Kakinada District News
-
ఐదేళ్లలో లబ్ధి పొందారిలా..
బోట్క్లబ్(కాకినాడసిటీ): ఖరీఫ్ ముగిసింది. పెట్టుబడిసాయం కోసం రైతులు ఎదురుచూశారు. కానీ నిధులు విడుదల కాలేదు. బయట వ్యాపారస్తుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి వచ్చిన పంటలు విక్రయించి అప్పులు తీర్చారు. ప్రస్తుతం రబీ సీజన్ మొదలై సుమారు నెలరోజులు కావస్తోంది. కానీ పెట్టుబడి సాయం మాత్రం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. ఇప్పటికే రైతులు పెట్టుబడుల కోసం బయట వ్యాపారస్తులు వద్ద అప్పులు చేసుకొని మరీ సాగు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం తమ వాటా కింద రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ఇప్పటికే రెండుసార్లు జమ చేసేంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక విడత కూడా వారి ఖాతాల్లో జమ చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నగదుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చంద్రబాబు సర్కార్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇప్పుడే సాయం అవసరం ప్రస్తుతం రబీలో రైతులు ఎరువులు వేసుకొనే అదను వచ్చింది. ప్రస్తుతం పొలాలు పిలక దశ నుంచి దుబ్బు దశకు చేరుకున్నాయి. ఎకరాకు రెండు, మూడు బస్తాలు ఎరువులు వేసుకోవాలి. ఎరువులు కొనుగోలు చేయాలంటే రూ.4 వేల నుంచి రూ.5 వేలు పైబడి పెట్టుబడి పెట్టాలి. దీనికితోడు వరిపైరుకు ఏదైనా తెగులు సోకితే అదనంగా పురుగుమందులు కూడా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో రైతులకు పెట్టుబడి సహాయం ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సహాయం రైతులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జగన్ హయాంలో అన్నదాతలకు ఆర్థిక భరోసా ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గతంలో జగన్ సర్కార్ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 కలిపి మొత్తం రూ.13, 500 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో రెండు లక్షలకు పైగా ఉన్న రైతులకు ఈ ఐదేళ్లలో కేవలం రైతు భరోసా ద్వారానే రూ.1,121 కోట్ల మేర లబ్ధి చేకూరింది. మూడు విడతల్లో సకాలంలో జమ జగన్మోహన్రెడ్డి రైతులకు ఇబ్బందులు లేకుండా వైఎస్సార్ రైతుల భరోసా సొమ్ము సకాలంలో ఖాతాల్లో జమ చేశారు. ఖరీప్ పంట వేసే ముందు ఏటా సరిగ్గా మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500 జమ చేసేవారు. తర్వాత అక్టోబర్ నెలలో ఖరీప్ పంట కోతలతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండవ విడతలో రూ.4 వేలు జమ చేసేవారు. ఆ తర్వాత జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండగ సమయంలో మరో రూ. 2 వేలు ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.13, 500 చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యేది. ఇలా ఐదేళ్లు ఏటా సకాలంలో రైతులను ఆదుకొంటూ వచ్చారు. కరోనా సమయంలో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ రైతు భరోసాతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇలా అనేక పథకాల ద్వారా గత ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. సాగుకు ముందు సాయమేది? తాను అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఖరీఫ్ సాగుకు కేంద్రం నిధులు విడుదల చేయడంతో రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఏటా ఇవ్వాల్సిన రూ.20 వేలలో మొదటి విడతగా ఎంత జమ చేస్తుందో కూడా తెలియడం లేదు. దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. రబీలోనైనా వస్తుందా అని ఎదురుచూపు గత ఏడాది జూన్ నెలలో ఖరీఫ్ సాగు చేసుకొన్న రైతులు మూడు నెలలు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూశారు. ఖరీఫ్ ముగిసింది. రబీ సీజన్ కూడా వచ్చింది. రైతులు ఇప్పటికే వరినాట్లు వేసుకోవడంతో పాటు పంట వేసకొని సుమారు 20 రోజుల నుంచి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విడత కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు. చంద్రబాబు రైతులను గతంలో రుణమాఫీ పేరుతో ముంచాడని ప్రస్తుతం రైతులకు పెట్టుబడి సహాయం కూడా అలాగే చేసేలా ఉన్నారని ఇప్పటికే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ సీజన్ వచ్చినా అందని సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు విడతలు రైతు ఖాతాల్లో జమ ఇంకా విడుదల కాని రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఏటా రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం ఏది? జిల్లాలో 1.70 లక్షల మంది అన్నదాతల ఎదురుచూపు పెట్టుబడుల కోసం బయట వ్యాపారస్తుల వద్ద అప్పులు సంవత్సరం రైతుల లబ్ధి సంఖ్య (రూ.కోట్లలో) 2019– 20 1,70,698 181.02 2020– 21 1,66,963 216. 22 2021– 22 1,62,125 214.43 2022–23 1,69,989 190.71 2023–24 1,74,229 250.36 పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారు ఖరీఫ్లో ఇవ్వలేదు. ప్రస్తుతం రబీ సాగు మొదలు పెట్టి నెలరోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం అందలేదు. ప్రస్తుతం వరి పంటలకు ఎరువులు వేసుకోవాలి. కానీ డబ్బులు లేకపోవడంతో బయట అప్పులు తెచ్చుకొంటున్నాం. ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పిన పెట్టుబడి సహాయం వెంటనే ఇవ్వాలి. – ఎల్లపు రామసూర్యసత్యనారాయణ, రైతు, బొడ్డవరం, కోటనందూరు మండలం హామీ అమలు చేయాలి అధికారంలోకి వస్తే ఏటా రైతులకు రూ.20 వేల చొప్పున సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. రబీ పనులు ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. బయట వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తున్నాం. పెట్టుబడి సాయం ఇస్తే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఎంతో ఆసరాగా ఉంటుంది. – ఎర్నీడి సత్తిరాజు, రైతు, జి.మేడపాడు, సామర్లకోట మండలం -
పెండింగ్ పెన్షన్, జీపీఎఫ్లను పరిష్కరిస్తాం
కాకినాడ సిటీ: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొందడమే లక్ష్యంగా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వ హణ ముఖ్య లక్ష్యమని, పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్లను పరిష్కరిస్తామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ అన్నారు. శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశపు మందిరంలో కాకినాడ జిల్లా పెన్షన్ అదాలత్, జీపీఎప్ అదాలత్, ఇతర అనుబంధ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి ఉద్యోగి తన సర్వీస్కు సంబంధించిన అన్ని అంశాలు సర్వీస్ రిజిస్టర్లో నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. జీపీఎఫ్ ప్రతిపాదనలు పంపండంలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి 6 నెలల ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించాలన్నారు. పెన్షనర్ల పదవి విరమణ చేసే ఆరు నెలల ముందు పెన్షన్ పేపర్లు అకౌంటెంట్ జనరల్కి పంపాలని సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పోలు కిషోర్రెడ్డి తెలిపారు. 40 శాతం మంది పెన్షన్ పేపరు పదవీ విరమణ చేసిన నాలుగు నెలల తర్వాత పెన్షన్ పేపర్లు సమర్పించడం వల్ల ఆలస్యంగా బెనిఫిట్స్ వస్తున్నట్లు వివరించారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్రావు మాట్లాడుతూ డీడీవో సక్రమంగా ప్రతిపాదనలు పంపితే సకాలంలో పెన్షన్ ఇతర బెనిఫిట్స్ విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది పాత పెన్షన్ పొందుతున్నారన్నారు. వాటికి సంబంధించి ఆయా డ్రాయింగ్ అధికారులు ప్రతిపాదనలు సిఫార్సు చేస్తే ప్రస్తుత పీఆర్సీకి అనుగుణంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని వివరించారు. పలువురు పెన్షనర్లు, అధికారులు, ఉద్యోగులు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలను రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ చేతుల మీదుగా అందజేశారు. కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్సీ భాస్కరరావు, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్రాావు, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పి కిషోర్రెడ్డి, వి లలిత్కుమార్, సీనియర్ అకౌట్స్ ఆఫీసర్లు జి సునీత, టి విజయ్కుమార్, డి చంద్రశేఖర్, కాకినాడ జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ శ్రీనువాసులు పాల్గొన్నారు. కలెక్టర్ షణ్మోహన్ -
‘రత్నగిరి...చివరాఖరికి..’పై జిల్లా యంత్రాంగం సీరియస్
అన్నవరం దేవస్థానంపై సోమవారం సమీక్షించనున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నవరం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా భక్తుల అభిప్రాయాల ఆధారంగా ఇచ్చిన ర్యాంకుల్లో అన్నవరం దేవస్థానం చివరాఖరు ఏడో ర్యాంకు రావడంపై జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. జిల్లాలో గల ఏకై క పెద్ద పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం రాష్ట్రంలో చివరి ర్యాంకు రావడంపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘ ‘రత్నగిరి ..చివరాఖరికి...’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ వార్తలో ఏడో ర్యాంకు రావడానికి దారితీసిన పరిస్థితులను కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించారు. అతి తక్కువ సమయంలో దేవస్థానం పరిస్థితి ఎందుకిలా దిగజారిందనే దానిపై దేవస్థానం అధికారులతో స్వయంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సోమవారం చర్చించనున్నారు. ఈ మేరకు అన్నవరం దేవస్థానంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో బాటు దేవస్థానం ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా దిగజారడంపైన కూడా చర్చించనున్నారు. వీటితో బాటు ఏ విధమైన చర్యలు తీసుకుంటే దేవస్థానానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందనే దానిపై కూడా చర్చించనున్నారు. సిబ్బంది పనితీరుపై సమీక్షించనున్నారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఇతర అధికారులు కూడా పాల్గొంటారని దేవస్థానం వర్గాలు తెలిపాయి. -
కార్యకర్తలకు అండగా ఉంటా
కాకినాడ రూరల్: జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నిమితులైన అనంతరం తొలిసారిగా కాకినాడలో మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబును ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా రాజాకు పూలమాలలు వేసి స్వాగతం పలికిన కన్నబాబు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. పార్టీ నాయకులు కూడా రాజాను సత్కరించారు. అనంతరం ఇద్దరు నేతలు కొద్ది సేపు జిల్లాలో వైఎస్సార్ సీపీ బలోపేతం గురించి చర్చించుకున్నారు. అనంతరం దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ తనను నమ్మి జగన్మోహన్రెడ్డి నియమించడంతో బాధ్యతలు స్వీకరించానని, అందరి నాయకులను కలుసుకుని సమన్వయంతో ముందుకు వెళుతున్నానన్నారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంతో పాటు అంకితభావంతో నాయకులందరూ పార్టీ కోసం పని చేసేలా కృషి చేస్తానన్నారు. అనంతరం కన్నబాబు మీడియాతో పార్టీని బలోపేతం చేయడానికి నాయకలంతా గట్టిగా పనిచేస్తామన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్టీకి ఆదరణతో పాటు జగన్మోహన్రెడ్డిపై నమ్మకం కూడా ఉందన్నారు. తునిలో జరిగిన సంఘటన దుర్మార్గమన్నారు. లా అండ్ ఆర్డర్ను చేతుల్లోకి తీసుకుంటున్నారని, ప్రతి కార్యకర్తను కాపాడుకునే విధంగా పార్టీ ముందుకు వెళుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్లు బెజవాడ సత్యనారాయణ, రామదేవు సూర్య ప్రకాశరావు, పార్టీ నాయకులు జమ్మలమడక నాగమణి, రావూరి వెంకటేశ్వరరావు, గోపుశెట్టి బాబ్జీ, పుల్ల చందు, అనుసూరి ప్రభాకర్, లింగం రవి, అనుసూరి ప్రభాకర్, పల్లంరాజు, నక్కా సత్యనారాయణ, కొండలరావు, కర్రి చక్రధర్, రెడ్డి నాయుడు, వరప్రసాద్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పార్టీ రీజనల్ కో ఆర్డినేటరు కన్నబాబును మర్యాదపూర్వకంగా కలయిక -
జన గణనతో పాటే కుల గణన
కాకినాడ రూరల్: జాతీయ స్థాయిలో ఈసారి జరిపే జన గణనతో పాటే కుల గణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. కాకినాడలో నాగమల్లితోట జంక్షన్ వద్ద శుక్రవారం నిర్వహించిన బీసీ సంఘ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుల గణన చేపట్టాల్సిన ప్రాధాన్యతను కేంద్రానికి తెలిసేలా ఉద్యమాలు, కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. చట్ట సభలో బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించాలన్నా, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీల వర్గీకరణ జరపాలన్నా, మండల కమిషన్ సిఫారసులను సంపూర్ణంగా అమలు పరచాలన్నా బీసీ కుల గణన జరపవల్సి ఉందన్నారు. అనంతరం జిల్లా నూతన వర్గానికి నియామకపు పత్రాలు అందించారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుత్తుల రమణ నియమితులవ్వడంతో ఆయనతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులకు నియామకపు పత్రాలు అందించారు. త్వరలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అవగాహన ర్యాలీ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు -
తల్లి ప్రోత్సాహంతోనే ఐపీఎస్
● ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీ సుస్మిత ● తిమ్మాపురం ఎస్హెచ్ఓగా బాధ్యతల స్వీకరణ కాకినాడ రూరల్: తల్లి ప్రోత్సాహంతో తాను ఐపీఎస్గాను, సోదరిణి ఐఏఎస్గా ఎంపికయ్యామని 2023 ఏపీ కేడర్ ఐపీఎస్గా ఎంపికై న తమిళనాడుకు చెందిన ఆర్.సుస్మిత తెలిపారు. అసిస్టెంట్ ఎస్పీగా జిల్లాలో ట్రైనీలో ఉన్న ఆమె శుక్రవారం కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని కడలూరుకు చెందిన తమది వ్యవసాయ కుటుంబమన్నారు. తండ్రి వ్యవసాయం చేస్తారని, తల్లి ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్లో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారన్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడని, అక్కా, తాను ఐఏఎస్, ఐపీఎస్గా ఎంపికయ్యామన్నారు. తల్లి ప్రోత్సాహంతో తాను ఆరుసార్లు ప్రయత్నంతో ఐపీఎస్ సాధించానన్నారు. ఎస్హెచ్ఓగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువు ఆవశ్యత తెలియజేయడంతో పాటు గుడ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు గురించి అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. తిమ్మాపురం స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయి నిర్మూలనపై దృష్టి పెడతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ఆర్టీఐ నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా నంబరు ప్లేట్లపై దృష్టి పెడతామన్నారు. హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తామన్నారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 23న నిర్వహిస్తున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఏపీపీఎస్సీ, రెవెన్యూ, ఇంటర్మీడియెట్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ఈ నెల 23, ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్ష జరుగుతుందన్నారు. 9,379 అభ్యర్థుల నిమిత్తం కాకినాడ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. వీరంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో నవ దంపతులు, వారి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మంటపాలు, క్యూ లు నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు సత్యదేవుని ప్రాకార సేవ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవార్లను శనివారం తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువస్తారు. అక్కడ తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పండితులు పూజలు చేసిననంతరం ఊరేగింపు ప్రారంభమవుతుంది. -
రత్నగిరి..చివరాఖరికి..
● భక్తుల సేవల్లో వెనుకబాటు ● రాష్ట్రంలోని ఏడు పుణ్యక్షేత్రాలకు ర్యాంకులు ● అన్నవరం దేవస్థానానికి ఆఖరి స్థానం అన్నవరం: కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడు వెలసిన అన్నవరం దేవస్థానానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఆదాయం కూడా బాగానే వస్తూంటుంది. కానీ, భక్తులకు అవసరమైన సేవలు అందించడంలో మాత్రం అన్నవరం దేవస్థానం పూర్తి స్థాయిలో వెనుకబడింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై దేవదాయ శాఖ ఇటీవల ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అనంతరం ప్రకటించిన ర్యాంకుల్లో అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం చిట్టచివరి స్థానం పొందింది. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లలో వెనుకబడింది. వరుసగా కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, విశాఖపట్నం సింహాచలం, శ్రీశైలం మొదటి ఆరు స్థానాల్లో నిలవగా, అన్నవరం దేవస్థానం ఆఖరి ర్యాంకుతో సరిపెట్టుకుంది. ర్యాంకులు ఇలా.. ● దేవాలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూములు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు తదితర అంశాల్లో అన్నవరం దేవస్థానానికి ఆరో ర్యాంకు వచ్చింది. ఇందులో కాణిపాకం దేవస్థానం మొదటి ర్యాంకు సాధించింది. ● ఇతర దేవస్థానాల కన్నా అన్నవరం దేవస్థానంలో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందని ఎక్కువ మంది భక్తులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్నవరానికి ఆరో ర్యాంకు వచ్చింది. ఇందులో విజయవాడ కనకదుర్గ గుడి మొదటి ర్యాంకు పొందింది. ● సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యతను భక్తులందరూ ప్రశంసిస్తూంటారు. కానీ, ఆశ్చర్యకరంగా ప్రసాదం విషయంలో సత్యదేవుని ఆలయానికి ఐదో ర్యాంకు వచ్చింది. ఈ విషయంలో శ్రీకాళహస్తి మొదటి ర్యాంకు సాధించింది. ● ప్రసాదం విషయంలో 50 శాతం, దర్శనానికి సంబంధించి 30 శాతం, మౌలిక వసతులపై 20 శాతం మంది భక్తుల అభిప్రాయాలు తీసుకున్నట్లు దేవదాయ శాఖ తెలిపింది. ఇవీ లోపాలు ఒకప్పుడు రాష్ట్రంలో తిరుపతి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు, ఆదాయం, భక్తుల రాకపోకలతో వెలుగొందిన అన్నవరం దేవస్థానం పరిస్థితి మిగిలిన దేవస్థానాల కన్నా దిగువన ఉండటం గమనార్హం. దేవస్థానానికి ఏడో ర్యాంకు వచ్చే అంతగా పరిస్థితి దిగజారిందా అనే అభిప్రాయాన్ని సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు దేవస్థానానికి అన్ని విధాలా ఇబ్బందికరంగా మారాయి. ఒకవైపు ఆర్థిక సమస్యలు దేవస్థానాన్ని కుంగదీస్తున్నాయి. ప్రతి నెలా సిబ్బంది జీతాలు, పెన్షన్లకే నిధులు పోగేయాల్సి వస్తోంది. నిర్మాణాలు, ఇతర వ్యయాలు చాలా వరకూ కుదించాల్సి వచ్చింది. ● దేవస్థానంలో వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. దేవస్థానంలోని ఉచిత కల్యాణ మండపంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమానికి అనుమతించడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీనికి సంబంధించి నిర్వాహకులు ధార్మిక కార్యక్రమం అని చెప్పి అనుమతి తీసుకున్నారని దేవదాయ శాఖకు ఈఓ నివేదిక పంపించారు. ● సెల్ఫోన్ భద్రపరిచేందుకు దేవస్థానంలో రూ.5 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.10 వసూలు చేశారని ఒక భక్తుడు ఆధారాలతో వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీనిపై విచారణ అనంతరం రూ.5 లక్షల పరిహారం, మనోవేదనకు గురైన ఆ బాధితునికి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది. ఇది కూడా చర్చనీయాంశమైంది. ● వీటికి తోడు దేవస్థానంలో పరిపాలన కూడా గతంలో అంత చురుకుగా లేదనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం ఈఓగా డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును రెండు నెలల క్రితం ప్రభుత్వం నియమించింది. ఆయన దేవదాయ శాఖకు కొత్త కావడంతో సిబ్బందిపై ఆధారపడి పాలన సాగించాల్సి వస్తోంది. కొంత అవగాహన వచ్చినప్పటికీ ఇంకా పట్టు పెంచుకోవల్సిన అవసరం ఉంది. మొదటి ర్యాంకు సాధిస్తాం దేవస్థానంలో ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాట్లు చేసి, మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేస్తాం. సత్రాల గదుల్లో దుప్పట్ల కొనుగోలు, పారిశుధ్యం మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, ప్రసాదం నాణ్యత మరింత పెంచడం వంటి చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం భక్తులతో మెలిగేలా చర్యలు తీసుకుంటాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
కల కానకనే దివికేగిన దిగ్గజం
క్రీడల్లో ఆయన ఓ ఎవరెస్టు. ఎందరో క్రీడాకారులకు ఆయనో ద్రోణాచార్యుడు. ఎందరో గురువులకు ఆయన ఓ లక్ష్యం. అటువంటి వారెందరినో చూసి మురిసిపోయే ఆయన.. తన కలల పంట.. కుమారుడు సాత్విక్ సాయిరాజ్ ఇంతింతై వటుడింతయై అని అంతకంతకూ ఆయన ప్రవీణుడైన బ్యాడ్మింటన్ క్రీడనే అందిపుచ్చుకుని ఎదిగిపోతుంటే.. ఆ ఘనతలను కళ్లారా చూస్తూ.. వారూ వీరూ మెచ్చుకుంటుంటే.. సంబరపడిపోయారు. ప్రభుత్వం సైతం అత్యున్నత పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్ రత్న ప్రకటించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆ గౌరవాన్ని కుమారుడు అందుకునే ఉద్విగ్న క్షణాలను కళ్లారా చూడాలని ఆశపడ్డారు. ఆ కార్యక్రమానికి బయలుదేరారు. ఉన్న ఊరు దాటారో లేదో విధి అమాంతం ఆయనను అందని తీరాలకు తీసుకుపోయింది. బ్యాడ్మింటన్ క్రీడలో ఆయన తీర్చిదిద్దిన ఎందరో ఆణిముత్యాలు ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రీడారంగంలో ‘కాశీ’ అంటే తెలియని వారు ఉండరు. క్రీడాకారునిగా, క్రీడా శిక్షకునిగా, వ్యాయామోపాధ్యాయునిగా, న్యాయ నిర్ణేతగా, అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని తండ్రిగా ఇలా క్రీడలకు సంబంధించి అన్ని రంగాల్లోనూ అరితేరిన వ్యక్తిగా రంకిరెడ్డి కాశీ విశ్వనాథం చెరగని ముద్ర వేశారు. అటువంటి కాశీ గురువారం మృతి చెందడం ఉమ్మడి తూర్పు క్రీడాకారులు.. క్రీడాభిమానులలో విషాదాన్ని నింపింది. అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి, జాతీయ బ్యాడ్మింటన్ రిఫరీ రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (66) మృతి చెందారు. న్యూఢిల్లీలో జరిగే ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును సాత్విక్ అందుకోవాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి ఢిల్లీ బయలుదేరిన కాశీకి సొంత ప్రాంతమైన అమలాపురం పట్టణం దాటిన వెంటనే గుండెపోటుకు గురై మృతి చెందారు. కాశీకి భార్య, ఇద్దరు కుమారులు క్రీడాకారులు, క్రీడాభిమానులకు ‘కాశీ’ సుపరిచితులు. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా రాష్ట్రస్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్న కాశీ షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ రిఫరీగా పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు సేవలందించారు. కాశీ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన పనిచేసిన ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్, అంబాజీపేట ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి క్రికెట్, అమలాపురం ఆఫీసర్స్ క్లబ్లో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేఎస్బీఏ) కార్యదర్శిగా, అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శిగా సైతం సేవలందించారు. గత ప్రభుత్వ హయాంలో తన కుమారుడు సాత్విక్ పేరు మీద రూ.ఐదు లక్షలు, కలెక్టర్ నిధులతో కలిపి ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో వుడెన్ కోర్టు నిర్మాణం చేయించారు. కాశీ వద్ద వ్యాయామోపాధ్యాయ విద్యలో సలహాలు, సహకారం పొందిన సుమారు 18 మంది ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీలుగా, పీడీలుగా పనిచేస్తుండడం విశేషం. బ్యాడ్మింటన్పై మక్కువతో సాత్విక్ను అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దడంలో తండ్రిగా, తొలి శిక్షకునిగా కాశీ సఫలీకృతులయ్యారు. సాత్విక్ కామన్వెల్త్, థామస్ కప్, ఆసియా కప్లో స్వర్ణ, రజిత పథకాలు పొందిన విషయం తెలిసిందే. సాత్విక్కు 2022–23 సంవత్సరానికి ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. అ అవార్డును కొన్ని అనివార్య కారణాల వల్ల అందుకోవడం ఆలస్యమైంది. తాజాగా సాత్విక్ న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు బయలుదేరిన విశ్వనాథం అకస్మాత్తుగా మృతి చెందడంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాభిమానుల్లో విషాదాన్ని నింపింది. జాతీయ బ్యాడ్మింటన్ రిఫరీ విశ్వనాథం మృతి తనయుడు సాత్విక్ ఖేల్రత్న పురస్కార స్వీకారానికి వెళ్తుండగా హఠాన్మరణం ఉమ్మడి తూర్పులో క్రీడలపై చెరగని ముద్ర పీడీగా, శిక్షకునిగా ఎంతోమందికి తర్ఫీదు -
కష్టం నాది.. పదవి ఆయనది!
