లలో).. ప్రధాన పంటలకు ఇలా.. పంట 2024–25 2025–26 వరి 43,000–45,000 44,000–46,000 వరి (సీడ్) 48,000–50,000 48,000–50,000 జొన్న 18,000–20,000 19,000–21,000 జొన్న (సీడ్) 22,000–25,000 24,000–26,000 మొక్కజొన్న 32,000–34,000 34,000–36,000 సజ్జ 15,000–17,000 16,000–18,000 కంది 22,000–24,000 23,000–25,000 పప్పుశనగ 24,000–26,000 25,000–27,000 పత్తి 44,000–46,000 46,000–48,000 పత్తి (సీడ్) 1,40,000–1,50,000 1,40,000–1,50,000 వేరుశనగ 28,000–30,000 30,000–32,000 ఆముదం 19,000–20,000 20,000–21,000 పండ్లతోటలకు ఇలా.. రకం 2024–25 2025–26 మామిడి 42,000–44,000 45,000–47,000 మామిడి (హైడెన్సిటి) 60,000–65,000 64,000–66,000 పొప్పాయి 65,000–67,000 67,000–69,000 కలంగడి 33,000–35,000 34,000–36,000 జామ 45,000–47,000 47,000–49,000 బత్తాయి 43,000–45,000 45,000–47,000 దానిమ్మ 75,000–77,000 76,000–78,000 నిమ్మ 48,000–50,000 50,000–52,000 కూరగాయలకు ఇలా.. రకం 2024–25 2025–26 ఎండుమిర్చి 82,000–84,000 84,000–86,000 టమాటా 53,000–55,000 55,000–57,000 వంకాయ 38,000–40,000 40,000–42,000 ఉల్లి 43,000–45,000 45,000–47,000 బెండ 28,000–30,000 30,000–32,000 క్యాబేజీ 33,000–35,000 33,000–35,000 క్యాలీఫ్లవర్ 32,000–34,000 33,000–35,000 మునగ 33,000–35,000 34,000–36,000 క్యాప్సికమ్ 48,000–50,000 50,000–52,000 బ్యాంకు రుణాలపైనే ఆధారం.. జోగుళాంబ గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఇక్కడ జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, 120 దాకా చెరువులు, కుంటలు ఉన్నాయి. జిల్లాలో వేలాది మంది సన్న, చిన్నకారు రైతులు ఏటా పంట పెట్టుబడులకై బ్యాంకు రుణాలపైనే ఆధార పడతారు. పంట రుణ పరిమితి పెంచడం రైతులకు ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఏటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాాలం కలిసి వస్తేనే అన్నదాతకు కొంత డబ్బు మిగులుతోంది. పంట పెట్టుబడులకు రైతుభరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పథకాలు ఉన్నా.. వాటితో రైతుల అవసరాలు పూర్తిగా తీరవు. ఈక్రమంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది. ఎకరాకు రూ. 3వేల వరకు పెంచుతూ ఎస్ఎల్టీసీ ఉత్తర్వులు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ వానాకాలం, యాసంగి సీజన్లలో రుణాలు పొందే రైతులకు ప్రయోజనం -
భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం, చతుస్థానార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, గరుడపట గ్రామోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. నేడు సీతారాముల కల్యాణోత్సవం.. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. భక్తులు రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. వక్ఫ్ సవరణతో పేద ముస్లింలకు మేలు గద్వాలటౌన్: వక్ఫ్ సవరణ బిల్లుతో పేద ముస్లింలకు ఎంతో మేలు చేకూరుతుందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్పాషా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు పేరుతో ఇంతకాలం జరిగిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. వెనుకబడిన ముస్లింలకు ఇది ఆర్థికపరమైన ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. పేద ముస్లింలు బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు. సమావవేశంలో బీజేపీ నాయకులు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రవికుమార్, మాలీం ఇసాక్, మోహిద్ ఖాన్, ఆసిఫ్, అతాఉర్ రహమాన్, దేవదాసు, నర్సింహ తదితరులు ఉన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
రాజోళి/శాంతినగర్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. రాజోళి మండల కేంద్రం, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళారుల మాటలు నమ్మి సన్నబియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. అదే విధంగా రాజోళిలో కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పి.రామ్మోహన్, వీరభద్రప్ప, డీటీలు శ్రీకాంత్రెడ్డి, ప్రశాంత్గౌడ్, ఆర్ఐ సర్ధార్, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,289 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 1,265 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,289, కనిష్టంగా రూ. 3,019, సరాసరి రూ. 4,789 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,369, కనిష్టంగా రూ. 5,116, సరాసరి రూ. 6,369 ధరలు లభించాయి. 116 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,361, సరాసరి రూ. 6,091 ధరలు పలికాయి. 75 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,016, కనిష్టం రూ. 1,911, సరాసరి రూ. 1,982 ధరలు వచ్చాయి. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మెల్బోర్న్లోని బియాండ్ యువర్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సరోజ గుల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం పీయూలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పక్షుల ఎదుగుదల, జీవితంతో పోరాటం తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. వ్యక్తి అభిరుచికి అనుగుణంగా స్వేచ్ఛను అనుభవించాలని, ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో కొత్త అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, సిద్ధరామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. యువతులతో ఉద్యోగి అసభ్యకర ప్రవర్తన కేటీదొడ్డి: ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఓ యువకుడు మండలంలోని యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న యువతుల తల్లిదండ్రులు సదరు ఉద్యోగిని నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
సీతమ్మకు కీలక పదవి
రాజకీయరంగ ప్రస్థానం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె.. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీచేసి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్రెడ్డిపై 19,034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఆల వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఆమె పరాజయం పొందారు. ● 2023 సెప్టెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో సీతా దయాకర్రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి భార్యాభర్తలిద్దరూ కలిసి అసెంబ్లీలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. నారాయణపేట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్తకోట దయాకర్రెడ్డి కుటుంబానికి పదవి వరించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్రెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 45 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీతా దయాకర్రెడ్డి హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కొనసాగనున్నారు. సీతా దయాకర్రెడ్డికి కీలక పదవి రావడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దయాకర్రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం.. కుటుంబ నేపథ్యం సీతాదయాకర్ రెడ్డి 1961 అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో జన్మించారు. ఆర్బీవీఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ (1977–79), బీఏ (1979–82) పూర్తిచేశారు. 1982–84లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివారు. 1984 ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు. మక్తల్ టికెట్ ఆశించిన సమయంలో భరోసా.. దయాకర్రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్దఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు సీతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కాంగ్రెస్ టికెట్ మక్తల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి టికెట్ ఇస్తూ.. గెలిపించుకొని రావాలని, భవిష్యత్లో కీలక పదవి అప్పగిస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఎలాంటి రాజకీయ తప్పిదాలు జరగకుండా వాకిటి శ్రీహరి గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. టీడీపీని వీడుతూ కంటతడి.. సుదీర్ఘకాలం దయాకర్రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే 2022లో వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపించడంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే 2023 జూన్లో దయాకర్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. రాజకీయ పరిణమాలతో రేవంత్రెడ్డి సమక్షంలో సీతమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్రెడ్డి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి దయాకర్రెడ్డి కుటుంబానికి పెద్దపీట -
రాయితీ రాబడి
బల్దియాల్లో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం సబ్సిడీ గద్వాలటౌన్: ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం తాజాగా ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరు వరకు పన్ను బకాయిలు చెల్లించిన యజమానులు.. 2025–26 ఆర్థిక సంవత్సవానికి సంబంధించిన ఆస్తిపన్ను ఈ నెలాఖరు వరకు చెల్లించి రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో క్రమంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. ● 2025–26 ఆర్థిక సంవత్సరంచెల్లింపుదారులకు ప్రోత్సాహకం ● ఈ నెలాఖరు వరకు గడువు ● మున్సిపల్ ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం -
రాయితీ రాబడి
బల్దియాల్లో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం సబ్సిడీ గద్వాలటౌన్: ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం తాజాగా ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరు వరకు పన్ను బకాయిలు చెల్లించిన యజమానులు.. 2025–26 ఆర్థిక సంవత్సవానికి సంబంధించిన ఆస్తిపన్ను ఈ నెలాఖరు వరకు చెల్లించి రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో క్రమంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. ● 2025–26 ఆర్థిక సంవత్సరంచెల్లింపుదారులకు ప్రోత్సాహకం ● ఈ నెలాఖరు వరకు గడువు ● మున్సిపల్ ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం -
సద్వినియోగం చేసుకోవాలి
రాజోళి/శాంతినగర్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. రాజోళి మండల కేంద్రం, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళారుల మాటలు నమ్మి సన్నబియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. అదే విధంగా రాజోళిలో కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పి.రామ్మోహన్, వీరభద్రప్ప, డీటీలు శ్రీకాంత్రెడ్డి, ప్రశాంత్గౌడ్, ఆర్ఐ సర్ధార్, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,289 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 1,265 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,289, కనిష్టంగా రూ. 3,019, సరాసరి రూ. 4,789 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,369, కనిష్టంగా రూ. 5,116, సరాసరి రూ. 6,369 ధరలు లభించాయి. 116 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,361, సరాసరి రూ. 6,091 ధరలు పలికాయి. 75 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,016, కనిష్టం రూ. 1,911, సరాసరి రూ. 1,982 ధరలు వచ్చాయి. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మెల్బోర్న్లోని బియాండ్ యువర్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సరోజ గుల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం పీయూలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పక్షుల ఎదుగుదల, జీవితంతో పోరాటం తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. వ్యక్తి అభిరుచికి అనుగుణంగా స్వేచ్ఛను అనుభవించాలని, ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో కొత్త అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, సిద్ధరామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. యువతులతో ఉద్యోగి అసభ్యకర ప్రవర్తన కేటీదొడ్డి: ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఓ యువకుడు మండలంలోని యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న యువతుల తల్లిదండ్రులు సదరు ఉద్యోగిని నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
బీచుపల్లిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఎర్రవలి: బీచుపల్లి పుణ్య క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆలయంలో గరుడ పటంతో గ్రామ ప్రదక్షిణ, ద్వజస్తంభ స్నపనం, ధ్వజారోహణం, అష్టదిగ్భందనం, యాగశాలలో ప్రధాన కుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ట, మూర్తి మంత్ర హోమం, లఘుపూర్ణాహులి, తీర్థప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పలువురు దంపతులు సంతానం కోసం గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
గద్వాల క్రైం: కేసుల నమోదు విషయంలో ఏస్థాయి అధికారి అయినా నిర్లక్ష్యం.. అవినీతి, అక్రమ దందాల వ్యవహారంలో అంటకాగినట్లు బహిర్గతమైతే ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ప్రజలకు, యువతకు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఉండాలని జిల్లా పోలీసు శాఖకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై ప్రత్యేక బృందం విచారణకు శ్రీకారం చుట్టిందన్నారు. యువత బెట్టింగ్ యాప్ల ద్వారా తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న ఘటనలు ప్రతి చోట వెలుగులోకి వస్తున్నాయని.. ఈ కేసుల విచారణకు సీట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నడిగడ్డలో నమోదైన బెట్టింగ్ కేసుల నివేదికలను అందించాలని డీజీపీ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో నిషేధిత మత్తు పదార్థాలు, ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు నిఘా పెంచాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాధ్యమైనంత వేగంగా నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి.. రౌడీ షిట్ ఓపెన్ చేయాలన్నారు. మావోయిస్టు, ప్రభుత్వ వ్యతిరేకత అంశాలపై ద్వేషం, హింసాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని సూచించారు. ● జిల్లాలో బాలికలు, మహిళలను ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే అలసత్వం వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రార్థనా మందిరాలు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, సంత బజారుల వద్ద షీ టీం, బ్లూకోర్టు, నిఘా బృందాలతో గస్తీ పెంచాలని సూచించారు. బాధితులకు భరోసా కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యం నింపాలన్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు మేము సైతం కార్యక్రమం ద్వారా చేయూత అందించాలని అన్నారు. నమోదైన కేసులపై ఆరా.. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి అంశాలపై ఎస్పీ శ్రీనివాసరావును డీజీపీ అడిగి తెలుసుకున్నారు. చీటింగ్, సైబర్ క్రైం, ఉద్యోగాల పేరుతో మోసం, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద కేసులు, చోరీలు, పేకాట, మత ఘర్షణలు తదితర కేసుల నమోదు విషయంలో సిబ్బంది సాంకేతిక ఆధారాలు, అవసరమైన సాక్షుల వాగ్మూలంతో నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. సమావేశంలో మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, ఐజీ ఎల్ఎస్ చౌహాన్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రమేశ్, డీఎస్పీ మొగులయ్య, సీఐలు శ్రీను, టాటాబాబు, రవిబాబు, నాగేశ్వరెడ్డి, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, నాగశేఖర్రెడ్డి, శ్రీనివాసరావు, జగదీశ్, నందికార్ తదితరులు ఉన్నారు. యువతకు దిక్సూచిగా వ్యవహరించండి ఆన్లైన్ బెట్టింగ్లపై ప్రత్యేక విచారణ మహిళలపై వేధింపుల విషయంలో అలసత్వం వద్దు రాష్ట్ర సరిహద్దులో నిఘా పెంచండి డీజీపీ జితేందర్ -
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు
గద్వాల: ఎల్ఆర్ఎస్ పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ రాయితీ గడువును ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పొడిగించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచాలి అలంపూర్ రూరల్: పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచాలని సీపీఎం మండల కార్యదర్శి జి కే ఈదన్న కోరారు. అలంపూర్ మండలంలో గురువారం కురిసిన వర్షానికి రైతులు పొలాల్లో పొగాకు మండెలను తాటిఫారంతో కప్పేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో ఆయన పలు పొగాకు పంటలను పరిశీలించడంతోపాటు రైతులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ మండల వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పొగాకు పంటను ఐటీసీ, వీఎస్టీ, జీపీఐ, అలయన్స్ తదితర కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుని పొగాకు పంటను కొనుగోలు చేస్తున్నాంటారన్నారు. అయితే పొగాకు కంపెనీలు కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడంతో రైతులు అనేక అవస్థలను పడుతున్నారని, అకాల వర్షాలతో రైతులు మరింత ఆందోళన చెందున్నారని అన్నారు. గురువారం కురిసిన వర్షానికి పొగాకు పంట నాణ్యత తగ్గుతుందేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారని, ఒక వైపు కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వాతావరణం సహకరించకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పొగాకు కంపెనీలు గుర్తించి నూతనంగా కొనుగోలు కేంఽద్రాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రైతుల నుండి పొగాకు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మోస్తరు వర్షం గద్వాలవ్యవసాయం: గద్వాల పట్టణంలో గురువారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చిన్నపాటి జల్లులతో వర్షం పడింది. అయితే రైతులు ఎప్పటిలాగే మార్కెట్ యార్డుకు వేరుశనగ, ఆముదాలు, వడ్లు, కందులు విక్రయానికి తీసుకొచ్చారు. పలువురు రైతులు ధాన్యాన్ని షెడ్లలో పోశారు. పది గంటల ప్రాంతంలో ఎండ ఉండటంతో కొంత మంది రైతులు వేరుశనగను యార్డు ఆవరణలో పోశారు. కాగా ధాన్యం టెండర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, కాంటా చేసే సమయంలో చిన్నపాటి జల్లులతో వర్షం వచ్చింది. వేరుశనగ తడవకుండా వెంటనే హమాలీలు, దడవాయిలు, ఇతర చాట కూలీలు రైతులతో కలిసి కవర్లు కప్పారు. వర్షం బంద్ అయిన తర్వాత కాంటా వేసి మిల్లులకు తరలించారు. వర్షం కారణంగా కొంత వేరుశనగ ధాన్యం తడిసింది. అప్పటికే టెండర్ ప్రక్రియ ముగిసినందున విక్రయించిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని యార్డు అధికారులు తెలిపారు. కొద్దిగా తడిసిన వేరుశనగను.. కొనుగోలు చేసిన వ్యాపారస్తులు మిల్లులో ఆరబెడతారని, వారికి సైతం ఎలాంటి నష్టం జరగదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యార్డు ఆవరణలోని సిమెంట్ ఫ్లోరింగ్కు పలు చోట్ల గుంతలు పడ్డాయని, దీనివల్ల చిన్నపాటి వర్షం వచ్చిన నీరు నిల్వ ఉండి ధాన్యం తడుస్తోందని, ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. వేరుశనగ క్వింటా రూ.6,380 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 1,517 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6380, కనిష్టం రూ.2889, సరాసరి రూ. 5810 ధరలు పలికాయి. అలాగే, 40 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6519, కనిష్టం రూ. 3029, సరాసరి రూ. 6519 ధరలు వచ్చాయి. 51 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.6021, కనిష్టం రూ.5509, సరాసరి రూ. 5979 ధరలు వచ్చాయి. 229 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 1751, సరాసరి ధర రూ.2016 ధరలు లభించాయి. -
పిడుగు పడి ఇద్దరు కూలీలు..
అచ్చంపేట: పదర గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు పదర గ్రామానికి చెందిన రైతు పోగుల వినోద్ పొలంలో వేరుశనగ పంట తీసేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కూలీలు కొంత మంది చెట్ల కింద తలదాచుకోగా.. చెట్ల కింద పిడుగులు పడుతాయనే ఉద్దేశంతో వర్షంలోనే ఒకే దగ్గర నిల్చున్న సుంకరి సైదమ్మ(45), గాజుల వీరమ్మ(55), సుంకరి లక్ష్మమ్మలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను వెంటనే పదర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో కోడోనిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. పదర ఎస్ఐ సర్దామ్, ఆర్ఐ శేఖర్ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. గేదెలు మేపుతుండగా.. మానవపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్నగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) గేదెలను మేపేందుకు గురువారం వెళ్లాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు భార్య లక్ష్మీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ చంద్రకాంత్ను సంప్రదించగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. బుడమొర్సులో మరొకరు.. శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని బుడమర్సు గ్రామానికి చెందిన మాదిగ రాజు, తిమ్మక్కల చిన్న కుమారుడు మహేంద్ర(21) గురువారం గేదెలు మేపడానికి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు మహేంద్ర సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా మహేంద్ర రాకపోవడంతో కుంటుంబ సభ్యులు తుంగభద్ర నదితీరానికి వెళ్లి చూడగా విగతజీవుడై కనిపించడంతో బోరున విలపించారు. -
సూరాపూర్లో మరో రైతు..
లింగాల: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సూరాపూర్కు చెందిన రైతు దేశ పర్వతాలు(40) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి గురువారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో స్టార్టర్ దగ్గర తేలి ఉన్న వైరు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పర్వతాలుకు భార్య చిట్టెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
లైంగిక దాడులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
గద్వాల క్రైం: లైంగిక దాడుల విషయంలో ఎవరూ అధైర్యపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళల హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుతోనే సమ్యలపై విజయం సాధిస్తుందన్నారు. ఇంటా, బైటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల హక్కులు, లైంగిక దోపిడీలాంటి సమస్యల వలయంలో ఎందరో మహిళలు ఉన్నారన్నారు. ఇలాంటి వాటిపై ప్రతి ఒక్కరు చైతన్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. సామాజిక మార్పులతో ప్రతి క్షణం లింగ వివక్ష లేకుండా అందరు సమానమేనని గుర్తించాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం, భరోసా సభ్యులు ఇప్పటికే పలువురి పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బాధింపడ్డ మహిళలు, విద్యార్థినుల కోసం భరోసా కేంద్ర సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆయా శాఖల సిబ్భంది సమన్వయంతో సహాయ సహకరాలు అందించాలన్నారు. మైనర్లపై జరిగిన దాడుల విషయంలో నిందితులకు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మొగిలయ్య, శ్రీధర్బాబు, సీఐలు శ్రీను, టాటాబాబు, రవిబాబు, ఏపీపీ రేచల్ సంజనజాషువ, షీ టీం ఎస్ఐ రజిత, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, భరోసా, డీడబ్లూఓ, సీడబ్లూసీ సిబ్బంది శివాని, సునంద, స్వాతి, సహాదేవుడు, శిరిష తదితరులు ఉన్నారు. -
నేడు జిల్లాకు డీజీపీ జితేందర్ రాక
గద్వాల క్రైం/ధరూరు: రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. నడిగడ్డలో శాంతిభద్రతలు.. విపత్కర కేసులపై ప్రత్యేక సమావేశం నిర్వహించడంతోపాటు కేసుల పురోగతిపై ఆరా తీయనున్నారు. దీంతో జిల్లా అధికారులు గురువారం ఉదయం నుంచే పోలీసు స్టేషన్లోని నమోదైన కేసులు, పురోగతి సాధించిన కేసులు, పెండింగ్ కేసుల అంశాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టారు. మరోవైపు రెండు రాష్ట్రాల సరిహద్దులో అక్రమ దందాలకు అడ్డుకట్ట, నిషేధిత పదార్థాల కట్టడి, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చీటింగ్ కేసులపై సమీక్ష నిర్వహించనున్నారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో అక్రమ దందాల వ్యవహారంలో పోలీసు సిబ్బంది ప్రమేయంపై ఇటీవల నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదికను అందజేయడం వంటి ఫిర్యాదులను వాకబు చేయనున్నారు. నిషేధిత కల్లు విక్రయాలు, పోలీసుల దాడులు, తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు నమోదైన ఎన్డీపీఎస్ యాక్టు కేసుల వివరాల అంశాలపై ఆరా తీసే అకకాశం ఉంది. ధూరూర్ పోలీసుస్టేషన్కు భూమి పూజ అలాగే, ధరూరులోని నూతన పోలీసు స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేయగా.. ఈ నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జీతేందర్ ఉదయం 10.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. జిల్లాలో కేవలం రెండు పోలీసు స్టేషన్లు కేటీదొడ్డి, ఉండవెల్లి మాత్రమే అద్దె భవనంలో కొనసాగుతుండగా త్వరలో వాటికి మోక్షం కలిగించే ప్రక్రియను డీజీపీ దృష్టికి జిల్లా అధికారులు తీసుకెళ్లనున్నారు. అలాగే, ఆయన జిల్లా పోలీసు భవనాల్లో సాయుధ బలగాల బ్యారెక్లు, అధికారులు, సిబ్బంది బస చేసేందుకు చేపట్టిన క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. నూతన కార్యాలయ నిర్మాణ పనుల విషయంలో పోలీసు హౌసింగ్ సొసైటీ ఇంజినీర్లతో సమావేశం, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా, గురువారం డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను తదితరులు ధరూర్ పోలీస్ స్టేషన్నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించారు. డీజీపీ రాక నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతలు.. విపత్కర కేసులపై ఆరా తీసే అవకాశం వివరాల సేకరించడంలో జిల్లా పోలీసుశాఖ తలమునకలు -
జోరుగా మెడికల్ దందా!
వైద్యుల చీటీ లేకుండానే మాత్రల విక్రయాలురెండేళ్లుగా తనిఖీల జాడేది..? 2023 ఫిబ్రవరి 7, 9వ తేదిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు దినేష్, మహ్మద్రఫీ, రబీయా, రేష్మ జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ దుకాణాలు, సర్జీకల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఫార్మసిస్ట్లు లేకుండా మందులు విక్రయాలు, వైద్యుల చీటీలు లేకుండా మందులు రోగి, బంధువులకు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొందరు యువత దగ్గు సిరప్లను మెడికల్ దుకాణంలో కోనుగోలు చేసినట్లు ధ్రువీకరించారు. మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు, వాటి కాలపరిమితిలను డీ కోడ్ చేసుకున్నారు. అదే రోజు జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ దుకాణ నిర్వాహకుడు ఔషధ నియంత్రణ అధికారుల అనుమతి లేకుండా మందులు విక్రయించినట్లు గుర్తించి యాజమానికి నోటీసులు జారీ చేశారు. 30.12.2023 ముగ్గురిపై డ్రగ్ అండ్ కాస్మోటెక్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసులు జిల్లా కోర్టులో నడుస్తున్నాయి. నాటినుంచి జిల్లాలో అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేకపోయాయి. పలువురు దుకాణాదారులకు లైసెన్స్ లేకుండానే దర్జాగా మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో నాణ్యత లేని మందులు, వివిధ కంపెనీల నిర్వహకులు ఉచితంగా ఇచ్చిన మందులను రోగికి అంటగడుతున్నారు. వైద్యుల చీటీ లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ● మెడికల్ షాపులలో ఇష్టారీతిగా యాంటీబయాటిక్స్, నిద్రమాత్రల అమ్మకాలు ● కానరాని ఫార్మసిస్టులు ● మామ్ముళ్ల మత్తులో ఔషధ నియంత్రణాధికారులు గద్వాల క్రైం: జిల్లాలోని ప్రైవేటు మెడికల్ దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘన జోరుగా సాగుతోంది. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్ లేకుండానే నొప్పుల నివారణ, నిద్రమాత్రలు, యాంటీ బయాటిక్ మందులు విక్రయిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఆర్ఎంపీలు సైతం ఎలాంటి అనుమతి లేకుండా మెడికల్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిన కొందరు యువత సరిపడా డబ్బులు లేకపోవడంతో అదేతరహా మత్తును కలిగించే కొన్ని రకాల సిరప్లను మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేసి ఇష్టారీతిగా తాగుతున్నట్లు సమాచారం. మెడికల్ దుకాణాల నిర్వాహకులు ఇచ్చే మాముళ్లకు అలవాటు పాడి గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు చేయడమే మరిచారు అన్న ఆరోపణలు వినవస్తున్నాయి. జిల్లాలో 300 మెడికల్ దుకాణాలు, 8 సర్జికల్ ఏజెన్సీలు ఓ మాఫియాగా ఏర్పడ్డాయి. మందులు విక్రయించాలంటే నిబంధనల మేరకు ప్రతి మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ తప్పనిసరి. అయితే నడిగడ్డలో ఔషధ నియంత్రణ అధికారులు.. కార్యాలయం లేకపోవడం.. ఓ వ్యక్తిని నియమించుకుని అక్రమ సంపాదనకు తెర తీశారని సమాచారం. అంతా ప్రైవేటు వ్యక్తే.. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో వెలసిన మెడికల్ దుకాణాలను తనిఖీలు చేయాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్లకు అలవాటుపడడంతో ఓ ప్రైవేటు వ్యక్తే అంతా తానై నడిపిస్తున్నట్లు సమాచారం. నిత్యం మెడికల్ దుకాణాల నిర్వాహకులకు అందుబాటులో ఉంటూ.. ఎవరైనా తనిఖీలకు వస్తున్నట్లు తెలిస్తే ముందస్తుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నూతన దుకాణాల అనుమతి.. రెన్యూవల్ వివిధ అనుమతుల కోసం సదరు వ్యక్తిని సంప్రదిస్తే చాలు పనులు పూర్తి అవుతాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ సదరు ప్రైవేటు వ్యక్తిని ఆరా తీయగా.. గత కొన్నేళ్లుగా వారితో పని చేయడంతో నిర్వాహకులు కలవడం వాస్తవామే అన్నారు. -
పరీక్షలు ముగిసే.. ఆనందం వెల్లివిరిసే..
