
అన్నవరం దేవస్థానానికి డస్ట్బిన్లు అందజేసిన గెయిల్
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివా రి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ శ్రీగెయిల్ శ్రీ ఇండియా (రాజమహేంద్రవరం) సంస్థ రూ.18 లక్షల విలువ చేసే 85 జతల స్టెయిన్లెస్ స్టీల్ డస్ట్బిన్లను విరాళంగా అందజేసింది. సోమవా రం నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీటిని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ కేవీఎన్ రావు, జనరల్ మేనేజర్ కేబీ నారాయణ అందజేశారు. ఒకో జతలో ఒక తడిచెత్త, ఒక పొడిచెత్త డస్ట్బిన్లు ఉంటాయి. ఈ డస్ట్బిన్లనువివిధ సత్రాలలో, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి దేవస్థానంలో మరింత పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చూడాలని వారు కోరారు. గెయిల్ డీజీఎంలు రాజన్ కరతిస్వరన్, దివి ప్రభాకర్, హెచ్ఆర్ మేనేజర్ వైవీఎస్ మూర్తి, మాజీ మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ, దేవస్థానం ఈఈ వీ రామకృష్ణ, శాని టరీ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.