పిఠాపురం: నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది. పవన్ గెలుపులో తన పాత్రే కీలకం అనే అర్థం వచ్చేలా తయారు చేయించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేవలం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారాన్ని మాత్రమే పోస్టు చేయడంతో పాటు, పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తన కష్టంతో ఆయన పదవి సాధించారనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టింగ్ జనసేన శ్రేణుల్లో మంట పుట్టించింది. ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ–జనసేన మధ్య ఆధిపత్య పోరు రగులుతుండగా, ఈ పోస్టు మరింత అగ్గి రాజేసిందంటున్నారు. ఇదిలా ఉండగా తన సోషల్ మీడియా అకౌంట్ను మూడేళ్లుగా హైదరాబాద్కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని, గురువారం తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై టీడీపీ నేత వర్మ సంచలన ట్వీట్ కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ ఎక్స్లో వీడియో దుమారం రేగడంతో తనకు సంబంధం లేదని వివరణ -
నేడు పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
కాకినాడ సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి, పరిష్కరించడానికి, డీడీవోలకు సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ అదాలత్ జరుగుతోందన్నారు. జిల్లాలో ని డ్రాయింగ్, పంపిణీ అధికారులందరూ పెండింగ్ లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ సమస్యల వివరాలతో ఈ అదాలత్కు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. -
పశుగ్రాసానికి వెళ్లి.. అసువులు బాసి..
గండేపల్లి: పశుగ్రాసానికి పొలానికి వెళ్లిన వ్యక్తి అసువులు బాసిన వైనమిది. ఉదయాన్నే పొలానికి వెళ్లిన అతడు తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన కాకర్ల నాగేంద్ర (34) గండేపల్లి మండలం యల్లమిల్లిలో గారపాటి కామరాజుకు చెందిన పొలాన్ని కొంత కాలంగా కౌలుకు చేస్తున్నాడు. రోజులానే గురువారం ఉదయాన్నే పొలానికి వెళ్లి, పశువుల కోసం చొప్ప కోసుకుని, మోపు కట్టుకుని తల పైకి ఎత్తుకునే సమయంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు చొప్ప వెన్నులు తగిలాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురైన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య నాగు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడి పైనే కుటుంబం ఆధారపడి ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా?
గండేపల్లి: ఏడీబీ రోడ్డు విస్తరణకు సంబంధించి తమకు జరుగుతున్న నష్టానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పెంచి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ విషయం తేల్చకుండా అధికారులు తమ ఇళ్లు, షాపులు కూల్చివేయడంపై మండిపడ్డారు. వివరాలివీ.. రాజానగరం – కాకినాడ ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో మండలంలోని సూరంపాలెం పరిధి రామేశంపేటలో ఇళ్లు, షాపుల కూల్చివేత ప్రారంభించారు. దీనిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. 64 గజాల స్థలం కోల్పోతున్న వారికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చారని, 130 గజాలు కోల్పోతున్న వారికి కూడా అంతే పరిహారం ఇవ్వడం ఎంతవరకూ న్యాయమని అధికారులను ప్రశ్నించారు. తమకు తగిన నష్ట పరిహారం ఇవ్వకుండా ఏవిధంగా కూలగొడతారని నిలదీశారు. ఎక్కువ, తక్కువ తేడాలు గమనించకుండా అందరికీ ఒకేలా నష్టపరిహారం ఇవ్వడమేమిటని తహసీల్దార్ శ్రీనివాస్ను ప్రశ్నించారు. దుకాణాలు, ఇళ్లల్లో విలువైన సామగ్రితో పాటు గృహోపకరణాలు కూడా ఉన్నాయని, కనీసం వాటిని తీసుకునేందుకై నా సమయం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎంకు చెప్పినా.. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు రామేశంపేటలో తమ సమస్య చెప్పుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, దీంతో పిఠాపురం వెళ్లి వివరించామని బాధితులు చెప్పారు. దీనిపై ఆయన అధికారులతో మాట్లాడతానన్నారని, ఇంతలోనే కూల్చివేతలు మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కనికరించని అధికారులు తమ ఇల్లు, దుకాణం కోల్పోతున్నామనే ఆందోళనతో స్థానిక మహిళ వరలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఇంట్లో వైద్యం చేయిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించి కూల్చివేత కొనసాగించారని వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఇంట్లో సిలైన్లు పెట్టినప్పటికీ అధికారులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారని వాపోయారు. అధికారులు అంత నిర్దయగా వ్యవహరిస్తే తామెలా బతకాలని ప్రశ్నించారు. 18 నిర్మాణాల కూల్చివేత రామేశంపేటలో 18 నిర్మాణాలను కూల్చివేసినట్టు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. వీరికి గతంలో నష్టపరిహారం ఇచ్చామని, అదనంగా ఇంటి స్థలం లేదా మరికొంత పరిహారం ఇస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణ పనులు శుక్రవారం నుంచి కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం ఎస్సైలు యూవీ శివ నాగబాబు, టి.రఘునాథబాబు, సతీష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఏడీబీ రోడ్డులో రామేశంపేట వద్ద నిర్మాణాల కూల్చివేత ప్రస్తుత విలువ ప్రకారం పరిహారం పెంచాలని బాధితుల డిమాండ్ ఆందోళనతో మహిళకు అస్వస్థత ఇంట్లో వైద్యం జరుగుతున్నా కూల్చివేత ఆపని అధికారులు మండిపడిన స్థానికులు -
వైఎస్సార్ సీపీ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మీ శివకుమారి
రౌతులపూడి: వైఎస్సార్ సీపీ అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామానికి చెందిన అంగూరి లక్ష్మీ శివకుమారి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులందాయి. దళిత వర్గానికి చెందిన లక్ష్మీ శివకుమారి గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలిగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పదవులు చేపట్టారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం వైఎస్సార్ సీపీ అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా పదవి ఇచ్చింది. ఆక్టోపస్ శిక్షణ పూర్తి కాకినాడ క్రైం: ఉగ్ర చర్యల నిరోధక సంస్థ ఆక్టోపస్ ప్రత్యేక శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో 40 మంది కమాండోలు శిక్షణ పొందారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ సి.రాజారెడ్డి పర్యవేక్షణలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్.మురళీకృష్ణ, కె.మహేష్ల ఆధ్వర్యంలో మాక్డ్రిల్, రెక్కీలపై శిక్షణ నిర్వహించారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం ఆదేశాలతో వైస్ ప్రిన్సిపాల్ శశి, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫణికిరణ్, లైబ్రేరియన్ లక్ష్మణరెడ్డి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరించాలి కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ జె.వెంకటరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 98 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ చేశామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కాకినాడ మెక్లారిన్ హైస్కూల్, పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతుందన్నారు. సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. 23న గ్రూప్–2 మెయిన్ పరీక్షకాకినాడ సిటీ: ఏపీపీఎస్సీ ఈ నెల 23న నిర్వహిస్తున్న గ్రూప్–2 మెయిన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లూ చేయాలని జాయింట్ కలెక్టర్, ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. గ్రూప్–2, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన గురువారం కలెక్టరేట్లో సమీక్షించారు. గ్రూప్–2 పేపర్–1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ జరుగుతుందని తెలిపారు. ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.45 గంటల తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ పరీక్షకు జిల్లాలో 9,379 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. 12 మంది లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామన్నారు. వీరు ఆయా కేంద్రాలను తనిఖీ చేసి, అభ్యర్థులు తమ వెంట తీసుకువచ్చిన ఫోన్లు, బ్యాగులు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించాలని జేసీ రాహుల్ మీనా ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వెంకటరావు, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్.వెంకటరావు, సీపీవో పి.త్రినాథ్, జిల్లా వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులు ఎన్.విజయకుమార్, ఎస్.సూర్యప్రకాశరరావు, కె.కరుణాకర్బాబు, రెవెన్యూ, విద్యుత్, వైద్య, ఆరోగ్యం, ప్రజా రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటితే చర్యలు కాకినాడ క్రైం: సోషల్ మీడియాలో హద్దులు దాటి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, మార్ఫింగ్ వీడియోలు, సున్నిత అంశాలపై అసంబద్ధ ప్రస్తావనలు, కులమతాలు, ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన పోస్టులు, వ్యక్తిగత దూషణలకు దిగితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నెటిజన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. -
12 మంది ఉద్యోగులపై వేటు
కాకినాడ క్రైం: జీజీహెచ్లో ఒకే రోజు 12 మంది ఉద్యోగులను తొలగించడం తీవ్ర కలకలం రేపింది. వీరిలో ఇద్దరు రెగ్యులర్, ఇద్దరు కాంట్రాక్టు ఫార్మసిస్టులు, ఇద్దరు ఫిజియోథెరపిస్టులు, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక థియేటర్ అసిస్టెంట్, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. 2020–21లో నిర్వహించిన నర్సింగ్ పోస్టుల విక్రయాలు, లేని పోస్టుల్ని సృష్టించి మరీ భర్తీ చేయడం వంటి ఆరోపణలతో అప్పటి జీజీహెచ్ మేనేజర్ నరసింగరావు కొద్ది నెలల కిందట సస్పెండయ్యారు. అప్పట్లో ఆయన ద్వారా ఉద్యోగాలు పొందిన 12 మంది జీజీహెచ్ సిబ్బందిని గురువారం ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ షణ్మోహన్కు లిఖితపూర్వకంగా నివేదించారు. వేటు పడిన ఉద్యోగులకు మరెక్కడైనా పోస్టింగులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. కాగా, ఉద్యోగుల తొలగింపు అంశంపై ట్రెజరీ, జీజీహెచ్ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వీరికి మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేంత వరకూ జీతం ఇచ్చే అవకాశం లేదని జిల్లా ఖజానా శాఖ స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలపై విచారణేదీ ! జీజీహెచ్ మేనేజర్గా పని చేస్తూ సస్పెండైన నరసింగరావుపై ప్రధానంగా నర్సింగ్ పోస్టుల విక్రయాలు, లేని పోస్టుల్ని సృష్టించి మరీ భర్తీ చేశారనే ఆరోపణలున్నాయి. నర్సింగ్ పోస్టుల విక్రయాల అవినీతిపై పక్కా ఆధారాలు లభించడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నరసింగరావును అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లోనే కొనసాగుతున్నారు. జీవోలో లేని పోస్టుల సృష్టించి మరీ భర్తీ చేసిన అంశానికి సంబంధించి నరసింగరావుపై వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ పద్మా శశిధర్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాల్సి ఉంది. ఆయన సస్పెండై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం షోకాజ్ నోటీసు కూడా పంపించలేదు. కనీస విచారణ కూడా జరగకపోవడంతో లేని పోస్టులు సృష్టించడంలో నరసింగరావు ఉద్దేశం ఏమిటనే విషయం తేలలేదు. దీనిపై స్పష్టత వస్తే ఇప్పుడు తొలగించిన ఉద్యోగులు నరసింగరావు అవినీతిలో భాగస్వాములా, పావులా అనే విషయంపై స్పష్టత వచ్చేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనినిబట్టి వారికి మరెక్కడైనా ఉద్యోగాలు ఇవ్వాలా, లేక పూర్తిగా తొలగించాలా అనే విషయం కూడా స్పష్టమయ్యేది. నరసింగరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఛార్జెస్ ఫ్రేమ్ చేయడంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో నెల గడిస్తే నరసింగరావు సస్పెండై నాలుగు నెలలు పూర్తవుతాయి. తాజా నిబంధనల ప్రకారం నాలుగు నెలలు దాటితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై ఎటువంటి ఛార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉండదు. ఇదే కనుక జరిగితే సస్పెన్షన్ తర్వాత ఎటువంటి కఠిన చర్యలూ తీసుకోకుండానే మళ్లీ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై ఉద్యోగ వర్గాల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. జీజీహెచ్లో లేని ఉద్యోగాల భర్తీపై చర్యలు కలెక్టర్కు అధికారుల నివేదిక -
రత్నగిరి..చివరాఖరికి..
● భక్తుల సేవల్లో వెనుకబాటు ● రాష్ట్రంలోని ఏడు పుణ్యక్షేత్రాలకు ర్యాంకులు ● అన్నవరం దేవస్థానానికి ఆఖరి స్థానం అన్నవరం: కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడు వెలసిన అన్నవరం దేవస్థానానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఆదాయం కూడా బాగానే వస్తూంటుంది. కానీ, భక్తులకు అవసరమైన సేవలు అందించడంలో మాత్రం అన్నవరం దేవస్థానం పూర్తి స్థాయిలో వెనుకబడింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై దేవదాయ శాఖ ఇటీవల ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అనంతరం ప్రకటించిన ర్యాంకుల్లో అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం చిట్టచివరి స్థానం పొందింది. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లలో వెనుకబడింది. వరుసగా కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, విశాఖపట్నం సింహాచలం, శ్రీశైలం మొదటి ఆరు స్థానాల్లో నిలవగా, అన్నవరం దేవస్థానం ఆఖరి ర్యాంకుతో సరిపెట్టుకుంది. ర్యాంకులు ఇలా.. ● దేవాలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూములు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు తదితర అంశాల్లో అన్నవరం దేవస్థానానికి ఆరో ర్యాంకు వచ్చింది. ఇందులో కాణిపాకం దేవస్థానం మొదటి ర్యాంకు సాధించింది. ● ఇతర దేవస్థానాల కన్నా అన్నవరం దేవస్థానంలో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందని ఎక్కువ మంది భక్తులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్నవరానికి ఆరో ర్యాంకు వచ్చింది. ఇందులో విజయవాడ కనకదుర్గ గుడి మొదటి ర్యాంకు పొందింది. ● సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యతను భక్తులందరూ ప్రశంసిస్తూంటారు. కానీ, ఆశ్చర్యకరంగా ప్రసాదం విషయంలో సత్యదేవుని ఆలయానికి ఐదో ర్యాంకు వచ్చింది. ఈ విషయంలో శ్రీకాళహస్తి మొదటి ర్యాంకు సాధించింది. ● ప్రసాదం విషయంలో 50 శాతం, దర్శనానికి సంబంధించి 30 శాతం, మౌలిక వసతులపై 20 శాతం మంది భక్తుల అభిప్రాయాలు తీసుకున్నట్లు దేవదాయ శాఖ తెలిపింది. ఇవీ లోపాలు ఒకప్పుడు రాష్ట్రంలో తిరుపతి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు, ఆదాయం, భక్తుల రాకపోకలతో వెలుగొందిన అన్నవరం దేవస్థానం పరిస్థితి మిగిలిన దేవస్థానాల కన్నా దిగువన ఉండటం గమనార్హం. దేవస్థానానికి ఏడో ర్యాంకు వచ్చే అంతగా పరిస్థితి దిగజారిందా అనే అభిప్రాయాన్ని సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు దేవస్థానానికి అన్ని విధాలా ఇబ్బందికరంగా మారాయి. ఒకవైపు ఆర్థిక సమస్యలు దేవస్థానాన్ని కుంగదీస్తున్నాయి. ప్రతి నెలా సిబ్బంది జీతాలు, పెన్షన్లకే నిధులు పోగేయాల్సి వస్తోంది. నిర్మాణాలు, ఇతర వ్యయాలు చాలా వరకూ కుదించాల్సి వచ్చింది. ● దేవస్థానంలో వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. దేవస్థానంలోని ఉచిత కల్యాణ మండపంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమానికి అనుమతించడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీనికి సంబంధించి నిర్వాహకులు ధార్మిక కార్యక్రమం అని చెప్పి అనుమతి తీసుకున్నారని దేవదాయ శాఖకు ఈఓ నివేదిక పంపించారు. ● సెల్ఫోన్ భద్రపరిచేందుకు దేవస్థానంలో రూ.5 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.10 వసూలు చేశారని ఒక భక్తుడు ఆధారాలతో వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీనిపై విచారణ అనంతరం రూ.5 లక్షల పరిహారం, మనోవేదనకు గురైన ఆ బాధితునికి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది. ఇది కూడా చర్చనీయాంశమైంది. ● వీటికి తోడు దేవస్థానంలో పరిపాలన కూడా గతంలో అంత చురుకుగా లేదనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం ఈఓగా డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును రెండు నెలల క్రితం ప్రభుత్వం నియమించింది. ఆయన దేవదాయ శాఖకు కొత్త కావడంతో సిబ్బందిపై ఆధారపడి పాలన సాగించాల్సి వస్తోంది. కొంత అవగాహన వచ్చినప్పటికీ ఇంకా పట్టు పెంచుకోవల్సిన అవసరం ఉంది. మొదటి ర్యాంకు సాధిస్తాం దేవస్థానంలో ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాట్లు చేసి, మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేస్తాం. సత్రాల గదుల్లో దుప్పట్ల కొనుగోలు, పారిశుధ్యం మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, ప్రసాదం నాణ్యత మరింత పెంచడం వంటి చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం భక్తులతో మెలిగేలా చర్యలు తీసుకుంటాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్గా జయలక్ష్మి
కాకినాడ లీగల్: స్టాం్ప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్గా కె.ఆనందరావు వ్యక్తిగత కారణంగా 15 రోజులు సెలవు పెట్టారు. ఆయన స్థానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న జె.జయ లక్ష్మిని కాకినాడ జిల్లా ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్గా నియమించారు. ఈ మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అన్నవరం ఆలయానికి కోడ్ నుంచి మినహాయింపు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి. అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు. సజావుగా ఎమ్మెల్సీ పోలింగ్ కాకినాడ సిటీ: ఈ నెల 27వ తేదీన జిల్లాలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సెక్టార్, రూట్ అధికారులు సమర్థంగా పని చేయాలని ఏఆర్వో డీఆర్వో జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశపు మందిరంలో సెక్టార్, రూట్ అధికారులు, తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఏఆర్వో జె వెంకటరావు హాజరై కాకినాడ, పెద్దాపురం ఆర్టీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణితో కలిసి అధికారులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జిల్లాలో 70,540 మంది ఓటర్లకు 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 21 సెక్టార్ అధికారులను నియమించామన్నారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ ఎం.జగన్నాథం పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు కాకినాడ సిటీ: తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్న దృష్ట్యా కాకినాడ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 163(2) ప్రకారం ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ గుమికూడడం నిషిద్ధమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు పెట్టకూడదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించామని కలెక్టర్ వివరించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 25వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఎవరు సమావేశాలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా తిరగడం చేయకూడదన్నారు. నేడు పీఆర్జీ కాలేజీ ప్రిన్సిపాల్పై విచారణ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం కళాశాలలో విచారణ చేపట్టనున్నారు. కళాశాలలకు చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు కళాశాల నిధులతో పాటు పరీక్ష విభాగంలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ విద్యా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. గత ఏడాది నవంబర్ 4న ఆర్జేడీ శోభారాణి కమిటీ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేయగా సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ విచారణ చేపట్టనున్నారు. -
క్రీడా స్ఫూర్తిని చాటిన హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం క్రీడా స్ఫూర్తిని చాటాయి. పురుషుల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై 7–1 స్కోర్తో ఛత్తీస్గఢ్ సెక్టార్, ఆర్బీఎస్ భువనేశ్వర్పై ఆర్బీఎస్ ఉత్తరాఖండ్ 5–0తో, ఆర్బీఎస్ ఛండీగఢ్పై ఆర్బీఎస్ బెంగళూరు 4–1తో, గోవా సెక్టార్పై తెలంగాణ సెక్టార్ 21–0 స్కోర్తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్తో, కేరళ సెక్టార్పై ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో, మధ్య ప్రదేశ్ సెక్టార్పై ఏపీ సెక్టార్ 18–0 స్కోర్తో గెలుపొందాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, మ్యాచ్లను ప్రారంభించారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, సూరిబాబు పర్యవేక్షించారు. -
హామీలు మర్చిపోతే ఎలా?
ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని నమ్మి మేము ఓట్లు వేశాం. ఇప్పుడు వాటిని మర్చిపోతే ఎలా. నేతన్న నేస్తం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లబ్ధి పొంది నిలదొక్కుకున్నాయి. అలాంటి నేతన్న నేస్తం అందక పోతే చాలా నేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాయి. నెరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వకూడదు. ప్రస్తుతం నేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. వాటిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోపోవడం దురదృష్టకరం. – దౌడురి భాస్కరరావు, చేనేత కార్మికుడు, తాటిపర్తి, గొల్లప్రోలు మండలం -
మమ్మల్ని పట్టించుకునే వారు లేరు
నష్టమైనా, కష్టమైనా చేనేతనే నమ్ముకుని కుటుంబాలను పొషించుకుంటున్నాం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం ఇచ్చి ఏటా సాయం అందించడంతో మాకు కొండంత అండగా ఉండేది. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో మాకు ఉపాధి తగ్గుతూ వస్తోంది. పడుగు ధర రెండేళ్లతో పోల్చుకుంటే రెట్టింపు అయింది. కిలో పడుగు ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. నేతకు ఉపయోగించే ముడి సరుకు ధరలు విపరీతంగా పెదరగడంతో గణనీయంగా ఉపాధి తగ్గిపోయింది. రోజంతా కుటుంబం మొత్తం కష్టపడితే రూ.300 మించి కూలీ కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడం దారుణం. – గుండారపు పార్వతి, నేత కార్మికురాలు, వాకతిప్ప, కొత్తపల్లి మండలం -
అర్ధరాత్రి దొంగల హల్చల్
షట్టర్లు పగులగొట్టి పది దుకాణాల్లో చోరీ తుని: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రచ్చతో ఆందోళనకు గురైన ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేశారు. తుని పట్టణంలో రద్దీగా ఉండే జీఎన్టీ రోడ్డులో ఒకేసారి పది దుకాణాల షట్టర్లను పగులగొట్టి, అందిన కాడికి దోచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా ఏకకాలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆయా దుకాణాల్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తుని పట్టణంతో పాటు, పాయకరావుపేటలోనూ చోరీలకు యత్నించారు. పెద్ద ముఠాయే ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆయా దుకాణాల్లో సీసీ ఫుటేజ్తో పాటు, దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. వస్త్ర దుకాణంలో దుస్తులు పట్టుకెళ్లారని, మిగిలిన దుకాణాల్లో నగదును దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చోరీలకు పాల్పడిన ముఠా ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా సీసీ ఫుటేజ్లో గుర్తించామన్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టరు షణ్మోహన్ అన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం ఆయన స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయంలో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గోదావరి కాలువలో భక్తులు స్నానాలు చేసే రేవు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించారు. ఆలయంలోనికి ప్రవేశించే క్యూ లైన్ల విధానాన్ని ఈఓ బళ్ల నీలకంఠంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఐపీల పేరుతో ఘర్షణలకు దిగితే సహించేది లేదన్నారు. ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గం నుంచి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేయడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలను వ్యతిరేకిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భక్తులకు తాగునీరు అందే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్తు సరఫరా నిరంతరం ఉండాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులకు భోజనాలు పెట్టే దాతలకు ఒక ప్రదేశం కేటాయించాలన్నారు. మహాశివరాత్రి రోజున పోలీసుతో పాటు ఇతర సెక్యూరిటీ సిబ్బందితో భక్తులకు సేవలందించే విధంగా చూడాలన్నారు. రథోత్సవం రోజున ఎమ్మెల్సీ పోలింగ్ ఉండటంతో అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా భారీ వాహనాలు పట్టణానికి దూరంగా నిలిపి వేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు, అసిస్టెంట్ కమిషనర్ దుర్గాభవానీ, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, జిల్లా అగ్నిమాపక సహయాధికారి ఎం. శ్రీహరిజగన్నాథ్, పెద్దాపురం అగ్నిమాపక అధికారి ప్రసాద్, డీఎస్పీ డి.శ్రీహరి రాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి, ఎంపీడీఓ కె హిమామహేశ్వరీ, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య, ఉత్సవాల ప్రత్యేకాధికారి కేవీ సూర్యనారాయణ, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు పాల్గొన్నారు. -
మాస్టర్ ప్లాన్కు సూచనలు ఇవ్వండి
కాకినాడ సిటీ: కోరంగి వైల్డ్లైఫ్ అభయారణ్యం ఎకో–సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధిత అధికారులు తమ సూచనలు, సలహాలు అందించాని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ జిల్లా అటవీశాఖ అధికారి డి.రవీంద్రనాథ్రెడ్డితో కలిసి కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీపై అటవీ, రెవెన్యూ, మత్స్య, భూగర్భ జలాలు, పశుసంవర్థక, ఉద్యాన, మున్సిపల్ కార్పొరేషన్, సర్వే ఇతర శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డీఎస్వో రవీంద్రనాథ్రెడ్డి కోరంగి వైల్డ్లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 26 కిలోమీటర్లు దూరం వరకు ఎకో–సెన్సిటివ్ జోన్ ఉంటుందన్నారు. ఈ జోన్ వల్ల వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. పర్యావరణ సమతుల్యత నెలకొని పచ్చదనం పెంపొందడంతో పాటు సేంద్రీయ వ్యవసాయానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ జోన్ పరిధిలో వర్షపు నీటిని వివిధ పద్ధతుల్లో నిల్వ చేసుకొని జంతువులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని కలెక్టర్ వివరించారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎకో–సెన్సిటీవ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయరు చేయనుందని దీనికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తమ సూచనలు, సలహాలు అందించాల సూచించారు. ఈ సమావేశంలో తిరువనంతపురం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ టీవీ వినోద్, హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ రీజనల్ డైరెక్టర్ కె జయచంద్ర, పశుసంవర్థకశాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశరరావు, మత్స్యశాఖ అధికారి కె కరుణాకర్బాబు, గ్రౌండ్ వాటర్ డీడీ పి రాధాకృష్ణ, కాకినాడ అటవీశాఖాధికారి శ్రీదీప్తి, కోరంగి వైల్డ్లైఫ్ అటవీ అధికారి ఎస్ఎస్ఆర్వీ వరప్రసాద్ పాల్గొన్నారు. -
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ సలీం బాషా సాక్షి, అమలాపురం: రానున్న పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు సమన్వయంతో పాటుపడాలని డీఈఓ షేక్ సలీం బాష ఉపాధ్యాయులు, ఎంఈఓలకు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారు చేసి, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. టెన్నికాయిట్ పోటీలకు సర్వం సిద్ధం గోపాలపురం: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు చిట్యాల జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు, రెండు కొత్తవి కలిపి మొత్తం 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే చంద్రశేఖర్, హెచ్ఎం ఎస్ఎల్ఎన్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పోటీలు 22వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రేయింబవళ్లు పోటీలు జరుగుతాయని తెలిపారు. -
ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే..
జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ ఆరో ఉప కులపతిగా బుధవారం మధ్యాహ్నం వీసీ చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సీఎం, విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వర్సిటీలతో కొత్త కోర్సులపై ఒప్పందం, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనాంశాలు కీలకంగా ఉండేలా ప్రక్షాళన చేపడతానన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్–100లో ఉంచడంతో పాటు, మెరుగైన ఎన్బీఐ ర్యాంకింగ్ సాధనకు కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులను స్టార్టప్స్, ఆవిష్కరణలకు ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం సెనెట్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, మాజీ వీసీ ప్రసాదరాజు, పద్మరాజు, మురళీకృష్ణ, డైరెక్టర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
అర్ధరాత్రి దొంగల హల్చల్
షట్టర్లు పగులగొట్టి పది దుకాణాల్లో చోరీ తుని: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రచ్చతో ఆందోళనకు గురైన ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేశారు. తుని పట్టణంలో రద్దీగా ఉండే జీఎన్టీ రోడ్డులో ఒకేసారి పది దుకాణాల షట్టర్లను పగులగొట్టి, అందిన కాడికి దోచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా ఏకకాలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆయా దుకాణాల్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తుని పట్టణంతో పాటు, పాయకరావుపేటలోనూ చోరీలకు యత్నించారు. పెద్ద ముఠాయే ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆయా దుకాణాల్లో సీసీ ఫుటేజ్తో పాటు, దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. వస్త్ర దుకాణంలో దుస్తులు పట్టుకెళ్లారని, మిగిలిన దుకాణాల్లో నగదును దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చోరీలకు పాల్పడిన ముఠా ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా సీసీ ఫుటేజ్లో గుర్తించామన్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
తుని రూరల్: తిరుపతి బోనగిరిలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు ఎంపికయ్యాయి. బుధవారం తుని మండలం హంసవరం మోడల్ స్కూల్ మైదానంలో ఎంపికలు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు తెలిపారు. ఇరు జట్ల నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ జాబ్స్, జిల్లా కార్యదర్శి గంటా విక్టర్బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. పురుషుల జట్టు: ఆర్.రాహుల్, వై.వెంకట సాత్విక్, టి.కార్తికేయ, ఎం.అరవింద్, జి.శ్రీనాగ వీరసాయితేజ, పి.దుర్గాఅరవింద్, కె.రామ్చరణ్, జి.జగన్ప్రకాష్, టి.ఉమేష్, ఎం.యశ్వంత్, జి.పవన్, జి.ఆకాష్. మహిళల జట్టు: ఎస్.రేణుక, పి.నవ్యశ్రీ, ఎస్.సాయిరేఖ, జె.హరిణి, కె.మౌనిక, సీహెచ్ దేవి, కె.కనకదుర్గ, వి.విజయ దుర్గాభవాని, జి.దుర్గాసత్యశ్రీ, ఎం.త్రినేత్రదేవి, బి.వెన్నెల, పి.గంగ. -
రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్చార్జి డీఐజీగా భీమవరం జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కాకినాడ జాయింట్ సబ్రిజిస్ట్రార్–1 ఆర్వీ రామారావు, జాయింట్ సబ్రిజిస్ట్రార్–2 పీఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర్లు 2022–24 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఇక్కడ నుంచి భీమవరం జిల్లా రిజిస్ట్రార్గా బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లా డీఐజీగా ఉన్న బి.శివరామ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా కె.ఆనందరావుకు ఇన్చార్జి డీఐజీగా నియమించారు. అదనపు బాధ్యతలుగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఈయన పరిధిలోకి వస్తాయి. -
రూ.3.60 లక్షల ఎరువుల సీజ్
పిఠాపురం: గొల్లప్రోలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి చెందిన మన గ్రోమోర్ రిటైల్ సెంటర్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు మాట్లాడుతూ, విజిలెన్స్ ఎస్పీ స్నేహిత ఆదేశాల మేరకు, డీఎస్పీ తాతారావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 14–35–14 రకం చెందిన 200 బస్తాల ఇన్వాయిస్ రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతుల కోసం ఫిర్యాదు బాక్స్ లేకపోవడం, స్టాక్ బోర్డ్ నిర్వహణ లేకపోవడం తదితర అంశాలను గుర్తించామన్నారు. షాపు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి, రూ 3.60 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ మధుమోహన్, గొల్లప్రోలు ఏఓ సత్యనారాయణ, తూనికలు, కొలతల అధికారి సరోజ పాల్గొన్నారు. కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్లోని ప్లాట్ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల సదుపాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.31.37 కోట్లతో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేశారు. -
గామన్ బ్రిడ్జిపై కారు దగ్ధం
కొవ్వూరు: పట్టణ శివారున ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జిపై 33వ పిల్లర్ వద్ద బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. బ్యానెట్ నుంచి మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన బందెల కృష్ణ ఆ కారులో రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు – రూ.1.77 లక్షల నగదు, బైక్ స్వాధీనం అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని పేరూరు వై.జంక్షన్లో ఈ నెల 4న ఓ బైక్ నుంచి రూ.1.50 లక్షల నగదును కాజేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ.1.77 లక్షల నగదు, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. వై.జంక్షన్లోని ఓ టిఫిన్ సెంటరులో అల్పాహారానికి ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు బైక్పై వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన రూ.1.50 లక్షల నగదును దొంగిలించి పరారైన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీడివలస గ్రామానికి చెందిన మేకల బాలరాజును అరెస్ట్ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు పర్యవేక్షణలో, పట్టణ ఎస్సై టి.తిరుమలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలరాజు రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు. -
లిల్లీని పిండినల్లిపేస్తోంది
పెరవలి: తూర్పుగోదావరి జిల్లాలో లిల్లీపూల సాగు 300 ఎకరాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరుగుతోంది. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటలో వివిధ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుమచ్చ లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకు వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణ చర్యలు ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి (మీల్ బగ్) ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీదుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వలన తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లిపురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగు పుష్పగుచ్ఛాన్ని మొగ్గతొలిచే పురుగులు ఆశించి, గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోయి గుచ్ఛ అలాగే ఉండిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు.. లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్డిజం గ్రాము లీటరు నీటికి పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే, రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు. 300 ఎకరాల్లో లిల్లీ పూల సాగు దుష్ప్రభావం చూపుతున్న తెగుళ్లు సస్యరక్షణ చర్యలు తప్పవంటున్న నిపుణులుఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులతో పాటు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఇలా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి, ఎకరాకి 60 వేల నుంచి 70 వేలు పుష్పగుచ్చాలొచ్చి 3 నుండి 7 టన్నుల పూల దిగుబడి వస్తుంది. -
టీడీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు
తుని: సుధీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విరుచుకుపడ్డారు. బుధవారం తుని యనమల కృష్ణుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ లేరని, బలం లేని చోట అధికార మదంతో పోలీసులు, అధికారులను ఉపయోగించుకుని బలవంతంగా లాక్కుకోవడానికి యత్నంచడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. టీడీపీలో మంత్రిగా, స్పీకర్గా ఉన్నత పదవుల్లో ఉన్న యనమల రామకృష్ణుడు నీచ రాజకీయాలకు పాల్పడి సభ్య సమాజం నివ్వెర పోయే విధంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకుని ప్రజా స్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ కుట్రను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన చోటా నాయకులతో నాపై విమర్శలు చేస్తున్నారని, ముందు మీరు నైతిక విలువలు పాటించి తర్వాత నీతులు చెబితే బాగుంటుందన్నారు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాలుగు సార్లు వాయిదా పడేవిధంగా అధికారులను ప్రభావితం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని విర్ర వీగిపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్కు పోటీ పడతారా? వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు -
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా పట్టించుకోరా?
● డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కన్నబాబు ప్రశ్న ● ప్రభుత్వ తీరు దుర్మార్గమని మండిపాటు పిఠాపురం: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టించుకోకపోతే ఎలాగని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రశ్నించారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేస్తున్న అరాచకాలకు నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా మంగళవారం చలో తునికి బయలుదేరారు. వారిని గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు టోల్ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి, ఆందోళన నిర్వహించారు. పోలీసులు, ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, తునిలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను పవన్ కల్యాణ్ ఖండించాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్న తునిలో ఇంతటి దారుణాలు జరుగుతూంటే ఇక రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఎవ్వరూ ఎప్పుడూ తమ రాజకీయ జీవితంలో ఇటువంటి దారుణ ఘటనలను చూడలేదన్నారు. తునిలో కేవలం చిన్న వైస్ చైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ, కూటమి నేతలు యుద్ధ వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఒక్క కౌన్సిలర్ కూడా లేని తునిలో టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి, దౌర్జన్యంగా పదవి లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్క వైస్ చైర్మన్ ఎన్నిక కోసమే ఇంత దారుణాలకు తెగబడితే, ఇక రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతోందని ఆయన ప్రశ్నించారు. నిషేధాజ్ఞలు టీడీపీ వారికి వర్తించవా? వారికో న్యాయం, తమకొక న్యాయమా అని పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ నేతలంతా తునిలో మోహరించి ఉంటే పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్కే వెళ్లడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుస్తోందని దుయ్యబట్టారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే.. దానిని కూడా ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని ఆపారని, తరువాత వైఎస్సార్ సీపీ ఘన విజయం సొంతం చేసుకుందని గుర్తు చేశారు. కూటమి నేతల మాదిరిగా తామూ ప్రవర్తించి ఉంటే ఇతర పార్టీలకు చెందిన ఒక్క కౌన్సిలర్ అయినా కౌన్సిల్లో కూర్చోగలిగే వారా అని ప్రశ్నించారు. ‘మీరు తప్పు చేయకపోతే మమ్మల్ని ఆపాల్సిన అవసరం ఏముంది? ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలి’ అని కన్నబాబు ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ వంగా గీత, రామచంద్రపురం ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్తాబవుతున్న పాదగయ
పిఠాపురం: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 24న నిర్వహించనున్న అంకురార్పణతో ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. పాదగయ క్షేత్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు. మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వారం రోజుల పాటు ప్రతి నిత్యం ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. వీటికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పాదగయ పుష్కరిణిలో లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల పాత నీటిని తొలగించి, పుష్కరిణిని పూర్తిగా శుభ్రపరచి, అవసరమైన మరమ్మతులు చేసి, కొత్త నీటితో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కుక్కుటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఇలా.. ● పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఈ నెల 24వ తేదీ రాత్రి 8.32 గంటల సుముహూర్తానికి నిర్వహిస్తారు. ● 25వ తేదీన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు. ● 26న మహా శివరాత్రి పర్వదినం. ● 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నాకబలి, దండియాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, రథోత్సవం. ● 28వ తేదీన స్వామి వారి త్రిశూల స్నానం, తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం.పీఎం సూర్యఘర్పై అవగాహన కల్పించాలి కాకినాడ సిటీ: పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసమ్ యోజనపై కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకూ 671 మంది తమ ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. వ్యవసాయంలో సౌరశక్తిని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) యోజన ద్వారా రైతులకు సబ్సిడీపై సోలార్ పంపుల పంపిణీకి, పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లాలో అనువైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు పోలవరం ఎడమ కాలువను ఆనుకుని ఖాళీగా ఉన్న ప్రదేశాలపై సర్వే చేసి, నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్, పోలవరం ఎస్ఈ బి.ఏసుబాబు, డీఆర్డీఏ పీడీ ఎ.శ్రీనివాసరావు, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. సాంకేతిక నైపుణ్యం మెరుగుపరచుకోవాలి సామర్లకోట: సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు సాంకేతిక నైపుణ్యం మెరుగుపరచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇ.కృష్ణమోహన్ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లో ఎంపిక చేసిన 40 మంది సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నిక్స్(ఐసీటీ)పై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో మూడు రోజుల శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి జిల్లా నుంచీ నలుగురు డిజిటల్ అసిస్టెంట్లకు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ పీఆర్) ప్రొఫెసర్లు ఈ శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. డిజిటల్ టూల్స్పై నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. ఎన్ఐఆర్డీ పీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ రవిబాబు మాట్లాడుతూ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్పై డిజిటల్ అసిస్టెంట్లు పట్టు సాధించేలా శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణలోని ముఖ్యాంశాలను ఎన్ఐఆర్డీ పీఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు వివరించారు. -
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు
● బలం లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం దౌర్జన్యాలు ● మళ్లీ తుని నుంచే టీడీపీ పతనం ప్రారంభం ● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తుని: ప్రశాంతకు రోల్మోడల్గా ఉండే తునిని అల్లర్లు, దౌర్జన్యాలు, అక్రమ కేసులకు నిలయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిల్లో బలం లేని టీడీపీ.. వైస్ చైర్మన్ పదవి కోసం దౌర్జన్యాలకు పాల్పడటం హేయమని అన్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను తుని పోలీసులు, అధికారులు పాటించలేదని దుయ్యబట్టారు. తునిలో యనమల రామకృష్ణుడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. వైఎస్సార్ సీపీకి పూర్తి స్థాయి బలం ఉన్నా ఎన్నిక జరగకుండా వాయిదా వేయడం కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను ఓటింగ్కు రమ్మని డీఎస్పీ, అధికారులు చెప్పి తీసుకువెళ్లి, టీడీపీ రౌడీలతో కిడ్నాప్ చేయించాలని చూశారని, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని మహిళా కౌన్సిలర్లు పరుగులు తీసిన దృశ్యాలు మీడియాలో లైవ్లో కనిపించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇటువంటి ఘోరాలు చేయించడం పరిపాటి అని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2016లో కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లు, రైలు దహనం ఘటనలో తనపై 16 అక్రమ కేసులు పెట్టించారని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రభావాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ పతనం తుని నుంచి ప్రారంభమవుతుందని దాడిశెట్టి రాజా చెప్పారు. పాలకుడు సరైనవాడు కాకపోతే అరాచకం రాజ్యమేలుతుందని, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. టీడీపీ రౌడీ మూకల నుంచి సహచర కౌన్సిలర్లను రక్షించేందుకు అశ్రయం ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి పైన, తన పైన పోలీసులు కేసులు పెట్టారని చెప్పారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే పోలీసులను ఎందుకు విమర్శిస్తామని రాజా అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీల్ పాల్గొన్నారు. -
తునిలో గూండాగిరీ
టీడీపీ ‘అధికార’ దుర్వినియోగం గత మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణతో 30కి 30 కౌన్సిలర్ స్థానాలనూ వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోని టీడీపీ.. ప్రస్తుతం తునిలో అరాచకాలకు పాల్పడుతోంది. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినా ఎన్నిక ప్రశాంతంగా జరిపించలేక చేతులెత్తేయడం విచిత్రం. ఈ ఎన్నిక సందర్భంగా టీడీపీ అధికార దుర్వినియోగం తునిలో అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రజాస్వామ్యంపై తుని పట్టణంలో కొద్ది రోజులుగా క్రూర పరిహాసం జరుగుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేని స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న టీడీపీ.. ఆ పురపాలికలో చిన్నపాటి ‘ఏలిక’ పదవి కోసం అడ్డమైన దారులూ తొక్కుతోంది. ప్రజాస్వామిక విలువలను, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనలను అడ్డగోలుగా కాలరాసి.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గూండాగిరీకి తెగబడుతోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లపై దాడులకు దిగుతూ, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా మున్సిపాలిటీలో తిష్ట వేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నాలు సాగిస్తోంది. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అధికార మదానికి తల వంచి, చేష్టలుడిగి చూస్తూండటం ప్రజాస్వామిక వాదులను నివ్వెరపరుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: తునిలో తెలుగుదేశం పార్టీ గుండాగిరీ రాజ్యమేలుతోంది. పోలీసు సహా అధికార వ్యవస్థలన్నీ ఆ పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ, వారు చెప్పినట్టే నడుచుకుంటున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతలు తమ చెప్పుచేతల్లో ఉంచుకుని, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో టీడీపీ అరాచకవాదులు మంగళవారం మరోసారి దౌర్జన్యకాండకు తెగబడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగోసారి కూడా వాయిదా వేయించారు. కౌన్సిలర్లపై మూకుమ్మడి దాడి తుని మున్సిపల్ కౌన్సిల్ వేదికగా జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా డ్రామాను రక్తి కట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పోలీసు రక్షణ బాధ్యతలను జిల్లా అదనపు ఎస్పీ ఎంవీజే భాస్కరరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ మనీష్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజుకు అప్పజెప్పారు. తద్వారా కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనేలా రక్షణ కల్పిస్తామని జిల్లా యంత్రాంగం చెప్పింది. ఆ భరోసాతో కౌన్సిల్ హాలుకు ఓటింగ్కు బయలుదేరిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై టీడీపీ శ్రేణులు తమ కుట్రలో భాగంగా మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీనికి పోలీసులు కూడా సహకరించారనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాలుకు 200 మీటర్ల దూరాన పోస్టాఫీసు వీధిలో ఉన్న పిఠాపురం డాక్టర్ ఆస్పత్రి దాటి ముందుకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ, టీడీపీ శ్రేణులను మాత్రం కౌన్సిల్ హాలు దగ్గర వరకూ అనుమతించి, ‘పచ్చ’పాత ధోరణి చూపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి మరీ ‘పచ్చ’ గూండాలు.. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల పైకి దూసుకుపోతున్నా పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నిలువరించిన దాఖలాలు కనిపించ లేదు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పిస్తామన్న జిల్లా యంత్రాంగం మాటలు చివరకు గాలిలో కలసిపోయాయి. ‘చలో తుని’ అడ్డగింపు తునిలో అధికార టీడీపీ అరాచకాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇచ్చిన ‘చలో తుని’ పిలుపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు భారీ సంఖ్యలో తుని తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నేతలకు 41 నోటీసులు జారీ చేసి, తెల్లారేసరికి హౌస్ అరెస్టులు చేశారు. నియోజకవర్గాల నుంచి తుని బయలుదేరిన నేతలను మార్గం మధ్యలో అడ్డుకున్నారు. ● గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ నాయకులు అల్లి రాజబాబు, సుంకర విద్యాసాగర్, రావూరి వెంకటేశ్వరరావు, జమ్మలమడక నాగమణి తదితర నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ● జగ్గంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట ఇన్చార్జి తోట నరసింహం, యువ నాయకుడు తోట రాంజీ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను తుని రైల్వే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ● మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులను తుని రైల్వే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తదితరులను సామర్లకోటలో పోలీసులు అడ్డగించారు. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి, నిరసన తెలిపారు. ● రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త జక్కంపూడి గణేష్లను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. రాజాను హౌస్ అరెస్టు చేశారనే సమాచారంతో మాజీ మంత్రి, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు ఆయన ఇంటికి వెళ్లగా వారిని పోలీసులు అక్కడే నిర్బంధించారు. ● రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును రావులపాలెం వద్ద, పి గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును అయినవిల్లిలోను హౌస్ అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యంపై క్రూర పరిహాసం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మరోసారి అడ్డుకున్న టీడీపీ పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయిన ‘పచ్చ’ గూండాలు కౌన్సిలర్లపై దాడికి యత్నం భయంతో పరుగు తీసిన కౌన్సిలర్లు కోరం లేక నాలుగోసారీ ఎన్నిక వాయిదా -
జేఎన్టీయూకే వీసీగా ప్రసాద్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే ఆరో ఉప కులపతిగా ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి వీసీగా అల్లం అప్పారావు, రెండో వీసీగా తులసీరామ్దాస్, మూడో వీసీగా వీఎస్ఎస్ కుమార్, నాలుగో వీసీగా రామలింగరాజు సేవలందించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రొఫెసర్ ప్రసాదరాజును ఐదో వీసీగా నియమించారు. మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆయనను తప్పించి, ఇన్చార్జి వీసీగా ఆచార్య మురళీకృష్ణను కూటమి ప్రభుత్వం నియమించింది. రెగ్యులర్ వీసీల నియామకంలో భాగంగా ఎన్ఐటీ వరంగల్లో సివిల్ ప్రొఫెసర్గా ఉన్న సీఎస్ఆర్కే ప్రసాద్ను నియమించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన అమర్తలూరులో పదో తరగతి, తెనాలిలో ఇంటర్మీడియెట్, ఎన్ఐటీ వరంగల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇప్పటి వరకూ ఎనిమిది మందికి పీహెడ్డీ గైడ్గా వ్యవహరించారు. -
తెలుగులో తొమ్మిది సూత్రాలు
తెలుగులో అవగాహన– ప్రతి స్పందనపై నాలుగు ప్రశ్నల ద్వారా 32 మార్కులు సాధించవచ్చు. వ్యక్తీకరణ – సృజనాత్మకత నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు, ఎనిమిది మార్కుల ప్రశ్నలు మూడు వస్తాయి. వీటి ద్వారా 36 మార్కులు పొందవచ్చు. ప్రధానంగా పద్యభాగంలో కవి పరిచయాలు, గద్యభాగంలో ప్రక్రియలు, రామాయణంలో పాత్రలు చదవడం ద్వారా 12 మార్కులు సాధించవచ్చు. 8వ ప్రశ్నగా కేవలం పద్యభాగ సారాంశాలు, 9వ ప్రశ్నగా రామాయణం, 10వ ప్రశ్నగా సృజనాత్మకత (లేఖ, కరపత్రం) ద్వారా 24 మార్కులు పొందవచ్చు. 32 మార్కులను కేవలం పాఠ్య పుస్తకం వెనుక ఉన్న అభ్యాసాల ద్వారా సాధించవచ్చు. అవగాహన ప్రతిస్పందన నుంచి పరిచిత పద్యం ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలు మాత్రమే ఇస్తారు. – జి.ప్రభావతి, పాఠ్య పుస్తక రచయిత్రి, జెడ్పీహెచ్ఎస్, సఖినేటిపల్లిలంక బయాలజీలో ఈజీగా.. మారిన సిలబస్ను అనుసరించి బయాలజీ ప్రశ్న పత్రం 50 మార్కులకు 17 ప్రశ్నలతో ఉంటుంది. జవాబులు రాసే ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. సెక్షన్–4లో ప్రయోగాలపై 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. అందువల్ల జీవక్రియలు పాఠంపై అవగాహన అవసరం. అనువంశికత పాఠం నుంచి 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఈ రెండు పాఠ్యాంశాలు బాగా చదివితే 16 మార్కులు తప్పనిసరిగా పొందవచ్చు. సెక్షన్–3లో ఒక డయాగ్రామ్ వస్తుంది. ప్రత్యుత్పత్తి పాఠం నుంచి ఒక డయాగ్రామ్ తప్పనిసరిగా వస్తుంది. –మేకా రామలక్ష్మి, డీసీఈబీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, మండపేట -
జనసేన నేతలపై చార్జిషీటు నమోదు చేయని పోలీసులు
నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబం కరప: ఫీల్డు అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి నాలుగు నెలలైనా ఇంతవరకు బాధ్యులైన జనసేన పార్టీ నాయకులు ముగ్గురిపై చార్జిషీటు నమోదు చేయక పోవడంపై కరప మండలం పెనుగుదురు ఫీల్డుఅసిస్టెంట్ పులపకూర సునీత భర్త వీరబాబు సోమవారం ప్రకటనలో నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు బండారు మురళి (మండల జనసేన పార్టీ అధ్యక్షుడు), ఘంటా నానిబాబు, వీరమహిళ గుబ్బలవీరవెంకటభవానీల వేధింపులు భరించలేక ఫీల్డు అసిస్టెంట్ సునీత గతేడాది అక్టోబర్ నెలలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం పాఠకులకు విదితమే. కాగా అధికారపార్టీ నాయకులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఫీల్డు అసిస్టెంట్ భర్త వీరబాబు ఆరోపించారు. కరప పోలీసులు గతేడాది అక్టోబరు నెల 28వ తేదీన ముగ్గురు జనసేన నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. కాకినాడ డీఎస్పీ తన భార్య ఫీల్డుఅసిస్టెంట్ సునీత వాంగ్మూలాన్ని రికార్డు చేశారన్నారు. జరిగిన విషయాన్ని జడ్జి ఎదుట కూడా చెప్పామన్నారు. విచారణలో భాగంగా డీఎస్పీ మండల ఎస్సీ నాయకుల వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారన్నారు. ఎస్పీ కలుగచేసుకుని పెనగుదురు జనసేన పార్టీ నాయకులు ముగ్గురిపైన చార్జిషీటు దాఖలు చేయాలని కోరారు. మహిళలకు భద్రత కరవు తుని: సీఎం చందబాబు ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరవైందని తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిల్ హాలుకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంపై కలత చెందిన సుధారాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి ప్రజలు పూర్తి స్థాయి విజయాన్ని అందించారని, ఒక్క సీటు లేని టీడీపీ వైస్ చైర్మన్ కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. రెండు గంటల పాటు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదని, కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. మంగళవారం జరపనున్న ఎన్నికలో 17 మంది కౌన్సిల్ సభ్యులతో ఓటు వేయాలంటే జిల్లా ఎస్పీ, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చి తీసుకువెళితే వెళతామని లేకపోతే వెళ్లబోమని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పచ్చపాతం చూపడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్లో సోమవారం పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాకినాడ పట్టణానికి చెందిన మందపల్లి శ్రీదేవి వైఎస్సార్ ఫ్లై ఓవర్ విస్తరణలో భాగంగా తమ స్థలాలు పోయాయని భావించిన ప్రభుత్వం పక్కనే ఉన్న శ్మశాన భూమి, మరుగుదొడ్డిని పట్టాలుగా ఇచ్చిందని, ఆ భూమి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా స్థలంపై ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని, ఇప్పుడు పోలీసులతో వచ్చి ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. తమ కుటుంబాన్ని కాపాడాలని, లేదంటే కుటుంబం మొత్తం చనిపోయే పరిస్థితి ఉందని ఓ వినతి పత్రంలో పేర్కొన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమటూ ఆమె పురుగుల మందు తాగారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీ
సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల అనంతరం జరగనున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం తలమునకలైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా, డీఆర్ఓలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. తేలిన లెక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా రూపొందించి ఎన్నికల సంఘానికి పంపింది. ఎట్టకేలకు ఎన్నికలకు ఓటర్ల లెక్క తేల్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,97,945 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. పురుషులు 1,15,938, మహిళలు 82,033, ఇతరులు 10 ఉన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 285 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,97,945 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీ నిర్వహిస్తారు. అదే రోజు విజేతను ప్రకటిస్తారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ప్రచార వ్యయంపై నిఘా పెట్టారు. ఇప్పటికే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్, జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు చేశారు. పట్టభద్ర ఓటర్లకు అర్హతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటు లిస్టులో ఉంటే సరిపోదు. అర్హత పత్రం కలిగుండాలి. ఓటరు ఐడీ కార్డు, పాన్కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ అర్హతా సర్టిఫికెట్లు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారి హోదాతో జారీ చేసే కార్డులు ఉండాలి. బీఎల్ఓలు ఇంటింటా పర్యటించి ఓటరు స్లిప్పులు అందజేస్తారు. స్లిప్లు కేవలం ఎంట్రీకి ఉపయోగపడతాయి. ఓటరు తన అర్హత పత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఇందుకు గాను ఫారం–12ను జిల్లా రిటర్నింగ్ అధికారికి ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించాల్సి ఉంది. ఫారంతో పాటు డ్యూటీ కేటాయింపులతో కూడిన ఉత్తర్వుల జిరాక్స్ కాపీలు జతపర్చాల్సి ఉంటుంది. 2 వేల మంది సిబ్బంది తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు ఆరు జిల్లాలకు 2 వేల మంది సిబ్బందిని నియమించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభధ్రుల నియోజవకర్గ పరిధిలో 3,14,984 మంది ఓటర్లు ఉన్నారు. 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 70 జోన్లు ఏర్పాటు చేసి.. 70 జోనల్ అధికారులను, 95 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 456 పోలింగ్ కేంద్రాల్లో ఒక పీఓ, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ విధుల్లో ఉంటారు. ఆరు జిల్లాలకు కలిపి 456 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 456 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 456 మంది మైక్రో అబ్జర్వర్లు, 456 మంది వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. వీరితోపాటు 20 మంది రిజర్వ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. 26న పోలింగ్ సామగ్రి తరలింపు 26వ తేదీన ఉదయం పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. ఆయా జిల్లాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో 25వ తేదీ రాత్రికే ఏర్పాట్లు చేయనున్నారు. 25న ప్రచారానికి తెర పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రచారాన్ని ఆపేయాలి. బరిలో 35 మంది అభ్యర్థులు పట్టబద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా కూటమి, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య పోటీ నెలకొంది. మిగిలిన వారు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. తేలిన ఓటర్ల లెక్క ఉమ్మడి ‘తూర్పు’లో 1,97,945 మంది ఓటర్లు ఈ నెల 27న పోలింగ్ 285 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లలో అధికారుల తలమునకలు ఉమ్మడి తూర్పులో ఓటర్ల వివరాలు.. జిల్లా పోలింగ్ కేంద్రాలు పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం తూర్పుగోదావరి 92 36,361 26,606 3 62,970 కాకినాడ 98 42,463 28,072 5 70,504 కోనసీమ 95 37,114 27,355 2 64,471 -
ప్రతిభ చూపిన విద్యార్థికి అభినందన
కాకినాడ సిటీ: న్యూఢిల్లీలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ వ్యాకో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో 14 సంవత్సరాల విభాగంలో బంగారు పతకం సాధించిన కరప మండలం అరట్లకట్ట గ్రామానికి చెందిన యాళ్ల సురేష్కుమార్ను కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పట్టుదలతో కృషి చేయాలని ఆయన సూచించారు. న్యూఢిల్లీలో ఫోర్త్ వ్యాకో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ కేడి జాదేవ్ ఇండోర్ స్టేడియంలో లైట్, లైట్ కాంటాక్ట్ విభాగంలో ఏడో తరగతి చదువుతున్న సురేష్కుమార్కు క్రియేటివ్ పోలో గోల్డ్ మెడల్, లైట్ కాంటాక్ట్ విభాగంలో రెండు, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సురేష్కుమార్ చదువుతోపాటు ఆటలను కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలన్నారు. సురేష్కుమార్కు రూ.10,000 నగదు బహూకరించేందుకు సంసిద్ధతను తెలియజేశారు. సురేష్కుమార్ తండ్రి అంజిబాబును కూడా కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. -
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని ధర్నా
కాకినాడ సిటీ: అంగన్వాడీ వర్కర్ల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కాకినాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం.రమణ మ్మ, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నీరజ, జ్యోతి, రాజేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంలో చొరవ చూపించాలని, తక్షణమే గ్రాట్యూటీ అమలు చేయాలని, పెరిగి ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఏళ్ల తరబడి మినీ సెంటర్లలో మెయిన్ సెంటర్లుగా మార్చా లని పోరాటం చేస్తున్నా అమలు చేయడంలేదన్నారు. మెనూ చార్జీలను పెంచి ఇవ్వాలన్నారు. నేడు రాష్ట్ర ప్ర భుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని, గత ప్రభుత్వ హయాంలో రాసుకున్న మిని ట్స్ అంగీకరించిన అంశాలను అమలు చేయాలని డి మాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధపడుతున్నామన్నారు. ధర్నా అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఏ జ్యోతికి విన తి పత్రం అందజేశారు. రమ, విజయ, మున్ని, సరోజ, కనకదుర్గ, మేరీ రత్నం, సత్యవతి పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని ధర్నా చేస్తున్న అంగన్వాడీలు -
వాయిదా మంత్రం