గద్వాలటౌన్: పదో తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. బుధవారం చివరి పరీక్ష రాసిన అనంతరం కేంద్రాల నుంచి విద్యార్థులంతా సంతోషంగా బయటకు వచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆనందంతో బైబై చెప్పుకొన్నారు. కొంతమంది విద్యార్థులు సెల్ఫీలు దిగారు. చాలా కాలం కలిసి చదివిన వారంత పరీక్షల చివరిరోజు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నవారు సాయంత్రానికే ఇళ్లకు బయలుదేరారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వీరిని తోడ్కని వెళ్లారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలమే కనిపించింది. మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ ఇంటిబాట పట్టారు. ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. దీంతో మొత్తం పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. చివరిరోజు 7,600 మంది రెగ్యులర్ విద్యార్థులకుగాను 7,567 మంది పరీక్షలకు హాజరయ్యారు. 33 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను విద్యాధికారులు తనిఖీ చేశారు. -
పేదలందరికీ సన్నబియ్యం
గద్వాల/ధరూరు/కేటీదొడ్డి: పేదలందరికీ సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల పట్టణంలోని 35,26 వార్డులలో, అలాగే ధరూరు, కేటీదొడ్డిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను మెరుగుపర్చేందుకు ఉగాది పండుగ కానుకగా నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసే ప్రతీష్టాత్మక పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు లావు బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 335 రేషన్షాపులు ఉండగా వాటి ద్వారా 1,62,000పైగా రేషన్కార్డులకు మొత్తం 5,50,000 మందికి పైగా లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరికి నెలకు 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం సేకరించి వాటిని మరఆడించి మార్కెట్లో కిలో బియ్యం రూ.40 ఉన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈసన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించకుండా ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్తో అదనపు ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు. త్వరలోనే కొత రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు. అనంతరం ధరూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మళ్లీఖార్జున్, డీఎస్వో స్వామికుమార్, రేషన్డీలర్లు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న పోరాటాన్ని స్ఫూర్తి తీసుకోవాలి బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ బహుజన రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి యోధుడన్నారు. పన్నుల వసూళ్ల పేరుగా ప్రజలను పీడిస్తున్న మొగలులను అడ్డుకుని పోరాటం చేశారన్నారు. అలాగే, కేటీదొడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తిచేసి తీరుతాం
అచ్చంపేట/ఉప్పునుంతల: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)ని రెండున్నరేళ్లలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతనెల 22న ప్రమాదం చోటు చేసుకున్న దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ను బుధవారం సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేకాఽధికారి శివశంకర్ లోతేటి, కలెక్టర్ బదావత్ సంతోష్తో మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మరో 105 నుంచి 110 మీటర్ల వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే సమస్య ఓకొలిక్కి వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన 40 రోజుల్లో వివిధ బృందాలకు చెందిన 700 నుంచి 800 మంది సహాయక సిబ్బంది, నిపుణులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 550 నుంచి 600 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. సొరంగం లోపల భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర పరికరాలు అతుక్కుపోవడంతో అక్కడ బురద తొలగింపు కష్టంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయక సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మరో 15 రోజుల్లో సహాయక చర్యలను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. భవిష్యత్లో సొరంగం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సొరంగం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎన్డీఆర్ఎస్ అధికారి డా.హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిఽధి ఫిరోజ్ ఖరేషి, జీఎస్ఐ అధికారులు రాజశేఖర్, కాడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్ తదితరులు ఉన్నారు. లభించని కార్మికుల ఆచూకీ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 45 రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుల జాడ లభించడం లేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. ఉబ్బికి వచ్చిన నీటితో కూలిన సొరంగం ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్ల తొలగింపునకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే టీబీఎం భాగాలు, శిథిలాలు, మట్టి, రాళ్ల తొలగింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగంలో 10వేల లీటర్లు నీటి ఊట వస్తుండగా.. 2.5 కి.మీ. ఒకటి చొప్పున 150 హెచ్పీ సామర్థ్యం కలిగిన భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. డీ–1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి కాగా.. మరో 105 నుంచి 110 మీటర్ల మేర తవ్వకాలు చేపడితే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సొరంగంలో ప్రమాదం ఘటన బాధాకరం 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల పరిశీలన -
వ్యవసాయ అధికారులకు కొత్త సెల్ నంబర్లు
గద్వాల వ్యవసాయం: వ్యవసాయ శాఖ జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రభుత్వం నూతన సెల్నంబర్లు కేటాయించింది. ఈమేరకు సక్రియానాయక్ డీఏఓ సెల్నం. 8977745995, రమేష్బాబు ఏడీఏ, సెల్నం. 8977745994, భవాని ఏఓ (టెక్నికల్) సెల్నం. 8977745626, మహాలక్ష్మీ ఏఓ (టెక్నికల్ 8977745627, శ్రీలత ఏఓ (టెక్నికల్) 8977745628, చంద్రశేఖర్ ఏఓ (టెక్నికల్) 8977745629, అశ్విని ఏఓ(టెక్నికల్) 8977745630, నాగార్జున రెడ్డి ఎంఏఓ అలంపూర్ 8977745645 సెల్ నంబర్ కేటాయించారు. అలాగే, జనార్ధన్ ఎంఏఓ అయిజ 8977745646, రవికుమార్ ఎంఏఓ ఇటిక్యాల 8977745647, ప్రదీప్కుమార్ ఎంఏఓ మానవపాడు 8977745648, సురేఖ ఎంఏఓ రాజోళి 8977745649, అనిత ఎంఏఓ ఉండవల్లి 8977745650, రాధ ఎంఏఓ వడ్డేపల్లి 8977745657, సంగీతలక్ష్మీ ఏడీఏ గద్వాల రూరల్ 8977745996, శ్రీలత ఎంఏఓ ధరూర్ 8977745658, ప్రతాప్ కుమార్ ఎంఏఓ గద్వాల 8977745659, హనుమంతురెడ్డి ఎంఏఓ గట్టుకు సెల్ నంబర్ 8977745684 కేటాయించారు. దీంతోపాటు సాజిద్ ఉర్ రహమాన్ ఎంఏఓ కెటీదొడ్డి 8977745685, రాజశేఖర్ ఎంఏఓ మల్దకల్ 8977746043, సుబ్బారెడ్డి ఏఓ (టెక్నికల్) అలంపూర్ ఏడీఏ కార్యాలయం 8977746018, చంద్రమౌళి ఏఓ (టెక్నికల్) గద్వాల ఏడీఏ సెల్నం. 8977746019, అయూబ్ ఏఓ (పీడీ అండ్ డీ ఫార్మ్ కొర్విపాడు) 8977745563, నాగేశ్వర్రావ్ ఏఓ (పీడీ అండ్ డీ ఫార్మ్ జులెకల్) సెల్నం. 8977745564 కేటాయించారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్, స్టోర్కీపర్, టెక్నికల్) అగ్నివీర్ ట్రేడ్మెన్ వివిధ కేటగిరీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్కీపర్ పోస్టులకు 10వ తరగతి, ట్రేడ్మెన్కు 8వ తరగతి పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. www.join indiarmy.nic.in వెబ్సైట్లో ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, వీటితోపాటు ఐటీఐ, డిప్లోమా, ఎస్ఎస్సీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయని తెలిపారు. కామన్ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా 13 భాషలలో ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని, మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారని, జూన్లో సంబంధిత వెబ్సైట్లో అడ్మిట్కార్డులు పొందవచ్చని, ఇతర వివరాలకు సికింద్రాబాద్లోని రిక్రూటింగ్ కార్యాలయం ఫోన్ నంబర్ 040–27740205 ను సంప్రదించాలని తెలిపారు. ఉచిత శిక్షణ కార్యక్రమం గద్వాల: స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో హైదరాబాద్లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక నెల నాన్రెసిడెన్సీయల్ ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వనున్నట్లు ఉపాధి కల్పనాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు www.tgbcstudycircle. cgg.gov.in లో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దర ఖాస్తులు చేసుకున్న వారికి ఈనెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా కేం్దద్రంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 040–29303130 నంబర్ను సంప్రదించాలన్నారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థల పరిశీలన కేటీదొడ్డి: మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ప్రజలకు అనువైన స్ధలాన్ని ఎంపిక చేసి త్వరలో నూతన భవన నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆలయాల్లో అడిషనల్ కమిషనర్ విచారణ అలంపూర్ : అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి బుధవారం విచారణ చేపట్టారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాల్లో విచారణ చేపట్టినట్లు ఆమె వివరించారు. ఇటీవల ఆలయాలపై పలు కథనాలు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలతో ఆలయాల్లో అన్ని అంశాలపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలోనూ రెండు సార్లు దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేసినట్లు పేర్కొన్నారు. -
కౌలుకు తీసుకుని సాగు..
అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతున్నందున ఈసారి 15 ఎకరాలను కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశాను. ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాను. వారంలో రెండు రోజులే సాగునీరు అందడంతో పంట ఎదగలేదు. ఇలాంటి సమయంలో నీటిని పూర్తిగా నిలిపివేయడం వల్ల పంటను పశువులకు వదిలిపెట్టి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. – గుంతల చెన్నప్ప, రైతు, అమరచింత పొట్టదశలో ఉన్నాయి.. జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని పొందుతూ ములమళ్ల శివారులో 10 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నా. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. రెండు తడుల వరకు నీటిని అందిస్తే పంట చేతికందే అవకాశం ఉంది. అధికారులు ముందుగా వారబందీతో సాగునీటిని అందించారు. అంతే కాకుండా గత నెల నుంచి వారంలో రెండు రోజులే సాగునీటిని అందించారు. ఇప్పుడు సైతం అదే విధంగా పంటలు చేతికొచ్చే వరకు సాగునీటిని అందించాలి. – ఆంజనేయులు, రైతు, మస్తీపురం మరో రెండు తడులు అందించాలి.. అమరచింత ఎత్తిపోతలకు జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీటిని పొందుతున్నాం. ఎత్తిపోతల ఆయకట్టు పరిధిలో ములమళ్ల, సింగపేట, ఖానాపురం, మస్తీపురం, అమరచింత, పాంరెడ్డిపల్లె గ్రామాల పరిధిలో ఈసారి యాసంగిలో 800 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాం. ప్రాజెక్టు అధికారులు వారబందీలో కోత పెట్టి కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే సాగునీటిని అందించారు. ప్రస్తుతం వరిపైర్లు పొట్టదశలో ఉన్నాయి. గింజలు గట్టిపడాలంటే మరో రెండు తడులపాటు సాగునీటిని అందించాలి. – ఆంజనేయులు, అమరచింత లిఫ్ట్ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారుల ఆదేశాలతో.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ మట్టం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టుకు ఇదే చివరి తడిగా సాగునీటిని వదిలి.. కాల్వలకు నీటి సరఫరాను నిలిపివేశాం. నీటినిల్వ మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో వారబందీ ద్వారా రైతులకు సాగునీటిని అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సాగుకు నీటిని వినియోగించే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ ● -
గద్వాల చరిత్రను కాపాడతాం
గద్వాల: గద్వాల సంస్థాతనాధీశుల చరిత్రను కాపాడతానని గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ మునిమనవడు కృష్ణరాంభూపాల్ అన్నారు. బుధవారం ఆయన గద్వాల స్వయంభు లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. గద్వాలలో దిగుడు బావులు తాగునీటి కోసం తమ పూర్వీకులు నిర్మించారని, కొత్తబావిని పరిశీలించడం జరిగిందని చాలా బాధపడ్డానని బావి కబ్జా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కలెక్టర్తో మాట్లాడుతామన్నారు. కొత్తబావిని కాపాడాలని కలెక్టర్కు వినతి గద్వాల పట్టణంలోని చింతలపేట వద్ద సంస్థానాధీశుల కాలంలో నిర్మించినటువంటి కొత్తబావి ఆక్రమణకు గురవుతుందని వెంటనే కొత్తబావిని సంరక్షించాలని రాజవంశీయులు కలెక్టర్ బీఎం సంతోష్ను సుహాసినిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, వెంకటాద్రిరెడ్డి, విక్రమ్సింహారెడ్డి కోరారు. ఈమేరకు వారు బుధవారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో వినతిపత్రం అందజేశారు. ఇవ్వడానికి సిద్ధం జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 850లో 2.20 ఎకరాలు 1975లో మా నాన్న కొనుగోలు చేశారని ఇందులో కొత్తబావి కూడా ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ జి.వేణుగోపాల్ అన్నారు. ఆయన విలేకరులతో మాటాడుతూ.. తాను ఎక్కడా ఒక ఇంచు స్థలాన్ని కూడా కబ్జా చేయలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎమ్మెల్యే, ఎవరైన పెద్దలు చెబితే కొత్తబావిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
జంటలే లక్ష్యంగా దోపిడీలు
పెట్రోలింగ్ పెంచుతాం : ఐజీ కల్వకుర్తి టౌన్: ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఊర్కొండపేట ఆలయానికి వస్తారని, వీరి రక్షణ కోసం పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్తో కలిసి పరిశీలించారు. ఊర్కొండ పోలీస్స్టేషన్కు సిబ్బందిగా ఎక్కువగా కేటాయించి, ఆలయం వద్ద పికెటింగ్ నిత్యం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. స్థానికులు, ఆలయ పాలక మండలి, ఆలయ పరిసర ప్రాంత ప్రజలతో ఐజీ మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యాచార ఘటనలో పాల్గొన్న ఆలయ ఉద్యోగి గురించి తెలుసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకారం అవసరమని ఐజీ పేర్కొన్నారు. ఐజీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచార కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఏడుగురు నిందితులే ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఇదే తరహాలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత కేసులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఇప్పటికే పలుమార్లు నేరాలకు పాల్పడినట్టుగా తేల్చారు. ఆలయానికి వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకుని బెదిరించి, దోపిడీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు.. ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. చట్టం తెలిసిన నేరస్తులు.. మైనర్ల జోలికి వెళ్లరు మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేశ్గౌడ్తోపాటు ఊర్కొండపేట గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, సాదిక్ బాబా, హరీశ్, వాగుల్దాస్, మణికంఠ ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్నా రు. అయితే వీరు మైనర్లు ఎవరైనా జంటలుగా కనిపిస్తే అప్రమత్తంగా ఉంటారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో ద్వారా కఠిన శిక్షలు అమలు అవుతుండటంతో వారిని బెదిరించి, డబ్బులు మాత్రమే వసూలు చేస్తారు. వివాహిత మహిళలు, మేజర్లు అయితే దోపిడీ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలను తీసుకున్నా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్ప టి వరకు ఎంత మందిపై నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కనీస వసతులకూ దిక్కులేదు.. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. అరకొరగా ఉన్న బాత్రూంలు, టాయిలెట్లను సైతం మూసి వేస్తుండటం, నిర్వహణ లేకపోవడంతో మహిళలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు, టాయిలెట్లు, వసతి గదులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు లేక ఆరుబయటకు వెళ్తున్న మహిళలను బెదిరిస్తూ కొందరు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. నిఘా వైఫల్యమేనా..? ఊర్కొండపేట ఆలయ సమీపంలో గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆలయంలోని సిబ్బంది, గ్రామానికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు, యువకులు ఆలయానికి వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి వద్ద ఉన్న నగదును దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫొటోలు, వీడియోలు బయట పెడుతామంటూ బెదిరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో బ్లాక్మెయిల్ ముఠా వీడియోలు, ఫొటోలతో బెదిరించి డబ్బు వసూలు తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టింది ఈ ముఠానే.. ప్రముఖ ఆలయం వద్ద కరువైన పోలీసుల నిఘా బాధితురాలికి ప్రభుత్వం అండ ఊర్కొండ: ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో అత్యాచార ఘటన జరగడం దారుణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక ఆలయ అధికారులు, పోలీసులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయమై తనతో ఫోన్లో మాట్లాడారని వివరించారు.ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి విచారణ వేగవంతం చేస్తున్నారని, బాధిత కుటుంబానికి అండగా ఉంటా మని చెప్పారు.స్థానికంగా గంజాయి విక్రయాలు జరుగుతుంటే పోలీసులకు ఎందుకు సమాచా రం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అయితే.. రికార్డే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నాలకు మద్దతు ధరతోపాటు ప్రోత్సాహకంగా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో అన్నదాతలు ఈ యాసంగిలోనూ వరిసాగు వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన సన్న రకాల ధాన్యం సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో ఈ సీజన్లో సాధారణ సాగును మించి సుమారు 20 శాతం.. గత యాసంగితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వరి సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 11,36,660 మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం నిర్దేశించారు. 1,61,504 ఎకరాల్లో పెరిగిన సాగు.. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 4,75,264 ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం ఇదే సీజన్లో 6,36,768 ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన 1,61,504 ఎకరాల్లో వరి సాగు పెరగగా.. ఈ మేరకు అదనంగా మరో 30 కొనుగోలు కేంద్రాలను అదనంగా కేటాయించారు. రెండో వారంలో కేంద్రాలు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి కోతలు ప్రారంభం కాగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదటి వారం నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కోతలకు మరింత సమయం పట్టనుండగా.. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మినహా మిగతా జిల్లాల కలెక్టర్లు.. మిల్లర్లు, వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 11.36 లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్లతో పోలిస్తే ఈ యాసంగిలో భారీగా వరిసాగు ఉమ్మడి జిల్లాలో 30 వరకు పెరిగిన కొనుగోలు కేంద్రాలు ఈ నెల రెండో వారంలో అందుబాటులోకి సెంటర్లు ఇప్పటికే అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటుకు ఆదేశాలు -
మున్సిపల్ బడ్జెట్ రూ.15.29 కోట్లు
గద్వాలటౌన్: మున్సిపల్ బడ్జెట్ అంటే.. గతానికి పేరడీగా, అంకెల గారడీగా.. మొత్తం కాగితాలకే పరిమితమనే విమర్శలున్నాయి. అయితే, ఈ సారి గద్వాల పట్టణ ప్రగతి లక్ష్యంగా లెక్కల పద్దులు తయారు చేశారు. ప్రత్యేక పాలనలో మున్సిపల్ బడ్జెట్ ఏకరీతిలో ఉండేలా లెక్కలు వేశారు. కలెక్టర్ సారథ్యంలో బడ్జెట్ను రూపొందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ బడ్జెట్ రూ.15.29 కోట్లుగా నిర్ణయించి, గత నెల ఆమోదించారు. సొంత నిధులతో.. ఈ సారి బడ్జెట్లో మున్సిపల్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంతోనే బడ్జెట్ తయారు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లను పరిగణలోకి తీసుకుంటుండగా మొదట సొంతంగా వచ్చే నిధులు సమకూర్చుతున్నారు. గద్వాల మున్సిపాలిటీ నుంచి ఏడాదికి రూ.6 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఆస్తిపన్ను, నల్లా పన్ను, ఇంటి అనుమతుల జారీ, దుకాణాల అద్దెలు, ట్రేడ్ లైసెన్స్ తదితర వాటి నుంచి ఈ నిధులు వస్తాయి. వాటిని పక్కాగా ఖర్చు చేసే విధంగా బడ్జెట్ను రూపొందించి ఆమోదించారు. పచ్చదనానికి 10 శాతం.. ఈ ఏడాది ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లోను 10 శాతం గ్రీన్ బడ్జెట్గా రూపొందించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం పచ్చదనానికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, ట్రీ గార్డులు, ట్యాంకర్లు తీసుకోవడం వంటి వాటికి బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టనున్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్తో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించారు. మూడో వంతు విలీన కాలనీల అభివృద్ధికి మున్సిపల్ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. బడ్జెట్లో మూడో వంతు(మూడింట ఒక బాగం) మురికివాడలు, శివారు, విలీన కాలనీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం కల్పించారు. నిధులు పక్కాగా ఖర్చు అయ్యే విధంగా స్థానికంగా ఉండే ఆయా వార్డుల అధికారులు చూడాల్సి ఉంటుంది. వీటికి ప్రాధాన్యం బడ్జెట్ తయారీలో కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. దానికి అనుగుణంగా బడ్జెట్లో పద్దులు పొందుపర్చారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాటికి అవసరమయ్యే వాహనాలు, పరికరాల కొనుగోలు, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా నిమిత్తం విద్యుత్ బిల్లుల చెల్లింపులతో పాటు ఏదైనా రూపంలో రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో రూపొందించారు. రాబోయె ఏడాది కాలంలో ప్రతిపాదిత ఆదాయ, వ్యయాలను బడ్జెట్లో చూపించారు. అలాగే, ప్రత్యేకంగా కొన్ని పనుల నిమిత్తం పలు రకాల పనులకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఉండాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చే నిధులను అందులో పొందుపర్చారు. పార్కులు, వైకుంఠధామాలు, క్రీడా స్థలాల ఏర్పాటు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత మార్కెట్లు, శాసీ్త్రయ పద్దతిలో డంపింగ్ యార్డుల నిర్వహణ వంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చి నిధులను కేటాయింపులు చేశారు. గద్వాల శివారు, విలీన కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం 10 శాతం గ్రీన్ బడ్జెట్ ప్రగతిపైనే ఆశలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ ప్రగతి అక అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఐదేళ్ల పాలకవర్గ హయంలో సుమారు రూ.10 కోట్లతో ఆయా వార్డుల్లో ప్రగతి పనులు జరిగాయి. అయినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం నిధుల కొరతతో కొత్తగా పనులు చేపట్టే ప్రణాళికలు చేపట్టడం లేదు. ఉన్నదాంట్లో సమకూరిన నిధులను కార్మికుల వేతనాలకు వినియోగిస్తున్నారు. అయినా ఇంకా రెండు నెలల జీతాలు బకాయిలున్నాయి. -
ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
గద్వాల క్రైం: సమస్యలపై వచ్చే బాధితుల పట్ల సిబ్బంది స్నేహ పూర్వకంగా ఉండాలని, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయనతోపాటు డీఎస్పీ మొగిలయ్య పట్టణ పోలీసు స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలోని వివిధ కాలనీలో నిత్యం గస్తీ, పెట్రోలిం నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైం, మహిళల వేధింపులు, అత్యాచార యత్నం, మిస్సింగ్ కేసులలో ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శివారు ప్రాంతాల్లో నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలని, స్టేషన్ పరిశరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పందించాలని, బాధితులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. సీఐ శ్రీను, ఎస్ఐ కల్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు. నేడు ఉల్లి బహిరంగ వేలం దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు రావడం వల్ల శనివారం నుంచి మంగళవారం వరకు లావాదేవీలు జరగలేదు. తిరిగి బుధవారం మార్కెట్లో లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఉల్లి వేలం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ధాన్యం టెండర్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
ప్లాస్టిక్కు చెక్
అడవిలోకి రాకముందే.. హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీదుగా శ్రీశైలం చేరుకునే ప్రయాణికులు సుమారు 60 కి.మీ., దట్టమైన నల్లమల అటవీప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అడవి మధ్యలో విసిరేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల మనుగడకే ముప్పుగా మారుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రహదారి వెంట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. పండుగలు, సెలవు రోజుల్లో వాహనాల రద్దీతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం పెరుగుతున్నాయి. అడవిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేస్తూ.. అడవిలోకి రాకముందే చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ను సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మన్ననూర్ చెక్పోస్టు వద్ద, శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను దోమలపెంట చెక్పోస్టు వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు. నల్లమలలో పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం అమలు ●● వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చర్యలు ● మన్ననూరు, దోమలపెంట చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు ● అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 80 శాతం వరకు తగ్గిన వ్యర్థాలు ● ఇప్పటి వరకు 34 వేల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తి సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేస్తోంది. నల్లమల గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోలకు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు వేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ కట్టడిపై చర్యలు కట్టుదిట్టం చేసింది. దట్టమైన నల్లమల అడవిలోకి రాకముందే ముఖద్వారం వద్ద వాహనదారుల నుంచి ప్లాస్టిక్ను సేకరించడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ప్లాస్టిక్ వేయవద్దని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖ చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధంతోపాటు అవగాహన కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఏటా అడవిలో పోగవుతున్న చెత్తలో సుమారు 80 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించగలిగారు. అనూహ్య స్పందన.. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, వ్యర్థాలను అడవిలో పడేయకుండా ఉండేందుకు స్థానికులు, వాహనదారులకు అటవీశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నల్లమలలోని మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందిస్తున్నారు. 16 మంది స్వచ్ఛ సేవకులు అడవిలోకి ప్రవేశించే వాహనాల్లో అత్యవసరంగా వినియోగించే వాటర్ బాటిళ్లను 2 లీటర్లు, అంతకన్నా పెద్ద సైజులో ఉండే సీసాలనే అనుమతిస్తున్నారు. ఖాళీ అయిన బాటిళ్లను అడవిలో ఎక్కడా పడవేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే అడవిలోకి పంపుతున్నారు. ఫలితంగా చాలావరకు అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. ఎక్కడైనా రోడ్డుకు ఇరువైపులా ఉండే వ్యర్థాలను 16 మంది స్వచ్ఛ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. చెక్పోస్టులు, అడవిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మన్ననూర్లోని ప్లాస్టిక్ బేయిలింగ్ కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని తుక్కుగూడలో ఉన్న హైపర్ ప్లాస్టిక్ పార్క్ రీసైక్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 34 వేల కిలోల ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తుండగా.. ఇకముందు చిప్స్, ఇతర కవర్లను సైతం రీసైక్లింగ్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందరి సహకారంతో.. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలుచేస్తున్నాం. అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో ఏటా పోగవుతున్న ప్లాస్టిక్ చెత్తలో 80 శాతం తగ్గింది. స్థానిక ప్రజలు, వ్యాపారులతోపాటు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి సహకారం లభిస్తోంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీ శాఖ అధికారి -
భక్తిశ్రద్ధలతో ఈద్–ఉల్–ఫితర్
గద్వాలటౌన్: పవిత్ర రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షక్షలు చేపట్టి ప్రార్థనలతో ముగించారు. సోమవారం ఉదయం ముస్లింలు ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలకు తరలివెళ్లారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాకు ముస్లింలు ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా అబ్దుల్ హకీం నమాజ్ చేయించారు. ప్రార్థనల అనంతరం ఈద్గా దగ్గర శ్మశాన వాటికలోని తమ పెద్దల సమాదుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చుట్టు పక్కల గ్రామాల ముస్లింలు సైతం గద్వాల ఈద్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ యాదయ్య ఆధ్వర్యంలో సీఐ టంగుటూరి శ్రీను గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలపడానికి వివిధ పార్టీల నాయకులు ఈద్గా దగ్గరకు వచ్చారు. ప్రార్థనల అనంతరం ముస్లింలకు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్కుమార్, బీఆర్ఎస్ నాయకుడు హనుంమతునాయుడు, ఎంఐఎం జిల్లా కన్వీనర్ మున్నాబాషలతో పాటు పలువరు నాయకులు ఈద్ ముబారక్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం వారు ముస్లింనుద్దేశించి మాట్లాడారు. హిందూ ముస్లింల ఐక్యతకు గద్వాల నిదర్శనమని పేర్కొన్నారు. గద్వాల సర్వమత సమైక్యతకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కిటకిటలాడిన ఈద్గాలు, మసీదులు ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ పార్టీల నాయకులు -
ఆస్తిపన్ను వసూళ్లలో ‘అయిజ’ రికార్డు
అయిజ: మున్సిపాలిటీలకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులో 95 శాతం వసూలు చేసి అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో టాప్ ఫైవ్లో ఒకటిగా నిలిచింది. సోమవారం ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు కావడంతో చివరి రోజు వసూలు చేసిన దానితో కలిపి అయిజ టాప్ ఫైవ్లో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో గత సంవత్సరం కంటే 12.09 శాతం ఆస్తిపన్ను ఎక్కువగా వసూలు చేయడంతో అయిజ మున్సిపాలిటీ 15 ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించింది. దీంతో 15వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.2కోట్లు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులు మాట్లాడుతూ.. పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ఆస్తిపన్ను 95 శాతం వసూలు చేశామని అన్నారు. మొత్తం 1.82 కోట్లు డిమాండ్ ఉండగా 1.62 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆర్ఐ, ఆర్ఓ, బిల్ కలెక్టర్లను అభినందించారు. మున్సిపాలిటీ సిబ్బంది సంబరాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఆర్ఓ లక్ష్మన్న, ఆర్ఐ విజయ్, వార్డు ఆఫీసర్లు భరత్, రామకృష్ణ, బిల్ కలెక్టర్లు అజ్మీర్ ఖాజా, అడివన్న, మహేంద్రనాథ్, నరేష్, నాగరాజు, ఆంజనేయులు, వీరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
మోదం.. ఖేదం
90 శాతం ఆస్తి పన్ను వసూళ్లతో అయిజ, అలంపూర్, వడ్డేపల్లి ముందంజ గద్వాలలో ఎందుకీ పరిస్థితి ఎనిమిది నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన కమిషనర్కు పాలకవర్గానికి మొదటి నుంచి పోసక లేదు. పాలకవర్గం కనుసన్నల మధ్య నడిచే సిబ్బంది మొదట్లో పన్ను వసూళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పాలకవర్గం గడువు ముగిసిన తరువాత కఠినంగా వ్యహరించిన కమిషనర్కు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. బకాయిలు ఎక్కువగా ఉండటం, వీటితో పాటు సిబ్బంది అరకొరగా ఉండటం వలన పన్నులు సకాలంలో వసూలు చేయలేకపోయారు. కొత్తగా వచ్చిన వార్డు అధికారులకు సర్వేలు, ఎల్ఆర్ఎస్ తదితరమైన బాధ్యతలు అప్పగించడంతో వారు సైతం పన్ను వసూళ్లపై దృష్టి సారించలేదు. ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ ఇచ్చిన చాలా మంది ప్రజలు వినియోగించలేకపోయారు. చివరలో వడ్డీమాఫీ రావడం వలన బడా బకాయిదారులు ముందుకు రాలేదు. ఫలితంగా పన్నుల వసూళ్ల మందగించింది. ● 56 శాతంతో లక్ష్యానికి దూరంగా గద్వాల మున్సిపాలిటీ.. ● ప్రభుత్వ కార్యాలయాల నుంచి నామమాత్రంగాపన్ను వసూలు ● ముగిసిన ఆర్థిక సంవత్సరం వసూలు గడువు గద్వాలటౌన్: ఈ ఏడాది ఎలాగైనా వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని సంకల్పించిన అధికారులు.. గద్వాల మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో మేర సఫలమయ్యారు. ఆశించిన స్థాయిలో పన్ను వసూళ్లు రాబట్టారు. గద్వాలలో మాత్రం లక్ష్యానికి దూరంగా నిలిచారు. ఉన్నతాధికారుల నుంచి పదే పదే ఒత్తిళ్లు రావడంతో అధికారులు ఈ మార్చిలో వసూళ్ల ప్రక్రియను కొంత వేగవంతం చేశారు. బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి పన్ను వసూలు చేశారు. అయినప్పటికి జిల్లా కేంద్రమైన గద్వాలలో పన్నుల వసూళ్లు పేలవంగా ఉన్నాయి. అటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి చాలా ఏళ్లుగా పెండింగ్ బకాయిలు అరకొరే వసూలు కావడంతో అధికారులను నిరాశ కలిగించింది. అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు వందశాతం లక్ష్యానికి స్వల్ప దూరంలో నిలిచాయి. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపుతో పన్ను వసూళ్లకు అడ్డుకట్ట పడింది. ఇప్పటి వరకు జిల్లాలోని గద్వాల మినహా.. అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆశించిన మేర పన్ను వసూలయ్యాయి. అవరోధాలు ఎన్నో.. ఏటా ఆస్తిపన్ను వసూళ్లను చేపట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతుంటారు. పట్టణంలోని ప్రతి నివాసగృహం, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి వాటి వైశాల్యాన్ని బట్టి పన్నును నిర్ధారిస్తారు. భువన్ సర్వే ద్వారా ప్రతి ఇంటిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తించడంతో ఆయా గృహాల పరిణామాలకు చాలావరకు పన్ను పెరిగింది. వీటిని రాబట్టేందుకు అధికారులు గత రెండు నెలల నుంచి వసూళ్ల ప్రక్రియను చేపట్టారు. మొదట రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మాత్రమే వీటిని వసూలు చేశారు. కానీ లక్ష్యం పెద్దగా ఉండటం.. గృహాలు అధిక సంఖ్యలో ఉండటంతో గతనెల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచారు. గద్వాల, అయిజలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూలు ప్రక్రియను చేపట్టారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పన్ను వసూలు చేశారు. పెండింగ్లో ఉన్న వాటికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరల్లో ఆస్తిపన్నుపై హడావిడి చేయడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయారు. గద్వాలలో 56.53 శాతానికే పన్ను వసూళ్లు పరిమితం కాగా.. మిగిలిన మూడు మున్సిపాలిటీలలో 90 శాతం మార్కును దాటాయి. గద్వాల పట్టణ వ్యూ జిల్లా కేంద్రంలో చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలు, అయిజలో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు రూ.2 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు నామమాత్రంగానే పన్ను వసూళ్లు జరిగింది. మొదటి నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్ను వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం కూడా వాటి నుంచి ఆస్తిపన్ను వసూళ్లు కాకపోయిన పెద్దగా పట్టించుకోవడం లేదు. పన్ను వసూలు వివరాలిలా.. మున్సిపాలిటీ అసెస్మెంట్లు పన్ను వసూలైంది శాతం డిమాండ్ (రూ.కోట్లలో) గద్వాల 15,896 7.17 4.05 56.53 అయిజ 8,051 1.82 1.62 90.03 ప్రభుత్వ కార్యాలయాల పన్ను వసూళ్లు నాస్తి -
ఊర్కొండపేటలో కలకలం
సాక్షి, నాగర్కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రు లు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువు తో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏ డుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడు గు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పో లీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజా యి, మ ద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడు గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికై నా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి సోమవారం ఉదయం ఫిర్యా దు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పార్టీకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరానన్నారు. ఆలయానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం ఒళ్లు జలదరించే రీతిలో చిత్రహింసలు జిల్లాలోని దర్శనీయ ప్రదేశాల్లో కొరవడిన భద్రత యథేచ్ఛగా మద్యపానం, గంజాయి వినియోగం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని వైనం -
తొలి పండుగ.. ఆనందమే నిండుగా
గద్వాలటౌన్: నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఉగాది పచ్చడి.. పండితుల పంచాంగ శ్రవణం.. కిటకిటలాడిన ఆలయాలు.. మొత్తంగా కోలాహాలంతో శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి ఆదివారం జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. ఎన్నో అనుభూతుల్ని పంచిన శ్రీక్రోధీనామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పారు. ఎక్కడ చూసినా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోలాహాలంగా తిరుగుతున్న యువకుల సందడితో విశ్వావసు నామ ఉగాది సందడి కనిపించింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు తెలుగు వారి తొలి పండుగ ఉగాది సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అందరికీ విజయం చేకూర్చాలని, ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని పంచారు. స్థానిక గాంధీచౌక్ నుంచి రాజవీధి వరకు దేవాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం ట్రాఫిక్ రద్దీ పెరిగింది. సాయిబాబ దేవాలయం, గంజిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, క్రిష్ణమందిరం, వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం, కోటలోని చెన్నకేశవ స్వామి ఆలయం, పెద్ద అగ్రహారంలోని అహోబిల మఠం వద్ద భక్తులు అధిక సంఖ్యలో దైవ దర్శనం చేసుకున్నారు. స్థానిక సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పించారు. పలు దేవాలయాల వద్ద పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా అరటి బోదెలు, మామిడి తోరణాలు, ఉగాది పచ్చళ్లతో పాటు పంచాంగ శ్రవణం, వివిధ వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు తదితరమైనవి విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీక్రోధీ నామ సంవత్సరం చేదు అనుభవాలు మిగిల్చగా శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందోనని తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం పట్ల అనేక మంది ఆకర్షితులయ్యారు. భక్తి శ్రద్దలతో రాబోయే సంవత్సరం రాశిఫలాలను తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఎద్దుల బండలాగుడు పోటీలను నిర్వహించి రైతులను ఉత్సాహపరిచారు. దక్షిణ కాశీలో పంచాంగ శ్రవణం అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో తెలుగు తొలి పండగ ఉగాదిని పురస్కరించుకొని బ్రహ్మశ్రీ శ్రీకాంత్శర్మ పంచాంగ శ్రావణం వినిపించారు. అంతా మంచే జరుగుతుందని ప్రవచించారు. ఆలయ ఈఓ పురేందర్ కుమార్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య అర్చకులతో కలిసి పంచాంగ శ్రావణ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం శ్రీకాంత్శర్మ పంచాంగ శ్రావణంలో ఏడాదంతా మంచి పరిణామాలే ఉంటాయని వివరించారు. అలాగే ఏఏ రంగాల్లో అభివృద్ధి ఉంటుందో, రాశులవారీగా ఆదాయం, వ్యయం వివరాలు తెలిపారు. ఆలయాల్లో ఉగాది ప్రత్యేక పూజలు పలుచోట్ల పంచాంగ శ్రవణాలు -
మనమెంత భద్రం..?
జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు పాత ఇళ్లపైనే నిర్మాణాలు.. చాలామంది మధ్య తరగతి ప్రజలు ఇళ్ల స్థలాలు లేక పెరుగుతున్న కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి పాత ఇళ్లపైనే అదనంగా గదులు నిర్మించుకుంటున్నారు. కొందరైతే పిల్లర్లు లేని ఇళ్లపై ప్రమాదకరంగా నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొంత మంది అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు ఉల్లంఘించి బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారు. ఈ విషయంలో భవన యజమానులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అధికారులు సైతం క్షేత్రస్థాయి పరిశీలన చేసి భవన సామర్థ్యానికనుగుణంగా అనుమతులు ఇచ్చి దిశానిర్ధేశం చేయాలి. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గద్వాలలో భిన్నమైన పరిస్థితులున్నాయి. గద్వాలటౌన్: ‘ఐదు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పోతులవారి వీధిలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందిన తీరు అందరిని కలిచివేసింది.’ ఈ సంఘటనను చూస్తే.. మరి గద్వాల జిల్లా పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల ఎదుట కనిపిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సంబఽంధిత అధికారులు స్థానికంగా ఉన్న భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. బహుళ అంతస్తులు, పురాతన భవనాలు, కట్టడాల విషయంలో అధికారులు, పాలకులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించటంలేదు. ‘చేతులు కాలే దాకా కళ్లు తెరుచుకోరు... కాళ్లు కదలవు’ అన్నట్లుగా జిల్లా కేంద్రంలోని ఆయా శాఖల అధికారుల పనితీరు కనిపిస్తుంది. ఈ స్థితిలో గద్వాలలో బహుళ అంతస్తుల నిర్మాణాల భద్రత, నాణ్యత ఎంతమాత్రం అన్న ప్రశ్న రేకెత్తించింది. పర్యవేక్షణ అంతంతే నోటీసులతో సరిపెడుతున్న అధికారులు గుర్తించినా.. పట్టించుకోని వైనం ఏటా వానాకాలం ముందు జిల్లాలో పాత భవనాల ఇళ్లను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపడతారు. పట్టణాలు, గ్రామాల్లో అప్రమత్తం చేసినా ఇంటి యజమానుల్లో అవగాహన కలగటం లేదు. కొంతమంది ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. కానీ కొందరు ఇళ్ల యజమానులు మాత్రం తమకేమి పట్టనట్లు ఉండిపోయారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే చాలా మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
పురాతన బావి కబ్జాపై స్పందించాలి
గద్వాలటౌన్: సంస్థానాధీశుల కాలం నాటి పురాతన బావి కబ్జాపై ఎమ్మెల్యే స్పందించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం కబ్జాకు గురైన పురాతన బావిని వివిధ ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. చరిత్రాత్మకమైన పురాతన బావి అన్యాక్రాంతమవుతున్న అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమన్నారు. పురాతన కొత్తబావిని ఆక్రమించుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్పై చర్యలు తీసుకోవడానికి అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన బావిని తక్షణమే పునరుద్దరించి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురాతన బావిని పునరుద్దరించకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. బావి పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాన్ని చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కుర్వ పల్లయ్య, ఉప్పేర్ సుభాన్, వాల్మీకి, కృష్ణ, నాగన్న తదితరులు పాల్గొన్నారు. యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి పెద్దకొత్తపల్లి: గ్రామీణ యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకొని జాతీయస్థాయిలో రాణించాలని ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి గ్రామంలో ఆదివారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ యువతలో కబడ్డీ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి.. క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్గౌడ్, వెంకటేశ్వర్రావు, దండు నర్సింహ, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, సింగిల్విండో మాజీ చైర్మన్ బాలస్వామి, సుధాకర్ పాల్గొన్నారు. రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి ఆదివారం విశేషాలంకరణ చేశారు. అర్చకులు వివిధ రకాల పూలతో గర్భగుడిని, శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఉగాది పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తర్వాత ఆలయ ఆవరణలో ఉన్న కల్పవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఆలయం బయట ఉన్న దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. ఆయిల్పాం ఫ్యాక్టరీ పనులు అడ్డుకున్న గ్రామస్తులు కొత్తకోట రూరల్: మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ సైతం మాజీ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కాగా.. ఆదివారం ఉగాది రోజన ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం యంత్రాలతో రాగా, గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. ఎస్ఐ ఆనంద్ సిబ్బందితో అక్కడకు చేరుకొని నచ్చజెప్పారు. -
రంజాన్కి సర్వం సిద్ధం
● ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గాలు ముస్తాబు ● ముగిసిన నెలరోజుల ఉపవాస దీక్షలు గద్వాలటౌన్: ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. నెలరోజుల ఉపవాస దీక్షలు అనంతరం జరుపుకొనే రంజాన్ పర్వదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా నిర్వహించుకుంటారు. సోమవారం పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రం, అయిజ, అలంపూర్, మానవపాడు, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అన్ని మసీదులు ముస్తాబయ్యాయి. రంగులు వేసి రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యాపార కేంద్రాలన్నీ జనంతో కిటకిటలాడాయి. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గద్వాలలో ఏటా రంజాన్ చివరి వారం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా కూరగాయలు మార్కెట్ చౌరస్తాలో ఉన్న సేమ్యాల దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. టోపీలు, అత్తర్ల కొనుగోలు కోసం యువకులు ఉత్సాహం చూపారు. ఫ్యాన్సీ, బ్యాంగిల్స్టోర్స్ దుకాణాలు మహిళలు, యువతులతో కిక్కిరిశాయి. చిన్నారులను సైతం ఆకట్టుకునే విధంగా కొత్త తరహా దుస్తులు రంజాన్లో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్ల దగ్గర రంజాన్ పండగ శోభ కనిపించింది. పండగను పురస్కరించుకొని స్థానిక ఈద్గావద్ద కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పండగ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. -
ఎత్తిపోతలు జరిగేనా..?
‘పాలమూరు’ ద్వారా 4 టీఎంసీల నీటి పంపింగ్కు అనుమతులు మోటార్ల బిగింపు పూర్తి.. పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు అయిన ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటి వరకు నాలుగు మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రెండు మోటార్లకు విద్యుత్ సరఫరా, చార్జింగ్ వంటి పనులన్నీ పూర్తిచేశారు. డెలివరీ మెయిన్స్ కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలే ఎత్తిపోతలు పెండింగ్లో పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా.. నిర్మాణం, విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్కో మోటారు సామర్థ్యం 145 మెగావాట్లు పాలమూరు ప్రాజెక్టు పంప్హౌజ్లో ఏర్పాటుచేసే మోటార్లు 9 ● పంప్హౌజ్లో కొనసాగుతున్న పనులు ● పూర్తికాని విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం ● గతేడాది అక్టోబర్ నుంచి వాయిదా పడుతున్న వైనం ● వచ్చే నెలలో తప్పనిసరిగాచేపడతామంటున్న అధికారులు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నా నీటి ఎత్తిపోతలు మాత్రం నోచుకోవడం లేదు. అయితే ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా నీటి ఎత్తిపోతలు చేపడుతామని సంబంధిత అధికారులు చెబుతుండగా ఆచరణలో అమలుకు నోచుకుంటుందా.. లేదా.. అనేది సందేహంగా మారింది. 4 టీఎంసీలకు అవకాశం.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లూరు సమీపంలోని మొదటి లిఫ్ట్ను ప్రారంభించగా.. ఒక మోటారు ద్వారా రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. తాగునీటి అవసరాల కోసం ఈ సీజన్లో నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్లోనే కృష్ణానది పరవళ్లు తొక్కగా.. నాటి నుంచి ఎత్తిపోతలు చేపడతామని అధికారులు చెబుతూ వస్తుండగా.. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిసారిస్తేనే.. పాలమూరు ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం జరగడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా నీటి ఎత్తిపోతలు జరిగితే.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీరుతాయి. కేఎల్ఐ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న భారం కూడా తగ్గుతుంది. తగ్గుతున్న నీటి నిల్వలు.. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్వాటర్ ఫుల్గేజ్ లెవెల్ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్వాటర్ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. ఒక మోటారుతో రోజు ఎత్తిపోసే నీరు 3,000 క్యూసెక్కులు నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు ఈ సీజన్లో తాగునీటి అవసరాలకు అనుమతి ఉన్న నీటి వాటా 4 టీఎంసీలు తుది దశకు పనులు.. ఎల్లూరు లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల బిగింపు పూర్తయింది. సివిల్ వర్క్స్, డెలివరీ మెయిన్స్ పనులు తుది దశకు చేరాయి. అక్టోబర్ తర్వాత ఎత్తిపోతలు చేపట్టాలని భావించినా.. మోటార్ల బిగింపు, విద్యుత్ సరఫరా పనులు కొనసాగుతున్నందున సాధ్యం కాలేదు. తాగునీటి అవసరాలకు ఈ సీజన్లో 4 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్లో తప్పనిసరిగా ఎత్తిపోతలు చేపడుతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటి పారుదలశాఖ -
అంతటా పండుగ సందడి
గద్వాలటౌన్: జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదివారం పండగను జరుపుకోనుండటంతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు శనివారం గద్వాలకు వచ్చి పండగ వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో గద్వాల పాతబస్టాండ్, రథశాల, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. గద్వాలతో పాటు అయిజ, శాంతినగర్, అలంపూర్ పట్టణాలలో సైతం ఉగాది హడావుడి కనిపించింది. ఉదయం మందకొడిగా సాగిన విక్రయాలు సాయంత్రం ఒక్కసారిగా ఊపందుకోవడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. గద్వాలలో మామిడి కాయాలు, పచ్చి ఇస్తరాకులు, బంతిపూలు, టెంకాయల కొనుగోళ్లకు డిమాండ్ నెలకొంది. మార్కెట్తో పాటు ప్రధాన చౌరస్తాలలో పూల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు. పూలు, పండ్లు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నా కొనుగోలు దారులు ఏమాత్రం రాజీ పడలేదు. అన్ని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మామిడి తోరణాలు పెద్దమొత్తంలో తీసుకొచ్చి అమ్మకాలు జరిపారు. ఆలయాల ముస్తాబు ఉగాదిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో కోళ్లను బలిస్తారు. అందుకుగాను ఆలయ నిర్వహకులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయం, అహోబిల మఠం, శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం, నది ఆగ్రహారంలోని ఆలయాల దగ్గర పంచాంగం శ్రవణం నిర్వహించనున్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన అలంపూర్, బీచుపల్లి, మల్థకల్, పాంగుంట, చింతరేవుల తదితర ఆలయాలలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఉన్న ఆలయ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
18వ శతాబ్దం నుంచి పంచాంగ శ్రవణం
గద్వాల: ఉగాది పండుగను.. పంచాంగ శ్రవణాన్ని దాదాపు నాలుగు తరాలుగా ఆ కుటుంబసభ్యులు వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. వారే.. గద్వాలకు చెందిన బోరవెల్లి కుటుంబసభ్యులు. జిల్లా కేంద్రంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయాన్ని 18వ శతాబ్దంలో భీమ్రెడ్డి, నాంచారమ్మ దంపతులు నిర్మించారు. భీమ్రెడ్డి సోదరుడైన రామన్న గద్వాల సంస్థానానికి దత్తతగా వెళ్లి రాంభూపాలుడు–2 పేరుతో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అక్కడి నుంచి ప్రతి ఉగాది పండుగ సాయంత్రం సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయానికి బోరవెల్లి కేశవాచార్యులు నుంచి మొదలై 19వ శతాబ్దంలో వారి కుమారుడు బోరవెల్లి ప్రకాశమాచార్యులు, వారి కుమారులు బోరవెల్లి రాఘవాచార్యులు, మరియు బోరవెల్లి పవన్కుమార్ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ భక్తులకు పంచాంగ శ్రవణం చేస్తూ వస్తున్నారు. -
దాశరథి ఆత్మలో తెలంగాణ
వనపర్తిటౌన్: నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అని వెలుగెత్తి చాటిన దాశరథిని జైలులో నిర్బంధించినా గర్జించే రచనలు చేశారని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్హాల్లో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకలను సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించగా.. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దాశరథి ఆత్మలో తెలంగాణ భాగమైందని కొనియాడారు. ఆయన రచనలు బీఆర్ఎస్ ఆవిర్భావంతో గోడలపై నినాదాలుగా వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. మహనీయులకు జన్మనిచ్చిన గడ్డ.. సాహిత్య శిఖరం సురవరం ప్రతాపరెడ్డి పుట్టిన గడ్డ వనపర్తి అని ప్రశంసించారు. సంక్లిష్ట సమాజంలో నిలబడి నిజాం పోకడలను ఎత్తిచూపారని గుర్తుచేశారు. రైతాంగ పోరాట ఉద్యమం వెలుగులోకి రావడంతో తెలంగాణ గురించి ప్రపంచానికి తెలిసిందన్నారు. బీఆర్ఎస్ పాలన పాలమూరును పచ్చని పంటల కల్పవల్లిగా తీర్చిదిద్దిందని వివరించారు. నిరంజన్రెడ్డి మళ్లీ వస్తేనే వనపర్తిలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉన్నంత కాలం చరిత్రలో దాశరథి పేరు చిరస్థాయిగా ఉంటుందని, అనతి కాలంలోనే ప్రభావితమైన రచనలు చేసిన కవిగా దాశరథి తెలంగాణలో గుర్తుండిపోయారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంతో దాశరథికి నిజమైన నివాళులర్పించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు కవులను దేశపతి శ్రీనివాస్, నిరంజన్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్గౌడ్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్, కవులు, వీరయ్య, నాగవరం బలరాం, బైరోజు చంద్రశేఖర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు. జైలులో నిర్బంధించినా రచనలు ఆపలేదు ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ -
54 ఏళ్లుగా జ్యోతిష్యం.. పంచాంగం
మానవపాడు: మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మేళ్ల చెరువు రేవతీనాథ్శర్మ 54 ఏళ్లుగా జ్యోతిష్యం.. పంచాంగ శ్రవణం వినిపిస్తూ వస్తున్నారు. రాష్ట్రం నుంచేగాక ఆంధప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పంచాంగం, జ్యోతిష్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. మానవపాడు మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన ఆఫీస్ నాగిరెడ్డితోపాటు దత్రాత్రేయశాసీ్త్ర, విజయవాడ నాగేశ్వరశాస్త్రీ వద్ద రేవతీనాథ్శర్మ పంచాంగం, జ్యోతిష్యం నేర్చుకున్నారు. నాటి నుంచి ప్రజలకు జ్యోతిష్యం, పంచాంగం వివరిస్తూ వస్తున్నారు. అలాగే, ఉత్తమ అర్చకుడిగా ఉమ్మడి మహబూబ్నగర్ కలెక్టర్ శ్రీదేవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
ఆలయాల్లో ప్రముఖుల ప్రత్యేక పూజలు
అలంపూర్/ఎర్రవల్లి: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓ పురేందర్కుమార్, ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా జోగుళాంబ అమ్మవారి, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. భక్తిశ్రద్ధలతో చండీహోమం అమావాస్యను పురస్కరించుకొని జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం చండీ హోమాలు నిర్వహించగా 178 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులతో కిక్కిరిసిన బీచుపల్లి పుణ్యక్షేత్రం ఎర్రవల్లి: అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని పలు ఆలయాలు శనివారం భక్తులతో రద్దీగా మారాయి. అభయాంనేయస్వామికి ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవితో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. -
‘ఉపాధి’ కూలీలకు అధిక వేతనం వచ్చేలా చూడాలి
ఎర్రవల్లి: ఉపాధి హామీ పఽథకంలో కూలీలతో సరైన కొలతల ప్రకారం పనులను చేయించి అధిక వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని, పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి పనిలో మహిళ సమాఖ్య సంఘం సభ్యులు కూడా పాల్గొని వివిధ శాఖలకు ఉపయోగపడే పనులను పూర్తిచేసి పథకాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ ఖాన్, ఎపిఎం శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్దన్రెడ్డి, టిఎ ప్రవీన్, తదితరులు పాల్గొన్నారు.పురాతన బావి కబ్జాపై నిరసనగద్వాలటౌన్: సంస్థానాధీశుల కాలం నాటి పురాతన బావులను పునరుద్ధ్దరించలేని పాలకులు, అధికార యంత్రాంగం.. కనీసం వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోలేకపోవడం దారుణమని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. పురాతన కొత్తబావిని పునరుద్దరించడంతో పాటు ఆక్రమించుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పురాతన బావి కబ్జాపై ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఆందోళనలు చేస్తున్న ఎమ్మెల్యే స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పూడ్చిన బావిలో మట్టి తొలగించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే, వారిపై అధికార పార్టీ నేత బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనుమతులు లేకుండా సుమారు రెండు వందల టిప్పర్ల మట్టిని తరలించి బావిని పూడ్చిన సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. దీక్ష శిబిరంలో బీజేపీ నాయకులు బండల వెంకట్రాములు, జయశ్రీ, కేకే రె డ్డి, దేవదాసు, చిత్తారికిరణ్, నర్సింహా, మాలీంఇసాక్, కృష్ణ, మదుగౌడ్, వాసు, శంకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.విద్యతోనే ఉజ్వల భవిష్యత్అచ్చంపేట రూరల్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. బీసీలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో బుడుబుక్కుల కులస్తులతో ఆయన సమావేశమై వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు చెందిన కొన్ని జాతుల వారు వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నా.. తమ కులం పేరు బయట చెప్పేందుకు సిగ్గుపడే స్థితిలో ఉన్నారన్నారు. బీసీలలోని కొన్ని కులాల్లో పేర్లు బయటకు చెప్పుకోలేనంత అభ్యంతరకరంగా ఉండటంతోనే కుల పేర్ల మార్పిడీపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. పేరు మార్పిడీపై వారి సలహాలను స్వీకరించారు. -
రైతులు జాగ్రత్తగా ఉండాలి
చాలా మంది ప్రజలు మాపై నమ్మకంతో అమరవాయి గ్రామానికి వచ్చి జ్యోతిష్యం, పంచాంగం చెప్పించుకుంటారు. మా గురువుల నుంచి నేర్చుకున్న జ్యోతిష్యం, పంచాంగ శ్రవణాన్ని ఏళ్లుగా ప్రజలకు వివరిస్తూ వస్తున్నా. ఇక.. ఈ విశ్వవాసు నామ సంవత్సరం విషయానికి వస్తే ప్రేమ వివాహలు ఎక్కువగా జరుగుతాయి. రెండు తుమ్ముల వాన, ఒక తుమ్ము గాలి విస్తాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి రెండు సార్లు ఆలోచించి పంట సాగు చేయాలి. పంట చేతికి వచ్చే సమయంలో ధర రాదు.. ధర వచ్చినప్పుడు పంట చేతిలో ఉండదు. నలుపు, తెలుపు, ఎరుపు పంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అగ్ని, వాహన ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. – మేళ్ల చెరువు రేవతీనాథ్శర్మ, అమరవాయి, మానవపాడు మండలం -
విశ్వావసు నామ శుభాకాంక్షలు
‘వి’శాల విశ్వంలో అందరూ..వి ‘శ్వా’ సముతో ధైర్యంగా జీవిస్తూ ‘వ’సుదైక కుటుంబంలో భాగమవుతూ ‘సు’గుణాల సంపదలను పంచుతూ అరమరికలు లేని సంసారమున షడ్రుచులతో కష్టసుఖాలను సమరీతిన భావించే శక్తి అందించాలని సర్వాంగ సుందరంగా తయారై విశ్వకాంతులను పంచాలని వస్తోన్న ‘విశ్వావసు‘ నూతన వత్సరానికి స్వాగతం... శుభస్వాగతం... – ఇల్లూరి వెంకట్రామయ్య శెట్టి రిటైర్డు తెలుగు ఉపాధ్యాయుడు, అలంపూర్ -
నాలుగు తరాలుగా..
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా మా తాత బోరవెల్లి కేశవాచార్యులు కొనసాగారు. తదనంతరం మా తండ్రి బోరవెల్లి ప్రకాషమాచార్యులు, వారి తర్వాత నాతో పాటు మా సోదరుడు రాఘవాచార్యులు ఆలయంలో భక్తులకు ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా ఉగాది విశిష్టతను వివరిస్తూ వస్తున్నాం. ఈ ఏడాది వచ్చే ఉగాదిని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటల స్థితిగతులు, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలోని యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలను వివరిస్తాం. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుపుతాం. – బోరవెల్లి పవన్కుమార్ ఆచార్యులు, గద్వాల -
షడ్రుచుల ఉగాది
క్రోధీకి వందనం.. ఆశల విశ్వావసు నామకు ఆహ్వానం తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్లో కాలానికి ఒక ప్రమాణం ఉంది. కాలాన్ని లెక్కించడానికి నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. అందులో భాగంగానే నెలలకు, సంవత్సరాలకు పేర్లను నిర్దేశించారు. ఛైత్రం నుంచి ప్రారంభమయ్యే నెలలు ఫాల్గుణంతో ముగిస్తాయి. కొత్త పూత, కొత్త కాత, కొత్త రుచులతో నూతన సంవత్సరం ఆరంభమవుతూ కొంగొత్త ఆలోచనలకు తెరతీస్తుంది. ద్వాపర యుగంలో తన అవతారాన్ని శ్రీకృష్ణుడు చాలించగా కలియుగం ప్రారంభమయ్యే సమయంగా దీన్ని యుగాదిగా పరిగణించారనే వాదన ఉంది. యుగాది కాలక్రమంలో ఉగాదిగా వాడుకలోకి వచ్చింది. పంచాంగ పఠనం తర్వాత నిర్వహించే కవి సమ్మేళనం ఆకట్టుకునేలా ఉంటుంది. ‘హితేన సహితం సాహిత్యం’ అంటారు. మేలుచేసేదే సాహిత్యం అని అర్థం. వసంతరుతువు కావడంతో లేత చిగుళ్లు తిన్న కోయిలలు మాధుర్యంతో కూసే కూత కవిలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. ఈ సమ్మేళనాల్లో ఔత్సాహిక కవులు జనహితం కోరుతూ రచించిన కవితలను షడ్రుచులతోపాటు మాతృబాషపై మాధుర్యాన్ని జోడించి ఇందులో చదివి వినిపిస్తారు. ఇలాంటి కవి సమ్మేళనాలకు చిన్నారులను తీసుకెళ్లడం వల్ల వారికి మాతృభాషపై మరింత అవగాహన పెరిగే వీలుంటుంది. కవితా రచనప్రక్రియపై అవగాహన పెరుగుతుంది. ఇతరభాషల పట్ల మోజుతో ఉన్నవారికి సైతం మాతృభాషపై ఆసక్తిని కలిగిస్తుంది. కవితల రూపంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరానికి పరిచయం చేయొచ్చు. ప్రపంచ భాషల్లో తెలుగు మాధుర్యమైంది. ఎందుకంటే తెలుగులో ప్రతి పదం చివర అచ్చుతో ముగుస్తుంది. అచ్చుతో పదాలు ముగిసే భాష కాబ ట్టి అజంతభాష అనే పేరువచ్చింది. తెలుగుభాష మాధుర్యాన్ని చాట డానికి కవి సమ్మేళనం ఒక చక్కని వేదిక. ● తెలుగు సంస్కృతికి ప్రతీక ఈ పండుగ ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు ఉగాది పర్వదినం తెలుగుజాతికి మాత్రమే ప్రత్యేకం. ఉగాది రోజున ఒంటికి పసుపు కలిపిన సున్ని పిండితో నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేస్తారు. కొత్త దుస్తులు ధరిస్తారు. షడ్రుచుల పచ్చడి సేవిస్తారు. పచ్చడిలో పులుపు (ఆమ్లం), తీపి (మధురం), వగరు (కషాయం), చేదు (పిత్తం), కారం (కటువు), ఉప్పు (లవణం) గుణాలతో కూడిన వేపపువ్వు, లేత మామిడి కాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, కారంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పండుగ రోజున సాయంత్రం వేళ ఆలయాల్లో, గ్రామకూడలిలో పంచాంగ పఠనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పంచాంగం పూర్వ కాలంనుంచి ఒక శాస్త్రంగా భావిస్తూ వస్తున్నారు. గ్రామ పురోహితుడు హాజరై గ్రామ పెద్దలు, పుర ప్రముఖుల మధ్య పంచాంగం వివరాలను చదివి వినిపిస్తారు. పంచాంగం రానున్న ఏడాది కాలంలో వ్యక్తుల వ్యక్తిగత ఆదాయ, వ్యయాలు, పోకడలతో పాటు దేశప్రాంత సామాజిక పరిస్థితులు, వాతావరణం వంటి విషయాల్లోనూ అప్రమత్తం చేస్తుంది. వర్షాలు, కరవు కాటకాలు, అరిష్టాల గురించి ఇందులో వివరిస్తారు. నమ్మకాన్ని బట్టి ఈ వివరాలను విశ్వసిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంశాలతో కూడిన పంచాంగ పఠనం వింటే సంపద, ఆయుష్షు, పాపపరిహారం, రోగాలు తొలగడం, చేసే ప్రయత్నాలు ఫలించడం వంటి ఐదు ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు. మనిషికి, ప్రకృతికి సంబంధం చలికాలంలో మనిషి శరీరంపై కాలం తీరిన చర్మం పొరలుగా రాలిపోతుంది. వెంట్రుకలు కూడా అలాగే రాలిపోతుంటాయి. ప్రకృతిలో కూడా హేమంతరుతువు (చలికాలం ప్రారంభం)లో చెట్ల ఆకులు ఎండిపోతుంటాయి. శిశిరుతువు (చలికాలం ముగింపు)లో కొత్త చిగుళ్లు వేస్తుంటాయి. ఇలా ఒకే కాలం మనిషికి, ప్రకృతికి సంబంధాన్ని కలిపింది. ఆకట్టుకునే కవి సమ్మేళనం తెలుగుజాతికి ప్రత్యేకం తెలుగు అజంత భాష భవిష్యత్తుపై అప్రమత్తత.. పంచాంగం -
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
గద్వాల: పేదింటి ఆడపడచులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్రెడ్డి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గద్వాల పట్టణం, ధరూరు, మల్దకల్, గట్టు, కెటి.దొడ్డి మండలాలకు చెందిన 40మంది మహిళలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు బాబర్, మురళి, ప్రభాకర్రెడ్డి రామన్గౌడ తదితరులు పాల్గొన్నారు. అలాగే, పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ఫండు నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. జములమ్మ హుండీ ఆదాయం రూ.27.78 లక్షలు గద్వాల న్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్దిగాంచిన జములమ్మ, పరుశరామస్వామి ఆలయ హుండీని శుక్రవారం ఆలయంలో లెక్కించారు. గడిచిన 65రోజులకు గాను హుండీని లెక్కించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ డివిజన్ పరిశీలకురాలు వెంకటేశ్వరీ, ఈఓ పురందర్కుమార్, చైర్మన్ వెంకట్రాములు, యూబీఐ అధికారులు శ్రీకాంత్రెడ్డి, సుధాకర్ సమక్షంలో సిబ్బంది, భక్తులు లెక్కించారు. నగదు రూ.27,78,778, మిశ్రమ బంగారం 27గ్రాములు, మిశ్రమ వెండి 640 గ్రాములు ఆదాయంగా వచ్చింది. గడిచిన ఏడాది ఇదే సమయానికి జరిగిన లెక్కింపుతో పోల్చితే రూ.50,739 అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, ఆలయాన్ని గద్వాల సంస్థాన వంశస్థులు శ్రీకృష్ణరాంభూల్ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఆయన అమ్మవారికి పూజలు జరిపించారు. అనంతరం అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,969 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 1388 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5969, కనిష్టం రూ.3119, సరాసరి రూ.5619 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6404, కనిష్టం రూ.6289, సరాసరి రూ.6289 ధరలు వచ్చాయి. 65 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6091, కనిష్టం రూ. 5669, సరాసరి రూ. 6059 ధరలు వచ్చాయి. 7 క్వింటాళ్ళ వరి (సోన) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ.1964 ధర లభించింది. -
కూలీల రక్షణపై పట్టింపేది?
రాజోళి: ఉపాధి హామీలో పని చేసే కూలీలకు రక్షణ కరువైంది. మండే ఎండలో పని చేసే వారికి చేయాల్సిన రక్షణ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి గ్రామాల్లో ఉపాధి పనుల్లో పాల్గొని కుటుంబ పోషణ చేసుకునే వారికి వేసవి కాలం వచ్చిందంటే గాల్లో ప్రాణాలు పెట్టి పనులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం జాగ్రత్తలు వహిస్తూ పనులు చేయండని చెబుతున్నప్పటికీ, నిర్ధేశించిన పనులను చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో కల్పించలేకపోతున్నారు. వసతుల్లేక ఇబ్బందులు ప్రస్తుతం పాంపాండ్స్, గుట్టల్లో గుంతలు తీయడం, నర్సరీల్లో మొక్కల పనులు జరుగుతున్నాయి. పని చేసే ప్రదేశంలో కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేదతీరడానికి ప్రభుత్వం గుడారాలు పంపిణీ చేసేది. ఏళ్లుగా వాటి పంపిణీ నిలిచింది. కనీసం కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా వాటిని అందిస్తే ప్రయోజనం చేకూరుతోంది. గతంలో మెడికల్ కిట్లు పంపిణీ చేసేది. గాయాలపాలైనా, ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కిట్లను పంపిణీ చేయాల్సింది. ఓఆర్ఎస్ ప్యాకెట్, బ్యాండెడ్, దూది, అయోడిన్ సీసా, కొన్ని రకాల మందులు ఉండేవి తొమ్మిదేళ్లుగా కిట్లను కూడా పంపిణీ చేయడం లేదు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పని చేయటం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ముంది. తాగునీరు సక్రమంగా తాగకపోతే నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవటంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతారు. ఈక్రమంలో కూలీలు తగినంత నీరు తాగుతూ.. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, పని ప్రవేశాల్లో ఓఆర్ఎస్ ద్రావణం లేదా నిమ్మకాయ నీళ్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, 12 నుంచి 3 గంటల వరకు పనిచేయటం మానుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముందే అప్రమత్తమవ్వాలి ప్రమాదాలు జరిగాక రక్షణ చర్యలు, ఆసుపత్రులకు పరుగులు తీసే బదులు ముందుగానే రక్షణ చర్యలు చేపడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎండలో కూలీలు పనులు చేసే దగ్గర కనీసం మెడికల్ కిట్లు, టెంట్లు ఉండటం లేదు. తాగునీరు కూడా సక్రమంగా లేదు. గ్రామానికి దూరంలో పని కల్పించినప్పుడు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. – విజయ్, రాజోళి ఏర్పాట్లు చేస్తాం గ్రామ పంచాయతీలకు బాధ్యత ఉన్నప్పటికీ, మా పర్యవేక్షణ నిత్యం ఉంటుంది. గ్రామానికి దూరంగా పనులు జరిగే సమయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఎక్కడ పనులు చేపట్టినా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా వసతులు లేకపోతే కూలీలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత సిబ్బందితో మాట్లాడి వెంటనే చర్యలు చేపడుతున్నాం. – ప్రసాద్, ఏపీఓ, రాజోళి ●గ్రామపంచాతీలపైనే.. ఉపాధి కూలీలకు రక్షణ చర్యలు కల్పించాలంటూ గ్రామ పంచాయతీలపైనే ప్రభుత్వాలు భారం వేస్తుండటంతో జీపీలు పూర్తి స్థాయిలో కూలీలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. బడ్జెట్ లేమి, నిధుల కొరత కారణంగా ఉపాది కూలీలకు కల్పించాల్సిన వసతుల్లో చాలా వరకు గాలికొదిలేస్తున్నాయి. తరుచూ జిల్లా అధికారుల తనిఖీలు, పనులు ఎక్కువగా జరిగే గ్రామాల్లో వసతుల కల్పన ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో కనీసం రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో కూలీలు ఉసూరుమంటున్నారు. ఉదయమే పనులకు వెళ్లి ఎండ పడకముందే ఇళ్లకు తిరిగి వచ్చేయాలంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పనులు నిర్ణయించే చోటుకు వెళ్లే సరికే ఎండ పడుతుందని, అక్కడ పని ప్రారంభించేలోగానే ఎండ ముదురుతుందని, అదే ఎండలోనే ఇంటికి రావడం తప్పడం లేదని కూలీలు అంటున్నారు. పనులు చేసి ఇంటికి వచ్చేలోగానే వడదెబ్బలు తగిలి అనారోగ్యానికి గురైన కూలీలు ఎందరో ఉన్నారని, ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఎండలు ఎక్కువగా ఉండగా..మున్ముందు ఇంకా ఎక్కువగా ముదిరే అవకాశముందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని కూలీలు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షణతో కనీస సౌకర్యాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మండుటెండల్లో ఉపాధి కూలీల అవస్థలు క్షేత్ర స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ కనీస సౌకర్యాలు కరువు రక్షణ చర్యలు గాలికొదిలేసిన అధికారులు -
ఉన్నత విద్యకు బాటలు
అభివృద్ధి వైపు పాలమూరు యూనివర్సిటీ పయనం ●● ఒకే విద్యా సంవత్సరంలో రూ.150 కోట్లు మంజూరు ● పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు విడుదల చేసిన కేంద్రం ● రాష్ట్ర బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయింపు ● లా, ఇంజినీరింగ్ కళాశాలల భవనాల నిర్మాణంపై దృష్టి ● హాస్టల్స్, ల్యాబ్స్ భవనాలను నిర్మాణానికి శ్రీకారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు గతంలో కేవలం వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ, ఈ సంవత్సరం వేతనాలతో పాటు అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడంతో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్, ల్యాబ్స్ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. లా, ఇంజినీరింగ్ కళాశాల కోసం కూడా భవనాల నిర్మాణం చేపడతాం. విద్యార్థుల చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే విధంగా కొత్త కోర్సులు ప్రారంభించేలా చూస్తాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ ●యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయింపు ఇలా.. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నూతన భవనాలు, అధునాతన ల్యాబ్లు, వినూత్న కోర్సులతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యూనివర్సిటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో నిధులు కేటాయింపులు చేయడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి విద్యార్థులకు హాస్టళ్లు, తరగతి, గదులు, ల్యాబ్లు, గ్రౌండ్స్ వంటివి లేక సతమతమవయ్యే వారు. కానీ, ఈ సంవత్సరం పెద్దమొత్తంలో నిధుల కేటాయింపుతో భవనాల నిర్మాణానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం ద్వారా ఇచ్చిన నిధులతో పెద్దఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్మాణాల కోసం రూ.35 కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులతో మరిన్ని భవనాల నిర్మాణాలకు అంచనాలు రూపొందిస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. రూ.150 కోట్లు కేటాయింపు.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేవలం సిబ్బంది వేతనాల కోసమే కేటాయింపులు జరిగివి. 2018లో పీయూలో న్యాక్ గ్రేడింగ్ రావడంతో ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేయగా.. పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో సిబ్బంది వేతనాల కోసం గతేడాది రూ.11 కోట్లు, ఈ సంవత్సరం రూ.15 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు కూడా ఇచ్చారు. గతేడాదితో పోల్చితే రూ.4 కోట్లు అదనంగా ఇవ్వడంతో యూనివర్సిటీపై వేతనాల భారం తగ్గనుంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు కేటాయించనప్పటికీ అధికారులు యూనివర్సిటీ అంతర్గత నిధులు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి నిధులు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా కేంద్ర ప్రభు త్వం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఒకేసారి కేటాయించడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతాయని భావిస్తున్నారు. సంవత్సరం ప్రతిపాదనలు కేటాయింపులు (రూ.కోట్లలో..) 2019– 20 119 6.63 2020– 21 216 7.39 2021– 22 137 7.58 2022– 23 75 9.58 2023– 24 84 10.91 2024– 25 200 50 వసతుల కల్పనపై దృష్టి.. యూనివర్సిటీలో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రస్తుతం అవసరమైన నిధులు అందుబాటులో ఉండడంతో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఇంజినీరింగ్, లా కళాశాలల భవనాల నిర్మాణం కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారు. ఈ రెండు కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం రెండు బాలుర, బాలికల హాస్టళ్లు, ఒక అకామిక్ బ్లాక్ను నిర్మించనున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో రీసెర్చ్ కోసం రూ.11 కోట్లతో రీసెర్చ్ఫెసిలిటీ భవనం, విద్యార్థులను అథ్లెటిక్స్ ప్రోత్సహించేందుకు సింథెటిక్ ట్రాక్, సందర్శకుల కోసం గ్యాలరీ నిర్మిస్తున్నారు. త్వరలో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
నత్తనడకన ఎల్ఆర్ఎస్
26 వేల దరఖాస్తులు.. 6 శాతంలోపే పరిష్కారం గతంలో అలా.. ప్రస్తుతం ఇలా.. గతంలో భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎల్ఆర్ఎస్కు అనుమతిస్తేనే సదరు స్థలం మార్కెట్ విలువను బట్టి దరఖాస్తుదారు ఫీజు చెల్లించేవారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనకు ముందే ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో చాలామంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా రాయితీ వర్తించాలంటే మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించాల్సి రావటం దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారుతోంది. వాయిదా పద్దతిలో చెల్లించేందుకు అవకాశం లేకపోవడం, కొందరి ప్లాట్లు నిషేదిత జాబితాలోకి వెళ్లటంతో ఫీజు చెల్లింపులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గద్వాలటౌన్: అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ కరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీని ఈ నెలాఖరు వరకు వర్తింపజేసింది. సమయం సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో దరఖాస్తుదారులు స్పందిస్తేనే వారికి ఉపయుక్తంగా మారనుంది. మించిపోతే పూర్తిస్థాయిలో చెల్లించాల్సిన పరిస్థితి. ప్రత్యేక రాయితీపై అధికారులు విస్తృత అవగాహన చేపడుతున్నా.. పలువురు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడంతో భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొననున్నాయి. ఆరు శాతంలోపే.. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నత్తను తలపిస్తోంది. గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో 26,691 దరఖాస్తులు రాగా.. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1,506 మాత్రమే పరిష్కరించి ప్రొసీడింగ్స్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 31వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి మాత్రమే రాయితీ ఇవ్వనుండటంతో చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే ప్రక్రియ వేగంగా సాగకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారు. సాంకేతిక సమస్యలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని అధికారులే చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్తో భారీ ఆదాయం సమకూరుతుందని భావించిన మున్సిపల్ అధికారులకు నిరాశే ఎదురవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో ఎల్ఆర్ఎస్పై ప్రభావం పడుతుంది. క్షేత్రస్థాయిలో సమీక్ష సైతం మొక్కబడిగా ఉంది. క్రమబద్ధీకరణ ఫీజు కంటే ఖాళీ స్థలం ఫీజు ఎక్కవగా ఉండటంతో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కొందరైతే తర్వాత చూద్దాంలే అని విరమించుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 5.64 శాతం మంది మాత్రమే ఫీజులు చెల్లించారంటే స్పందన ఎంత దారణంగా ఉందో అర్థమవుతోంది. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఇప్పటికే వార్డు ఆఫీసర్ల ద్వారా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వివరాలు తెలియజేశాం. నెలాఖరు వరకు రాయితీ అవకాశం ఉన్నందున దరఖాస్తుదారులు ఫీజు చెల్లించి ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి. – నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్ మొరాయిస్తున్న సర్వర్ ఎల్ఆర్ఎస్ సర్వర్ మొరాయిస్తుండటంతో ఇంటి వద్ద, మీసేవ, ఈసేవా ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించే వారు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వినియోగిస్తుండటంతో వేగం తగ్గుతుందని అంటున్నారు. సర్వర్ వచ్చిపోతుండటంతో అసహనానికి గురవుతున్నారు. కొందరు ఫీజు చెల్లించిన తర్వాత రషీదు రావడంలేదు. మరి కొందరికి ఫీజు చూపించడంలేదు. ఇంకొందరికి అయితే దరఖాస్తు ఆన్లైన్లోనే కనిపించడం లేదు. జిల్లా వివరాలిలా.. సాంకేతిక సమస్యలతో పరేషాన్ రాయితీకి రెండు రోజులే గడువు -
అనుమానిత వ్యక్తుల సమాచారం అందించాలి
గద్వాల క్రైం: గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ శ్రీను సూచించారు. గురువారం సాయంత్రం గద్వాల పట్టణంలోని బీసీ కాలనీ, తెలుగు పేట, శివాలయం, రవీంద్ర పాఠశాల కాలనీలో ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ, ఎస్ఐలు కళ్యాణ్కుమార్తో పాటు సిబ్బంది కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ఘటనలు జరగకుండా ముందుస్తుగా ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కాలనీలో ఎవరికై న ఇళ్లు అద్దెకు ఇచ్చే క్రమంలో వారి వ్యక్తిగత సమాచారం, శాశ్వాత చిరునామా, ఆధార్ కార్డు తదితర వివరాలు సేకరించాలని, అలాగే ఎవరైన శుభకార్యాలు, దూర ప్రయాణాలకు వెళ్లే క్రమంలో దగ్గరలోని పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. అనంతరం కాలనీలోని పలు ఇళ్లలోని వ్యక్తుల సమాచారం ఆరా తీశారు. సీసీ కెమెరాలను కాలనీలో ఏర్పాటు చేసుకోవాలని, అత్యవసర సమయంలో డయల్ 100కు సంప్రదించాలన్నారు. 160 వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్టేషన్కు తరలించారు. ఎవరైన క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
మానవుడి ఆయుష్షు పెంచడమే ఉగాది ఉద్దేశం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో జీవిస్తున్న మానవుడి ఆయుష్షు పెంచడమే పండగ ఉద్దేశం అని, షడ్రుచులను వివిధ ప్రకృతి ప్రసాదాలతో తయారు చేసిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుందన్నారు. చేదు, తీపిలు జీవితంలో మంచి చెడులను ఆస్వాధించడమే అన్నారు. వక్త గుంత లక్ష్మణ్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ముఖ్యమని, సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని సూచించారు. ప్రపంచ విపత్తులకు భారతదేశ యువత మార్గాలను చూపాలని, చెడు వ్యసనాలకు బానిసై నిర్వీర్యం కాకుండా, తన కుటుంబంతో పాటు దేశసేవలో భాగం కావాలని, వసుదైక ఉమ్మడి కుటుంబ విలువను పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కవితలు, జానపద గేయాలు, జానపద నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ రాజ్కుమార్, తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సంధ్యరాణి, ప్రిన్సిపాళ్లు రవికాంత్, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బకాయిదారులకు ఊరట
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ఈ నెల 31 వరకే అవకాశం మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను ఏటా రెండు అర్ధ వార్షికాల్లో చెల్లించవచ్చు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు, అక్టోబరు నుంచి మార్చి వరకు చెల్లించాల్సిన పన్నును ఏడాదికోసారి చెల్లించడం పరిపాటిగా మారింది. అయితే మొండి బకాయిల వసూలుకు, మున్సిపాలిటీ ఖజానాను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. గతేడాది వరకు ఉన్న పన్ను బకాయిని ఏక మొత్తంలో చెల్లించే వారికి, బకాయిలపై విధించే (వడ్డీ) జరిమానాలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు. కేవలం పది శాతం చెల్లిస్తే చాలని, ఈ అవకాశం ఈ నెల చివరి వరకు ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికే పన్ను బకాయిలను పూర్తి వడ్డీతో పాటు కలిపి చెల్లించి ఉంటే.. అలాంటి వారికి రాబోవు పన్ను చెల్లింపులో వడ్డీ రాయితీ వర్తింపచేయనున్నారు. గద్వాలటౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీలలో ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని మొండి బకాయిదారులకు ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పించింది. మార్చి 2024–25 నాటికి ఆస్తిపన్ను మొత్తం బకాయిలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ కానుంది. కేవలం పది శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. ఈ అవకాశం ఈ నెల 31వ తేదీ వరకు ఉంటుంది. జిల్లాలో గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పాతవి కాగా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినవి. గద్వాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోయాయి. గతేడాది ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి వడ్డీమాఫీ ప్రకటించింది. మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను వసూళ్లు చాలా వరకు మందగించాయి. పలు రాయితీలు ఇచ్చినప్పటికి ఆశించిన స్థాయిలో పన్నులు వసూళ్లు కాలేదు. దీంతో పాత బకాయిలు వసూలు చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ కొత్త ఎత్తుగడ వేసింది. వన్ టైం స్కీం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వన్ టైం స్కీం ద్వారా పాత బకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్దమవుతున్నారు. చెల్లింపులు జరిగితే ఆయా శాఖలకు భారం తగ్గే అవకాశం ఉంది. వన్ టైం సెటిల్మెంట్తో వంద శాతం వసూలు చేయాలని అధికారుల కసరత్తు 31 వరకు చెల్లించేవారికి మాత్రమే వర్తింపు -
మరమ్మతు..