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025కూటమి కుతంత్రంసాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. లేని అధికారం కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలుచేసి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం కాలరాస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి కరెన్సీ కట్టలు, అధికార బలాన్ని వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై న తుని మున్సిపల్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. జంటిల్మెన్ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన మున్సిపల్ వైస్చైర్పర్సన్–2 పీఠాన్ని పోలీసులను కీలుబొమ్మలుగా మార్చి రౌడీలు, సంఘవ్యతిరేక శక్తులను వెంటేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలంతా కట్టకట్టుకుని ఎగరేసుకుపోదామని వేసిన ఎత్తులకు పై ఎత్తులను ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చేసేది లేక చివరకు అధికారబలంతో ఈ నెల 3, 4 తేదీలలో జరగాల్సిన ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు. ఇలా రెండు పర్యాయాలు టీడీపీ నేతల కుట్రలు బెడిసికొట్టడంతో మూడోసారి సోమవారం వ్యూహాలకు పదునుపెట్టి వైస్చైర్పర్సన్ పీఠంపై పాగా వేద్దామని గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి అక్రమ మార్గంలో వైఎస్సార్ సీసీ నుంచి 10 మంది కౌన్సిలర్లకు టీడీపీ కండువాలు కప్పి నిస్సిగ్గుగా కౌన్సిల్ హాలులో సమావేశపరిచారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని టీడీపీ నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనుకున్న తెలుగు తమ్ముళ్ల కుట్రలకు రాజా పక్కా వ్యూహంతో మూడోసారి కూడా చెక్ పెట్టారు. టీడీపీ కుట్రలను దీటుగా స్పందన అడ్డదారిలో తెచ్చుకున్న పది మంది కౌన్సిలర్లను కౌన్సిల్ హాలులో సమావేశపరిచి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్ సీపీ వెన్నంటి నిలిచిన నలుగురు కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువచ్చి కోరం చూపించి వైస్ చైర్పర్సన్ పోస్టు కొట్టేద్దామని పెద్ద ప్లానే వేశారు. రాజకీయంగా పరిణతి చెందిన రాజా టీడీపీ వ్యూహాలను పసిగట్టి గట్టి ఎదురుదెబ్బ కొట్టడంలో ఆ పార్టీ పాచిక పారలేదు. తొలి నుంచి వైఎస్సార్ సీపీ వెంట ఉన్న18 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేసైనా కౌన్సిల్లో కోరం సాధించి వైస్ చైర్పర్సన్ పీఠాన్ని తన్నుకుపోవాలని టీడీపీ కుట్ర చేసింది. ఇందులో భాగమే మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి భర్త, కో–ఆప్షన్ సభ్యుడు బాబు సహా పార్టీ నేతలను పోలీసుల బలప్రయోగంతో గృహనిర్బంధం చేశారు. ఈ దురాఘతాలతో కూటమి ప్రభుత్వం తునిలో ఒక రకంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. చివరకు మున్సిపల్ చైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సహా పలువురు నేతలపై టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ తదితరులతో దౌర్జన్యాలకు కూడా పురిగొల్పింది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు కౌన్సిల్కు వెళ్లకుండా దీటుగా స్పందించడంతో తెలుగు తమ్ముళ్లు తోక ముడిచారు. రౌడీ మూకలతో నింపేసిన కౌన్సిల్హాలులో భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం, కోర్టు చెప్పినట్టు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందనే నమ్మకం లేక కౌన్సిలర్లు ఎవరూ వెళ్ల లేదు. తునిలో టీడీపీ జరుపుతోన్న అరాచకాలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు రక్షణ కల్పిస్తేనే మంగళవారం జరిపే ఎన్నికకు రాగలుగుతామని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జిల్లా యంత్రాంగానికి అల్టిమేటమ్ ఇచ్చారు. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి ‘చలో తుని’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజా మద్ధతుతో తునిలో అధికారపార్టీ నేతల ఆగడాలు, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న తీరును ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు చలో తునికి సమాయత్తమవుతున్నాయి. వైస్ చైర్పర్సన్ అందునా జంటిల్మెన్ ఒప్పందంలో రెండున్నరేళ్ల కాలానికి రెండో వైస్ చైర్పర్సన్ పోస్టు నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీదే. ఆ పోస్టు కోసం అధికారపార్టీ నేతలు ఇన్ని రోజులుగా ఇన్ని కుప్పిగంతులు వేయాలా అని విజ్ఞులు ఆక్షేపిస్తున్నారు. ఒకప్పుడులో టీడీపీలో నంబర్–2గా వెలిగిన యనమల రామకృష్ణుడు ఇలాకాలో ఆయన కనుసన్నల్లోనే ఇన్ని రోజులుగా కుట్ర రాజకీయం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్, పీఏసీ చైర్మన్, ఆర్థిక మంత్రి వంటి పదవులు అలంకరించిన యనమల వైస్ చైర్పర్సన్ పోస్టు కోసం ప్రజలు ఒక్క సీటు కూడా కౌన్సిల్లో ఇవ్వకుండా తిరస్కరించినా ఇంతలా దిగజారిపోవాలా అని తుని జనం ఆక్షేపిస్తున్నారు. ఎన్నిక పర్యవేక్షించేందుకు జేసీ రాహూల్మీనాను కలెక్టర్ షన్మోహన్ సగిలి నియమించారు. ఎన్నికల అధికారిగా డీపీఓను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కోరం లేక పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని కలెక్టర్ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో కౌన్సిలర్లు ఎవరైనా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వైస్ చైర్పర్సన్ పీఠం కోసం దిగజారుడు లేని అధికారం కోసం ప్రలోభాలు టీడీపీ దౌర్జన్య రాజకీయాలు యనమల ఇలాకాలో అడ్డూ అదుపూ లేని అరాచకాలు నేడు ‘చలో తుని’ వైఎస్సార్ సీపీ పిలుపు ఉమ్మడి తూర్పున శ్రేణులు సమాయత్తం కోరం లేక నేటికి వాయిదా : కలెక్టర్ ఎన్నిక పర్యవేక్షకుడిగా జేసీ మీనా న్యాయం అడిగితే ఎదురు కేసులు – మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై కేసు తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలను నిలదీసినందుకు వైఎస్సార్ సీపీ నేతలపై ఎదురు కేసులు పెట్టారు. మూడు పర్యాయాలు అన్యాయంగా వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగకుండా శాంతి భద్రతల సమస్యను సృష్టించిన కూటమి పెద్దలను వెనకేసుకొస్తూ పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, అసాంఘిక శక్తులు దాడి చేస్తాయనే భయంతో మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి ఇంటి వద్దే ఉన్న కౌన్సిలర్లకు ధైర్యం చెప్పేందుకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెళ్లారు. తుని పట్టణ పోలీసులు మాత్రం ఇందుకు విరుద్ధంగా కౌన్సిలర్లను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై ఒక కేసు, పోలిశెట్టి రామలింగేశ్వరావుపై దాడిచేశారంటూ మరో కేసు నమోదు చేయడం గమనార్హం. అధికార పార్టీ అండతో తుని టౌన్ సీఐ ఎం.గీతారామకృష్ణ వ్యవహరించిన తీరును వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు. -
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది భక్తులు ● రూ.30 లక్షల ఆదాయం ● ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి, అమ్మవారు అన్నవరం: వివాహాల సీజన్ సందర్భంగా నవ దంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం రద్దీ నెలకొంది. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలకు వివిధ ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు కూడా సత్యదేవుని సన్నిధికి తరలివచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో రద్దీ పెరిగింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులను దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,500 నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు. ముత్తంగి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాలతో చేసిన కవచాల (ముత్తంగి) అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరుడు భక్తులకు కనువిందు చేశారు. -
సర్వేలపై మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ
కాకినాడ సిటీ: జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల సచివాలయాల పరిధిలో ఆరు సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఆదేశించారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్ ఇన్ హౌస్హోల్డ్స్, జియో ట్యాగింగ్, నాన్ రెసిడెన్సీ ఇన్ ఏపీ, చిల్ట్రన్స్ విత్ పుట్ ఆధార్, డెట్ఆడిట్ ఇలా పలు సర్వేలను పూర్తి చేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజలో ఉందన్నారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు తదితర మున్సిపాలిటీలు వెనుకబడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ కమిషనర్ భావన సూచనలతో ఆయా మున్సిపాలిటీ పరిధిలోని కమిషనర్లు, నోడల్ అధికారులు, సచివాలయాల సిబ్బందికి శిక్షణను కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్యాలయంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ నిర్వహించారు. సర్వేలను సకాలంలో పూర్తి చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేలను సకాలంలో పూర్తి చేయగలిగితేనే ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయవచ్చన్నారు. టీపీఆర్వో శైలజ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. అనుమతి తీసుకొని కవర్ చేయండి కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో బర్డ్ప్లూ బారిన పడిన కోళ్ల ఫారాలకు సంబంధించిన వార్తల కవర్ చేసే నిమిత్తం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొంతమంది మీడియా వారు వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం తెలిపారు. మీడియా వారు బర్డ్స్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ వార్తులు కవర్ చేయడానికి వెళ్లాలనుకుంటే పశుసంవర్థకశాఖ అధికారులు, సమాచారశాఖ అధికారులు అనుమతి తీసుకుని సూచనలు, జాగ్రత్తలు తీసుకొని వార్తల కవర్ చేయడానికి వెళ్లాలని, జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లినట్లయితే మిగిలిన కోళ్లకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. -
రూ.300 లంచం.. ముగ్గురి సస్పెన్షన్
కాకినాడ క్రైం: రోగి నుంచి రూ.300 లంచం తీసుకున్న నేరంలో ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి చర్యలు తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల కిందట ఓ మహిళ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (ట్యూబెక్టమీ) కోసం కాకినాడ జీజీహెచ్లో చేరింది. ఈ నెల 15న ఆమెకు ఆసుపత్రిలోని ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్లో ట్యూబెక్టమీ నిర్వహించారు. శస్త్రచికిత్స చేయడానికి ముందు ఆమెను చికిత్సకు సిద్ధం చేసేందుకు అక్కడ పనిచేస్తున్న రెగ్యులర్ ఎఫ్ఎన్ఓ మోర్తా వీరలక్ష్మి, కాంట్రాక్టు బేసిక్ ఎంఎన్ఓ సీహెచ్ రవితేజలు రూ.300 ఇవ్వాలని డిమాండ్ చేయగా, వారికి పారిశుధ్య కార్మికురాలు మంగ సహకరించింది. శస్త్రచికిత్స ఒత్తిడిలో ఉన్న కుటుంబీకులు డబ్బులు తర్వాత ఇస్తామన్నా కనికరించలేదు. ఇస్తేనే సర్జరీకి సిద్ధం చేస్తామంటూ తేల్చి చెప్పారు. వారి ఒత్తిడితో అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వక తప్పలేదు. రూ.300 అందిన తర్వాతే శస్త్రచికిత్సకు సిద్ధం చేయించి ఆపరేషన్ థియేటర్లోకి పంపారు. వీరి నిర్వాకంతో మహిళ కుటుంబం ఎంతో ఆవేదన చెందింది. శస్త్రచికిత్స అనంతరం శనివారం మధ్యాహ్నం మహిళ కుటుంబ సభ్యులు జీజీహెచ్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిప్యూటీ కలెక్టర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ బృందం ఫ్యామిలీ ప్లానింగ్ విభాగానికి వెళ్లి విచారణ చేపట్టింది. బాధితులతో పాటు మరికొందరు వీరు డబ్బులు డిమాండ్ చేయడం, శస్త్రచికిత్సకు ఆటంకం కలిగేలా రోగులను ఇబ్బందులకు గురి చేయడం నిజమేనని చెప్పారు. సాక్ష్యంగా రోగుల అటెండర్లు ఇందుకు సంబంధించిన వీడియో రికార్డింగ్లను అధికారులకు అందజేశారు. పకడ్బందీ ఆధారాల నేపథ్యంలో చర్యలు అనివార్యమయ్యారు. ఈ విచారణలో వెలుగుచూసిన అంశాలను డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారికి నివేదించారు. విచారణలోని వాస్తవాల ఆధారంగా లంచం తీసుకున్న మోర్తా వీరలక్ష్మి, సీహెచ్ రవితేజ, మంగలను సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.ఫ కాకినాడ జీజీహెచ్లో ఘటన ఫ రోగి నుంచి లంచం తీసుకోవడంతో చర్యలు -
రెండు బైక్ల ఢీ
ఆలమూరు/ కడియం: మండలంలోని మడికి నుంచి దుళ్ల వెళ్లే రహదారిలో రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్లకు చెందిన గంటి రాజు (33), కుమారి దంపతులు తమ వ్యక్తిగత పనిపై కొత్తపేట మండలం మందపల్లి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. స్థానిక షణ్ముక నర్సరీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో మళ్లీ వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త రాజు మృతి చెందగా, భార్య కుమారి మృత్యువుతో పోరాడుతుంది. ఢీకొట్టిన బైక్ యజమానికి కూడా తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై అశోక్ తెలిపారు. నాన్న లేడని ఎలా చెప్పేది వివాహానికి వెళ్లి పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందగా, అతని భార్య కుమారి ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేశవరంలోని ఒక ప్రైవేటు కూల్ డ్రింక్ కంపెనీలో పనిచేస్తూ గంటి రాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, రెండేళ్ల కుమార్తె ఉంది. ఇంటి వద్ద పాపను వదిలి భార్యతో కలిసి రాజు మందపల్లిలో వివాహానికి శనివారం రాత్రి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఉన్న రెండేళ్ల చిన్నారికి నాన్న ఎక్కడని అడిగితే ఏమని చెప్పాలని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రి మృత్యువాత పడి, తల్లి ఆసుపత్రిలో ఉండడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. ఫ ఒకరి మృతి ఫ ఇద్దరికి తీవ్ర గాయాలు -
అడుగులేద్దామిలా..
ఇంగ్లిషు ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. గ్రామర్, ఒకాబ్యులరీపై అధికంగా సాధన చేయాలి. సెక్షన్–ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్, సెక్షన్–బీలో గ్రామర్ అండ్ ఒకాబ్యులరీ, సెక్షన్–సీలో క్రియేటివ్ రైటింగ్ ఉంటాయి. సెక్షన్–ఏలో 30 మార్కులకు 24 మార్కులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఆరు సాధారణ ప్రశ్నలుంటాయి. పేరాను బాగా చదివి అర్థం చేసుకుంటే కచ్చితంగా 24 మార్కులు స్కోర్ చేయవచ్చు. పాఠ్య పుస్తకాల చివర ఇచ్చే గ్రామర్ను బాగా చదివితే 25 మార్కులు ఈజీగా సాధించవచ్చు. క్రియేటివ్ రైటింగ్లో లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, స్పీచ్, డైరీ ఎంట్రీ, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్రశ్నలు, పేరాగ్రాఫ్ రైటింగ్ ప్రశ్నలకు బాగా సాధన చేయాలి. కొత్త సిలబస్తో పాటు, నూతన విధానంలో ప్రశ్నపత్రం ఇస్తారు. నౌన్ మోడిఫయర్స్ కొత్తగా ప్రవేశపెట్టారు. – ఆర్.వెంకటేశ్వరరావు, జెడ్పీ హెచ్ఎస్, భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం గణితానికి ఓ లెక్కుంది గణిత భావనలు బాగా అవగాహన చేసుకుని సూత్రాలపై పట్టు సాధిస్తే గణితమంత సులువైన సబ్జెక్టు మరొకటి ఉండదు. 1, 3, 7, 13, 14 అధ్యాయాలను బాగా అధ్యయనం చేస్తే ప్రతి విద్యార్థి కచ్చితంగా 60 మార్కులు పొందే వీలుంది. ఈ ఐదు చాప్టర్లు గణితంలో పంచరత్నాలుగా భావించాలి. ఈ చాప్టర్ల నుంచే సులభమైన 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు మిగిలిన అధ్యాయాల్లో 1, 2, 4 మార్కుల ప్రశ్నలపై పట్టు సాధిస్తే 100 మార్కులు సులభంగా స్కోర్ చేయవచ్చు. –టీఎస్వీఎస్ సూర్యనారాయణమూర్తి (గణితావధాని), జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, అమలాపురం -
పదిలం.. విజయం
రాయవరం: పాఠశాల స్థాయిలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యాభ్యాసం సాగించిన విద్యార్థి తొలిసారి ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలు పదో తరగతిలోనే. విద్యార్థుల భవితకు తొలిమెట్టు ఇదే. అలాంటి పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో ఎలా ప్రిపేర్ కావాలో నిపుణుల సూచనలు ఇలా.. రాజభాషలో.. ద్వితీయ భాష హిందీ పరీక్ష పత్రం 6 విభాగాలుగా ఉంటుంది. ఆ విభాగాల నుంచి 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొదటి భాగం నుంచి 12 మార్కులకు పాఠ్య పుస్తకంలోని వ్యాకరణ అంశాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. భాగం–2లో కాంప్రహెన్షన్ నుంచి 4 పేరాగ్రాఫ్లు ఇచ్చి ఒక్కో పేరాగ్రాఫ్కు 5 మార్కుల చొప్పున 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పేరాగ్రాఫ్లను చదివి బాగా అర్థం చేసుకుని రాయాలి. భాగం–3లో కవి, రచయితల గురించి బాగా చదివి అవగాహన పెంచుకుంటే 10 మార్కులు పొందవచ్చు. 19వ ప్రశ్నగా ‘దోహా’ మొదటి పాఠం నాలుగు పద్యాల్లో ఒకటి ఇస్తారు. లేఖలో చుట్టీ పత్ర్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. – తాహెర్ పాషా, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్ఎస్ (బాలికలు), రాజోలు భౌతికశాస్త్రం.. భయం వద్దు ఫిజిక్స్లో మొత్తం 8 పాఠ్యాంశాల్లో నాలుగు ఫిజిక్స్, నాలుగు కెమిస్ట్రీ పాఠ్యాంశాలున్నాయి. రెండు విభాగాల నుంచి 39 చొప్పున ఛాయిస్తో 78 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. కాంతి, ఆమ్లాలు–క్షారాలు పాఠాల నుంచి రెండు పటాలు వస్తాయి. నాలుగు మార్కులు స్కోర్ చేయవచ్చు. లోహాలు – అలోహాలు పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రయోగం వస్తుంది. విద్యుత్ పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. –అడబాల వీఎల్ నరసింహారావు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, జెడ్పీహెచ్ఎస్, చింతల్లంక, అయినవిల్లి మండలం చరిత్రలో సమాచార విశ్లేషణ ముఖ్యం నూతన విధానంలో పటాలకు 15 మార్కుల వెయిటేజీ ఉంటుంది. చరిత్ర నుంచి ఒకటి, రెండు పాఠ్యాంశాల్లోని పటాలు, భూగోళం నుంచి 6, 7 పాఠ్యాంశాల్లోని పటాలు చదవాలి. పటాల గుర్తింపు విషయంలో చరిత్రలో 3, 5, భూగోళంలో 1, 6, పౌరశాస్త్రంలో 4, 5, అర్థశాస్త్రంలో 3వ పాఠం అత్యంత ప్రధానమైనవి. 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే భూగోళంలో మూడు నాలుగు పాఠాల్లో విషయ అవగాహన కింద వస్తాయి. చరిత్రలో 2, 5 పాఠ్యాంశాల నుంచి అకడమిక్ స్టాండర్డ్–2 కింద ప్రశ్నలు ఇస్తారు. పౌరశాస్త్రంలో ప్రజాస్వామ్యం పాఠ్యాంశం నుంచి సమకాలీన అంశాల్లో ప్రతిస్పందన (అకడమిక్ స్టాండర్డ్–4) అనే అంశంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అర్థశాస్త్రంలో పట్టికలు, గ్రాఫ్లపై విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. పరీక్షలలో భారతదేశం మరియు ప్రపంచ పటం రెండు అవుట్లైన్ మ్యాప్లను తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది. – కేఎస్వీ కృష్ణారెడ్డి, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్ఎస్, ఈతకోట, రావులపాలెం మండలంఫ ప్రణాళికతో చదివితే మంచి మార్కులు ఫ విద్యార్థులకు సబ్జెక్టు నిపుణుల సూచనలు -
ఉల్లాసంగా ఆలిండియా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు మూడోరోజు సోమవారం ఉల్లాసంగా జరిగాయి. ఒడిశా సెక్టార్, హర్యానా మధ్య జరిగిన పోటీలో ఒడిశా 8–0 స్కోర్తో, ఉత్తరాఖండ్ సెక్టార్, ఢిల్లీ సెక్టార్ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ మ్యాచ్లో 4–0 స్కోర్ తేడాతో, బీహార్ సెక్టార్, తెలంగాణ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో బీహార్ సెక్టార్ 15–0 స్కోర్తో విజయం సాధించాయి. రాయల్ స్పోర్ట్స్ బోర్డు, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాయల్ జట్టులో ఆనంద రత్నకుమార్ 3, గోవింద్, గణేష్, సుమన్లు చెరో ఒక్కొక్క గోల్స్ వేసి జట్టును విజయ పథంలో నడిపించారు. బీహార్, తెలంగాణ మధ్య జరిగిన మ్యాచ్లో బీహార్ 15–0 స్కోర్తో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 2–0తో, కేరళ, ఏపీ మధ్య జరిగిన మ్యాచ్లో ఏపీ 11–0 స్కోర్తో గెలుపొందాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్, తెలంగాణ మధ్య జరిగిన పోటీలో తెలంగాణ 4–3 స్కోర్తో, కేరళ–ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 9–0, పుదుచ్చేరి–ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా 6–0 స్కోర్తో విజయం సాధించాయి. గోవా–మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర 18–0 స్కోర్తో, అహ్మదాబాద్–ఇండోర్ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 స్కోర్తో డ్రాగా ముగిసింది. సోమవారం నిర్వహించిన మ్యాచ్లను టోర్నమెంట్ కో–ఆర్డినేటర్, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు పర్యవేక్షించారు. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కొత్తపేట: ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాలపై సోమవారం ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు దాడులు చేశారు. కొంత కాలంగా పూతరేకులు తయారీలో నకిలీ నెయ్యి వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు జరిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్స్టెక్టర్లు గ్రామంలో పలు పూతరేకుల తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు రొక్కయ్య, సుబ్బారావు, ప్రసాద్, శ్రీకాంత్ చౌదరి టీమ్లు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆయా కేంద్రాలు, దుకాణాల్లో పూతరేకులు తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని, సీల్ ఫ్యాకెట్లను, ఇతర సరకులు, పరిసరాలు, పరిశుభ్రతను, షాపుల్లో పూతరేకులు, ఇతర తినుబండారాలను పరిశీలించారు. బ్రాండ్ నేమ్ లేబుల్ లేని నెయ్యి ప్యాకెట్లను గుర్తించారు. అలా ఒక తయారీ కేంద్రంలో 15 కిలోలు, మరో రెండు షాపుల్లో 142 కిలోల నెయ్యి ప్యాకెట్లు సీజ్ చేశారు. వీటికి సంబందించి 3 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 7 దుకాణాల్లో పూతరేకుల శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్ రిపోర్టులను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేని 10 షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ బ్రాండ్ నేమ్ లేని నెయ్యి ప్యాకెట్లు గుర్తించి సీజ్ చేశామన్నారు. తయారీ దారులు లూజ్ ప్యాకెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ బ్రాండ్ నెయ్యినే వాడాలని చెబుతున్నామన్నారు. ప్రతి విక్రయదారుడు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసుకోవాలన్నారు. తద్వారా నాణ్యమైన పూతరేకులు విక్రయించాలన్నారు. కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రామంలో ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మరికొన్ని షాపుల యజమానులు ఆ షాపులను మూసేశారు. ఫ ఆత్రేయపురంలో పూతరేకుల తయారీపై తనిఖీలు ఫ ఏడు షాపుల్లో శాంపిల్స్ సేకరణ -
రోడ్డు ప్రమాదంలో తోడి కోడళ్లు మృతి
రాజానగరం: రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. భర్త సంపాదనకు భార్య సంపాదన కూడా తోడైతేనేగానీ గడవని పరిస్థితిలో భర్తకు సాయంగా కూలికి పోతున్న తోడి కోడళ్లు రోడ్డు ప్రమాదంలో అశువులు బాసి, ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మండలంలోని దివాన్చెరువులో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కానవరానికి చెందిన కప్పల చంద్రమ్మ (51), కప్పల రిప్కో(55)లు తోడికోడళ్లు. రిప్కో భర్త నాగేశ్వరరావుతో కలసి వారిద్దరూ పాలచర్లలోని నర్సరీలో ప్రతిరోజు కూలి పనికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బైక్పై తిరిగి వస్తుండగా దివాన్చెరువులో ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో కింద పడిన వారి పైనుంచి లారీ దూసుకుపోయింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చావులోనూ కలిసే.. తోడి కోడళ్లు అయిన చంద్రమ్మ, రిప్కోలు ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ల కంటే మిన్నగా కలిసి మెలసి ఉండేవారని, చివరికి మృత్యులోనూ కలిసే ఉన్నారని ప్రమాద దృశ్యాన్ని చూసిన కానవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ నిమిత్తం దూరంగా కూలికి వెళ్లి, కొద్దిసేపట్లోనే ఇళ్లకు చేరుకుంటారనుకునే లోపే మృత్యువు కబళించడం అందరినీ కలచివేసింది. చంద్రమ్మ భర్త గ్రామంలోనే మేకలను కాస్తుంటాడు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఇక రిప్కో భర్త నాగేశ్వరరావు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకరికి తీవ్ర గాయాలు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పండ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం
రాజానగరం: మండలంలోని దివాన్చెరువు పండ్ల మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏఎస్ఆర్ ఫ్రూట్స్ గొడౌన్ నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించి, క్షణాలలో ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు సైతం కంగారు పడ్డారు. ఇక మార్కెట్లో ఉన్నవారు చాలామంది ప్రాణభయంతో అటుఇటు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియడంలేదు. గొడౌన్ వెనుక భాగంలో చెత్తను పోగేసి మంట పెట్టడంతో ప్రమాదం జరిగిందని కొందరు, షార్ట్ సర్క్యూట్ వల్ల అని మరికొందరు చెబుతున్నాయి. కాగా విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం అగ్నిమాపక దళాధికారి మార్టిన్ లూథర్కింగ్ ఆధ్వర్యంలో ఆర్యాపురం, ఇన్నీసుపేట, కొవ్వూరుల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గొడౌన్లో నిల్వ చేసిన యాపిల్స్, ఫైనాపిల్స్, ఖర్బూజా, దానిమ్మ, డ్రాగన్ వంటి వివిధ రకాల పండ్లు మంటలకు ఆహుతయ్యాయి. గొడౌన్ వద్ద పార్కు చేసిన రెండు పల్సర్ బైకులు కూడా కాలిపోయాయి. ఈ ప్రమాదం గురించి గొడౌన్ యజమాని ఆరాధ్యుల శ్రీనివాసరావు (ఏఎస్ఆర్) మాట్లాడుతూ రూ. 10 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ రకాల పండ్లను గొడౌన్లో స్టోర్ చేశామని, అవి ఈ మంటలకు కాలిపోయాయన్నారు. అలాగే 15 వేల విలువైన ప్లాస్టిక్ ట్రేలు ఆనవాళ్లు లేకుండా బూడిదయ్యాయన్నారు. ఈ కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ మంటలకు ఆహుతైన గొడౌన్ ఫ సుమారు రూ.50 లక్షల నష్టం -
లోవలో భక్తుల రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, ప్రసాదం, లడ్డూల విక్రయం ద్వారా రూ.1,10,115, పూజా టికెట్లకు రూ.44,930, కేశఖండన శాలకు రూ.9,600, వాహన పూజలకు రూ.5,100, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.21,910, విరాళాలు రూ.48,108 కలిపి మొత్తం రూ.2,39,763 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. రత్నగిరిపై 26న సరస్వతీ పూజఅన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఈ నెల 26వ తేదీన సరస్వతీ పూజ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 9 గంటలకు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పండితులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం విద్యార్థులు ఉత్తమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని ప్రార్థిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో అన్నవరం, చుట్టుపక్కల విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని అధికారులు కోరారు. కోటసత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారని ఆల య ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టిక్కెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,22,202 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పడా.. ఏమిటో తేడా!
అలాగైతే ఉపయోగమేమిటి? పడా వచ్చినా కౌడాలోనే పనులు చేయించుకోవాల్సి వస్తే పిఠాపురం ప్రజలకు పెద్దగా కలిసి వచ్చేదేముంటుంది? ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు వివిధ పనులపై కాకినాడలోని కౌడా కార్యాలయానికి వెళ్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందువలన పడా సేవలను విస్తృతపరచాలి. – కొండేపూడి శంకరరావు, సామాజికవేత్త, పిఠాపురం కొన్ని ఇబ్బందులు మాత్రమే తగ్గుతాయి పడా వల్ల కొన్ని ఇబ్బందులు మాత్రమే తగ్గుతాయి. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తే కౌడాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని పనులు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లోనే పూర్తవుతాయి. అయితే, పూర్తిగా అన్ని పనులూ పడా ద్వారా జరిగే అవకాశాల్లేవు. – కనకారావు, మున్సిపల్ కమిషనర్, పిఠాపురం ● జీఓ తప్ప నిధుల ఊసే లేదు ● అధికారుల అజమాయిషీయే అధికం ● ప్రజా వ్యతిరేకత చల్లార్చడానికేనని మిత్రపక్షం విమర్శ పిఠాపురం: నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక హబ్గా అభివృద్ధి చేస్తానంటూ పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీని అమలు కోసం ఒక అధికారిక వ్యవస్థ రూపొందిస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పడా) ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేయించారు. అనంతరం ఒక ఐఏఎస్ అధికారితో పాటు 17 మంది సిబ్బందిని నియమిస్తూ మరో జీఓ ఇచ్చారు. పడా కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు పడా వల్ల నియోజకవర్గానికి కలిగే లాభాలు ఏమిటనేది ప్రజలకు అంతు చిక్కడం లేదు. తన నియోజకవర్గానికి సంబంధించి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటి ఏర్పాటు చేసుకున్న సీఎం చంద్రబాబు.. ఇప్పటికే రూ.కోట్లు మంజూరు చేసుకున్నారు. పిఠాపురంలో మాత్రం పడా ఏర్పాటు జీఓలకే పరిమితమైంది. ఇప్పటి వరకూ నయాపైసా నిధులు రాలేదు. ఆయన రాని లోటు తీర్చడానికేనా.. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ పవన్ కల్యా ణ్ గత ఎనిమిది నెలల్లో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రజలకు ఎనిమిది రోజులు కూడా అందుబాటులో లేరు. ఇన్చార్జితో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీంతో, పవన్ తీరుపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే పడా ఏర్పాటు చేశారని మిత్రపక్షమైన టీడీపీ విమర్శిస్తోంది. అయితే, పవన్ ఇక నుంచి అధికారులతో పాలన సాగించనున్నారని, దీనివలన అభివృద్ధి జరుగుతుందని జనసేన వర్గీయులు చెప్పుకొంటున్నారు. ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ ఎవరితోనో పాలన చేయించడమేమిటో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. కౌడాదే పెత్తనం ఇప్పటికే ఈ ప్రాంతమంతా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) పరిధిలో ఉంది. ఈ రీత్యా పడా అధికారాలు చాలా పరిమితంగానే ఉండనున్నా యి. దీనికి కౌడా స్థాయిలో అధికారాలు ఉండవని చెబుతున్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు కేంద్రం నుంచి నిధులు వస్తూంటాయి. కానీ పడాకు ఆ అవకాశం లేదని సంబంధిత జీఓ చెబుతోంది. కేవలం నియోజకవర్గానికి వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పేదరిక నిర్మూలన చర్యలు, అధికారుల బదిలీలు, పోస్టింగ్ల వంటి వాటి వరకూ మాత్ర మే పడా అధికారాలు పరిమితమని అంటున్నారు. కౌ డా ఏర్పాటైనప్పటి నుంచీ పిఠాపురం ప్రాంత ప్రజలు ఇళ్లు, స్థలాలు, భూముల కన్వర్షన్లు, షాపుల వంటి అనుమతులను అక్కడే తీసుకుంటున్నారు. ఇప్పుడు పడా వచ్చినప్పటికీ ఈ పనులు మాత్రం కౌడా పరిధిలోనే చేయించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత రుసుములు ఆ సంస్థకే చెల్లించాలి. అంటే పిఠాపురం ప్రాంత ఆదాయం కూడా కౌడాకే వెళ్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి వివిధ రూపాల్లో కౌడాకు వస్తున్న నిధుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అందిస్తూంటుంది. అదే పరిస్థితి ఇప్పుడూ కొనసాగుతుందని, అందువలన పడా వచ్చినా పెత్తనం కౌడా చేతిలోనే ఉంటుందని చెబుతున్నారు. -
కనకధార కురవాలని!
అన్నవరం: అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న అన్నవరం సత్యదేవునిపై ఎందువల్లనో కానీ కొంత కాలం నుంచి లక్ష్మీ కటాక్ష వీక్షణాలు పూర్తి స్థాయిలో ప్రసరించడం లేదు. దీంతో దేవస్థానం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అన్నవరం దేవస్థానం ఆర్థిక ఇబ్బందులపై ‘సాక్షి’ గత డిసెంబర్ 30న ‘లక్ష్మీ.. రావా.. రత్నగిరికి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కార్యనిర్వహణాధికారి (ఈఓ) వీర్ల సుబ్బారావు దేవస్థానం ఆదాయం పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను, సిబ్బందిని కోరారు. దీనిపై ‘ఆదాయ మార్గాలు చెప్పండి’ శీర్షికన ‘సాక్షి’ జనవరి 28న వార్త ప్రచురించింది. కాగా, ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు అనే రీతిలో ఉన్న దేవస్థానాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి, పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు రూపకల్పన చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఖర్చులు తగ్గించి, ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. మిగులు కూడా స్వల్పంగానే ఉంది. ఈ ప్రతిపాదనలను దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించారు. గత బడ్జెట్లో రూ.కోటి మిగులుతుందని అంచనా వేయగా.. అదికాస్తా తలకిందులైంది. పైగా, అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం కాస్తయినా మిగులు చూపాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఏదైనా అద్భుతం జరిగి, భక్తుల నుంచి దండిగా విరాళాలు, కానుకలు వస్తే మాత్రం దేవస్థానం ఆర్థికంగా ఒడ్డున పడుతుంది. ఆ మేరకు కనకధార కురిపించాలని సిరులమాతల్లి శ్రీమహాలక్ష్మిని అధికారులు వేడుకుంటున్నారు. మిగులు స్వల్పమే.. మొత్తం రూ.162.55 కోట్లతో 2025–26 బడ్జెట్ను రూపొందించారు. ఇందులో వ్యయం రూ.162.13 కోట్లుగా పేర్కొన్నారు. తద్వారా రూ.42 లక్షలు మాత్రమే మిగులు చూపించారు. గత ఏడాది రూ.160 కోట్లతో బడ్జెట్ రూపొందించగా, వ్యయం రూ.159 కోట్లు, మిగులు రూ.కోటిగా అంచనా వేశారు. అయితే, అయితే అంచనాలకు మించి వ్యయం అవడంతో అదనంగా రూ.10 కోట్లు కేటాయించాలని కోరుతూ దేవదాయ శాఖకు సప్లిమెంటరీ బడ్జెట్ ప్రతిపాదించారు. ఇది దేవదాయ శాఖ కమిషనర్ పరిశీలనలో ఉంది. భక్తుల సేవల్లో కుదింపు లేదు నూతన బడ్జెట్లో కొన్ని వ్య యాల్లో కోత విధించాం. అ యినప్పటికీ భక్తులకు అందించే సేవల్లో మాత్రం ఎటు వంటి కోతలూ విధించలే దు. ఆ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఇంజినీరింగ్ నిర్మాణాల విషయంలో కూడా ముందుగా నిర్ణయించినవన్నీ కొనసాగుతాయి. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్టుకు.. రత్నగిరిపై సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్టుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై రూ.12 కోట్ల వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అయితే, భక్తుల భోజనాల ఖర్చు, ఆ విభాగం సిబ్బంది జీతభత్యాలకు చెల్లింపులు అంతే మొత్తంలో అవుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. గోసంరక్షణ ట్రస్ట్కు.. సత్యదేవ గో సంరక్షణ ట్రస్టులో డిపాజిట్లపై రూ.కోటి ఆదాయం వస్తూండగా ఆవుల మేత, ఇతర అవసరాలకు రూ.కోటి వ్యయమవుతుందని ప్రతిపాదించారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వ్యయాల్లో భారీ కోత బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల వ్యయాల్లో భారీ కోత విధించారు. గత రెండేళ్లలో ఇంజినీరింగ్ విభాగంలో రూ.20 కోట్లు ఖర్చు చేశారు. దీంతో గత నవంబర్ నెలకే బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి. ఇంకా సుమారు రూ.3 కోట్లు చెల్లింపులు, చేపట్టాల్సిన పనులు మిగిలాయి. దీంతో వీటికి నిధులివ్వాలని సప్లిమెంటరీ బడ్జెట్లో ప్రతిపాదించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇంజినీరింగ్ విభాగానికి రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎలక్ట్రికల్ విభాగానికి కూడా రూ.కోటి మాత్రమే కేటాయించారు. పేరుకుపోయిన సీజీఎఫ్ బకాయిలు గత ఏడాది కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) చెల్లింపులు రూ.16 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు, ఈ ఏడాది చెల్లింపులకు కలిపి బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.25 కోట్లు కేటాయించారు. 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు (రూ.కోట్లలో) ఆదాయం షాపుల లీజులు, లైసెన్సుల ఆదాయం 14.50 సత్రాల అద్దెలు 15.00 హుండీల కానుకలు 20.00 ప్రసాదం విక్రయాలు 40.00 వ్రతాల ఆదాయం 50.00 డిపాజిట్లపై వడ్డీ 6.00 ఇతర ఆదాయ వనరుల ద్వారా 17.00 వ్యయం సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు 45.00 ముడిసరకుల కొనుగోళ్లు 35.00 ఉత్సవాల ఖర్చు 30.00 పారిశుధ్య విభాగం 8.00 ఇంజినీరింగ్ విభాగం 5.00 ఎలక్ట్రికల్ విభాగం 1.00 సీజీఎఫ్, ఆడిట్ ఫీజు వంటి చెల్లింపులు 25.00 ఇతర చెల్లింపులు 13.00 వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన రూ.162.55 కోట్లతో ప్రతిపాదనలు ఆర్థిక ఇబ్బందుల ప్రభావం ఖర్చుల్లో భారీగా కోత వ్యయం అంచనా రూ.162.13 కోట్లు -
చెందుర్తిలో 4,500 కోళ్ల మృతి
● బర్డ్ఫ్లూగా అనుమానం ● శాంపిల్స్ సేకరణ ● అధికారులు అప్రమత్తం పిఠాపురం: గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్లో ఒకేసారి 4,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో మండలానికి బర్డ్ఫ్లూ వ్యాపించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వివరాలివీ.. చెందుర్తికి చెందిన బి.కృష్ణ కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఐబీ కంపెనీకి చెందిన కోళ్లను ఒక్కో బ్యాచ్లో 2,500 చొప్పున సుమారు 10 వేల కోళ్లు పెంచుతున్నాడు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా 1,500 కోళ్లు మృతి చెందాయి. దీంతో ఆందోళనకు గురైన కృష్ణ చనిపోయిన కోళ్లను వెంటనే వేరు చేయడం ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 4,500 కోళ్లు మృతి చెందాయని అతడు చెప్పాడు. కోళ్ల మృతిపై సంబంధిత కంపెనీకి, పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఆ కంపెనీ సిబ్బంది వెంటనే వచ్చి, చనిపోయిన కోళ్ల శాంపిల్స్ తీసుకుని వెళ్లారు. గొల్లప్రోలు పశు వైద్యాధికారి హిమజ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కోళ్ల మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. అన్ని పరీక్షలూ నిర్వహించిన అనంతరం కోళ్ల మృతికి కారణాలను నిర్ధారిస్తామని హిమజ తెలిపారు. బర్డ్ఫ్లూపై అనుమానాలు వ్యక్తమవుతూండగా ఆ దిశగా కూడా అన్ని పరీక్షలూ చేస్తామని చెప్పారు. -
ఎమ్మెల్సీ బరి.. పార్టీల గురి
● ప్రచార జోరు పెంచిన అభ్యర్థులు ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 33 మంది పోటీకాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం సమీపిస్తూండటంతో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుండగా, ఇక 10 రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, వారి మద్దతుదార్లు ఆయా ఓటర్లను నేరుగా కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోలు సైతం ప్రకటిస్తున్నారు. కొంత మంది సాయంత్రం వేళ గెట్ టుగెదర్లు నిర్వహించి, భోజనాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి దిడ్ల వీర రాఘవులు, టీడీపీ మద్దతుతో పేరాబత్తుల రాజశేఖర్తో పాటు మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అతి పెద్ద ఉపాధ్యాయ సంఘమైన యూటీఎఫ్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, ప్రజాసంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు పేరాబత్తుల రాజశేఖర్కు గట్టి సవాలే విసురుతున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో తాము బలపరిచిన రాజశేఖర్ విజయం కోసం టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రకటించింది. అంతేకాకుండా ప్రతి సచివాలయానికి ఒక ఇన్చార్జిని నియమించింది. అలాగే, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. సచివాలయానికి ఒకరిద్దరు చొప్పున నాయకులు, కార్యకర్తలను నియమించి ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి ఓటరును నాలుగైదుసార్లు కలిసి పోలింగ్ బూత్ వరకూ తీసుకువచ్చే బాధ్యతను వారికి అప్పజెప్పారు. ఇప్పటికే టీడీపీ నాయకులు ఓటర్ల జాబితా చేత పట్టుకుని, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు ప్రతి పట్టభద్ర ఓటరునూ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సీపీఎం, సీఐటీయూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సంఘాల నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. -
నేడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక
● తునిలో భారీగా బందోబస్తు ● ప్రతిష్టంభనకు నేటితో తెర! తుని: మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నిక సోమవారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. వైఎస్సార్ సీపీకి సంపూర్ణ మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ ఈ ఎన్నికకు టీడీపీ కూడా సమాయత్తమైంది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 వార్డులను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రెండో వైస్ చైర్మన్ పదవికి అవకాశం కల్పించారు. ఈ మేరకు అప్పట్లో వైఎస్సార్ సీపీకి చెందిన పామర్తి మహేష్ వైస్ చైర్మన్–2గా ఎన్నికయ్యారు. రెండేళ్ల అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేసి, ఎన్నిక జరగకుండా అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించగా సోమవారం మరోమారు ఎన్నిక నిర్వహించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 15 రోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెర పడనుంది. ఇదిలా ఉండగా వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను భయపెట్టి, ప్రలోభపెట్టి చేర్చుకున్న టీడీపీ.. వైస్ చైర్మన్–2 పదవికి పోటీ చేయనుంది. గతంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం కౌన్సిల్ సభ్యులు, మీడియాను మాత్రమే కౌన్సిల్ హాలులోనికి అనుమతిస్తామని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. -
చమురు సంపదపై హక్కుకు ఉద్యమం
23న కాకినాడలో సదస్సు కాకినాడ సిటీ: చమురు, సహజ వాయువు, ఖనిజాలు, ప్రకృతి వనరులపై రాష్ట్ర ప్రజల హక్కును కాపాడుకునేందుకు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఈ నెల 23న కాకినాడలో నిర్వహిస్తున్న సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సముద్ర తీరంలోని చమురు, సహజవాయు నిక్షేపాలు మనకే దక్కాలని, దీనికోసం, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. సహజ వనరుల ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి 50 శాతం కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందన్నారు. దీనిపై రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేసినా, గ్యాస్ కేటాయింపులు, ఆదాయంలో సగం పొందలేకపోయామని చెప్పారు. కువైట్, మన దేశంలోని ముంబై కన్నా గోదావరి బేసిన్లోనే సహజ వాయు నిల్వలు అధికంగా ఉన్నాయని ముప్పాళ్ల తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ, మన తీరంలోని సహజ వనరులను పాలకులు బడా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కోనసీమ జిల్లా కార్యదర్శి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. -
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,500 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా అధిక సంఖ్యలో రత్నగిరికి తరలివచ్చి, సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. ఎక్కువ మంది కార్లు, ఇతర వాహనాల్లో రావడంతో దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు. ఘనంగా రథసేవ ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి టేకు రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం ఈఓ సుబ్బారావు దంపతులు కొబ్బరి కాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, రామారాయ కళా వేదిక మీద సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
పడా.. ఏమిటో తేడా!
అలాగైతే ఉపయోగమేమిటి? పడా వచ్చినా కౌడాలోనే పనులు చేయించుకోవాల్సి వస్తే పిఠాపురం ప్రజలకు పెద్దగా కలిసి వచ్చేదేముంటుంది? ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు వివిధ పనులపై కాకినాడలోని కౌడా కార్యాలయానికి వెళ్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందువలన పడా సేవలను విస్తృతపరచాలి. – కొండేపూడి శంకరరావు, సామాజికవేత్త, పిఠాపురం కొన్ని ఇబ్బందులు మాత్రమే తగ్గుతాయి పడా వల్ల కొన్ని ఇబ్బందులు మాత్రమే తగ్గుతాయి. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తే కౌడాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని పనులు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లోనే పూర్తవుతాయి. అయితే, పూర్తిగా అన్ని పనులూ పడా ద్వారా జరిగే అవకాశాల్లేవు. – కనకారావు, మున్సిపల్ కమిషనర్, పిఠాపురం ● జీఓ తప్ప నిధుల ఊసే లేదు ● అధికారుల అజమాయిషీయే అధికం ● ప్రజా వ్యతిరేకత చల్లార్చడానికేనని మిత్రపక్షం విమర్శ పిఠాపురం: నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక హబ్గా అభివృద్ధి చేస్తానంటూ పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీని అమలు కోసం ఒక అధికారిక వ్యవస్థ రూపొందిస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పడా) ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేయించారు. అనంతరం ఒక ఐఏఎస్ అధికారితో పాటు 17 మంది సిబ్బందిని నియమిస్తూ మరో జీఓ ఇచ్చారు. పడా కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు పడా వల్ల నియోజకవర్గానికి కలిగే లాభాలు ఏమిటనేది ప్రజలకు అంతు చిక్కడం లేదు. తన నియోజకవర్గానికి సంబంధించి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటి ఏర్పాటు చేసుకున్న సీఎం చంద్రబాబు.. ఇప్పటికే రూ.కోట్లు మంజూరు చేసుకున్నారు. పిఠాపురంలో మాత్రం పడా ఏర్పాటు జీఓలకే పరిమితమైంది. ఇప్పటి వరకూ నయాపైసా నిధులు రాలేదు. ఆయన రాని లోటు తీర్చడానికేనా.. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ పవన్ కల్యా ణ్ గత ఎనిమిది నెలల్లో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రజలకు ఎనిమిది రోజులు కూడా అందుబాటులో లేరు. ఇన్చార్జితో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీంతో, పవన్ తీరుపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే పడా ఏర్పాటు చేశారని మిత్రపక్షమైన టీడీపీ విమర్శిస్తోంది. అయితే, పవన్ ఇక నుంచి అధికారులతో పాలన సాగించనున్నారని, దీనివలన అభివృద్ధి జరుగుతుందని జనసేన వర్గీయులు చెప్పుకొంటున్నారు. ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ ఎవరితోనో పాలన చేయించడమేమిటో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. కౌడాదే పెత్తనం ఇప్పటికే ఈ ప్రాంతమంతా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) పరిధిలో ఉంది. ఈ రీత్యా పడా అధికారాలు చాలా పరిమితంగానే ఉండనున్నా యి. దీనికి కౌడా స్థాయిలో అధికారాలు ఉండవని చెబుతున్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు కేంద్రం నుంచి నిధులు వస్తూంటాయి. కానీ పడాకు ఆ అవకాశం లేదని సంబంధిత జీఓ చెబుతోంది. కేవలం నియోజకవర్గానికి వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పేదరిక నిర్మూలన చర్యలు, అధికారుల బదిలీలు, పోస్టింగ్ల వంటి వాటి వరకూ మాత్ర మే పడా అధికారాలు పరిమితమని అంటున్నారు. కౌ డా ఏర్పాటైనప్పటి నుంచీ పిఠాపురం ప్రాంత ప్రజలు ఇళ్లు, స్థలాలు, భూముల కన్వర్షన్లు, షాపుల వంటి అనుమతులను అక్కడే తీసుకుంటున్నారు. ఇప్పుడు పడా వచ్చినప్పటికీ ఈ పనులు మాత్రం కౌడా పరిధిలోనే చేయించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత రుసుములు ఆ సంస్థకే చెల్లించాలి. అంటే పిఠాపురం ప్రాంత ఆదాయం కూడా కౌడాకే వెళ్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి వివిధ రూపాల్లో కౌడాకు వస్తున్న నిధుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అందిస్తూంటుంది. అదే పరిస్థితి ఇప్పుడూ కొనసాగుతుందని, అందువలన పడా వచ్చినా పెత్తనం కౌడా చేతిలోనే ఉంటుందని చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తుని: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి గాయాలతో బయటపడ్డ ఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై తుని వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకెళితే..విజయనగరం జిల్లా వేపాడ మండలం, వేలుపర్తికి చెందిన గోకడ రవికుమార్(25), అనకాపల్లి జిల్లా రాంబిల్లికి చెందిన నాగిరెడ్డి కిల్లాడి ద్విచక్ర వాహనంపై అన్నవరం వచ్చారు. తిరుగు ప్రయాణంలో స్థానిక డీమార్టు సమీపంలో ఉన్న హవేలి రెస్టారెంటు దగ్గర నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న గోకడ రవికుమార్ అక్కడకక్కడే మృతి చెందగా అతనితో ప్రయాణిస్తున్న నాగిరెడ్డి కిల్లాడి గాయాలతో బయట పడ్డాడు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ ఘటనా స్థలిని పరిశీలించారు. యువకుడు మోటారు వాహనాన్ని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి
పి.గన్నవరం: ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి తాడేపల్లిగూడెం నుంచి మోటార్ సైకిలుపై ఇంటికి వస్తూ బెల్లంపూడి వద్ద ప్రమాదానికి గురైన ఎల్.గన్నవరం గ్రామ సర్పంచ్ పసలపూడి రామకృష్ణ (46) రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తాడేపల్లిగూడెం నుంచి వస్తున్న రామకృష్ణ బెల్లంపూడి వద్ద ప్రమాదవశాత్తూ పంట బోదెలో పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను స్థానికులు పంట బోదెలోనుంచి బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సర్పంచ్కు భార్య సీతారత్నం, కుమారుడు పవన్ వెంకట సాయి, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
బైకులు ఢీకొని వ్యక్తి మృతి
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అన్నవరం పోలీసుల వివరాలు ప్రకారం గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన నక్కా సత్యనారాయణ(50) కత్తిపూడిలో ఒక కార్యక్రమం నిమిత్తం బైక్పై వచ్చి తిరిగి చెందుర్తి వెళ్లుతుండగా వజ్రకూటం సమీపంలో ఎదురుగా జగ్గంపేట మండలం కాట్రపల్లి నుంచి కత్తిపూడి వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అన్నవరం ఎస్సై హరిబాబు తెలిపారు. విద్యుత్ వైర్లు తెగిపడి వ్యవసాయ కూలీ...నిడదవోలు రూరల్: విద్యుత్ వైర్లు తెగిపడి అరటితోటలో పురుగుమందు స్ప్రే చేస్తున్న వ్యవసాయ కూలీ కరెంట్షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు ఆదివారం తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మండలంలోని పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన దేశాబత్తుల నరేష్(35) పందలపర్రు శివారులోని అరటితోటలో ఆదివారం ఉదయం పురుగుమందు స్ప్రే చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగి మీద పడటంతో కరెంట్షాక్కు గురై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు చెప్పారు. కరెంట్షాక్కు గురై మృతిచెందిన దళిత యువకుడు నరేష్ కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారాన్ని విద్యుత్శాఖ అధికారులు ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. నరేష్ భార్య మౌనికకు ప్రభుత్వం తరుపున ఉపాధి కల్పించాలన్నారు. -
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ఆల్ఇండియా హాకీ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఆర్ఎస్బీ (హైదరాబాద్), ఆర్ఎస్బీ (కొచ్చి) మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ హైదరాబాద్ జట్టు 8–1 స్కోర్ తేడాతోను, ఆర్ఎస్బీ(చంఢీఘర్), ఆర్ఎస్బీ (ముంబయి) మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ ముంబయి 5–1 స్కోర్ తేడాతోను, ఆర్ఎస్బీ (సిమ్లా), ఆర్ఎస్బీ (రాయ్పూర్) మధ్య నిర్వహించిన మ్యాచ్లో ఆర్ఎస్బీ రాయ్పూర్ 6–2 స్కోర్ తేడాతో విజయం సాధించాయి. ఛత్తీస్గఢ్ సెక్టార్, గుజరాత్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో గెలుపొందింది. మధ్యప్రదేశ్, తెలంగాణ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలంగాణ 4–3 స్కోర్ తేడాతోను, కేరళ సచివాలయం, ఢిల్లీ సచివాలయం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 9–0 స్కోర్తోను, పాండిచ్చేరి , ఒడిశా సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా జట్టు 6–0 స్కోర్తోను, గోవా , మహారాష్ట్ర సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు 18–0 స్కోర్తోను విజయం సాధించాయి. శ్రీకృష్ణ కోలాట బృందం, శ్రీఽభరత్ లిఖిత ఆర్కెస్ట్రా, ఆర్ టెక్నో రాక్ బ్యాండ్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
డాబాపై నుంచి పడి వ్యక్తి...
పి.గన్నవరం: ప్రమాదవశాత్తూ డాబాపై నుంచి కిందపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పి.గన్నవరంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైవీపాలెంనకు చెందిన యర్రంశెట్టి వీరా స్వామినాయుడు (55) పి.గన్నవరం శివాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి డిష్ యాంటెన్నాను సరిచేసేందుకు డాబాపైకి ఎక్కాడు. ఈ క్రమంలో మెట్లపై ఉన్న చెత్తను తీసి కిందకు పడేస్తుండగా అదుపుతప్పి స్వామినాయుడు కిందకు పడిపోయాడు. తలకు గాయాలపాలైన అతడిని స్థానికి సీహెచ్సీకి తరలించగా ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతదేహానికి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
వ్యక్తిని కిడ్నాప్ చేసి దోపిడీ
పిఠాపురం: దారిలో గాయాలతో ఉన్న వ్యక్తికి సాయం చేసేందుకు ఆగిన ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న నగదు దోపిడీ చేసిన ఘటన గొల్లప్రోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో గొల్లప్రోలు దేవినగరానికి చెందిన ఉమ్మడి గంగాధర్ టైల్స్ పని చేసుకుని సురేష్ కల్యాణ మండపం మీదుగా దేవినగరంలోని తన ఇంటికి వెళుతున్నాడు. దారిలో అప్పటికే అక్కడ ఇరువర్గాలు కొట్లాడుకుంటుండగా, పిఠాపురం రథాలపేటకు చెందిన ఒక వ్యక్తికి గాయం అవడంతో మానవత్వంగా అతనికి సాయం చేయడానికి ఆగి నీరు అందిస్తున్నాడు. ఇంతలో పిఠాపురం రథాలపేటకు చెందిన పెద్ద, చిన్న, ఆకాష్ లతో పాటు గొల్లప్రోలుకు చెందిన గణేష్ ,అంజి బాధితుడు ఉమ్మడి గంగాధర్ను బలవంతంగా బండిమీద ఎక్కించుకుని పిఠాపురం రథాలపేట ఏరియాలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బీరు సీసాలతో, ఇనుపరాడ్లతో బాధితుడిపై దాడి చేసి గాయపరిచి అతని జేబులో ఉన్న రూ.3,800లను దోచుకున్నారు. అతనిని అదే రోజు రాత్రి మూడు గంటల సమయంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వదిలివేసి వెళ్లిపోయారు. గాయాలతో ఉన్న బాధితుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకుని జరిగిన విషయం బంధువులకు చెప్పాడు. ఈ ఘటనపై బాధితుడు ఆదివారం గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. -
వక్క.. లాభాలు పక్కా
పిఠాపురం: ప్రకృతి వ్యవసాయం పరవళ్లు తొక్కుతుందనడానికి నిదర్శనమే కొత్త పంటల సాగు. వైవిధ్యమైన వ్యవసాయ విధానాలను రైతులు అవలంబిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ ఎక్కడా సాగు చేయని పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జాజికాయ, జాపత్రి వంటి అరుదైన పంటలను పరిచయం చేసిన స్థానిక రైతులు ఇప్పుడు పోకచెక్క సాగు చేపట్టారు. ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడులు ఇచ్చే సాగు పోక చెక్క. రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా తక్కువ నీటి వసతి ఉన్నా సాగు చేసుకునే ఈ పంటను కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. పంట సాగు చేసిన నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభం నుంచి వందేళ్ల వరకు ఎటువంటి పెట్టుబడి లేకుండా నిరంతరాయంగా ఆదాయం పొందే అవకాశం వక్క సాగులో మాత్రమే ఉంది. ఒక ఎకరం పొలంలో 450 నుంచి 500 వరకు మొక్కలు నాటుతున్నారు. పంట నాటిన నాలుగేళ్ల అనంతరం ఎకరానికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా సుమారు 100 కేజీల వరకు పోకచెక్క కాయల దిగుబడి వస్తుంది. దీని నుంచి 30 శాతం వరకు పోకచెక్క వస్తుంది. మార్కెట్లో ధరలు బాగుంటే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి తోటలు వేస్తుంటారు. ఈ మొక్కలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు. కేవలం అవసరమైనప్పుడు నీరు పెట్టుకోవడం, సేంద్రియ ఎరువులు ఏడాదికి రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఏడాదిలో వక్క దిగుబడి వచ్చే నాలుగు నెలలు మాత్రమే రైతుకు పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో సేంద్రియ పద్ధతిలో సాగుకు అనుకూలంగా ఉండడంతో స్థానిక రైతాంగం వక్క తోటల పెంపకం చేపట్టింది. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పంటను ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కాకినాడ జిల్లాలోని తొండంగి, రౌతులపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. జిల్లాలో పోకచెక్క సాగు 15.20 హెక్టార్లు సాగు చేస్తున్న రైతులు 50 మంది సాగవుతున్న మండలాలు 5 ఒక్కసారి సాగు చేస్తే వందేళ్ల ఆదాయం సేంద్రియ విధానంలో ప్రయోగాత్మకంగా సాగు సాగు బాగుంది ఇప్పటి వరకు పలు రకాల వాణిజ్య పంటలు సాగు చేశాను. అయితే కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, తెగుళ్లు పంటలను తీవ్రంగా దెబ్బతీయడంతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. రెండేళ్ల కిత్రం ఎకరం పొలంలో చెక్క సాగు ప్రారంభించాను. మరో ఏడాదిన్నరలో పంట ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతానికి అనువైనది కాకపోయినా ప్రస్తుతం పంట బాగానే ఉంది. – దేశినీడి నాగేశ్వరరావు, చెక్క సాగు చేసిన రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతులు ఆసక్తి చూపుతున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే చెక్క సాగుకు స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా జిల్లాలో పోకచెక్క సాగు చేపట్టారు. ప్రస్తుతం మొక్కలు బాగానే ఎదుగుతున్నాయి. కొన్నింటి దిగుబడి ప్రారంభమైంది. మిగిలిన చోట్ల దిగుడులు బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. – ఎన్.మల్లిఖార్జునరావు, ఉద్యానశాఖాధికారి, కాకినాడ -
చికెన్ షాపులు వెలవెల
ఆలమూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ కలకలం రేగడంతో మాంసాహారం మార్కెట్ పూర్తిగా కుదేలైంది. మాంసాహారాన్ని ఉడికించి తింటే వైరస్ ప్రభావం ఏమీ ఉండదని పశుసంవర్ధకశాఖ, వైద్యారోగ్యశాఖ చెబుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులు ఈ రెండింటికి దూరంగా ఉంటే బెటర్ అనే అభిప్రాయం వినియోగదారుల్లో కన్పిస్తోంది. బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో ఆదివారమైనా వ్యాపారం సజావుగా సాగుతుందని భావించిన చికెన్, మటన్ వ్యాపారులకు నిరాశే మిగిలింది. దీంతో మాంసాహారాన్ని కొనుగోలు చేసే వినియోగదారుల లేక వ్యాపారులు గగ్గోలు పెట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు వేల మటన్, చికెన్ దుకాణాల ద్వారా వారంతపు రోజైన ఆదివారం సుమారు వెయ్యి మేకలతో పాటు దాదాపు 50 వేల బ్రాయిలర్, ఫారం కోళ్ల మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో మాత్రం అందులో సుమారు 40 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుంది. కాని బర్డ్ ప్లూ వల్ల ఈ ఆదివారం ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కిరాణా షాపులు, హోల్సేల్ దుకాణాల్లో గుడ్లు కొనుగోలు చేసేందుకు సైతం వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. గణనీయంగా పడిపోయిన చికెన్ విక్రయాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ప్లూ వైరస్ కల కలం అధికంగా ఉన్నా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం లేదు. అయినా జిల్లావ్యాప్తంగా బ్రాయిలర్, ఫారం కోళ్ల ధరలు కొంతమేర తగ్గినా వినియోగదారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇప్పటి వరకూ చికెన్ కేజీ ధర రూ.300 నుంచి రూ.180కి పడిపోయినా వ్యాపారులకు ప్రయోజనం కలిగించలేదు. అమ్మకానికి తెచ్చిన కోళ్లు అలాగే ఉండిపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు కూడా మూతబడటంతో చికెన్ వ్యాపారానికి కోలుకోని దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. మటన్ విక్రయాలపై అదే ప్రభావం బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం చికెన్ విక్రయాలతో పాటు కొంత మేర మటన్ విక్రయాలపై పడింది. మటన్ ధర అధికంగా ఉండటంతో పాటు ఈ ఆదివారం పెళ్లి ముహుర్తాలు ఎక్కువగా ఉండటం కూడా మటన్ విక్రయాలపై ప్రభావం పడిందని తెలుస్త్తోంది. దాదాపుగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మటన్ అమ్మకాలు బారీగా తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మటన్ బారీస్థాయిలో నిల్వ ఉండిపోవడంతో నష్టాలు తప్పవని వారు ఆవేదన చెందుతున్నారు. రెస్టారెంట్లలో చికెన్ స్థానంలో మటన్ ఐటమ్స్ తయారు చేస్తున్నా ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. 42 ఆర్ఆర్టీ బృందాల ఏర్పాటు కాకినాడ జిల్లాలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా పశుసంవర్థకశాఖ 21 మండలాల్లో మండలానికి రెండు బృందాలు చొప్పున 42 ఆర్ఆర్టీ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పశువైద్యాధికారితో పాటు ఇద్దరు కాంపౌండర్లు, ఇద్దరు అసిస్టెంట్లు కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. పీపీఈ కిట్స్, మాస్క్లు, స్ప్రేయింగ్ మందులు అందుబాటులో ఉంచారు. కోళ్లు, మాంసం వివరాలు పాత ధర (కేజీ) కొత్త ధర (కేజీ) రూపాయల్లో.. రూపాయల్లో.. బ్రాయిలర్ (లైవ్) 120 85 ఫారం (లైవ్) 80 50 బ్రాయిలర్ చికెన్ 300 180 ఫారం చికెన్ 200 130 కోడి గుడ్లు 07 4.50 జాగ్రత్తలు తీసుకుంటే సరి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యథేచ్ఛగా మాంసాహారాన్ని భుజించవచ్చు. ఇంట్లో హైజిన్ పాటించాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి వంట చేసుకునే ముందు కచ్చితంగా కిచెన్ రూమ్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పచ్చి మాంసం, కోడిగుడ్లు, చికెన్ పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేసుకోవాలి. మాంసాహారాన్ని 75 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసి తినడం ద్వారా వైరస్ను నశింపజేయవచ్చు. ముడి మాంసం, సగం ఉడికించిన కోడి గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు. మాంసాహారాన్ని ఉడకపెట్టిన తరువాత బయటకు తీసి శుభ్రపరచుకుని వండుకోవాలి. బర్డ్ఫ్లూ కలకలంతో దుకాణాల మూసివేత మాంసాహారం కొనుగోలుకు ప్రజలు దూరం వ్యాపారుల ఆదివారం ఆశలు గల్లంతు అపోహలు వీడండి జిల్లాలో ఎక్కడా బర్డ్ ప్లూ వైరస్ కేసు నమోదు కానందున మాంసాహారాన్ని భుజించవచ్చునని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ చెబుతున్నారు. బర్డ్ ప్లూ వైరస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్కు మించితే జీవించే అవకాశం లేదని వివరిస్తున్నారు. ఉడికించిన మాంసాహారాన్ని తింటే ఏవిధమైన వ్యాధులు దరి చేరవని, బర్డ్ ప్లూ అసలు సోకదంటూ జిల్లా పశుసంవర్థకశాఖ, వైద్యారోగ్యశాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వివరిస్తున్న సంగతిని ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేయమని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. శీతాకాలం ముగిసి వేసవికాలంలోకి ప్రవేశించేటప్పుడు సాధారణంగా బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపోహలు వీడండి–యదేఛ్ఛంగా మాంసాహారం భుజించండి అంటూ స్వచ్ఛంద సంస్థలు, పౌల్ట్రీ యజమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ధరలు తగ్గినా వ్యాపారం లేదు బర్డ్ ప్లూ వైరస్ నిర్ధారణ కాకపోయినా ప్రచార మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగున్నందువల్ల చికెన్, కోడిగుడ్లు ధరలు తగ్గినా ఆ మేరకు వ్యాపారం జరగలేదు. వినియోగదారులు కూడా మాంసాహారంపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. చికెన్ వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – గాడ శివ, చికెన్ వ్యాపారి, ఆలమూరు మటన్ విక్రయాలు పడిపోయాయి బర్డ్ ప్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుందంటూ పుకార్లు సృష్టించడం వల్ల చికెన్ విక్రయాలతో పాటు మటన్ విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. రెస్టారెంట్లలో కూడా చికెన్కు డిమాండ్ తగ్గగా ఆమేరకు మటన్ విక్రయాలు పెరగలేదు. మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితి వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. – రొట్టా సతీష్, మటన్ వ్యాపారి, రావులపాలెం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
క్రీడలతో ఉన్నత శిఖరాలు
రావులపాలెం: క్రీడలతో విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరుకోవాలని డాన్బాస్కో ప్రిన్సిపాల్ ఐ.బల్తాజార్ అన్నారు. రాష్ట్ర స్థాయి పదో జూనియర్ నెట్బాల్ పోటీలు ఆదివారం డాన్బాస్కో స్కూల్ ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను బల్తాజార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అండర్ –19 విభాగంలో 13 జిల్లాలకు చెందిన బాల బాలికలు సుమారు 350 మంది నెట్బాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నట్టు నెట్బాల్ రాష్ట్ర అసోసియేషన్ సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. లీగ్ కం నాకౌట్ విధానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి తెలిపారు. బాలుర, బాలికల విభాగాల్లో 11 జట్లు లీగ్ దశలో పాల్గొంటాయన్నారు. రావులపాలెంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలు -
హుండీ ఆదాయం రూ.11,61,650
పిఠాపురం: పాదగయ శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.11,61,650 ఆదాయం సమకూరిందని ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ, ధర్మదాయ శాఖ తనిఖీదారు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షంలో దేవస్థానం సిబ్బంది, సేవా సంఘం భక్తులు, పట్టణ ప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యాన ఆలయంలో శనివారం హుండీల ఆదాయం లెక్కించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నోట్లు రూ.10,42,690, చిల్లర నాణేలు రూ1,18,960 వచ్చాయని తెలిపారు. 61 వేల మంది రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య పిఠాపురం: జిల్లాలోని 1.34 లక్షల మంది రైతుల్లో 61 వేల మందికి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ కుమార్ తెలిపారు. గొల్లప్రోలు మండలం మల్లవరం రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న రిజిష్ట్రేషన్ పక్రియను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను సులభంగా పొందడానికి ప్రతి రైతుకూ ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నామన్నారు. రైతులు తమ ఆధార్ నంబర్, ఆధార్ అనుసంధానిత ఫోన్ నంబర్, పట్టాదారు పాస్ పుస్తకంతో గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి, ఈ సంఖ్య పొందవచ్చన్నారు. ఈ నెలాఖరులోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజయ కుమార్ కోరారు. కార్యక్రమంలో గొల్లప్రోలు మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ ఇంటిపై దాడి సామర్లకోట: స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు ఇంటిపై అదే ప్రాంతానికి చెందిన కొంత మంది గురువారం రాత్రి దాడి చేశారు. ఈ మేరకు హరిబాబు గురువారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి వస్తున్న సమయంలో కొంత మంది తన కారుకు అడ్డంగా వచ్చారని, కారు అద్దాలు పగులగొట్టారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యానికి, తన ఇంటిపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల అండతోనే ఈ దాడి జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం చేయాలని హరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్ లోన్ బాధితులకు నెల రోజుల్లో న్యాయం తుని రూరల్: తేటగుంట కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల అవకతవకలు వాస్తవమేనని, బాధితులందరికీ నెల రోజుల్లో న్యాయం చేస్తామని ఇన్చార్జి బ్రాంచి మేనేజర్ ఏసుదాసు చెప్పారు. ‘కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల గోల్మాల్’ శీర్షికన ‘సాక్షి’ శనివారం వార్త ప్రచురించిన నేపథ్యంలో బంగారం తాకట్టు పెట్టి, రుణాలు పొందిన వారు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకున్నారు. ఇన్చార్జి మేనేజర్ను కలసి వారి బంగారం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని, ఈ ప్రక్రియ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని వారికి ఏసుదాసు బదులిచ్చారు. ఇప్పటికే మేనేజర్ సహా ముగ్గురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా చూస్తామని చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. గోల్డ్ లోన్ల గోల్మాల్లో అప్రైజర్ ప్రధాన పాత్ర ఉండటంతో తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం 160 ఖాతాల్లో గోల్డ్ లోన్ల అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది రుణం తిరిగి చెల్లించి, బంగారు నగలు తీసుకు వెళుతున్నారు. నగలు తక్కువ ఉన్న బాధితులు ఏయే వస్తువులు గోల్మాల్ అయ్యాయో పేర్కొంటూ బ్యాంకుకు ఫిర్యాదులు చేస్తున్నారు. -
తునిలో టీడీపీ అరాచకం
● వైస్ చైర్మన్ పదవి కోసం బరితెగింపు ● రేప్ కేసులు పెడతామంటూ కౌన్సిలర్లకు బెదిరింపులు ● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపాటుతుని: మున్సిపల్ ఎన్నికల్లో తుని పట్టణ ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పి, ఒక్క సీటు కూడా ఇవ్వక పోయినా దొడ్డిదారిలో వైస్ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా తునిలో టీడీపీ నాయకులు, పోలీసులు కలిసి అరాచకం సృష్టిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. కౌన్సిలర్లకు ఫోన్లు చేసి, రేప్ కేసులు పెడతామని హెచ్చరిస్తూంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు పసుపు చొక్కాలు వేసుకుని వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 కౌన్సిలర్ పదవులనూ వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుందని గుర్తు చేశారు. రెండో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 3, 4 తేదీల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే టీడీపీ నాయకులు, గుండాలు, రౌడీషీటర్లు చొచ్చుకుని వచ్చి ఎన్నికను అడ్డుకున్నారని, విధి లేని పరిస్థితుల్లో కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. కౌన్సిలర్ల తరఫు న్యాయవాది సమర్పించిన వీడియోలను పరిశీలించి, ఈ నెల 17న తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిందిగా డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక పక్రియ వీడియో తీయించి, కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక గలాటా చేసి, వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకోలేమని తెలుసుకున్న టీడీపీ నాయకులు.. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా చేర్చుకోవడానికి బెదిరింపులకు దిగారని రాజా అన్నారు. ఏకంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్బాబు జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడటం సబబు కాదన్నారు. కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి, పార్టీ మారకపోతే కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిక ప్రశాంతంగా జరిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చిలక పలుకులు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోర్టు అక్షింతలు వేయడంతో కళ్లు తెరిచారన్నారు. 30 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఉంటే ఇందులో 10 మందిని బలవంతంగా చేర్చుకున్నంత మాత్రాన వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకోలేరని రాజా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు టీడీపీ తూట్లు పొడిచినా చివరకు న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో రత్నగిరి కిటకిటలాడింది. స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవార్ల ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనం మీదకు వేంచేయించి, ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండితులు పూజలు చేసిన అనంతరం, దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి సేవను ప్రారంభించారు. పండితుల మంత్రోచ్చారణలు, బాజాభజంత్రీల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. పునఃపూజల అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రధానాలయానికి చేర్చారు. నేడు సూర్య నమస్కారాలు రత్నగిరి కళావేదిక మీద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సూర్య నమస్కారాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులు సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. 11 గంటలకు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. అలాగే, ఉదయం పది గంటలకు ఆలయ ప్రాంగణంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. -
చికెన్.. రేటు ఢమాల్
● బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ● ముక్క ముట్టేందుకు భయపడుతున్న జనం ● పడిపోయిన చికెన్, గుడ్డు ధరలుకాకినాడ సిటీ: బర్డ్ప్లూ విజృంభించి, లక్షలాదిగా కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో జిల్లాలో చికెన్, కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. బర్డ్ఫ్లూ ప్రభావం జిల్లాను తాకనప్పటికీ, ఇతర జిల్లాల్లో ఈ వ్యాధి సోకిందనే వార్తలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ఈ వ్యాధి సోకిందనే పుకార్లు వ్యాపించడం, చికెన్, గుడ్లు తినరాదని ప్రసార మాధ్యమాల్లో వస్తూండటంతో ముక్క ముట్టేందుకు చికెన్ ప్రియులు జంకుతున్నారు. అయితే, జిల్లాలో ఈ వ్యాధి లేదని, దీనిపై భయపడనక్కరలేదని పశు సంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో కోళ్ల పెంపకంపై నేరుగా ఆధారపడి దాదాపు 12 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాగే దాదాపు 30 వేల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఫామ్లలో ప్రతి నెలా 64 లక్షల నుంచి 90 లక్షల బ్రాయిలర్ కోళ్లు, 30 లక్షల లేయర్ కోళ్లు, లక్షకు పైగా నాటు కోళ్ల పెంపకం జరుగుతోంది. ప్రతి రోజూ దాదాపు 6 లక్షలకు పైగా కోళ్లు జిల్లా నలుమూలలకూ రవాణా అవుతున్నాయి. ఇతర జిల్లాలకు మరో 2 లక్షల కోళ్లు సరఫరా అవుతున్నాయి. వీటిలో సాధారణంగా 3 నుంచి 5 శాతం మరణాలుంటాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొన్ని రోజులకు ముందు కిలో చికెన్ ధర రూ.240 నుంచి రూ.260 వరకూ ఉండేది. బర్డ్ఫ్లూ భయంతో అది కాస్తా ప్రస్తుతం రూ.170కి పడిపోయింది. లైవ్ కోడి రూ.85 మాత్రమే పలుకుతోంది. లైవ్ రూ.110కి విక్రయిస్తేనే గిట్టుబాటు అవుతుందని పెంపకందార్లు చెబుతున్నారు. అధికారులు అప్రమత్తం బర్డ్ఫ్లూ నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల పరిశ్రమదారులను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలో కోళ్లకు ఎక్కడా బర్డ్ఫ్లూ సోకిన దాఖలాలు లేవని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. కోళ్లు చిన్న జబ్బు పడినట్లు తెలిసినా వెంటనే వైద్యులకు సమాచారం అందించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 21 మండలాలకు 42 విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, కోళ్ల ఫామ్లను తనిఖీ చేస్తున్నారు. కోళ్లు చనిపోతే కారణమేమిటో వైద్యులు నిర్ధారించేలా చర్యలు తీసుకున్నారు. ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. పక్షుల ద్వారా వ్యాపించే అవకాశం జిల్లా ఎక్కడా బర్డ్ఫ్లూ లక్షణాలు నమోదు కాలేదు. అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాం. పక్షుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తికి ఆస్కారం అధికంగా ఉంది. అందువలన కోళ్ల ఫామ్ల వద్ద పక్షుల సంచారం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించాం. కోడిగుడ్లు, చికెన్ బాగా ఉడికించి తినవచ్చు. – డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, కాకినాడ -
లెక్క తప్పితే చిక్కులే
గత అనుభవాల రీత్యా ఏర్పాట్లు గత మహా శివరాత్రి ఉత్సవాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. వీరిలో సుమారు 70 వేల మంది మాత్రమే దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. దానికి తగినట్లు పోలీసులు, ఆర్అండ్బీ అధికారులతో చర్చించి చర్యలు చేపట్టాం. ఈ నెల 18న జిల్లా కలెక్టర్ సమీక్షలో పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటాం. – కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, ఈఓ, పాదగయ క్షేత్రం, పిఠాపురం అధికారులే బాధ్యత వహించాలి మహా శివరాత్రి నాడు పాదగయకు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తూంటారు. ఈ ఏడాది మహా శివరాత్రి బుధవారం మంచి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా కేవలం లక్షకు పైగా మాత్రమే భక్తులు వస్తారంటూ అధికారులు లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలా తక్కువ అంచనాలతో ఏర్పాట్లు చేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. జరగరాని సంఘటన జరిగితే అధికారులే బాధ్యత వహించాలి. వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. – వెంకటేశ్వరరావు, విశ్వహిందూ పరిషత్ నాయకుడు, పిఠాపురం పిఠాపురం: దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికా అమ్మవారు వెలసిన పుణ్యభూమి. దేశంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతీ మాధవ స్వామి ఆలయం ఇక్కడే కొలువు తీరింది. సాక్షాత్తూ దత్తాత్రేయుని అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం కూడా ఇదే. అంతే కాదు.. గయా క్షేత్రం కావడంతో ఇది పితృ కార్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధి పొందిన ఇక్కడి పాదగయ ఆలయానికి మహాశివరాత్రి పర్వదిన వేళ లక్షలాదిగా భక్తులు తరలి వస్తూంటారు. మరికొద్ది రోజుల్లో శివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ భక్తుల రద్దీకి తగినట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడి అధికార యంత్రాంగం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. ● పాదగయ శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓఎస్డీ ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా శివరాత్రికి లక్షకు పైగా మాత్రమే భక్తులు వస్తారని ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ చెప్పారు. ● వాస్తవానికి అధికారిక లెక్కల ప్రకారం పాదగయ క్షేత్రాన్ని ఏటా సుమారు 2 కోట్ల మంది భక్తులు దర్శిస్తారు. ఒక్క మహా శివరాత్రి పర్వదినం నాడే సుమారు 4 లక్షల మంది ఇక్కడి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, కుక్కుటేశ్వరస్వామిని, ఇతర దేవతా మూర్తులను దర్శించుకుంటారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం శివరాత్రి ఉత్సవాలకు 2.50 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. ● శివరాత్రి వేళ ఆలయానికి వచ్చిన భక్తుల్లో చాలా మంది పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లిపోతూంటారు. వచ్చిన భక్తుల్లో సగం మంది మాత్రమే దర్శనాలకు వస్తూంటారు. ఇలా ఆలయంలోకి వచ్చిన భక్తుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. ● శివరాత్రి రోజు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. గత అనుభవాలను బట్టి ఆ నాలుగు గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయి. ● దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా భక్తులు ఆలయం పరిసరాల్లోకి వచ్చి తీరుతారు. దీంతో క్యూలైన్లు నిండిపోతాయి. ఒక్కసారిగా వారి తాకిడి పెరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వారిని నిలువరించేంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అదే రోజు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సైతం పోలీసులు శివరాత్రి ఉత్సవాల బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది. ● మరోవైపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం శివరాత్రి మర్నాడే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్నికల బందోబస్తుకు వెళ్తారు. ● ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. కానీ, లక్షన్నర మందే వస్తారని ఈఓ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా భక్తుల లెక్కల్లో పొరబడితే, ఉత్సవాల ఏర్పాట్లపై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ అంచనాలకు మించి భక్తులు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు లేక అధికార యంత్రాంగం చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది. శివరాత్రి ఏర్పాట్లపై పక్కాగా దృష్టి పెట్టాల్సిందే పాదగయకు ఏటా 4 లక్షల మంది రాక లక్షన్నర మందే వస్తారంటున్న ఆలయ అధికారులు లెక్కల్లో పొరబడితే తొక్కిసలాటకు ఆస్కారం ముందుచూపుతో ఏర్పాట్లు చేయాలంటున్న భక్తులు 18న కలెక్టర్ సమీక్ష బ్రేక్ దర్శనమంటూ ఏర్పాట్లు మహా శివరాత్రి నాడు వేకువజామున ఒంటి గంట నుంచే భక్తులు పుణ్యస్నానాలు ప్రారంభిస్తారు. మర్నాడు సాయంత్రం వరకూ వారి తాకిడి ఉంటుంది. ఒకేసారి లక్షల మంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిని గుంపులు గుంపులుగా విడగొట్టి బ్రేక్ ఇచ్చి, స్నానాలకు వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలా చేస్తే తమ వంతు వచ్చేంత వరకూ ఆగే ఓపిక భక్తులకు ఉండదు. పాదగయ పరిసరాల్లో అంత ఖాళీ ప్రదే శం, పటిష్టమైన బారికేడ్లు ఉండే అవకాశమూ లేదు. అటువంటప్పుడు అధిక సంఖ్యలో భక్తులను ఆపి, వదిలే ఏర్పాట్లు చేస్తే అందరూ ఒక్కసారిగా పరుగు తీసే ఏర్పడుతుంది. అదే కనుక జరిగితే తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల మంజూరు సందర్భంగా పలువురి ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట వంటి దుర్ఘటనలు జరిగే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అలా కాకుండా వచ్చిన వారు వచ్చినట్టుగా పుష్కరిణి వద్దకు వెళ్లనిస్తే ఎంత మంది వచ్చినా తొక్కిసలాటకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాదగయలో గతంలో జరిగిన శివరాత్రి ఉత్సవాలు ఎటువంటి తొక్కిసలాటా లేకుండా సాఫీగా జరిగాయి. ఈ నేపథ్యంలో భక్తులను ఆపాలనే ప్రయత్నంపై అధికారులు పునరాలోచించాలని పలువురు సూచిస్తున్నారు. పాదగయ శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఈ నెల 18న సమీక్ష నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా ఈ అంశాలపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. -
ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించాలి
కాకినాడ క్రైం: అధికార పార్టీ ఆగడాలపై హైకోర్టు పరోక్షంగా చురక వేసింది. అధికార మదంతో పేట్రేగిపోతున్న పచ్చ మూకలకు, వారికి వంత పాడుతున్న అధికారులకు తమ విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేసింది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నికను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. తుని 25వ వార్డు కౌన్సిలర్ కాసే సుమతి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఈ మేరకు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలివీ.. కౌన్సిల్లో ఒక్క సభ్యుడు కూడా లేకపోయినా.. తుని మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నికను టీడీపీ గూండాలు రెండుసార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు ఈ నెల 3న ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ రోజు వైస్ చైర్మన్ను ఎన్నుకునేందుకు వెళ్తున్న చైర్పర్సన్ను, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో ‘పచ్చ’ మూకలు బరితెగించాయి. కౌన్సిలర్లు, అధికారులకు మాత్రమే అనుమతి ఉండే కౌన్సిల్ హాలులోకి టీడీపీ నాయకులు, ‘పచ్చ’ గూండాలు చొరబడి, ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నారు. దీంతో ఎన్నిక ఈ నెల 4వ తేదీకి వాయిదా పడినా ఆ రోజు కూడా టీడీపీ మూకలు ఎన్నిక జరగనివ్వలేదు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్వశిక్షా అభయాన్ సీఈవో పి.వేణుగోపాలరావు మున్సిపల్ కార్యాలయానికి రాకుండా తహసీల్దార్ కార్యాలయంలోనే ఉండిపోయారు. తద్వారా అధికార టీడీపీకి పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించాలని మూడోసారి నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో 25వ వార్డు కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. మూడోసారైనా ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి, అధికార పార్టీ నేతల కట్టుబానిసల్లా వ్యవహరించడాన్ని, పోలీసులు సహా ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన పలు విభాగాల అధికారుల తీరును కోర్టు ముందుంచారు. వారి ఉద్యోగాన్ని వారు సక్రమంగా నిర్వహించేలా ఆదేశించాలని మాండమస్ రిట్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ప్రతివాదుల వివరణ కోరింది. వారి కౌంటర్ను అనుసరించి ఎన్నిక నిర్వహించే కౌన్సిల్ హాలులో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి, ఫుటేజీని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. మరోసారి ఎన్నిక వాయిదా పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఎక్కడా ఏకపక్ష ధోరణికి తావివ్వొద్దని పేర్కొంది. ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరిగి తీరాలని స్పష్టం చేసింది. ఎన్నికను ఇప్పటికే రెండుసార్లు అడ్డుకున్న టీడీపీ నేతల తీరును ప్రజలు ఎండగడుగున్నారు. ఈ నేపథ్యంలో వెలువడిన హైకోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నికపై హైకోర్టు ఆదేశం అధికార పార్టీ ఆగడాలపై చురక అధికారుల బాధ్యతలు గుర్తు చేసిన న్యాయస్థానం కౌన్సిలర్ సుమతి రిట్పై స్పందించిన కోర్టు