జోగుళాంబ గద్వాల‘జూరాల’కురూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025రామన్పాడు గేట్లకు లీకేజీలు.. రామన్పాడు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు ఆయా గేట్లను పూర్తిస్థాయిలో మూసివేసినా లీకేజీలు ఏర్పడి ముందుకు పారుతోంది. అంతేగాకుండా ఎప్పుడో చేసిన కాల్వల లైనింగ్ దెబ్బతినడంతో ఎప్పుడు తెగిపోయాయోనన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం రామన్పాడు రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తుంటారు. కాల్వల గేట్లు దెబ్బతినడంతో నీటి తాకిడికి ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు, అక్కడక్కడ దెబ్బతిన్న కాల్వ లైనింగ్, చిన్న చిన్న మరమ్మతులు వేసవిలో చేపట్టేందుకు అధికారులు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం కాల్వల్లో సాగు, తాగునీరు వదులుతున్నామని పంట కోతలు పూర్తయిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. వేసవి పూర్తయ్యే నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామన్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడుతోందని.. వేసవిలో మరమ్మతులు పూర్తిచేసి సకాలంలో సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఉన్న జూరాల ఎడమకాల్వ వెంట ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని గండ్లు ఉన్నాయో గుర్తించే పనుల్లో వర్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ వెంట మరమ్మతులు చేసిన అధికారులు ప్రస్తుతం రూ.1.20 కోట్లతో గేట్లు, లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలుగా ఉండగా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలం వరకు సుమారు 75 కిలోమీటర్ల పొడవున కాల్వ ఉంది. ఆయా మండలాలను కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీరు ఎడమకాల్వ ద్వారానే విడుదల చేస్తున్నారు. ఆరు కిలోమీటర్లు.. ఎనిమిది రంధ్రాలు... మూలమళ్ల నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది ప్రదేశాల్లో కాల్వ దెబ్బతింది. వీటి మరమ్మతులు చేపట్టకపోతే వచ్చే వర్షాకాలం వరదల నీటి ఉధృతికి లైనింగ్ దెబ్బతిని గండ్లుపడే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా.. జూరాల ప్రధాన ఎడమకాల్వకు ఏర్పడిన రంధ్రాలను పూడ్చడంతో పాటు దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. రెండేళ్లుగా కాల్వ పనులు, చేపట్టకపోగా.. కనీసం పూడికతీత, ముళ్లపొదలు కూడా తొలగించడం లేదు. – వెంకటేష్, నందిమళ్ల ప్రతిపాదనలు పంపించాం.. జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చడంతో పాటు చిన్న చిన్న మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని గతేడాది ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ఈ ఏడాది జూరాల ఎడమ కాల్వ, రామన్పాడు కుడికాల్వ గేట్ల మరమ్మతులు, చిన్న చిన్న పనుల కోసం రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు మంజూరైతే పంట కోతలు పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ సబ్ డివిజన్ దెబ్బతిన్న జూరాల ఎడమ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు.. లైనింగ్ వేసవిలో పనులు చేపట్టేందుకు అధికారుల సన్నాహాలు -
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
మల్దకల్: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సునంద అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో గట్టు అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే పౌష్టికాహారంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. నెలనెలా వైద్యపరీక్షలు చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు సంధ్యారాణి, నాగరాణి, తెల్లమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
గద్వాల: డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా గత రెండేళ్లుగా వాళ్ల సహనాన్ని పరీక్షించవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులతో కలిసి డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలలో కొన్నింటికి విద్యుత్ కనెక్షన్లన్లు, వాటర్ సరఫరా, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు వంటి మౌళిక వసతులు కల్పించకుండా లబ్ధిదారులను మోసం చేస్తున్నట్లు ఆరోపణ చేశారు. ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా ఆలస్యం చేయడంతో కిటికీలు, తలుపులు, ధ్వసం అయ్యాయని దీనిపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలన్నారు. అదేవిధంగా ధ్వంసమైన ఇళ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలన్నారు. రెండేళ్ల కిందట లక్కీడిప్పు విధానంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి లబ్ధిదారులను ఎంపిక చేశారని తరువాత 99మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం దారుణమన్నారు. ఉద్దేశపూర్వకంగానే పేర్లు తొలగిస్తూ, కాలయాపన చేయడం సరైన విధానం కాదని మండిపడ్డారు. లక్కీడిప్ విధానంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించాలని లేదంటే లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహా, లబ్ధిదారులు లక్ష్మీ, శమిన్, పావని, రాజేష్, అంజి, రఘు, నాగరాజు, సురేష్, నరేష్, రాజు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ట్రాఫిక్ సిబ్బందికి నూతనంగా వచ్చిన పరికరాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని వాహనదారులు సామర్థ్యానికి మించి స్పీడ్తో వాహనాలు నడుపుతూ వారు ప్రమాదాలకు గురవుతూ.. ఇతరులను వాటి బారిన పడేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ పలు అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు 10 ఫ్లెక్సిబుల్ ఐరన్ బారికేడ్స్, 10 రిఫ్లెక్ట్ జాకెట్స్, 10 బ్రీత్ అనలైజర్స్ తదితర వాటిని ట్రాఫిక్ సిబ్బందికి అందజేశామన్నారు. జిల్లాలోని ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ట్రాఫి క్ ఎస్ఐ బాలచంద్రుడికి పరికరాలను అందజేశారు. -
ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి
అలంపూర్: సాగుభూములను ప్రమాదకరంగా మార్చే ఇథనాల్ ప్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. హైదరాబాద్లోని శాసన మండలిలో సమావేశాల్లో ఎమ్మెల్సీ పలు సమస్యలను బుధవారం ప్రస్తావించారు. అలంపూర్ నియోజకవర్గంలో ప్రజలు వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్నారని వివరించారు. రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామం వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పంట పొలాలకు ప్రమాదకరంగా మార్చే ఈ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని, ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మా ప్రాంతంలో వ్యవసాయ భూములకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉన్న ఫ్యాక్టరీలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీతో 12 గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా రైతులు, ప్రజలు పోరాటం చేస్తున్నారని, పంట పొలాలను, భూగర్భ జలాలను కలుషితం చేసే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల సర్పంచ్ల పాలన ముగిసి ఏడాది కావస్తుండటంతో గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. త్వరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలకు రాష్ట్రంతోపాటు కేంద్ర నిధులు వస్తాయని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీల్లో పన్నుల భారం తగ్గించాలని కోరారు. మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గం వచ్చేలోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 5 కి.మీ, 8 కి.మీ దూరంలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటిల్లో కలిపారని పేర్కొన్నారు. ఇకనైనా వాటిని విడదీసి పంచాయతీలుగా మార్చాని విజ్ఞప్తి చేశారు. -
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
ఎర్రవల్లి: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే ప్రశ్నించడంతో పాటు మన హక్కులను సాధించగలుగుతున్నామని.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లిలో ఏర్పాటు చేసిన జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్మన్ వెన్నెల, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్జాన్తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ.. రాజ్యాంగాన్ని కాపాడుతూ.. దేశ ప్రజలను మభ్యపెడుతూ మనువాద సిద్దాంతాన్ని ప్రజలపైన రుద్దుతున్న బీజేపీ పార్టీని ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించే దిశగా గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ నాయకులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందీని జాతీయ భాష చేయాలని కుట్ర పన్నుతుందని, తెలుగు ప్రాంత ప్రజలకు అన్యాయం చేసే ఈ చర్యను అడుగడుగునా అడ్డుకోవాలని అన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన వాళ్లకి చివరికి అన్యాయం జరిగిందని, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడితే సొంత పార్టీ వాల్లే తమ కష్టాన్ని గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నాయకులు పలు సమస్యలపై ఒకరికొకరు ప్రశ్నించుకొని మాటలతో వాగ్వాదాలకు దిగగా.. ఏఐసిసి కార్యదర్శి ఇరువురికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్మన్ వెన్నెల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, మార్కెట్యార్డు చైర్మెన్ దొడ్డెప్ప, వైస్ చైర్మెన్ కుమార్, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీచుపల్లిలో ప్రత్యేక పూజలు మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని బుధవారం ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ట్ర సాంస్కృతికశాఖ చైర్పర్సన్ వెన్నెల, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్జాన్ సందర్శించారు. అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
గద్వాల డిపో మేనేజర్గా సునీత
గద్వాల క్రైం: ఆర్టీసీ గద్వాల డిపో మేనేజర్గా సునీత బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరిస్తానని, సంస్థ అభివృద్ధికి ప్రతిఒక్క రూ సహకరించాలన్నారు. మేనేజర్కు సిబ్బంది పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి గద్వాల: ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి నిర్ధేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆదేశించారు. బుధవారం గద్వాల మండల పరిదిలోని చెనుగోనిపల్లి గ్రామంలోని ఉపాధి హమీ పనులను ఆయన పరిశీలించి కీలక సూచనలు అందించారు. అనంతరం గ్రామంలోని కోళ్ల షెడ్, పశువుల షెడ్ పరిశీలించి, నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్, కనీస వసతులు కల్పించాలని అన్నారు. సీఎంను కలిసిన అర్చక సంఘం నాయకులు అలంపూర్: హైదరాబాద్లోని అసెంబ్లీ వద్ద అర్చక ఉద్యోగ సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మేశ్వర జోగుళాంబ అమ్మవా రి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ అర్చక సంఘం నాయకులతో కలిసి సీఎంను శాలువాతో సత్కరించారు. అర్చక ఉద్యోగ జేఏసీ డైరీని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు వారు తెలిపారు. -
పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
కేటీదొడ్డి: రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె, ఉమిత్యాల గ్రామాలలో ర్యాలంపాడు రిజర్వాయర్ 104 ప్యాకేజీ కాల్వ ద్వారా నీరందక పంటలు ఎండగా.. వరి పంటలను ఆయన పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ సంతోష్, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్కు పోన్ చేసి సాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడింది శూన్యమన్నారు. జూరాల, నెట్టెంపాడు, రిజర్వాయర్ ఆయకట్టు కింద సాగునీరందకపోవడంతో పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని విమర్శించారు. యాసంగి సాగుకు ముందు ప్రభుత్వం ఐఏబీ సమావేశం నిర్వహించకుండా పంటల ప్రణాళిక రూపొందిందని అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అయినా సీఎం రేవంత్రెడ్డి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఓ వైపు పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించడానికి కూడా మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధులకు తీరిక లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలోపు ఎప్పుడు కూడా రైతుల పంటలు ఎండకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పంటలు ఎండడానికి కారణమయ్యాడని ఆరోపించారు. రాప్ట్రంలో ఇప్పటి వరకు 448 మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్వాకం వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, మోనేష్, అంగడి బస్వరాజ్, వెంకటేష్ నాయుడు, ఎస్ రాము, తిరుమలేష్, కామేష్, తదితరులు ఉన్నారు. -
గడువు లేక.. పరికరాలు పొందక !
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాయితీపై పరికరాలు అయిజ: రైతులకు సాగులో ఎంతో అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే సమయం ఇవ్వడంతో అర్హులైన రైతులు ఎంతోమంది పథకానికి దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం పడుతుండడంతో ఇక రెండు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక.. అందులోనూ కేవలం మహిళా రైతులే అర్హులని తెలపడంతో అయోమయంలో పడ్డారు. గడువు పెంచి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు. సబ్సిడీపై పరికరాలు వ్యవసాయదారులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభించి రైతులకు అవసరమైన వివిధ రకాల పరికరాలు, యంత్రాలు 50 శాతం సబ్సిడీతో అందించేందుకు వ్యవసాయ శాఖ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కేవలం మహిళా రైతులకు మాత్రమే ఈ పథకానికి అర్హులను చేస్తోంది. దరఖాస్తు చేసేందుకు కేవలం రెండు, మూడు రోజుల గడువు ఇవ్వడంతో సర్వత్రా అయోమయం నెలకొంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అందిస్తోంది. సన్న, చిన్నకారు, ఇతర వర్గాలకు చెందిన మహిళా రైతులు దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసిన మహిళా రైతులకు సబ్సిడీలో అవసరమైన వ్యవసాయ పరికరాలు సరఫరా చేస్తారు. రెండు రోజులు.. 58 దరఖాస్తులు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా యూనిట్లు, నిధులు మంజూరు చేసింది. ఈ నెల 24న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దశాబ్ద కాలంపాటు ఆగిన ఈ యాంత్రీకరణ పథకం మళ్లీ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం, కేవలం మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఉండటంతో భూములున్నప్పటికీ మహిళల పేరుతో భూమి లేకపోవడంతో అర్హులైన చిన్నకారు, సన్నకారు రైతులు సైతం ఈ పథకానికి దూరమవుతున్నారు. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 58 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలతో ఇబ్బందులు.. ట్రాక్టర్కు సంబంధించిన యంత్రాలు ఇచ్చేందుకు భూమి మహిళల పేరుతో ఉండాలని, ట్రాక్టర్ ఆర్సీ మహిళల పేరుతో ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం నిబంధనలు కొంతమేర సడలిస్తూ దరఖాస్తు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, 2016–17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ శాఖలో యాంత్రీకరణ పథకాన్ని నిలిపేసింది. దీంతో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు సంఘాల ప్రతినిధులు ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి జిల్లాల వారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాకు సంబందించి 234 యూనిట్లు కేటాయించి, రూ.56.88 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో వ్యవసాయశాఖ అధికారులు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే వివిధ కంపెనీలకు చెందిన తయారీదారులు సంబంధిత పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. సబ్ మిషన్ ఆఫ్ ఫామ్ మెకలైజేషన్ పథకం కింద ఎంపికై న రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందజేస్తారు. ప్రభుత్వం పేర్కొన్న ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాకు మంజూరైన యూనిట్ల వివరాలిలా.. పరికరాలు యూనిట్లు ట్రాక్టర్లు 3 రోటవేటర్లు 30 పవర్ స్ప్రేయర్లు 73 బ్యాటరీ స్ప్రేయర్లు 73 సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 5 డిస్క్ హారో కేజ్ వీల్స్ 39 పవర్ టిల్లర్ 2 స్ట్రా వేలర్లు 2 బండ్ ఫార్మర్ 3 బ్రష్ కట్టర్లు 2 పవర్ వీడర్లు 2 గడువు పెంచాలి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మూడురోజులు గడువు మాత్రమే విధించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు వారి వారి కుల ధ్రువీకరణ పత్రాలను ధరఖాస్తులకు జత చేయాల్సి ఉంటుంది. సరైన సమయానికి కుల ధ్రువీకరణ పత్రం అందకపోవడంతోదరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పెద్దలు ఆలోచించి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాలి. – ఆంజనేయులు, అయిజ అర్హులందరికీ అందజేయాలి ఏడేళ్ల తర్వాత ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తుంది. మహిళల పేరుతో రాయితీ పరికరాలు అందించడం బాగుంది. అయితే చాలా తక్కువ పరికరాలు జిల్లాకు కేటాయించారు. అవి ఏమాత్రం సరిపోవు. అర్హులైన రైతులందరికీ సరిపడా పరికరాలు మంజూరు చేయాలి. – వెంకటమ్మ, అయిజ త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం ఉన్నతాధికారుల ఆదేశానుసారం మహిళా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరించాం. ఈనెలాఖరు వరకు లబ్ధిదారులను గుర్తించి త్వరలో అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలను అందిస్తాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లాకు 234 యూనిట్లు.. రూ.56.88 లక్షలు మంజూరు దరఖాస్తుకు తక్కువ సమయం ఇవ్వడంతో రైతుల ఇబ్బందులు చాలా మంది అర్హులు పథకానికి దూరం 26న ముగిసిన సమయం.. జిల్లాలో కేవలం 58 దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచి లబ్ధి చేకూర్చాలని రైతుల వినతి -
పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండండి
అయిజ: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇతరులను ఎవరినీ కేంద్రాల వద్దకు రానివ్వకూడదని, పరీక్ష సమయం ముగిసేవరకు జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఉత్తనూరులోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఏ విద్యార్థి, సెంటర్ సిబ్బంది సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన సందరించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పని తీరును ఎస్సై శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క ఉద్యోగి నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని న్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వై. మోగిలయ్య, శాంతినగర్ సీఐ టాటా బాబు తదితరులు ఉన్నారు. -
డామిట్.. కథ అడ్డంతిరిగింది!
అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మకై ్క వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. -
జోగుళాంబ క్షేత్రం అభివృద్ధికి చర్యలు
గద్వాల: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జోగుళాంబ దేవస్థానం అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ పునరుద్ధరణ ప్రణాళికను ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏకై క శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దేవాలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆలయ పరిసరాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రసాద్ స్కీం భవనానికి నీటి సరఫరాకు సంబంధించి మున్సిపల్ కమిషనర్, ఇంట్రా ఈఈ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు నది నీటి శుద్ధి విషయంలో ఫీల్డ్ విజిట్ నిర్వహించి.. 15 రోజుల్లో వ్యయ అంచనాలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసాద్ స్కీం భవనాన్ని టూరిజం శాఖ అధికారులు వెంటనే దేవాదాయశాఖకు అప్పగించాలన్నారు. దేవాలయానికి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, గాంధీ జంక్షన్ నుంచి ఆలయం వరకు రహదారి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. హైదరాబాద్, కర్నూలు నుంచి అలంపూర్ మార్గాల్లో దిశానిర్దేశిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రాంతంలో మొక్కలు పెంచాలని, టాయిలెట్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి అన్నిశాఖల అఽధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాలయం వద్ద చేపట్టే అభివృద్ధి పనులపై శాఖల వారీగా వారం రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు, అసిస్టెంట్ స్థాపతి గణేశ్, టెంపుల్ డిజైనర్ గోవిందహరి, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈఓ పురేందర్, డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ వనజారెడ్డి తదితరులు ఉన్నారు. -
సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..
అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు. – మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.. ఎల్ఆర్ఎస్పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం. – వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ● -
శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసుల విచారణలో వేగం పెంచాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జాకు పాల్పడినట్లు వచ్చే ఫిర్యాదులపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. పోలీసు సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తప్పవన్నారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషిట్ దాఖలు చేసి.. న్యాయస్థానంలో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్ల్లో నమోదైన కేసుల విచారణ వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి ఉన్నారు. -
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
గద్వాల క్రైం: ‘‘రానున్నది 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రత సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. జిల్లాలో ప్రస్తుతం ఎండల తీవ్రత 43 డిగ్రీలు దాటుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగడంతో పాటు ఉదయం 10 గంటల నుంచే వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలే రక్షణ గొడుగుగా నిలుస్తాయి.’’ అని జిల్లా ఇన్చార్జి వైద్యారోగ్యశాఖ అధికారి సిద్దప్ప వెల్లడించారు. వేసవిలో మండే ఎండలతో ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు వైద్యారోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రి, పల్లె దవాఖానల్లో వడదెబ్బకు గురైన వారికి అవసరమైన మందులు, లక్షకు పైగా ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఇన్చార్జి డీఎంహెచ్ఓ చెప్పారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రశ్న: ఉదయం నుంచే ఎండలు పెరుగుతున్నాయి. స్కూల్ నుంచి వచ్చిన చిన్నారులు ఉక్కపోతకు గురై ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీకాంత్, పాత హౌసింగ్ బోర్డు, గద్వాల వైద్యాధికారి: సాధారణంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు వేడిని తట్టుకునే సామర్థ్యం కోల్పోతారు. యూనిఫాం ధరించడం వల్ల వారికి అవసరమయ్యే గాలి చేకూరాదు. పైగా సిల్క్ దుస్తులు కావడం, షూ ధరించడం సమస్యగా ఉంటుంది. అవసరమైన పోషకాహారం, నీరు తీసుకోరు. బయట చిరుతిండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. వేడి గాలుల వల్ల ఉక్కపోతకు గురవుతారు. సిల్క్ దుస్తులు, షూ లాంటి వాటికి విరామం ఇవ్వాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి. ప్రశ్న: ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – రాముడు, ఉండవెల్లి వైద్యాధికారి: ప్రతి ఒక్కరూ తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు నిమ్మ, చెరుకు, పండ్ల రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే క్రమంలో చలువ అద్దాలు, గొడుగు, తలపాగ, టోపీ ధరించాలి. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్ధాలనే తీసుకోవాలి. అందులో మసాలాలు, నూనె వంటివి తక్కువగా ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, కల్తీ ఐస్తో తయారు చేసిన పండ్ల రసాలు తీసుకోవద్దు. శరీరంలో మార్పులు వచ్చినట్లు గమనిస్తే సమీపంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలోని వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే ఓఆర్ఎస్, ఐవీ ప్లూయిడ్స్, మందులు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటించాలి. ప్రశ్న: వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రసాద్, రెండవ రైల్వేగేట్, గద్వాల వైద్యాధికారి: ఎండల తీవ్రత పెరిగినందున ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి. చిన్నారులు, వృద్ధులను చల్లని ప్రదేశాల్లో ఉండాలి. బయటకు వచ్చే క్రమంలో కాటన్ దుస్తులు, గొడుగు లేదా తలపాగ, టోపీ ధరించాలి. బయట మాసాల ఫుడ్, బేకరి ఫుడ్, నూనె వంటి వంటకాల జోలికి వెళ్లరాదు. తేలికపాటి ఆహారం రాగిజావ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేని వారు పిడికెడు చక్కెర, చిటికెడు ఉప్పు కలిపిన నీటిని గంటకోసారి తాగాలి. ప్రశ్న: వ్యవసాయ, కూలీ పనులు చేసే వారు వడదెబ్బ బారిన పడకుండా ఏ జాగ్రత్తలు పాటించాలి? – పరశురాముడు లైఫ్ చేంజ్ సంస్థ నిర్వాహకుడు, గద్వాల ౖవెద్యాధికారి: కూలీలు, రైతులు వీలైనంత వరకు ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి పనులు చేసుకోవాలి. ఎక్కువగా చెట్ల నీడలో ఉండాలి. ఎండలో ప నులు చేయడం వల్ల శరీరంలో వేడి ఉష్ణోగ్రత లు పెరిగిపోయి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలి. ఉపాఽధి హామీ పనులు చేసే కూలీలకు కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యసిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. అవసరమైతే స మీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి. రానున్న రోజుల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అత్యవసరమైతేనే బయటకు రావాలి బయటి ఆహారానికి దూరంగా ఉండాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలకు ప్రత్యేక చర్యలు ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సిద్దప్ప -
ఉపాధి హామీ కూలీలకు మేలు చేకూర్చండి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు మేలు చేకూర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం ఇటిక్యాల నుంచి పెద్దదిన్నె రోడ్డు వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, రైతుల పొలాలకు వెళ్లే నక్ష దారి గురించి కొందరు అభ్యంతరం తెలుపగా.. అదనపు కలెక్టర్ వారితో నేరుగా మాట్లాడి నచ్చజెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఎం శివజ్యోతి, ఆర్ఐ భీంసేన్రావు, సర్వేయర్ దౌలమ్మ, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఏ పురేందర్ పాల్గొన్నారు. కోర్టు భవనానికి రూ. 81కోట్లు మంజూరు గద్వాల: జిల్లా కేంద్రంలో కోర్టు భవన సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తూ జీఓ జారీ చేసినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంగళవారం తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోర్టు భవన సముదాయం నిర్మాణానికి రూ. 81కోట్లను మంజూరు చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు హుండీ లెక్కింపు అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో బుధవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలతో పాటు అన్నదాన సత్రంలోని హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,150 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డుకు మంగళవారం 1242 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,150, కనిష్టంగా రూ. 3,011, సరాసరి రూ. 4,589 ధరలు వచ్చాయి. 18 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,513, కనిష్టంగా రూ. 3,819, సరాసరి రూ. 6,296 ధరలు లభించాయి. 46 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 3,361, సరాసరి రూ. 6,091 ధరలు వచ్చాయి. హైవేలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అలంపూర్: ఉండవెల్లి మండలం పుల్లూరు శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం అదికారులు తొలగించారు. పుల్లూరు టోల్ప్లాజా వద్ద నేషనల్ హైవే అథారిటీ కార్యాలయానికి సమీపంలోని 448 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోర్టు ద్వారా మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఎలాంటి స్పందన లేకపోవడంతో, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉండవెల్లి తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ శ్రీవాణి, సర్వేయర్ రాఘవేంద్ర, ఏఎస్ఐ సుబ్బారెడ్డి, రెవెన్యూ, పోలీసు, నేషనల్ హైవే ఆధికారులు మంగళవారం అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. నవోదయ ఫలితాలు విడుదల బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
క్షయ రహిత జిల్లాగా మార్చాలి
గద్వాల క్రైం: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. సోమవారం క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి కాదని, నివారణ దిశగా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత కేసుల విషయంలో రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైయ్యే మందులను ఉచితంగా అందించామన్నారు. జ్వరం, దగ్గు ఉన్న వారి గళ్ల పరీక్షలు నిర్వహించి వారిని గుర్తించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని, మంచి ఆహారపు అలవాట్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం లక్షణాలు కలిగిన వారు దగ్గర్లోని పీహెచ్సీలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, క్షయ వ్యాధి నివారణ కోసం వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తల సేవలు ఎంతో అభినందనీయమన్నారు.అంతకు ముందు జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. -
చల్లంగుండాలి..
మాకు మీరు.. మీకు మేము ! ‘సివిల్ సప్లయ్’లో తోడు దొంగలు ● జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ఇద్దరు అధికారుల హవా ● మిల్లర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వ్యవహారం ● వేడి భరించలేం.. ఏసీలు ఇవ్వాలంటూ బేరం ● నజరానాగా లారీకి 5 క్వింటాళ్ల సీఎమ్మార్ మిగిలించుకునేలా ఒప్పందం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే.. ‘మమకారం’ పంచిన మిల్లర్లకే మొగ్గు.. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం విదితమే. జోగుళాంబ గద్వాల జిల్లాలో 61 వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నులు.. మొత్తం 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యంగా ఇవ్వాలని గద్వాల జిల్లాలోని 37 రైస్ మిల్లులకు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనే సివిల్ సప్లయ్ అధికారులు వివక్ష చూపినట్లు తెలుస్తోంది. తమపై మమకారం చూపిన మిల్లర్లకు అధికంగా.. తమను పట్టించుకోని వారికి తక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేసినట్లు సమాచారం. మొత్తానికి గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మర ఆడించి.. 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. -
నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
గద్వాల క్రైం: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్ధప్పతో మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. సిద్ధప్ప, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ ఫోన్ చేయాల్సిన నంబర్లు : 7013959920, 9985878931 సమయం : మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
గద్వాల: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి గంటాకవితాదేవి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ణాన సదస్సులో ముఖ్యఅథితిగా ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ఎదగాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలన్నారు. పొదుపు సంఘాల మహిళలు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, సంగీత పాల్గొన్నారు. ట్రాన్స్కో ఎస్ఈగా శ్రీనివాస్రెడ్డి గద్వాల: ట్రాన్స్కో ఎస్ఈగా శ్రీనివాస్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు ఎస్ఈని విద్యుత్ శాఖ ఉద్యోగులు మర్యాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. ఉత్తమ సేవలందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు అందాయని ఎస్పీ శ్రీనివాస్రావు తెలిపారు. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు వివరించారు. బీచుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివుడికి అభిషేకాలు చేశారు. సోమవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని శివాలయంతోపాటు అభయాంజనేయస్వామి, జ్ఞానసరస్వతి, సీతారాముల వారిని దర్శించుకున్నారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. -
అరకొరగానే.. చిరుధాన్యాలు
గద్వాల వ్యవసాయం: ఈ ఏడాది కూడా చిరుధాన్యాల సాగు జిల్లాలో అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉంది. అయినా వీటి సాగుపై రైతులు ఆసక్తి కనబర్చడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు వీటి సాగుపై రైతులకు అవగాహన కల్పిండంలో విఫలమవుతున్నారు. మరో ముఖ్య ఆహార పంటలైన అయిన జొన్న, సజ్జ సాగు విస్తీర్ణం గతంతో పోల్చితే కాస్తంత పెరిగింది. ఇంకా పెరగాలిసన అవసరం ఉంది. చిరుధాన్యాలతో రోగాలు దూరం దైనందిన జీవితంలో చాలామంది అనేక రకాలుగా ఒత్తిళ్లకు లోనవుతుండటంతో పాటు, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో పలు రకాల అనారోగ్య సమస్యలకు, ధీర్ఘకాలిక వ్యాధులకు గురవువుతున్నారు. బీపీ, షుగర్, ఆస్తమా, కీళ్లనొప్పులు తదితర వాటికి గురవడంతో పాటు, కిడ్నీ, లివర్, గుండె సంబంధిత సమస్యలతో శారీరకంగా బలహీన పడుతున్నారు. ఇలాంటి వారికి బలవర్దకమైన ఆహరం చిరుధాన్యాలే. ముఖ్యంగా కొర్రలు, అండుకొర్రల్లో పీచుపదార్థాలతో పాటు, బలమైన పోషక విలువలుంటాయి. రాగుల్లో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి.వీటిని ఆహరంగా తీసుకుంటే బీపీ, షుగర్ లాంటి రోగాలు దూరం కావడంతో పాటు, శారీరకంగా బలపడతారు. అవగాహన, మార్కెటింగ్ సౌకర్యం కరువు గడిచిన ఏడెనిమిది ఏళ్ల నుంచి చిరుధాన్యాల ఆవశ్యకతపై వైద్యులు, మేధావులు ఆహారపు అలవాట్లుగా చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయినా వీటి సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలపై మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాలన్ని ఆరుతడి పంటలే. సాధారణంగా రెండు సీజన్లలో సాగు చేయవచ్చు. అయితే ఈ పంటల్లో కలుపు ఎక్కువగా వస్తుంది. దీనికితోడు నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు సరైన అవగాహన లేదు. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. వీటన్నింటి ఫలితంగా జిల్లాలో పత్తి, పొగాకు లాంటి వాణిజ్య పంటలు, వరి లాంటి ఆహారపు పంటలపై ఎక్కువగా దృష్టి సారిస్తూ వస్తున్నారు. కారణం వరి, పత్తి తదితర పంటలకు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, మద్దతు ధరకు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తుండటమే. కాస్త పెరిగిన జొన్న, సజ్జ చిరుధాన్యాలకు బాగా డిమాండ్ ఉన్నందున స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. అయితే, జొన్న, సజ్జలు పోషక విలువలు ఉండే బలవర్ధకమైన ఆహారం. ఈపంటల సాగు ఈ ఏడాది కొంత పెరిగిన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వీటికి మార్కెట్లో గిట్టుబాటు ధరలు ఉన్నాయి. పది, పదిహేనేళ్ల క్రితం వరకు జొన్న, సజ్జ సాగు చేసిన రైతులు ఆతర్వాత వరి, పత్తి లాంటి పంటలను వేస్తున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలు నాణ్యమైన జొన్నలు లభించకపోవడంతో కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెచ్చుకుంటున్నారు. జొన్న, సజ్జల సాగు బాగా పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో పంటల సాగు ఇలా.. (ఎకరాల్లో) ఏడాది చిరుధాన్యాలు జొన్న, సజ్జ 2016–17 500 6,881 17–18 650 4,138 18–19 1050 3,767 19–20 271 2,572 20–21 380 3,412 21–22 325 4,210 22–23 539 5,467 23–24 269 3,220 24–25 276 6,221 అవగాహన కల్పిస్తాం చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికి ఇక్కడి రైతులు వాణిజ్య, ఇతర ఆహార పంటలపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొర్ర, అండుకొర్రలు వేసేలా రైతులకు ఏటా చెబుతున్నాం. జొన్న, సజ్జ పంటకు పిట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేసేలా రైతులకు అవాహన కల్పిస్తాం. – సక్రియానాయక్, డీఏఓ డిమాండ్ ఉన్నా వీటి సాగుపై రైతుల అనాసక్తి అవగాహన కల్పించడంలో వ్యవసాయశాఖ విఫలం జిల్లాలో కాస్త పెరిగిన జొన్న, సజ్జ సాగు ‘ఆత్మ’కు నిధుల కేటాయింపు ఏదీ..? చిరుధాన్యాల సాగుపై వ్యవసాయ అధికారులు ఆత్మ (వ్యవసాయ సాంకేతిక సంస్థ) ఆధ్వర్యంలో 2019లో అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్) పథకం కింద పండించే రైతులకు 90శాతం సబ్సీడీపై విత్తనాలు అందించి ప్రోత్సహించారు. దీనివల్ల 2016, 2017, 2018 గణాంకాలను పోల్చితే 2019లో సాగు పెరిగింది. ఆతర్వాత 2020 నుంచి మళ్లీ తగ్గింది. ఎప్పటి లాగే రైతులు వరి, పత్తిపై దృష్టి సారించారు. ఇదిలా ఉంటే ‘ఆత్మ’కు గడిచిన నాలుగేళ్లుగా నిధులు కేటాయించడం లేదు. దీంతో కార్యక్రమాలకు నిలిచిపోయాయి. -
సకాలంలో పన్నులు చెల్లించాలి
కలెక్టర్కు తమ సమస్య విన్నవిస్తున్న రైతులు అలంపూర్ : మున్సిపాలిటీలో పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ చంద్రశేఖర్ రావు అన్నారు. అలంపూర్లో వార్డు అధికారులతో కలిసి కమిషనర్ సోమవారం దుకాణదారుల వద్ద పన్ను వసూలు చేశారు. నివాసగృహ యజమానులు, దుకాణదారులు పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారికి నోటీసులు అందించనున్నట్లు, పెండింగ్లో ఉన్న వారందరూ వెంటనే పన్నులు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 38 ఫిర్యాదులు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
యువతకు స్ఫూర్తి భగత్సింగ్
గద్వాల: ప్రజా పోరాటాలతోనే పీడిత ప్రజలకు విముక్తి లభిస్తుందని భగత్సింగ్ స్ఫూర్తితో అందరూ ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. ఆదివారం భగత్సింగ్ 94వ వర్థంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహా, అంజి, తిమ్మప్ప, పురుషోత్తం వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో... బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన గొప్ప దేశభక్తుడు భగత్సింగ్ అని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఆదివారం భగత్సింగ్ 94వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, రంగన్న, పరమేష్, తిమ్మప్ప, వెంకటేష్, నాగన్న, రామన్న తదితరులు పాల్గొన్నారు. భగత్సింగ్ ఆశయ సాధనకు కృషి గద్వాలటౌన్: భగత్సింగ్ ఆఽశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న భగత్సింగ్ విగ్రహానికి విద్యార్థి సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భగత్సింగ్ చిన్న వయస్సులోనే స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరికంబం ఎక్కిన పోరాట యోధుడని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. భగతత్సింగ్ స్ఫూర్తితో చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. -
పేట్రేగిపోతున్నారు..!
● మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడులు ● నడిగడ్డలో వరుస ఘటనలతో ప్రజల బెంబేలు ● రాజకీయ జోక్యంతో తలలు పట్టుకుంటున్న అధికారులు గద్వాల క్రైం: జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం మత్తులో కర్రలు.. గాజు సీసాలతో దాడులకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే ఓ ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ కిందపడి మృతి చెందింది. కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ప్రజలు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు.. ● ఈ నెల 6వ తేదీన గద్వాల మండలం కుర్వపల్లికి చెందిన ఓ మహిళ.. అదే గ్రామానికి చెందిన తాపీ మేసీ్త్రలతో ఇంటి నిర్మాణ పనులు చేయించింది. అయితే పనులు చేయడంలో జాప్యం చేయడంతో మరొకరితో పనులు చేయించింది. దీంతో ఇద్దరు తాపీమేసీ్త్రలు మద్యం మత్తులో సదరు మహిళ ఇంటి వద్దకు వచ్చి వాదనకు దిగారు. గమనించిన ఓ మహిళ సర్ది చెప్పేందుకు వెళ్లిన క్రమంలో ఆమెను తోసివేశారు. దీంతో కిందపడిన సదరు మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. – ఈ నెల 8వ తేదిన గద్వాల పట్టణానికి చెందిన ఓ పార్టీకి చెందిన నాయకులు మద్యం పార్టీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో మల్దకల్ మండలానికి చెందిన ఓ నాయకుడు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడుతున్న క్రమంలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కలత చెందిన ఓ నాయకుడు మరో వర్గానికి చెందిన వ్యక్తులను బీరోలు రోడ్డు మార్గంలోకి రప్పించుకుని దాడి చేశారు. బాధితులు పట్టణ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. – ఈ నెల 11వ తేదీన గంజిపెటకు చెందిన ఓ యువకుడిని తమ వర్గానికి చెందిన వ్యక్తులపై దాడి చేశాడని పాతకక్ష ఉంచుకొని బజాజ్ షోరూం సమీపంలో మద్యం మత్తులో దారి కాచి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి తలకు 16 కుట్లు పడ్డాయి. దాడి చేసిన వారిపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ● ఈ నెల 14న గద్వాల పట్టణానికి చెందిన యవకులు హోలీ పండుగ నేపథ్యంలో రంగులు చల్లుకున్నారు. అనంతరం కృష్ణానది సమీపంలో వడ్లవీధి, బీసీ కాలనీకి చెందిన యువకులు మద్యం తాగుతున్నారు. అయితే గుర్తు తెలియని యువకుడు మద్యం ఇవ్వాలంటూ వారితో అకారణంగా వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో యువకులు మద్యం మత్తులో ఉండడంతో రెండు వర్గాలకు చెందిన యువకులు ఒకరిపై మరొకరు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే ఓ యువకుడిపై గాజు సీసాలతో దాడి చేయగా కుడి కన్ను కింద భాగంలో 9 కుట్లు పడ్డాయి. ● ఈ నెల 18న గద్వాల మండలంలోని చేనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు. వృద్దులపై దాడి చేసిన క్రమంలో గాజు సీసాలతోనే దాడులు చేసినట్లు స్థానికులు గుర్తించారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దాడులు చేస్తే సహించం ఇటీవల చోటు చేసుకున్న దాడి ఘటనలను ఎంత మాత్రం సహించేది లేదు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. అల్లర్లు చోటు చేసుకోకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దిపాం. పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేశాం. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం నమోదైన కేసుల తీవ్రత ఆధారంగా, దాడులకు పాల్పడిన వ్యక్తులపై రౌడీషీట్ నమోదు చేస్తాం. రాజకీయ జోక్యంతో మాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పడం అవాస్తవం. ఇప్పటికే దాడి కేసుల్లో నలుగురు వ్యక్తులను రిమాండ్కు తరలించాం. త్వరలో మరి కొంతమందిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తాం. – మొగిలయ్య డీఎస్పీ, గద్వాల రాజకీయ జోక్యంతో చర్యలకు వెనకడుగు నడిగడ్డలో వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుందామంటే కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, రాజీ కుదుర్చుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో కృష్ణానది సమీపంలో దాడికి పాల్పడిన ఘటన విషయానికి వస్తే.. దాడిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన క్రమంలో రెండు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కట్టడి చేసే క్రమంలో వారిని సైతం పెడచెవిన పెట్టడంతో చివరికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఫోన్ కాల్ నేపథ్యంలో చోటుచేసుకున్న దాడి, కృష్ణానది వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు అడుగులు వేయగా.. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రాగా కేసులతో పోలీసులు మౌనం దాల్చారు. అయితే ఈ ఘర్షణలు మూడు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల మధ్య చోటు చేసుకోవడం.. ఎవరిపై చర్యలు తీసుకుందామన్న రాజకీయ నేతాల ఒత్తిళ్లతో పోలీసులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
గద్వాల: రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు తథ్యమని ప్రతిఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పార్టీ బలోపేతం కోసం పనిచేసి గెలుపొందేందుకు కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న రామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్నారు. ఆధోనిలో 70వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని, అలాంటి చోటనే బీజేపీకి చెందిన పార్థసారధి గెలుపొందారని పార్థసారధి గెలుపును స్ఫూర్తిగా తీసుకుని గద్వాలలో బీజేపీ గెలిచే వరకు పనిచేయాలన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి 20వేల మెజారిటీ ఇచ్చి బీజేపీ ఆదిపత్యాన్ని నిరూపించినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అయితే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను పూర్తిగా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ చేసేదే చెబుతుంది.. చెప్పిందే చేస్తుందని ఆమె అన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతే దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి ముందుకు నడిపిన నాయకుడు ప్రధాని మోడీ అని గుర్తు చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షమాభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు ప్రధాని మోడీ అన్నారు. నూతన అధ్యక్షుడు రామాంజనేయులు పార్టీలోని ప్రతిఒక్కరిని కలుపుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, భరత్కుమార్, రాంచంద్రారెడ్డి, ఎక్బోటేరవి, అయిజ రాంచంద్రారెడ్డి, రమాదేవి, వెంకట్రాములు, జయలక్ష్మీ, శివారెడ్డి, రజక జయశ్రీపాల్గొన్నారు. వన్ నేషన్...వన్ ఎలక్షన్ వన్ నేషన్... వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దీని వల్ల దేశ ఖజానాపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజలకు సైతం అన్ని విధాల మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ సంజీవ్రెడ్డి అన్నారు. గద్వాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అలంపూర్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన 306 మంది లబ్ధిదారులకు రూ.36,35,496 విలువగల చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి కుటుంబాల్లో వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లక్ష్యమన్నారు. సీఎం సహాయ నిధి ద్వార 161 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, నాయకులు, లబ్దిదారులు ఉన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అలంపూర్: ఆశా కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని.. అణచివేతతో ఉద్యమాలను ఆపలేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాజు అన్నారు. ఆదివారం అలంపూర్ పట్టణంలోని కేవీపీఎస్ కార్యాలయంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయిస్తుందని ఆరోపించారు. ఒక రోజు ముందే పోలీసులు ఆశ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని కట్టడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు కార్మికులకు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పోలీసలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం రెవంత్ రెడ్డి ముందస్తు అరెస్టులతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నరసింహ్మ, అయ్యప్ప, నాగరాజు ఉన్నారు. -
పరీక్షల నిర్వహణ.. కత్తిమీద సామే
గద్వాల టౌన్: జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం కేంద్రాలకు నిధుల కేటాయింపులో భారీస్థాయిలో కోత విధించడంతో పర్యవేక్షకులు చేతి నుంచి డబ్బులు చెల్లించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇస్తున్న నిధులు ఏడురోజులపాటు జరిగే పరీక్షల సమయంలో తాగునీటి వసతి కల్పించడానికే సరిపోతుందని వాపోతున్నారు. ఫలితంగా సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడైనా టీ తాగాలంటే రూ.10 ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థికి పరీక్ష నిర్వహణ కోసం మొక్కుబడిగా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏటా పరీక్షలకు ముందు ఈ వాదన ముందుకు వస్తున్నా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిధుల కేటాయింపులో అన్యాయం.. పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 45,837 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం నిధుల కేటాయింపులో మాత్రం శాసీ్త్రయంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థి నుంచి పరీక్ష ఫీజు కింద రూ.125 వసూలు చేసే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు మాత్రం కేవలం రూ.8.25 మాత్రమే ఇస్తున్నారు. ఈ లెక్కన రోజుకు వెచ్చిస్తున్నది రూ.1.17 మాత్రమే. ఇక ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రూ.10 కేటాయిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు తక్కువగా కేటాయించడం ఎంతవరకు సమంజసమని పరీక్షల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థికి కనీసం రూ.20 కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.8.25 ఇస్తుంది. ఇందులోనే విద్యార్థులకు ప్రతిరోజూ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. రోజుకు ఐదారు క్యాన్లకు గాను రూ.100 వరకు ఖర్చవుతుంది. ఏడురోజులకు రూ.700 వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. కొన్నిచోట్ల తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాగునీటికే సరిపోవడం లేదు.. వసతుల కల్పనకు వేధిస్తున్న నిధుల కొరత ఫీజు వసూలు చేస్తున్నా.. కేంద్రాలకు కేటాయించని వైనం తలలు పట్టుకుంటున్న పర్యవేక్షకులు రూ.20కు పెంచాలి.. పరీక్షల నిర్వహణ నిధులు పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి చెప్పినా ఫలితం లేకుండా పోతుంది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.20 ఇవ్వాలి. తక్కువ నిధులు ఇవ్వడం వల్ల పదో తరగతి పరీక్ష ఇన్విజిలేషన్కు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం అన్ని ధరలు పెరిగాయి. ఇన్విజిలేటర్లకు రోజుకు కేవలం రూ.33 ఇవ్వడం బాధాకరం. దీన్ని రూ.150కు పెంచాలి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా పునరాలోచించాలి. – గోపాల్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, గద్వాల మార్గదర్శకాల ప్రకారమే.. ప్రభుత్వ మార్గదర్శకాలు, వచ్చిన బడ్జెట్ ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. నిధుల పెంపు అనే దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. – అబ్దుల్ఘని, డీఈఓ -
ప్రతిజీవికి నీరు ప్రాణాధారం
గద్వాల టౌన్: ప్రతి జీవికి నీరు ప్రాణాధారమని, విద్యార్థులు నీటి వినియోగం పట్ల అవగాహన ఏర్పరచుకోవాలని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మీనాక్షి అన్నారు. శనివారం కళాశాల ఆవరణలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఏర్పాటు విధానాన్ని, వాటి వల్ల భూగర్భజలం పెరుగుదల గురించి వివరించారు. ఇంకుడు గుంతల ఆవిష్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ మీనాక్షి మాట్లాడుతూ నీటి వృథాను తగ్గించుకొని, సహజ వనరులను పరిమితంగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ దేవుజా పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి.. యువత వృత్తి నైపుణ్యాలు పెంచుకుని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కలందర్బాషా అన్నారు. టాస్క్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించగా.. జాబ్మేళాలో పాల్గొన్న సుమారు 250 మంది నిరుద్యోగులకు నైపుణ్యాలపై ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రతిభకనబర్చిన 106 మందిని ప్రైవేటు కంపెనీలలో వివిధ ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ప్రియాంక, వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, టాస్క్ కోఆర్డినేటర్ సత్యమ్మ పాల్గొన్నారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలి గద్వాల క్రైం: ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో ప్రతిఒక్కరు జాగ్రత్తగా, దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువత, విద్యార్థులు, ఎవరైనా అనుమతి లేని బెట్టింగ్ యాప్స్లకు అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఎవరైనా చెడు దారిలో నడుస్తున్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. -
పరిష్కారం చూపండి సారూ..
ఫోన్– ఇన్గద్వాల: తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి.. పది శాతం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.. పురాతన కట్టడాలను ఆక్రమిస్తున్నారు అంటూ పట్టణ ప్రజలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపుతామని అదనపు కలెక్టర్, మున్సిపాలిటీల ప్రత్యేకాధికారి నర్సింగ్రావు పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు గద్వాల, అయిజ, వడ్డేపల్లిలో నెలకొన్న వివిధ రకాల సమస్యలపై ‘సాక్షి’ శనివారం అదనపు కలెక్టర్ నర్సింగ్రావుతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించగా అపూర్వ స్పందన లభించింది. ప్రజలు సంధించిన ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఇలా.. ప్రశ్న : జిల్లాకేంద్రంలోని పురాతన బావిని కబ్జా చేశారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.? – మోహన్రావు, శంకర ప్రభాకర్, గద్వాల ప్రత్యేకాధికారి : మీరు చెప్పిన విషయం వాస్తవమే. దీనిపై ఇది వరకే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. పురాతన కట్టడాలను కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుని వాటిని కాపాడుతాం. ప్రశ్న : చెత్త సేకరించడం లేదు. కొన్నిచోట్ల మధ్యాహ్నం సమయంలో చెత్త తీసుకెళ్లడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగులమంతా డ్యూటీలకు వెళ్తున్నాం. ఇంట్లో చెత్త పేరుకుపోయింది. అదేవిధంగా కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే పిల్లలపై దాడి చేసి గాయపరిచాయి. – ప్రవీణ్, కొత్తహౌసింగ్బోర్డు కాలనీ, గద్వాల ప్రత్యేకాధికారి : చెత్త సేకరణను క్రమం తప్పకుండా ఉదయం వేళలో తీసుకెళ్లేలా పురమాయిస్తాం. అదేవిధంగా కుక్కల బెడదను అరికట్టేలా స్టెరిలైజేషన్ ప్రక్రియ చేపట్టి.. ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రశ్న : తేరుమైదానం వద్ద ఉన్న ప్రధాన రోడ్డును ఆక్రమిస్తూ డబ్బాలు పెడుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. – ఖరీంపాష, అశోక్నగర్, గద్వాల ప్రశ్న : గద్వాల మున్సిపాలిటీ పరిధిలో సర్వే నం.789, సర్వే నం.389లో 10 శాతం స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని కాపాడి రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. – రాఘవేంద్ర, న్యూహౌసింగ్బోర్డు కాలనీ, గద్వాల ప్రత్యేకాధికారి : ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించి మోఖపై వెళ్లి రికార్డుల ఆధారంగా విచారిస్తాం. కబ్జాకు గురైతే తప్పకుండా చర్యలు తీసుకుని వాటిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా రక్షణ కంచె ఏర్పాటు చేసి మున్సిపల్ బోర్డులు ఏర్పాటు చేస్తాం. ప్రశ్న : జయప్రజావైద్యశాల పక్కన అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వంద గజాల స్థలంలో ఆరు అంతస్తులు భవనం నిర్మిస్తున్నారు. పైగా ఎలాంటి సెట్బ్యాక్ కూడా లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై పత్రికలో వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – ప్రసాద్, నల్లకుంట, గద్వాల ప్రత్యేకాధికారి : నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడితే వెంటనే పనులు ఆపేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : ఫ్లై ఓవర్ పక్కన పెద్ద ఆస్పత్రి సమీపంలో 12 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క డ్రెయినేజీ, సీసీరోడ్లు లేవు. దీంతో ఇళ్ల నుంచి వచ్చిన మురుగు రోడ్లపైనే పారుతోంది. వానాకాలంలో నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. – ఇస్మాయిల్, గద్వాల ప్రత్యేకాధికారి : మున్సిపల్ ఏఈని పంపించి నివేదిక తెప్పించుకుంటాం. డ్రెయినేజీ, అంతర్గత రహదారులు నిర్మించేలా చూస్తాం. ప్రశ్న : అయిజ దుర్గానగర్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే ఠాగూర్ స్కూల్ వద్ద మురుగు రోడ్డుపైకి వచ్చి చేరుతుండడంతో ఇబ్బంది పడుతున్నాం. – భీంసేన్రావు, అయిజ ప్రత్యేకాధికారి : అధికారులను పంపి డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : అయిజ 20వ వార్డులో నారాయణస్వామి ఆలయం వద్ద తాగునీటి సమస్య ఉంది. అలాగే కరెంట్ స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. – జగదీశ్వర్, అయిజ ప్రత్యేకాధికారి : ఏఈని పంపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే కరెంట్ స్తంభాల సమస్య కూడా పరిష్కరిస్తాం. ప్రశ్న : ప్రతి శుక్రవారం శాంతినగర్లో సంత జరుగుతుంది. కానీ, సంతకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో రోడ్లపైనే అంగళ్లు ఏర్పాటు చేిస్తుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – వెంకటేశ్వర్లు, వడ్డేపల్లి ప్రశ్న : వడ్డేపల్లి 5, 6 వార్డుల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. – పావని, వడ్డేపల్లి ప్రత్యేకాధికారి : శాంతినగర్లో సంత ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న : అయిజలోని 8వ వార్డులో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం. ముళ్ల కంపలు పెరిగినా పట్టించుకోవడం లేదు. అలాగే కరెంట్ స్తంభాలు వాలిపోయి విరిగే ప్రమాదం ఉంది. ప్లాిస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంది. – భగత్రెడ్డి, అయిజ ప్రత్యేకాధికారి : డ్రెయినేజీ సమస్య, ముళ్లకంపల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. పాడైపోయిన చోట కరెంట్ స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలు సహకరించాలి. ప్రశ్న : అంబాభవాని ఆలయం దగ్గర డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. కాల్వలు లేకపోవడంతో మురుగంతా రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో దోమల బెడద, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. – ఎల్లప్ప, 9వ వార్డు, గద్వాల ప్రత్యేకాధికారి : డ్రెయినేజీ నిర్మాణం కోసం సిబ్బందిని పంపి వివరాలు తెలుసుకుంటాం. అప్పటి వరకు మురుగు రోడ్డుపైకి రాకుండా అవసరమైన చర్యలు చేపడుతాం. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం. ప్రశ్న : అయిజలోని కోట్లవీధిలో తాగునీటి సమస్య ఉంది. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు. అంబేడ్కర్ చౌరస్తాలో పెద్దపాటి గుంతలు ఉండటంతో ప్రమాదాలకు గురవుతున్నాం. తిక్కవీరేశ్వరస్వామి గుడి వద్ద హై లెవెల్ మినీ వంతెన నిర్మిస్తే బాగుంటుంది. అంబేడ్కర్ చౌరస్తాలో సమీకృత మార్కెట్లో పూర్తయినా అందుబాటులోకి రాలేదు. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. – రామచంద్రారెడ్డి, తిరుమల్రెడ్డి, ఖదీర్, మహబూబ్, అయిజ ప్రత్యేకాధికారి : అధికారులను పంపించి అవసరమైన చర్యలు చేపట్టి పరిష్కరిస్తాం. ప్రశ్న : వడ్డేపల్లి 5, 6 వార్డుల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. – పావని, వడ్డేపల్లి ప్రత్యేకాధికారి : శాంతినగర్లో సంత ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న : శాంతినగర్లో గ్రంథాలయ భవనం ఏర్పాటు చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. – గాయత్రి, శాంతినగర్ ప్రత్యేకాధికారి : పరిశీలించి గ్రంథాలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు తాగునీరు, డ్రెయినేజీ సమస్యలపై ప్రజల ఏకరువు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రత్యేకాధికారి నర్సింగ్రావు ‘సాక్షి’ ఫోన్– ఇన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన ప్రశ్న : 28వ వార్డులో తాగునీరు దుర్వాసనతో వస్తుంది. వాటర్ టెస్టింగ్ చేయించి సురక్షితమైన తాగునీటిని అందించాలి. అలాగే చారిత్రాత్మకమైన గద్వాల కోటను సంరక్షించే చర్యలు చేపట్టాలి. – రామ్నాథ్, 28వ వార్డు, గద్వాల ప్రత్యేకాధికారి : 28వ వార్డులో తాగునీటి శాంపిల్ తీసుకుని టెస్టింగ్ చేయిస్తాం. సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు చేపడుతాం. అలాగే గద్వాల కోటను సంరక్షించుకునేందుకు కలెక్టర్తో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడుతాం. ప్రశ్న: డ్రెయినేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అధికారులు, వార్డు నాయకులకు చెప్పినా పరిష్కారం కాలేదు. – పూజారి కృష్ణ, వెంకటరమణ కాలనీ, గద్వాల ప్రత్యేకాధికారి : మీరు చెప్పిన ప్రాంతానికి ముందుగా సిబ్బందిని పంపించి సమస్యను పూర్తిస్థాయిలో తెలుసుకుంటాం. ఆ తర్వాత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి
కేటీదొడ్డి: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు. శనివారం మండలంలోని పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, వార్షిక పరీక్షలలో ప్రైవేటుకు దీటుగా ఫలితాలు అనేది ఎంతో కీలకమైనదని, ఎక్కడికి వెళ్లినా మొదట ఎస్సెస్సీ మెమోనే చూస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడం, చదవడం, రాయడం, చేస్తారో వారే మంచి మార్కులు సాధిస్తారన్నారు. క్రమశిక్షణతో చదువుకున్న వారు పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, చైల్డ్ అబ్యూస్ వంటి చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర్రెడ్డి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పాగుంట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఆదిశిలాక్షేత్రంలో భక్తుల కిటకిట
మల్దకల్: ఆదిశిలాక్షేత్రం స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారిలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, అమరవాయి చింతలమునిస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, అరవిందరావు, నాగరాజుశర్మ, వాల్మీకి పూజారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీచుపల్లిని సందర్శించిన ఎమ్మెల్యే బండ్ల ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అ నంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట భార్య బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్రెడ్డి, కుటుంబ సభ్యులు, తదితరులున్నారు. ‘ప్రాధాన్యత రంగాలను విస్మరించారు’ వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేదని సీపీఎం జిల్లా నాయకుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శనివారం మండలంలోని బొల్లారం గ్రామంలో నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 శాతం పంట రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మీ పథకం, కొత్త ఆసరా పింఛన్లు, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాల్రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, మహబూబ్పాషా, రవిప్రసాద్, నాయకులు బాలగౌడ్, ఆశన్న, ఈశ్వర్, కృష్ణయ్య, నిరంజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చెరుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అమరచింత: చెరుకు సాగుచేస్తున్న రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన ప్రోత్సాహకాలు అందించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం ఫ్యాక్టరీ డీజీఎం మురళిని కలిసి చెరుకు రైతుల సమస్యలు విన్నవించారు. రెండేళ్లుగా సకాలంలో కోతలు పూర్తి చేయడం, రైతులకు అనుకున్న సమయానికి విత్తనాలు అందించడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. సాగు రైతులకు కంపెనీ ప్రకటించిన రాయితీలు అందించి ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్లో కోత కార్మికులకు అడ్వాన్సులు ముందస్తుగా చెల్లించి త్వరగా రప్పించాలని, కోత యంత్రాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని డీజీఎంకు అందజేశారు. కార్యక్రమంలో వాసారెడ్డి, నారాయణ, తిరుపతయ్య, నాగేందర్, రామకృష్ణ, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరికి బీమా తప్పనిసరి
నాగర్కర్నూల్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరు జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని తపాలా ప్రమాద బీమా పాలసీ సేకరణ కేంద్రాలను సందర్శించారు. అంతకు ముందు తపాలా కార్యాలయం వద్ద నాగర్కర్నూల్ ఎంపీడీఓ కోటేశ్వర్ తపాలా బీమా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ పర్యవేక్షకుడు భూమన్న మాట్లాడుతూ కేవలం తక్కువ డబ్బులతో ఎక్కువ బీమా పొందవచన్నారు. రూ.వెయ్యి చెల్లిస్తే ఏడాదిపాటు రూ.15 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్మికులు, ఉపాధి, అంగన్వాడీ, యువకులకు ఈ ప్రమాద బీమా చేయించాలని గ్రామీణ తపాలా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్పీఎం గఫార్, సిబ్బంది మహ్మద్ ఖాన్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి
మానవపాడు: జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఎ.బుర్ధిపాడు, కలుకుంట్ల, మానవపాడులో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో 50 మందికి పైగా కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో జాబ్కార్డు ఉన్నవారందరికీ అవగాహన కల్పించాలని ఫీల్డ్అసిస్టెంట్లను ఆదేశించారు. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామానికి ఉపయోగపడే పనులు చేపట్టాలని, గ్రామపరిదిలోని చిన్నపాటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు. అనంతరం నర్సరీలను పరిశీలించి అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలాఉండగా, ఉపాధిహామీ కూలి రూ.300కు పెంచాలని కలుకుంట్ల కూలీలు అడిషనల్ కలెక్టర్ను కోరారు. -
సంస్కృతి ఉట్టిపడేలా.. యువ ఉత్సవ్ పోటీలు
గద్వాలటౌన్: పల్లెజీవనం ప్రతిబింబించే నృత్యాలు.. సంస్కృతిలో ఆచార వ్యవహారాల ప్రదర్శనలు.. శాసీ్త్రయ జానపద నృత్యాలు ఇలా ఎన్నో భారతీయ కళలు ఉట్టిపడేలా జిల్లాస్థాయి యువ ఉత్సవ్ పోటీలు సాగాయి. భారత ప్రభుత్వం యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం వారు కళాశాల విద్యార్థులకు యువ ఉత్సవ్ – 2025 పోటీలు నిర్వహించారు. శుక్రవారం ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోటీలకు వేదికై ంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఒకరికి మించి ఒకరు చక్కటి ప్రతిభ కనబర్చి న్యాయ నిర్ణేతల మెప్పు పొందారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు, జీవనశైలి తదితర అంశాలతో కూడిన నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. సందేశాత్మకమైన అంశాలతో పలువురు విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చి మెప్పు పొందారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్ బాషా, ప్రభుత్వ పీజీ సెంటర్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి వారు మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తి వెలికితీయడానికి పోటీలు దోహదం చేస్తాయన్నారు. అనిల్గౌడ్, రాజేంద్రకుమార్ పాల్గొన్నారు. -
మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యం
గద్వాల క్రైం: మహిళల రక్షణ కోసం షీ టీంలు విధులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో ఆవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో 81 సమస్యాత్మక ప్రదేశాను గుర్తించి నిత్యం గస్తీ చేపట్టామన్నారు. వేధింపులకు గురి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు సైతం తరలించామన్నారు. కళాశాలలో ర్యాగింగ్ వంటివి చేస్తే నిర్భయంగా అధ్యాపక బృందానికి తెలియజేయాలని, వేధింపులకు గురిచేసినా, సామాజిక మాద్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాధితులు నేరుగా షీటీం సభ్యులకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 8712670312కు సంప్రదించాల్సిందిగా డీఎస్పీ తెలిపారు. 26న తైబజార్ వేలం అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ తైబజార్ వేలం పాటను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు, ఆసక్తి ఉన్న వారు 25వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను మున్సిపల్ కార్యాలయంలో తీసుకొని నిబంధనల మేరకు సాయంత్రం 5 గంటలోపు డీడీ డిపాజిట్లు అందజేయాలని తెలిపారు. మిగిలిన వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు గద్వాల: విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు శుక్రవారం తన ఛాంబర్లో కలెక్టర్ బీఎం సంతోష్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించి గుర్తింపు పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తూ పారదర్శకత, నిబద్దత, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, తదితరులు పాల్గొన్నారు. -
మొదటిరోజు 99.58 శాతం హాజరు
గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 7,597 మంది విద్యార్థులకుగాను 7,565 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 32 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. 99.58 శాతం హజరు నమోదైంది. మొత్తం 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు సహాయకుల సహాయంతో పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు బెంచీలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని గదులలో వెలుతురు సక్రమంగా లేక, ఫ్యాన్ల కొరతతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు వేర్వేరుగా జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పరీక్ష ముగిసే వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కలెక్టర్, ఎస్పీ తనిఖీ పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాలను వారు పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బంది తప్పని సరిగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, విద్యారుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
గద్వాల క్రైం: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి అన్నారు. శనివారం జిల్లా ఆస్పత్రిలో న్యాయపరమైన సమస్యలు, చట్టాలపై మాట్లాడారు. బుద్దిమాంద్యం గల వ్యక్తులు వివిధ దశలలో న్యాయపరమైన హక్కులను వినియోగించక లేకపోతున్నారని, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి వైద్యుల నుంచి పూర్తి సహకారం ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. -
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం ● ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు సదావకాశం ● ఆన్లైన్లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్సైట్ ● రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులు నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. దరఖాస్తు విధానం.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్ ఐడీతో ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఈ నెల 23 వరకు.. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండటం, ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. వేసవిలో శిక్షణ.. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు. ఇవీ కేంద్రాలు.. విద్యార్థులను ప్రోత్సహించాలి.. వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట -
లక్ష్యానికి అడ్డంకులు..!
పన్ను వసూళ్లలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లురెండు వారాల్లో పెరిగిన వేగంఆర్థిక సంవత్సరం మరో 12 రోజుల్లో ముగుస్తోంది. దీంతో పన్నుల వసూళ్లల్లో కమిషనర్ దశరథ్, రెవెన్యూ అధికారులు దూకుడు పెంచారు. బడాబకాయిదారుల జాబితాను చేతపట్టి అధికారులు నేరుగా దుకాణాలకు వెళ్తున్నారు.. ఆస్తిపన్ను చెల్లించే వరకు కట్టు కదలడం లేదు. ఈ క్రమంలో దుకాణాదారులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల సిఫార్సులను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు రోజువారి లక్ష్యాలు నిర్దేశిస్తుండటంతో... వారి ఆదేశాల మేరకు పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గడిచిన రెండు వారాలుగా పన్ను వసూళ్లుల్లో వేగం పెరిగింది. గద్వాలటౌన్: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది గద్వాల మున్సిపల్ అధికారుల పరిస్థితి. పట్టణంలో పన్ను వసూళ్లకు ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించారు. రోజువారి వసూళ్లకు రాజకీయ నేతలు మోకాలడ్డుతున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా మాజీ కౌన్సిలర్లు, లేదా పెద్ద రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు చేయిస్తున్నారు. లేదా చెల్లించమని బెదిరిస్తున్నారు. దీంతో పన్నులు వసూలు కాక ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక నలిగిపోతున్నారు. ఇదీ జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో అధికారుల పరిస్థితి. వంద శాతం పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఇరువురి మధ్య నలుగుతున్న మున్సిపల్ అధికారులు జిల్లా కేంద్రంలో పన్ను వసూలైంది 46.4 శాతమే.. నోటీసులు జారీ చేస్తున్నాం.. ఆస్తిపన్ను నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించడానికి అధికారులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా పన్ను వసూళ్ల వేగం పెరిగింది. బడా బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం వారు పన్ను చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నెలాఖరులోగా వందశాతం పన్ను వసూళ్లు చేస్తాం. – దశరథ్, కమిషనర్, గద్వాల -
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652
సమయం : శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు.. గద్వాల: జిల్లాలో పుర పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అఽధికారిగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) నర్సింగ్రావుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకునేందుకు శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. నేడు మున్సిపల్ ప్రత్యేక అధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ముగిసిన ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలు
గద్వాలటౌన్: ఇంటర్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మార్చి 5 నుంచి ప్రారంభమైన పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ–2, కామర్స్–2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3,577మంది విద్యార్థులకుగాను 3,458 మంది హాజరయ్యారు. పలువురు రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యార్థులు మొత్తం కలిపి 117 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్య జిల్లా అధికారి హృదయరాజు, మండల కేంద్రాలలోని కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పరీక్షలు ముగిసిన వెంటనే స్నేహితులు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. సంతోషంగా ఇంటిబాట పట్టారు. 117 మంది విద్యార్థులు గైర్హాజరు -
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652
సమయం : శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు.. గద్వాల: జిల్లాలో పుర పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అఽధికారిగా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) నర్సింగ్రావుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకునేందుకు శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రేపు మున్సిపల్ ప్రత్యేక అధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ఇసుక కొరత అధిగమించేందుకు చర్యలు
గద్వాల/రాజోళి/శాంతినగర్/అయిజ: ఇసుక అందుబాటులో ఉంచి, జిల్లాలో ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం జిల్లా మైనింగ్ ఏడీ వెంకటరమణతో కలిసి తుమ్మిళ్లలో కలెక్టర్ పర్యటించారు. తుంగభద్ర నదీ తీరంలో గల ఇసుక డీ–సిల్టేషన్ ప్రాంతాన్ని గుర్తించి పరిశీలించారు. గతంలో టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో ఇక్కడి నుండే ఇసుక సరఫరా చేయగా, ప్రస్తుతం వారి కాంట్రాక్ట్ ముగియడం, దాని రెన్యూవల్ ప్రక్రియ నడస్తుండటంతో మళ్లీ ఇసుక సౌలభ్యం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అక్కడ ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించి వాటి సరఫరా వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. క్షేత్ర స్థాయిలో బౌగోళిక పరిస్థితులను పరిశీలించి ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ ఎండీసీ ఆద్వర్యంలో ఇసుక డీ–సిల్టేషన్ ను ప్రారంభించాలన్నారు. అంతకుముందు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్,తహసీల్దార్ రామ్మోహన్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఓటరు నమోదు, బూత్లెవెల్ ఏజెంట్ల నియామకాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతిఒక్కరికి ఓటుహక్కు కల్పించేందుకు నిర్ణయించిందన్నారు. అదేవిధంగా పోలింగ్బూతులలో ఏజెంట్ల నియామకానికి సహకరించాలన్నారు. ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఏదైనా అభ్యంతరాలుంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. నూతన ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలను ఫామ్ 6,7,8 ద్వారా అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్రావు, తహసీల్దార్ మల్లిఖార్జున్, డీటీ కరుణాకర్, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యార్థీ... విజయీభవ!
గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 7,717 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 117 మంది ఉన్నారు. పది పరీక్ష రాసే వారిలో మొత్తం 3,851 మంది విద్యార్థులు బాలురు కాగా, 3,866 మంది బాలికలున్నారు. పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నాతధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత బస్పాస్, లేదా పదో తరగతి హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఆర్టీసీ ఇప్పటికే రూట్ మ్యాపింగ్ ప్రణాళికను తయారు చేసింది. సీసీ కెమెరాల నిఘాలో.. ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలోనే ప్రశ్నపత్రాల కవర్లను తెరవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాలలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును అధికారులు పరిశీలించారు. పోలీసు స్టేషన్లకు దూరంగా ఉన్న ‘సీ’ సెంటర్ల నుంచి ప్రశ్న పత్రాలను తరలించేందుకు పోలీసు ఎస్కార్టుతో ప్రత్యేక వాహనాలను కేటాయించారు. విద్యార్థులు, సిబ్బంది పరీక్ష కేంద్రం లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు అనుమతించరు. పటిష్ట బందోబస్తు కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులతో పది పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను తరలించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలి. నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు హాజరుకానున్న 7,717 మంది ద్యార్థులు మొత్తం 40 పరీక్ష కేంద్రాలు.. 430 మంది ఇన్విజిలేటర్లు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు ప్రశాంతంగా రాయండి జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మాస్ కాపీయింగ్కు పాల్పడితే డిబార్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – బీఎం సంతోష్, కలెక్టర్ -
నాలుగు జిల్లాలు
అట్టడుగున ● రాష్ట్రంలోనే సోలార్ మోడల్ విలేజ్గా నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్ మోడల్ ప్రాజెక్ట్ను చేపట్టింది. సాక్షి, నాగర్కర్నూల్: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అయితే అనీమియా ముక్త్ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్కర్నూల్ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్నగర్ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి. ● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్నగర్లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్కర్నూల్ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్కర్నూల్ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగు పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు సోలార్ మోడల్ విలేజ్గా కొండారెడ్డిపల్లి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్ లుక్ 2025లో వెల్లడి -
బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం
గద్వాల: రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కుర్వ పల్లయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్లో బడ్జెట్ పత్రాలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి సర్కార్ విద్యావ్యవస్థను పాతాళానికి తొక్కేసిందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.53శాతమే నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శమన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ రూపంలో రూ.8వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, ప్రస్తుతం బడ్జెట్లో కేవలం రూ.23,108కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. విదేశీ యూనివర్సిటీలలో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం సున్నా అన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్టున్న సీఎం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాజు, సందేష్, మాధవ్, నరేంద్ర, పవన్, జోయోల్, హరికృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
అలంపూర్: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఎస్టీఓలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని నియోజకవర్గ రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు సదానందమూర్తి, ఎం. మద్దిలేటి, కేశవ ఆచారి తెలిపారు. అలంపూర్ పట్టణంలోని బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని, మీ–సేవ ద్వార ఆన్లైన్లో పొందిన లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ ఎస్టీఓలో సమర్పించని పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ నెల 25వ తేదీ లోగా ఎస్టీఓలో లైఫ్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలన్నారు. లేదంటే పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్కు మార్చి నెల పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని, నిర్ణీత సమయంలోపు పెన్షనర్స్, ఫ్యామిలి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్స్ తప్పక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ మానవపాడు: మండలంలోని పెద్దపోతులపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన జి.ప్రభావతి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను కలెక్టర్ ఆదేశానుసారం ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ భాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సదరు కార్యదర్శి విధులకు సరిగా హాజరుకాకపోవడంతోపాటు ఇంటి పన్ను 20శాతం కూడా వసూలు చేయలేదని తెలిపారు. హామీలు అమలు చేయాలి గద్వాల: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆశాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశాలకు రూ.18వేల ఫిక్స్డ్ జీతాన్ని ఇవ్వాలన్నారు. అదేవిధంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు పదోన్నతలు కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు సగం పెన్షన్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఆశాల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నర్సింగ్రావుకు అందజేశారు. కార్యక్రమంలో కాంతమ్మ, పద్మ, నాగప్రమీల, రేణుక, సునీత, అభేద, శ్వేతా, జయలక్ష్మీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మల్దకల్: ఉపాధిహామీలో భాగంగా జాబ్ కార్డులు లేని కూలీలందరికి జాబ్కార్డులు అందించి పని కల్పించాలని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని తాటికుంట, పెద్దొడ్డి, మల్దకల్, అమరవాయి, బూడిదపాడు గ్రామాలను మోటార్సైకిల్పై కలెక్టర్ వెళ్లి అక్కడ చేపడుతున్న సీసీ రోడ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, నర్సరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దొడ్డి గ్రామంలో ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా నర్సరీతోపాటు ఉపాధిలో భాగంగా చేపడుతున్న ప్రదేశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. కూలీలకు అందుతున్న బిల్లులు, పనులు చేసిన రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఉపాధి పనుల వద్ద నేమ్బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాలలో చేపడుతున్న సీసీ రోడ్లను పరిశీలించి పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ బషీర్, ఎంపీఓ రాజశేఖర్, ఏపీఓ సుజాత, టెక్నికల్ అసిస్టెంట్లు నాగరాజు, ఉమేరా, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్అసిస్టెంట్లు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మోటార్సైకిల్పై వెళ్లి క్షేత్రస్థాయి పనుల పరిశీలన -
‘పాలమూరు’కు ఇచ్చింది రూ. 2,514 కోట్లే..
ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14.5 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఈ బడ్జెట్లో నిరాశే మిగిలింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఇంకా కనీసం రూ.20 వేల కోట్లు అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు చేపట్టిన పనులకు దాదాపు రూ.9వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం రూ.2,514 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది బడ్జెట్లోనూ ప్రభుత్వం రూ.2 వేల కోట్లే కేటాయించగా, ఆ మాత్రం నిధులను కూడా ఖర్చు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. సరైన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రాజెక్ట్ పను లు ముందుకు సాగే పరిస్థితులు కన్పించడం లేదు. -
మీ సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తే చర్యలు
కేటీదొడ్డి: మండల కేంద్రంతో పాటు నందిన్నె మీసేవ కేంద్రాలను ఈడీఎం శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీసేవ కేంద్రాలలో సిటిజన్ చార్ట్ నోటిస్ బోర్డ్, సర్టిఫికేట్, రిజిష్టర్, టోల్ఫ్రీ కాల్ నంబర్స్ ను ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రజల నుండి ఆరా తీవారు. మీసేవ కేంద్రాల నిర్వహకులు సిటిజన్ చార్ట్ సర్టిఫికేట్స్ రిజిష్టర్ గురించి వినియోగదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యాలు కలిగించకుండా మీసేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకుంటే కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన రేషన్కార్డుల సర్వీసులకు రూ.45 మాత్రమే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యం అని ఆయన తెలిపారు. ధరల పట్టిక కూడా క్షుణంగా కేంద్రాలలో ఉంచాలని సూచించారు. వారి వెంట మీసేవ జిల్లా యూనియన్ అధ్యక్షుడు సురేష్, వెంకటేష్ నాయుడు, మౌలాలి, తదితరులు ఉన్నారు. ఆదివాసీ చెంచుల సమస్యలపై పోరాటం మన్ననూర్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆదివాసీ చెంచులకు కనీస సౌకర్యాల కల్పన కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ చెంచు ఐక్యవేదిక అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్ అన్నారు. బుధవారం చెంచు పెంటల్లో పర్యటించిన ఆయన.. అగర్లపెంటలో చెంచులతో సమావేశమై మాట్లాడారు. పాలకులు, అధికారులు చెంచుల సంక్షేమాన్ని కాగితలకే పరిమితం చేశారని విమర్శించారు. పండగలు, జాతర్ల పేరుతో చెంచు పెంటలకు వస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు.. అరచేతిలో వైకుంఠం చూపించి చేతులు దులుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. చెంచులకు మౌలిక వసతుల కల్పన కోసం పాలకులు నిధులు మంజూరు చేస్తుంటే.. ఆంక్షల పేరుతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అప్పాపూర్, సార్లపల్లి గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించినప్పటికీ.. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. వేసవి కాలం వచ్చిందంటే చెంచు పెంటల్లో నివసిస్తున్న చెంచులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచు పెంటలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఐటీడీఏ తరఫున మోడల్ జీపీ పాఠశాలలు, వైద్యం, అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందించాలని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,050 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది. -
ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరగలేదు. ప్రభుత్వం బడ్జెట్లో ప్రజా సంక్షేమమం విస్మరించింది. అన్ని వర్గాలకు బడ్జెట్లో అన్యాయం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఏకై క శక్తిపీఠమైన జోగుళాంబ క్షేత్ర అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించలేదు. రోడ్లు, తాగునీటికి, సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు ఇవ్వలేదు. సరిహద్దులోని నియోజకవర్గాలకు వైద్య సేవల విషయమై బడ్జెట్లో ప్రస్తావించనేలేదు. ఆరు గ్యారంటీలకు, ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలకు నిధులకు మంగళం పాడారు. ప్రజలను మోసగించడానికి ప్రయత్నించినట్లు ఈ బడ్జెట్తో స్పష్టంగా తెలుస్తుంది. – విజయుడు, ఎమ్మెల్యే, అలంపూర్ -
మోదం.. ఖేదం
ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే ప్రాధాన్యం సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తారని భావించగా, బడ్జెట్లో కేవలం రూ.2,514 కోట్ల మేరకే కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు బడ్జెట్లో ప్రస్తావించింది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో నిధులను కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేఎల్ఐ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు.. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో రూ.800 కోట్లను కేటాయించింది. గతేడాది సైతం రూ. 715 కోట్లు కేటాయించగా, ఈసారి మరికొంత నిధులను పెంచింది. కల్వకుర్తి కింద పెండింగ్లో ఉన్న 28, 29, 30వ ప్యాకేజీలను పూర్తిచేయడం ద్వారా ఆయా ప్రాజెక్ట్లకు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి రూ.110 కోట్లు పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్ల పంపిణీ పథకాలకు నిధులను సమకూర్చింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ. 31,605 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందనున్నారు. ● ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని చెబుతూ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు. ● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది. పెండింగ్లో ఉన్న కోయిల్సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్లకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించింది. కోయిల్సాగర్కు రూ.80.73 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్కు రూ.144 కోట్లు, సంగంబండకు రూ.98.08 కోట్ల నిధులను కేటాయించింది. కోయిల్సాగర్ ప్రాజెక్ట్కు అవసరమైన కేటాయింపులు దక్కడంతో పెండింగ్లో ఉన్న దేవరకద్ర గ్రావిటీ కెనాల్, ఎడమ కాల్వ, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనుల్లో వేగం పెరుగనుంది. సంగంబండ కింద చేపడుతున్న భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. కోయిల్సాగర్, సంగంబండకు కేటాయింపులు కేఎల్ఐకు రూ.800 కోట్లు కేటాయింపు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతలకు మరోసారి నిరాశే నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు రాష్ట్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన -
దాహార్తి తీరేదెలా..?
వేసవి సమీపిస్తున్న వేళ మూగజీవాలకు కరువైన నీటి తొట్టెలు రాజోళి: వేసవి కాలం సమీపిస్తుందంటే జీవులన్నీ దాహార్తితో గుక్కెడు నీళ్ల కోసం పరితపిస్తుంటాయి. ఆ క్రమంలో మూగజీవాల కోసం వేసవిలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనుషులతో పోలిస్తే మూగ జీవాల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వమే ప్రత్యేక అవసరాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని వేలాది పశువులకు రానున్న రోజుల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఇంకా ఈ చర్యలు ప్రారంభించలేని పాడి రైతుల నుండి, వ్యవసాయ దారుల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్చి మాసం గడుస్తుండటంతో ఎండలు మరింత ముదిరే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, గ్రామాల్లో ప్రత్యేకంగా ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు నీరు తాగేందుకు వీలుగా ట్యాంకులు, నీటి తొట్టెలు నిర్మించాల్సి ఉంది. కాగా వాటిపై ఎలాంటి కదలిక లేకపోవడంతో ముందు రోజుల్లో పశువులు దాహార్తితో ఇబ్బందులు పడతాయనే ఆందోళన గ్రామాల్లో నెలకొంది. 217 గ్రామాలు.. 7.71 లక్షల మూగజీవాలు జిల్లాలో వేల సంఖ్యలో పశు సంపద ఉంది. మొత్తం 217 గ్రామాల్లో గేదెలు 52,248, ఆవులు ఎద్దులు కలిపి 75,463, మేకలు 67,568, గొర్రెలు 5,76,000 మొత్తం 7.71లక్షలు ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా ట్యాంకులు అవసరం లేకపోయిన్పటికీ, చాలా వరకు బయటకు వెళ్లి మేత మేసే పశువులకు, గ్రామీణ ప్రాంతాలతో పాటు, గ్రామం బయట ఉండే జీవాలకు తప్పకుండా నీటి అవసరముంటుంది. దాని కోసం గ్రామంలో పశువులు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో, నీటి వనరులుండి, పశువలకు నీరు తాగేందుకు అనువుగాని చోట ప్రత్యేకంగా ట్యాంకులు, నీటి తొట్టెలు నిర్మిస్తారు. అలాంటివే జిల్లాలో 128 మాత్రమే నిర్మించగా, అవి కూడా ఏళ్ల కాలం కింద నిర్మించినవి కావడంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిలో నీరు నింపితే అవి వృథాగా కిందకు పోవడమే కాక, పశువుల దాహార్తి తీర్చడంలేదు. జిల్లాలో ఉన్న పశువుల సంఖ్యకు, నిర్మించిన నీటి తొట్టెలకు అసలు పొంతనే లేకుంది. ఇప్పటికే చాలా చోట్ల రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సొంతంగా నిర్మించుకోగా మరికొన్ని చోట్ల పూర్తిగా శిథిలమై, అసలు ఉపయోగంలోనే లేవు. నిర్మించిన 128లో కూడా 57 తొట్టెలు మరమ్మతులో ఉండగా,38 తొట్టెలలో అసలు నీరే పోయడం లేదు. ఇక మిగిలిన 75 మాత్రమే వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా, అధికారులు 357 తొట్టెలు నిర్మించాల్సి ఉందని ప్రతిపాదనలు పంపగా నేటి వరకు ఎలాంటి మంజూరు కాలేదు.జిల్లాలో నీటి తొట్టెల వివరాలిలా.. కొత్తవి నిర్మించాలి వేసవి కాలం ప్రారంభం అవుతుంది. గ్రామాల్లో పశువులకు నీరు తాగేందుకు వనరులునన్నప్పటికీ, ఎండలు ముదిరేకొద్ది అవి పూర్తిగా ఎండిపోతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే గ్రామాల్లో తొట్టెల నిర్మాణాలు చేస్తే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. గ్రామాల్లో ఉన్న తొట్టెలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటికి మరమ్మతులు, అవసరమైతే కొత్తగా నిర్మించాలి. చాలా వరకు రైతులు బోర్ల దగ్గరే షెడ్లు నిర్మిస్తున్నప్పటికీ బయటకు వెళ్లే పశువులకు ఇబ్బందులు తప్పడం లేదు. – బాను, పాడి రైతు, శాంతినగర్ జిల్లాలో వేల సంఖ్యలో పశువులు 217 గ్రామాల్లో 128 తొట్టీలు మాత్రమే అందుబాటులో.. శిథిలావస్థకు చేరినవి కొన్ని.. పర్యవేక్షణ కరువై మరికొన్ని నిరుపయోగం 357 తొట్టెలకు ప్రతిపాదనలు పంపినా మంజూరుకాని వైనం ఇబ్బందులు రానివ్వం పశువులకు నీటి అవసరాలు ఉన్నప్పటికీ, పాడి రైతులు తమ షెడ్ల దగ్గర, ఇళ్ల దగ్గర బోర్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వేసవిలో కొంత నీటి కొరతను అధిగమిస్తున్నారనే చెప్పవచ్చు. కానీ బయటకు వెళ్లే పశువులకు ట్యాంకుల విషయంలో జిల్లాలో పలు చోట్ల ఇ బ్బందులు ఉన్నాయనే ఆలోచనతో గతంలోనే నీటి తొట్టెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ఈ వేసవిలో ఎక్కడ పశువులకు తాగునీ టి ఎద్దడి రాకుండా చూస్తాం. – వెంకటేశ్వర్లు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి -
‘పాలమూరు’ పరుగులు పెట్టేనా?
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదు. మొత్తం 12.50 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2015లో తొలుత రూ.35,200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే అంచనా వ్యయం రూ.52,056 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు కింద పంపుహౌస్లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అన్నిచోట్ల కీలకమైన మోటార్ల బిగింపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదటి లిఫ్టు వద్ద ఒక్క మోటారును మాత్రమే ప్రారంభించారు. నార్లాపూర్ సమీపంలో మొదటి లిఫ్టు వద్ద రెండు మోటార్లు, ఏదుల సమీపంలో రెండో లిఫ్టు వద్ద నాలుగు మోటార్లు, వట్టెం సమీపంలో మూడో లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల చొప్పున బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ● రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కొడంగల్– పేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులకు సంబంధించిన సర్వే మూడు దశల్లో పూర్తి కాగా.. ప్రాజెక్టు డీపీఆర్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ● కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఏడాదికి రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి. -
కూలీలకు కనీస వసతులు కల్పించండి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కూలీలకు కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఇటిక్యాల సమీపంలో పెద్దదిన్నె రోడ్డు, లింగమ్మచెరువు కట్ట వద్ద చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి పని కొలతలను పక్కాగా నమోదు చేయాలని.. 80 పనిరోజులు పూర్తిచేసిన కూలీలకు 100 రోజులు ఉపాధి పనులు పూర్తిచేసే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏవీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఎం శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఏ పురేందర్ పాల్గొన్నారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. కోయిల్సాగర్ది అదే దారి.. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం తాజాగా సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా.. పెండింగ్ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు -
అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ప్రజా భవన్లో మంగళవారం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై అలంపూర్ క్షేత్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్గర్ కలెక్టర్గా అజయ్ కల్లం విధులు నిర్వర్తించిన సమయంలో అలంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేశారని గుర్తుచేశారు. క్షేత్రం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్తో కలిసి రెండుసార్లు సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్, పార్కింగ్, ఆలయ చరిత్రతో కూడిన ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్షేత్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం, అతిథిగృహాల నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, అర్చీల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20న మరోసారి సమావేశం నిర్వహించి.. అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ వైస్ చాన్స్లర్ రాఘవారెడ్డి, రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీడ్స్ గ్రోవర్స్ సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు డా.కేశవులు తదితరులు ఉన్నారు. -
వారంలోగా ‘ఉపాధి’ పనులు పూర్తిచేయాలి
గద్వాల: జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఽఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల నిర్వహణలో అలసత్వం వహించకుండా నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించడంతో పాటు ప్రతి పనికి సంబంధించిన సమగ్ర వివరాలను అందుబాటులో ఉండాలని సూచించారు. మండలాల వారీగా పూర్తయిన పనుల జాబితా, ఎఫ్టీఓ జనరేషన్, పెండింగ్, పురోగతిలో ఉన్న పనులకు సంబంధించి నిర్దేశిత సమయంలోగా ఎంబీ రికార్డు వంటి వివరాలను నమోదు చేయాలన్నారు. చేసిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, పంచాయతీరాజ్ ఈఈ దామోదర్రావు, డీఈలు, ఏఈలు ఉన్నారు. -
టీ–ఫైబర్ సేవలెప్పుడో?
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్ సేవలకు సంబంధించిన పరికరాలను బిగించి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలకు డిజిటల్ సేవలు అందడం లేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరమవుతాయి. – నాగేంద్రం, డీపీఓ గ్రామపంచాయతీల్లో నిరుపయోగంగా పరికరాలు ● ఇంటర్నెట్ సౌకర్యంలేక మరుగున పడిన ఈ–పాలన ● ఏ పనికై నా మండల కేంద్రానికి వెళ్లాల్సిందే.. ●మానవపాడు: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సేవలు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతీ పనికి సాంకేతికతతో ముడిపడి ఉంది. ఈ నైపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల, కళాశాలలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతువేదికలు, ఇతర ప్రజాసేవల సంస్థలకు అతివేగంతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మిషన్ భగీరథ పథకం పైప్లైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్ కేబుల్ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ టీ–ఫైబర్ పరికరాలు అమర్చారు. అయితే ఇప్పటి వరకు సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఎన్నికలలోపు అందుబాటులోకి వచ్చేనా? ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, విజేతల వివరాలు ఇలా ప్రక్రియ అంతా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేక మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే, పంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించక ముందే విద్యుత్ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో రూ. వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత మాత్రం తప్పడం లేదు. జాడలేని ఈ–పాలన.. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయ వ్యయాలు, కార్మికుల జీత భత్యాల చెల్లింపులతో పాటు జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటిపన్ను తదితర సేవలను గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు డిజిటల్ రూపంలో అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసం క్లస్టర్ల వారీగా ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్లేట్లు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ కూడా చేశారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. అయితే పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ఈ–పాలన మరుగున పడింది. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనంతో పాటు ప్రజలకు డిజిటల్ సేవలు అందించాలనే సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా అవాంతరాలు ఉంటే లబ్ధిదారులు మండల పరిషత్ కార్యలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి పంచాయతీ కార్యదర్శులు చేతిరాత రశీదులే ఇస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం టీ–ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ఈ–పాలన అందించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. కోయిల్సాగర్ది అదే దారి.. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం తాజాగా సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా.. పెండింగ్ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని మంగళవారం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి అశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. ఆయన వెంట ఆలయ మాజీ ధర్మకర్త నీలప్ప, కడప డివిజన్ ఎస్డీఎం రవికుమార్, రాయచూరు ఎస్డీఎం వైవీ రావు, ఎంఎంలు శ్యాంసుందర్, చిరంజీవి ఉన్నారు. అదే విధంగా సీరియల్ నటి జ్యోతిరెడ్డి అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించి జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్ఎల్ఎంతో తక్కువ వడ్డీకే రుణాలు అయిజ: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే ఎక్కవ మొత్తంలో రుణాలు అందిస్తున్నట్లు నాబార్డ్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ బొల్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీడీఎంలు షణ్ముఖాచారి, మనోహర్రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ అయ్యపురెడ్డిలతో కలిసి అయిజ సింగిల్విండో కార్యాలయాన్ని సందర్శించారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్, ఫెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ మధుసూదన్రెడ్డితో వివరాలు తెలుసుకున్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల కేటాయింపులు, వాటి అమలు తీరుపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోనే రైతులకు అన్నివిధాలా మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. నేషనల్ లైవ్స్టాక్ పథకం ద్వారా గొర్రెలు, బర్రెలు, పౌల్ట్రీ తదితర వాటి ఏర్పాటు కోసం రైతులకు తక్కువ వడ్డీ రేట్లకే ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తామని.. ఇందులో గణనీయమైన సబ్సిడీ కూడా ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు గద్వాల: గద్వాల బార్ అసోసియేషన్కు 2025–26 సంవత్సరం నూతన అధ్యక్ష, కార్య దర్శులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షఫి ఉల్లా ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గ ఎన్నికలకు సీనియర్ న్యాయవాది పూజారి శ్రీధర్ను ఎన్నికల కమిషనర్గా నియమించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ఈ నెల 27వ తేదీలోగా పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం తగదు ధరూరు: మండలంలోని నీలహళ్లి–పాతపాలెం మార్గంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం విషయంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్కుమార్ అన్నారు. మంగళవారం బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే బ్రిడ్జి గతేడాది వర్షాకాలంలో వరదలకు కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఆయన వెంట నడిగడ్డ హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, మండల అధ్యక్షుడు గోవిందు, లవన్న, మునెప్ప, ఇస్మాయిల్, రాము, జగదీశ్, జమ్మన్న, ఆంజనేయులు, నాగరాజు, మల్దకల్, ప్రేమ్రాజ్ తదితరులు ఉన్నారు. -
మెడికల్ కళాశాలలో వసతులు కల్పించాలి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ నాయకులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, విద్యార్థులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆర్భాటంగా ప్రారంభించడంతో చూపిన శ్రద్ధ, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చూపలేదని విమర్శించారు. సమస్యలతో విద్యార్థులు సహజీవనం చేస్తున్నారని మండిపడ్డారు. 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోనే మెడికల్ కళాశాలను నిర్వహించడం దారుణమన్నారు. మెడికల్ కళాశాల భవనం ఇంకా నిర్మాణంలోనే ఉందని చెప్పారు. విద్యార్థులకు వసతి సౌకర్యం లేదని, కళాశాలకు ప్రహరీ నిర్మించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఫుడ్ సప్లైయ్కు టెండర్ నిర్వహించాలని కోరారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మెడికల్ కళాశాలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, రామాంజనేయులు, మురళిధర్రెడ్డి, కేకే రెడ్డి, బండల వెంకట్రాములు, రాజగోపాల్ పాల్గొన్నారు. -
ప్రతి కొనుగోలుకు రశీదు తప్పనిసరి
అలంపూర్: వినియోగదారులు ప్రతి కొనుగోళుకు రశీదు తీసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్తేజ అన్నారు. అలంపూర్లోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వినియోగదారులు కొనుగోలుకు సంబంధించి రశీదు పొందడం వలన ఏవైనా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు కలిగిన రశీదు ఆధారంగా న్యాయం పొందవచ్చని అన్నారు.సమావేశంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, న్యాయవాదులు శ్రీనివాసులు, నాగరాజు యాదవ్, వెంకటేష్, యాకోబు, నాగయ్య, తిరుమలేష్, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఇథనాల్ కంపెనీని రద్దు చేయించండి
శాంతినగర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటుచేస్తే రైతులు పంటలు నష్టపోతారని, ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్కు పెద్ద ధన్వాడ ప్రజలు విన్నవించారు. ప్రజలకు, రైతులకు నష్టం వాటిల్లే ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దుచేయించాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వంతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, వడ్డేపల్లి మండలం కొంకలకి చెందిన ఎం.శారదమ్మ అనారోగ్యానికి గురికాగా ఆమె ఆపరేషన్ ఖర్చుల కొరకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ కాపీని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఆర్డీఎస్కు నీరందించండి.. ఆర్డీఎస్ కెనాల్కు నీటిని విడుదల చేయించాలని ఆయకట్టు రైతులు ఆయనను కోరారు. వడ్డేపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు సోమవారం శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో కలిసి నీటిని విడుదల చేయించాలని కోరారు. స్పందించిన ఏఐసీసీ కార్యదర్శి నీటిని విడుదల చేయించేందుకు తన వంతు కృషిచేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయులు
గద్వాల: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా టి.రామాంజనేయులును నియమిస్తూ పార్టీ రాష్ట్ర ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారి గీతామూర్తి సోమవారం ప్రకటన విడుదల చేశా రు. అలాగే, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గద్వాల నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు బండల వెంకట్రాములు, అక్కల రమాసాయిబాబ, అలంపూర్ నియోజకవర్గం నుంచి కె.జయలక్ష్మీని నియమించారు. అలివేలు మంగ హుండీ లెక్కింపు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. -
గుర్రంగడ్డ పనుల్లో కదలిక
నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం 2018లో రూ.12కోట్లతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో మాత్రం చలనం లేదు. దీంతో గత ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతం సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు గుర్రంగడ్డవాసులు. విద్య, నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందాలన్నా పుట్టీల సాయంతో నది దాటాల్సిందే. కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం ఇదే. వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ఏళ్లుగా గుర్రంగడ్డ వాసులు కోరుతున్నా.. బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తవడంలేదు. తాజాగా వంతెన నిర్మాణ పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించామని, పనులు వేగవంతం చేసి కష్టాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈగ్రామంలో మొత్తం 600 కుటుంబాలు నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతో దీవివాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి. ఆర్నెళ్లు నది మధ్యలోనే.. కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం.. అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు ఏడాదిలో పూర్తి చేస్తాం 2018లో రూ.12కోట్లతో గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీంతో పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. – రహీముద్దీన్, ఇన్చార్జ్ ఎస్ఈ -
భూ బాగోతంపై విచారణకు ఆదేశం
గట్టు: గుట్టుగా ఐదెకరాల భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారంపై సోమవారం జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. గట్టు మండలంలోని ఇందువాసి శివారులో ఐదెకరాల భూమిని అడ్డదారుల్లో వారసులు కాని వారసులు రికార్డులను మార్చుకొని సొంతం చేసుకునేందుకు యత్నించగా.. దీనిపై ‘ఐదెకరాల భూమికి టెండర్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా అధికారులు స్పందించారు. అసలు గట్టు రెవెన్యూ కార్యాలయంలో ఏం జరుగుతుందని, అక్రమాలకు ఎవరెవరు సహకరిస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్ ఎవరు జారీ చేశారు, జారీ చేసే క్రమంలో కనీస విచారణ చేశారా లేదా అనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. జీవించి ఉన్న తల్లిదండ్రులను చనిపోయినట్లుగా నమ్మించిన వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్ను రెవెన్యూ అధికారులు గుడ్డిగా ఎలా జారీ చేస్తారని, ఎవరి హయాంలో ఈ సరిఫ్టికెట్ను జారీ చేశారనే వివరాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలాఉండగా అసలు పట్టాదారుడైన ముత్తయ్య చాలా కాలం క్రితమే చనిపోయినప్పటికీ అతను 2019లో చనిపోయినట్లుగా చూపుతున్న మరణ ధ్రువీకరణ పత్రం కూడా నకిలీది అని తెలిసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని పోర్జరీ చేసి, మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లుగా తెలుస్తోంది. 2019లో ఇందువాసి కార్యదర్శిగా పని చేసిన వ్యక్తిని మరణ ధ్రువీకరణ పత్రం గురించి ప్రశ్నిస్తే.. అసలు ఆ సంతకం తనది కాదని, తన సంతకాన్ని పోర్జరీ చేసినట్లు వ్యక్తి తెలపడం గమనార్హం. మొత్తం మీద గట్టు భూ బాగోతం వ్యవహారంపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనే దానిపై మండల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
గద్వాల క్రైం: వేసవి కాలంలో ప్రజలందరు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. సోమవారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. గత వారం రోజల నుంచి జిల్లాలో ఎండ తీవ్రత దాటికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరు సరిపడా నీటిని తాగాలన్నారు. ఆహార అలవాట్లు, రోజు వారి శ్రమ తదితర విషయాలను సూర్యరశ్మి తీవ్రత ఉన్న సమయంలో ఉపశమనం తీసుకోవాలన్నారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల శిక్షణకు ఎంపిక గద్వాలటౌన్: ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జమ్ము కాశ్వీర్లో జరిగే జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీల శిక్షణ క్యాంపునకు గద్వాలకు చెందిన క్రీడాకారుడు బీచుపల్లి ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. గత నెల 21వ తేది నుంచి 24వ తేదీ వరకు వికారాబాద్లో జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బాలుర కబడ్డీ పోటీలలో జిల్లా జట్టు తరపున బీచుపల్లి పాల్గొని ప్రతిభ కనబర్చారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో బీచుపల్లి క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలక్టర్లు జాతీయ స్థాయి పోటీల శిక్షణా శిబిరానికి ఎంపిక చేశారని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ అబ్రహాం, సెక్రటరి రవి, కోశాధికారి చందు, కరెంటు నర్సింహా, నగేష్, రైల్వేపాష, వెంకటన్న సీనియర్ క్రీడాకారులు హర్షం తెలిపారు. ముగిసిన వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఎదుర్కోళ్లు, స్వామివారి కల్యాణం, చతురస్త్రార్చన వంటి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు చతురస్త్రార్చన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రాతారాధన, సేవాకాలం, రాజభోగం, పూర్ణాహుతి, నవ కలశ స్నపన చక్రతీర్థం అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణ, అర్చకులు శ్రీకర్, శేషసాయి, రంగనాథ్, ప్రసాద్, నర్సింహచార్యులు, నవీన్, తివారీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. వారం రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 30మంది ఫిర్యాదులు అందజేసిట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు.. గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు అందాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై వివరించారని, ఇందుల్లో భూ సంబంధ, సైబర్ మోసాలు, వేధింపులపై ఫిర్యాదులు అందాయన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు వివరించారు. -
అవస్థల ప్రయాణం
అంతర్ జిల్లాల దారిలో.. మహబూబ్నగర్– శ్రీశైలం, పెబ్బేరు– జడ్చర్ల మధ్య పెరిగిన రాకపోకలు ●కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలు గు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ అచ్చంపేట: అంతర్ జిల్లాల రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఒకవైపు గుంతలు, మరోవైపు ప్రమాదకర మలుపులతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల రద్దీకి అనుగుణంగా అంతర్ జిల్లాల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలనే ప్రతిపాదనలు మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు వెళ్లేందుకు రెండు వరుసల రహదారులే దిక్కవుతున్నాయి. ఫలితంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి బిజినేపల్లి, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం మీదుగా అచ్చంపేట, మన్ననూర్ వరకు.. పెబ్బేరు నుంచి వనపర్తి జిల్లాకేంద్రం, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల వరకు రెండు వరుసల రహదారులు ఉన్నాయి. వీటిని జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉండగా.. కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు అలంపూర్ చౌరస్తా నుంచి డిండి, నల్లగొండ వరకు మరో జాతీయ రహదారి కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. మహబూబ్నగర్తోపాటు గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల ప్రజలు శ్రీశైలం– హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రోడ్డుపై ప్రయాణించాలి. ఉమ్మడి జిల్లావాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వాహనదారులు రాకపోకలు సాగిస్తారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రెండు వరుసల రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కనీస వేగంతో ఈ రోడ్డుపై ప్రయాణించడం కష్టతరంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు తిరిగే అంతర్ జిల్లాల రోడ్డును జాతీయ రహదారిగా మారిస్తే ప్రయాణికులు, వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది. వీటితో అనుసంధానిస్తే.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఎన్హెచ్–44, 167, 765 ఉన్నాయి. వీటికి అదనంగా భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ మీదుగా చించోలి వరకు ఎన్హెచ్–167ఎన్, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఎన్హెచ్–167కే, కర్నూలు నుంచి షోలాపూర్ వరకు ఎన్హెచ్–150సీ జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. అలాగే భూత్పూర్ నుంచి ఎన్హెచ్–44, చించోలి 167–ఎన్ రహదారులను అనుసంధానిస్తూ.. మన్ననూర్ (శ్రీశైలం ఎన్హెచ్–765) వరకు 104 కి.మీ., రోడ్డును పొడిగించాలనే డిమాండ్ ఉంది. పెబ్బేరు ఎన్హెచ్– 44 నుంచి వనపర్తి, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల ఎన్హెచ్–167 వరకు 74 కి.మీ., పుల్లూరు ఎన్హెచ్–44 నుంచి అలంపూర్, పెంట్లవెల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట మీదుగా డిండి ఎన్హెచ్–765 వరకు, వనపర్తి నుంచి కొత్తకోట మీదుగా మంత్రాలయం వరకు 110 కి.మీ., ఎర్రవల్లి ఎన్హెచ్–44 నుంచి గద్వాల మీదుగా రాయచూర్ వరకు 67 కి.మీ., మరికల్ నుంచి నారాయణపేట మీదుగా రామసముద్రం ఎన్హెచ్–150 వరకు 63 కి.మీ., రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి జాతీయ రహదారులుగా మారితే ఆయా గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిసారిస్తే జాతీయ రహదారుల దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. మహబూబ్నగర్– శ్రీశైలం అంతర్రాష్ట్ర రహదారి ఇలా.. పుణ్యక్షేత్రాలను కలుపుతూ.. గడిచిన రెండు దశాబ్ధాల కాలంలో ఉమ్మడి జిల్లా ఎంతో ప్రగతి సాధించింది. అంతర్ జిల్లాల రోడ్లు జాతీయ రహదారులుగా మారితే పర్యాటకంగా, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రజల రాకపోకలు, సరుకుల రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందినవారు శ్రీశైలానికి రావాలంటే మహబూబ్నగర్– అచ్చంపేట రోడ్డే దిక్కు. శ్రీశైలం, మద్దిమడుగు ఆంజనేయస్వామి, ఉమామహేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, సలేశ్వరం పుణ్యక్షేత్రాలు, పర్యాటకంగా విరాజిల్లుతున్న నల్లమల ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇలా రాకపోకలు సాగించే వాహనాలకు మహబూబ్నగర్–అచ్చంపేట, పెబ్బేరు– జడ్చర్ల్ల మధ్య ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు మార్గాల్లో రోడ్ల సామర్థ్యానికి మించి వాహనాలు నడుస్తున్నాయి. ఫలితంగా వాహనాలు తక్కువ వేగంతో వెళ్లాల్సి వస్తుండటంతో కొద్ది దూరానికే ఎక్కువ సమయం గడిచిపోతోంది. వీటిని జాతీయ రహదారులుగా మార్చాల్సిన అవసరం ఉంది. వాహనాల రద్దీకి అనుగుణంగా లేని రోడ్డు సౌకర్యం ప్రతిపాదనలకే పరిమితమైన జాతీయ రహదారి డిమాండ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
ఐదెకరాల భూమికి టెండర్
నకిలీ వారసుడి నిర్వాకం గట్టు: మొన్నటికి మొన్న.. గట్టుకు చెందిన ఓ వ్యవసాయ భూమి యజమాని 2016లో చనిపోతే ఆ వ్యక్తి ఆధార్ను మరో వ్యక్తి లింకు చేసుకొని 2021లో గట్టు రెవెన్యూ ఆఫీసులో దర్జాగా భూ బదలాయింపు చేశారు. దాయాది కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం బయట పడింది. నిన్నేమో.. ఆలూరులో ఒక కులానికి చెందిన వ్యక్తి చనిపోతే మరో కులానికి చెందిన వ్యక్తి ఆ భూమికి తామే వారసులమని వారసత్వం భూమిని బదలాయించగా తమ పనితనాన్ని చాటుకొని ఔరా అనిపించుకున్నారు. ఇక తాజా విషయానికి వస్తే.. వారసులు కాని వారసులు గట్టు రెవెన్యూ అధికారుల సహకారంతో తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొని ఇందువాసి శివారులోని 5–18 ఎకరాల భూమికి టెండర్ పెట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మొత్తంగా గట్టు రెవెన్యూ అధికారులు ఏం చేసినా అడిగే దిక్కెవరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఉన్నతాధికారులు కూడా ఇవేం పెద్ద నేరాలు కాదన్నట్లుగా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని సామాన్యులు ఆరోపిస్తున్నారు. తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్తో.. ఇటీవల ఇందువాసి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 385/బీ/1లోని 5–18 ఎకరాల భూమికి అసలు వారసులు కాకుండా నకిలీ వారసులు ముందుకు వచ్చి భూమిని కాజేసే ప్రయత్నం చేశారు. వారం రోజుల క్రితం అక్రమ భూ బదలాయింపు వ్యవహారంపై అసలు వారసులు గట్టు రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని ఘర్షణకు దిగి, పోలీస్ స్టేషన్ దాకా పంచాయితీ వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. ఇందువాసి గ్రామానికి చెందిన ముత్తయ్య తండ్రి ఇంజన్నకు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 358/బీ/1లో 5–18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ముత్తయ్య ప్రకాష్, గొర్లన్న అనే ఇద్దరు కుమారులతో పాటుగా ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే సదరు భూ యజమానితో పాటుగా కుటుంబ సభ్యులు ఉపాధి నిమిత్తం శాంతినగర్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. భూ యజమాని చనిపోయిన విషయం తెలుసుకున్న దాయాది అయిన విజయ్ తండ్రి ఇంజన్న అనే వ్యక్తి చనిపోయిన ముత్తయ్య తన తండ్రి కాకపోయినప్పటికి తన తండ్రే అని రెవెన్యూ అధికారులను నమ్మించాడు. ముత్తయ్య ఆధార్ లింకును తన తండ్రి ఇంజన్న ఆధార్కు లింకు చేయించుకున్నాడు. తన తండ్రి ఇంజన్న, తల్లి సుశీలమ్మ బతికుండగానే చనిపోయినట్లుగా నమ్మించి, గత ఏడాది నవంబర్లో తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను తీసుకున్నాడు. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా గత ఏడాది నవంబర్లో గట్టు తహసీల్దార్ కార్యాలయంలో వారసత్వంగా భూ బదలాయింపునకు ప్రయత్నించాడు. విషయం కాస్త శాంతినగర్లో ఉండే అసలు వారసుడికి తెలియడంతో గట్టు రెవెన్యూ కార్యాలయానికి వచ్చి, భూ బదలాయింపును అడ్డుకొని వాగ్వానికి దిగారు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత తహసీల్దార్ మారిపోవడంతో నకిలీ వారసుడు మళ్లీ రెవెన్యూ అధికారుల దగ్గర భూ బదలాయింపునకు ప్రయత్నించగా, అసలు వారసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ అధికారుల ఎదుటే ఘర్షణకు దిగారు. రెవెన్యూ అధికారులు అసలు విషయం తెలుసుకుని భూ బదలాయింపును నిలిపి వేసినట్లు తెలిసింది. కళ్లు మూసుకుని ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్ ఇచ్చిన అధికారులు అసలు వారసుడి రంగప్రవేశంతో ఆగిన భూ బదలాయింపు ఇందువాసి శివారులోని భూమికి ఎసరు తహసీల్దార్ ఏమంటున్నారంటే.. ఇందువాసి భూ బదలాయింపు వ్యవహారం తన దృష్టికి వచ్చినట్లు తహసీల్దార్ సలిముద్దీన్ తెలిపారు. తప్పుడు ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తన దృష్టికి రావడంతో రిజిస్ట్రేషన్ను నిలిపి వేశాం. గతంలో జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు సిఫారస్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం.. ఒక్కో మైనార్టీ గురుకుల కళాశాలల్లో ఒక్కో గ్రూప్లో 40 సీట్ల చొప్పున రెండు గ్రూప్ల్లో 80 సీట్లు ఉంటాయి. మైనార్టీలకు 75 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, (ముస్లింలకు 26, క్రిస్టియన్లు 2, జైన్స్, పార్సిస్, బుద్దిస్ట్, సిక్లకు 2 సీట్లు), ఇతరులకు 25 శాతం రిజర్వేషన్ల ప్రకారం 10 సీట్లు కేటాయిస్తారు. నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్నగర్ -
మిల్లుల్లో దొంగలు పడ్డారు
జోగుళాంబ గద్వాలనడిగడ్డలో వరుస బియ్యం అపహరణలతో విస్మయం సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025వివరాలు 8లో u● అమ్ముకున్నారా.. అపహరించారా.. అన్న అనుమానాలు ● తాజాగా రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు ● పోలీసుల అదుపులో నిందితులు? ●విచారణ దశలో ఉంది రైస్ మిల్లులో వరిధాన్యం, బియ్యం, నూకలను అపహరించిన ఘటనపై కొందరిని అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. అయితే ఇది ప్రభుత్వం కేటాయించిన సీఎమ్మారా.. లేక ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యమా అనేది తేలాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. సివిల్సప్లై శాఖ అధికారుల నివేదికాల ఆధారంగా విచారణ చేపడతాం. – శ్రీకాంత్, ఎస్ఐ, గద్వాల రూరల్ గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, బ్యాంకుల్లో దొంగలు పడడం వింటుంటాం. కానీ, నడిగడ్డలో ఏకంగా రైస్మిల్లుల్లో దొంగలు పడుతున్నారు. వందలాది ధాన్యం, బియ్యం బస్తాలను ఎత్తుకుపోతున్నారు. 50 నుంచి 75 కేజీల వరకు బరువు ఉండే వందలాది బియ్యం, ధాన్యం బస్తాలను గుర్తు తెలియని దుండగులు అపహరించడం.. అందులోను మొత్తానికి మొత్తం సీఎంఆర్ (మర ఆడించేందుకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం) ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా గద్వాల మండల పరిధిలోని ఓ రైస్ మిల్లులో దొంగలు చొరబడి వరిధాన్యం, బియ్యం, నూకలు అపహరించారని యాజమాని రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. గత ఏడాది ఎర్రవల్లి మండలంలోని ఓ రైస్ మిల్లులో సీఎంమ్మార్ బస్తాలు అపహరణకు గురయ్యాయి. ఇదంతా నిజంగా దొంగల పనా.. లేక ఇంటి దొంగల పనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సంఘటనలు యాజమానుల గారడీయే అని పలువురు ఆరోపిస్తున్నారు. మిల్లు యజమాని ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. పోలీసుల అదుపులో నిందితులు ఇదిలాఉండగా, మొదటి కేసులో పోలీసులు విచారణలో ఆరుగురు నిందితులను గుర్తించారు. ఏ1 లారీ డ్రైవర్ కావడం తరచూ గోదాంకు వరిధాన్యంను అన్లోడు చేసే క్రమంలో తెలిసిన కూలీల ద్వారా దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే తాజాగా రూరల్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులోను మిల్లులో పని చేసే వ్యక్తులే దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులోని రైస్ మిల్లులో వరిధాన్యం, బియ్యం, నూకలు అపహరించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎంత మొత్తంలో చోరీకి పాల్పడి వాటిని ఎక్కడికి తరలించారు, ఎంత విక్రయించారనే వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే కొన్ని చిక్కు ముడులున్నాయి. ప్రభుత్వం కేటాయించిన సీఎంమ్మార్ను మిల్లర్లు బ్లాక్ మార్కెట్లో గుట్టుగా విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా చేసి అందజేయాల్సి ఉండగా వాటి నుంచి తప్పించుకునేందుకే ఈ చోరీల అంశాన్ని సాకుగా చూపిస్తున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అనుమానాలెన్నో..? జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలు 25.12.2024 తేదీన హరినాథ్ రైస్ మిల్లు వ్యాపారికి సంబంధించి ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద ఓ గోదాంలో ప్రభుత్వం కేటాయించిన 1,50,000 బస్తాల సీఎమ్మార్ను కేటాయించగా అట్టి ధాన్యాన్ని గోదాంలో నిల్వ ఉంచారు. అయితే దుండగులు గోదాం షెట్టర్ను ధ్వంసం చేసి రూ.3.50లక్షల విలువ గల 300 బస్తాలు వరిధాన్యాన్ని అపహరించినట్లు ఇటిక్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. 8.03.2025 తేదీన అశోక్కుమార్ రైస్ మిల్లు వ్యాపారి గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులో రైస్ మిల్లును ఏర్పాటు చేసుకుని వరిధాన్యం మర ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో మిల్లులో వరిధాన్యం, బియ్యం, నూకల బస్తాలను మిల్లులో పని చేసే వ్యక్తులు అపహరించారని అనుమానం వ్యక్తం చేస్తు ఫిర్యాదు చేశాడు. అపహరించిన వరిధాన్యం, బియ్యం, నూకల విలువ రూ.2 లక్షలు ఉంటుందని ఫోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్, అయిజ పరిధిలో 37 రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం సీఎంమ్మార్ను 2024 – 2025 ఖరీఫ్ సీజన్కుగాను 85,483 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు మిల్లర్లు 31,481.696 మెట్రిక్ టన్నుల బియ్యంను (9.84 శాతం) మాత్రమే ప్రభుత్వానికి అప్పగించినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక ఆశోక్కుమార్ రైస్ మిల్లుకు ప్రభుత్వం 1470.120 మెట్రిక్ టన్నులకుగాను ఇప్పటివరకు 40 శాతం మేర సరఫర చేసినట్లు సమాచారం. ఖరీఫ్ గడువులోగా మొత్తం మర ఆడించిన బియ్యాన్ని అందజేయాల్సిన తరుణంలో చోరీ సంఘటన వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదులో రూ.2లక్షల విలువగా పేర్కొనగా.. నిందితులపై రూ.కోటిపైగా విలువ గల వరిధాన్యం, బియ్యం, నూకలను అపహరించినట్లు అభియోగం మోపినట్లు సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, 2023 సంవత్సరంలో గద్వాల, శాంతినగర్, అయిజ పోలీసు స్టేషన్లోని మూడు మిల్లులపై సైతం కేసులు నమోదయ్యాయి. అయితే ఆర్థిక బలం, నాయకుల మద్దతు ఉండడమే రైస్ మిల్లు వ్యాపారులకు కలిసి వస్తుంది. సివిల్ సప్లై శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా లేకపోవడం వ్యాపారులను నిలువరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు, వ్యాపారుల అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్ఫోర్స్ మెంట్, ఇంటెలిజెన్సీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు.