Kakinada District News
-
పంజాబ్లో వాడపల్లి యువకుడి మృతి
● మృతుడు వైఎస్సార్ సీపీ నేత సముద్రం కుమారుడు ● స్వగ్రామంలో అంత్యక్రియలు కొవ్వూరు: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న వాడపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఉప సర్పంచ్ లంకదాసు సముద్రం పెద్ద కుమారుడు నాగ వెంకట యశ్వంత్ (23) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమృత్సర్లో ఓ పరీక్ష రాసేందుకు ఈ నెల 6వ తేదీన తన స్నేహితుడి కలిసి మోటారుసైకిల్పై వెళ్లి తిరిగి వస్తుండగా కుపర్తల సమీపంలో హైవేపై డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యశ్వంత్తో పాటు అతడి స్నేహితుడు, విజయనగరానికి చెందిన గానా సిద్విక్ వర్మ (23) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అమృత్సర్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్ స్వగ్రామమైన వాడపల్లి తీసుకొచ్చారు. వాడపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న యశ్వంత్ ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యారు. మద్రాసులో ఉద్యోగం కుడా వచ్చింది. ఈ వారంలోనే ఉద్యోగంలో చేరనున్న సమయంలో మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారు. ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు), మాజీ ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. -
అట్టనాణేలతో లెక్కల పాఠాలు
అమలాపురం టౌన్: బ్రిటీషు కాలంలో దాదాపు 110 ఏళ్లనాటి ఎనిమిది రకాల అట్ట నాణేలను అమ లాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. కాలగర్భంలో కలిసి మరుగున పడిపోయిన ఈ నాణేలు అప్పట్లో అర్ధ రూపాయి, పావలా, బేడా (రెండు అణాలు), అణా, అర్ధణా, కాణి, దమ్మిడి అనే ఎనిమిది రకలుగా చెలామణిలో ఉండేవి. అప్పట్లో ఈ నాణేలను పిల్లలకు లెక్కలు నేర్పడానికి ఉపయోగించేవారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. అసలైన నాణేలు పిల్లలకు ఇస్తే అవిపోతే అనివార్యమయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టకుని వీటిని అట్టతో త యారు చేయించారు. వెండి రంగు, రాగి రంగుతో ఉండే ఈ అట్టనాణేలకు, అసలైన నాణేలకు వ్యత్యాసాన్ని ఎంతో పరీక్షించి చూస్తే తప్ప తెలియదు. ఈ నాణేలను బ్రిటీషు వారు జర్మనీ దేశానికి చెందిన లాంగ్ మన్స్ అనే కంపెనీ ద్వారా తయారు చేయించి మన దేశానికి రప్పించి ఇక్కడ విద్యార్థులకు లెక్కలు నేర్పేవారు. అయితే ఈ పద్ధతి ఎక్కువ కాలం నడవకపోవడంతో ఈ అట్టనాణేలు క్రమేణా అదృశ్యమయ్యాయి. అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన నడింపల్లి రామరాజు 50 ఏళ్ల కిందట అనేక పాఠశాలలను సందర్శించి తిరిగి అట్టనాణేలను సేకరించారు. ఆయన నుంచి తాను సేకరించినట్లు కృష్ణ కామేశ్వర్ తెలిపారు. 110 ఏళ్ల క్రితం చలామణి సేకరించిన కృష్ణ కామేశ్వర్ -
ప్రతి రైతు పారిశ్రామికవేత్తగా ఎదగాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి రైతూ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, వ్యవసాయాన్ని పరిశ్రమగా చేపట్టాలని జాతీయ వాణిజ్య పరిశోధన, వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమహేంద్రవరం ఐసీఏఆర్ – నిర్కా (సీటీఆర్ఐ)లో మంగళవారం వ్యవసాయంలో ఆవిష్కరణలు – వ్యవసాయం పారిశ్రామికరణ దిశగా ఆవిష్కర్తల కలయిక కార్యక్రమం జరిగింది. అధ్యక్షత వహించిన శేషుమాధవ్ మాట్లాడుతూ వ్యవసాయంలో వాణిజ్యపరమైన వినూత్న ఆవిష్కరణలు, అవకాశాలతో పాటు వాణిజ్య పంటల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే దిశగా రైతులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు కృషి చేయాలన్నారు. న్యూఢిల్లీ ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఐపీటీఎం) డాక్టర్ నీరు భూషణ్ ముఖ్యఅతిథిగా ఆన్లైన్లో హాజరు కాగా, వారి తరఫున న్యూఢిల్లీ ఐసీఏఆర్ – ఐటీఎంయూ డాక్టర్ వి.విక్రమ్సింగ్ ఆన్లైన్లో సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీఎంయూ నోడల్ ఆఫీసర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.రవిశంకర్ మాట్లాడుతూ ఆవిష్కర్తల కలయిక ఆవశ్యకతలను వివరించారు. వాణజ్య వ్యవసాయంపై ఆవిష్కరణలు, విలువ ఆధారిత పదార్థాల తయారీపై రైతుల విజయగాథలు, కోత అనంతరం వాణిజ్య పంటలలో వివిధ ఉత్పత్తులలో సంకలనం చేయబడిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, హైదరాబాద్ ఐసీఏఆర్–నారమ్ మేనేజ్మెంట్ డివిజన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ హెడ్ ఎస్.సెంథిల్ వినాయగం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నటరాజ్, నాబార్డు ఏజీఎం సోము నాయుడు, ఎపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడారు. అనంతరం 11 మంది ఔత్సాహిక యువత తమ అనుభవాలను వివరించారు. 11 ఎగ్జిబిషన్ స్టాళ్లలో పసుపు, అశ్వగంధం, ఆముదం, మిరప ఉత్పత్తులతో పాటు ఎన్జీవో, ఎఫ్పీవోలు, ఏపీసీఎన్ఎఫ్ (ప్రకృతి వ్యవసాయం) వారి వివిధ ఉత్పత్తులు, రోబోటిక్స్, డ్రోన్స్, జ్యూట్బ్యాగులను ప్రదర్శించారు. అనంతరం 17 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను సత్కరించారు. నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ ఉత్సాహంగా ‘ఆవిష్కర్తల కలయిక’ -
ఎట్టకేలకు పారిశుధ్య నిర్వహణ టెండర్ విడుదల
అన్నవరం దేవస్థానం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంతో సహా రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలలో శానిటరీ మెటీరియల్తో సహా క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజడ్ టెండర్ ప్రకటన మంగళవారం విడుదలైంది. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ ప్రొక్యూర్ టెండర్ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు ఆరు నెలలు ఆలస్యం చేశారు. గత అక్టోబర్లో విడుదల కావల్సిన టెండర్ ఆరునెలలు ఆలస్యం వచ్చింది. టెండర్లు దాఖలుకు అభ్యర్థన తేదీ ఈ నెల 16, ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న, టెండర్ దాఖలుకు చివరి తేదీ మే ఒకటి, మే ఐదున టెండర్ టెక్నికల్ బిడ్ తెరుస్తారు. మే 12న ఖరారు చేస్తారు. జూన్ ఒకటి నుంచి కొత్త కాంట్రాక్ట్ ప్రారంభమవుతుంది. కాగా.. చెత్త ట్రాక్టర్ కాంట్రాక్టును టెండర్ పిలవకుండా నెలకు రూ.60 వేలకు అప్పగించడంతో సాక్షిలో వార్త వచ్చిన విషయం తెలిసిందే. దీంతో టెండర్లు పిలిచి, అతి తక్కువకు దాఖలైన రూ.23,990కు ఖరారు చేశారు. దీంతో దేవస్థానానికి నెలకు రూ.30,010 ఆదా అయ్యింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అనుమానాస్పద స్థితిలో ఉద్యోగిని మృతి
నిడదవోలు: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నెల్లి కరుణ (28) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకై క కుమార్తె కరుణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం సాధించింది. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరగడం, కాళ్లూ చేతులు వంకర్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న కరుణను బంధువులు పద్మ, సుబ్బు కలిసి కారులో నిడదవోలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న కరుణను రాత్రి 9 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరుణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గదిలో ఉంచారు. బంధువులు, తల్లిదండ్రులు మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుణకు పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూశారు. అయితే వివాహం విషయంలో కుటుంబంలో కలహాలు జరుగుతున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కరుణ మరణ సమాచారం తెలుసుకున్న పట్టణంలోని వివిధ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆసుపత్రికి తరలివచ్చారు. మృతురాలి కరుణ తల్లి సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వీరబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కరుణ మృతదేహన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ సంతాపం తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం రాజానగరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జాతీయ రహదారిపై జీఎస్ఎస్ వైద్య కళాశాల సమీపంలో సోమవారం రూ.10 లక్షల విలువైన బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా మంగళవారం కూడా పైప్రాంతానికి కొద్దిదూరంలో పిరమిడ్ను చేర్చి ఉన్న పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై రూ.ఒక లక్ష విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ తహసీల్దార్ (పౌరసరఫరాలు) గొలుగూరి బాపిరాజు తెలిపారు. చక్రద్వారబంధానికి చెందిన మాడబోయిన గోపి నుంచి వడిశలేరుకు చెందిన వట్టికూటి మణికంఠ మినీ వ్యాన్ను అద్దెకు తీసుకుని, అనపర్తి నుంచి గండేపల్లికి ఈ బియ్యాన్ని రవాణా చేస్తున్నాడన్నారు. నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. -
పిడుగు పడి రైతు మృతి
నల్లజర్ల: పిడుగు పడి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపల్లి శివారు కృష్ణమ్మగూడెంలో వెలగాని సత్యనారాయణ (47) తన ఇంటి సమీపంలోని మామిడి చెట్టు వద్ద ఉన్న సిమెంట్ బెంచీపై కూర్చున్నాడు. ఈదురుగాలులతో వర్షం పడుతున్న ఆ సమయంలో పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు నబీపేట నుంచి వచ్చి ఇక్కడి ఎంపీపీ స్కూలు వద్ద ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు. వివాహిత మౌన దీక్ష కిర్లంపూడి: తన కుమారుడికి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజుపాలెంలోని తన అత్తారింటి వద్ద నాగ వెంకటలక్ష్మి అనే వివాహిత తన కుమారుడు, కుటుంబ సభ్యులతో మంగళవారం మౌన దీక్షకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామానికి చెందిన నాగ వెంకటలక్ష్మికి కొత్తపల్లి మండలం గోర్సకు చెందిన వీరబాబుతో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్నేళ్ల తరువాత రాజుపాలెంలో వారు స్థిరపడ్డారు. అయితే వీరబాబు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కానీ ఈ విషయం చెప్పకుండానే వివాహం చేశారు. వారికి మగబిడ్డ పుట్టిన తర్వాత ఆమెను అత్తింటివారు దూరం పెట్టారు. కుమారుడికి రావాల్సిన ఆస్తిని వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఇదేంటి అని అడిగితే ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయటకు వెళ్లగొడుతున్నారు. దీంతో నాగ వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి దీక్ష చేపట్టింది. -
13న గురుకులాల్లో ప్రవేశ పరీక్ష
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలలో 2025–26 విద్యా సంత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13వ తేదీన నిర్వహించనున్నట్లు పిఠాపురం అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ త్రివేణి తెలిపారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీబీఆర్ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్,ఇన్ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు)తో పరీక్షకు హాజరు కావాలని ఆమె కోరారు. నేడు రాష్ట్ర స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ్య ఎంఎస్ఎన్ పీజీ సెంటరులో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో తలాష్ – 2కె 25 పేరిట రాష్ట్రస్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ను బుధవారం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రశాంతి శ్రీ తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నన్నయ్య యూనివర్శిటీ వీసీ ప్రసన్న శ్రీ,, ఓఎన్జీసీ ఈడీ రత్నేష్కుమార్ హాజరవుతారన్నారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు అన్నవరం: సత్యదేవునికి చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు మంగళవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు తులసి దళార్చన నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 20 లక్షల ఆదాయం సమకూరింది. ఘనంగా సీతారాముల వేద సదస్యం కాగా, రత్నగిరి రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సీతారాముల వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని మరో ఆసనంపై ఉంచి పూజలు చేశారు. సీతారాములకు నూతన పట్టు వస్త్రాలను ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు అందజేశారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, గంగబాబు, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి కార్యక్రమం నిర్వహించారు. సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై దాడులు కాకినాడ క్రైం: కాకినాడలో కూటమి నేతల అండదండలతో విచ్చలవిడిగా లక్షల్లో జరుగుతున్న నంబర్గేమ్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని దినసరి కూలీలు, నిరుపేదల జీవితాలతో చెలగాటమాటమాడుతున్న సింగిల్ నంబర్ లాటరీల భాగోతాన్ని గత నెల 20న ‘కూటమి వారి లాటరీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ బిందుమాధవరావు తీవ్రంగా స్పందించి ఆకస్మికంగా దాడులు చేయించారు. కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లై ఓవర్, సంజయ్నగర్ లారీ ఆఫీసు, ఎమ్ఎస్ఎన్ చారిటీస్ నూకాలమ్మ గుడి వద్ద పార్కు తదితర ప్రాంతాల్లో నిత్యం సింగిల్ నంబర్ లాటరీతో పేదల పొట్టగొడుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ టూటౌన్, త్రీటౌన్ పరిధిలో పలు సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలను పోలీసులు గుర్తించారు. నంబర్ గేమ్ ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదును, మొబైల్ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. నంబర్ గేమ్కు మూలాలు, పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వేద సదస్యం నిర్వహిస్తున్న పండితులు -
దోపిడీకే ప్రాధాన్యం
పిఠాపురం: ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారారు. తాము చెప్పిందే ధర అన్నట్టుగా రైతులను దోచుకుంటున్నారు. వేరే దారి లేక వారు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రబీ సీజన్లో ప్రైవేటు ధాన్యం వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నా అడిగే నాథుడు కనిపించడం లేదు. ప్రస్తుతం గోదావరి డెల్టా, ఏలేరు పరిధిలో రబీ వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జోరుగా సాగుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులదే హవాగా మారింది. దీంతో ఒకపక్క దిగుబడులు ఆశించిన స్థాయిలో లేక, మరోపక్క మద్దతు ధర రాక రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. ఒక్క గింజ సేకరిస్తే ఒట్టు రబీ వరి కోతలు ప్రారంభించి రెండు వారాలైనా ఇంకా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో కోసిన ధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. తాము తప్ప ఎవరూ కొనేవారు లేరన్న సాకుతో ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు అమాంతం తగ్గించేశారు. రబీ కోతల ప్రారంభంలో 75 కేజీల సన్న రకాల ధాన్యం బస్తా రూ.1,450 చెప్పిన వ్యాపారులు కోతలు ముమ్మరం అయ్యాక ఒక్కసారిగా ధరను బస్తాకు రూ.250 చొప్పున తగ్గించేశారు. ప్రస్తుతం 75 కేజీల బస్తాను రూ. 1,200కు మాత్రమే కొంటున్నారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అమ్ముకుంటున్నారు. దీంతో ఎకరానికి రూ.10 వేల వరకు రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో 30 శాతానికి పైగా కోతలు పూర్తి కాగా సుమారు 1.20 లక్షల టన్నుల ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, సన్నరకం ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,740కి (ఏ గ్రేడ్ రకం) కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాని ఎక్కడా ఒక్క గింజ కూడా కొన్న ఆనవాళ్లు లేవు. జిల్లాలో రబీ సాగు వివరాలు రబీ సాగు చేసిన భూములు 1,58,120 ఎకరాలు సాగు చేసిన రైతులు – 1.45 లక్షల మంది ఏటా ధాన్యం దిగుబడి – 5.70 లక్షల టన్నులు గత రెండు వారాలుగా అమ్మిన ధాన్యం – సుమారు 1.20 లక్షల టన్నులు రోజూ – 1,500 నుంచి 2,000 టన్నుల ధాన్యం అమ్మకాలు సిండికేటుతో పతనమైన ధాన్యం ధర ప్రారంభంలో బస్తా రూ.1,450, ప్రస్తుతం రూ.1,200 కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించిన రైతులు ధర పతనంతో ఎకరానికి రూ.10 వేల వరకు నష్టం వేరే దారి లేక నష్టం వచ్చినా అమ్ముకుంటున్న రైతులు అమ్మక తప్పడం లేదు రోజురోజుకు ధాన్యం ధరలు తగ్గించేస్తున్నారు. ఎందుకని అడిగే వారు లేరు. ఎవరికి వారే ఏదో విధంగా ధాన్యం అమ్ముడైతే చాలు అన్నట్టుగా అమ్మేస్తున్నాం. కోత కోయక ముందు రూ.1,450 అన్నారు. తీరా కోత కోసాక రూ.1,00 అంటున్నారు. అయినప్పటికి అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో పాటు రైతులకు వేరే దారిలేక వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10వేల నష్టం తప్పడం లేదు. ప్రస్తుతం అంతా యంత్రాలతో కోతలు కోస్తుండడం వల్ల అంతా పచ్చి ధాన్యమే ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులు పచ్చి ధాన్యం ఎలా ఉన్నది అలా కొంటున్నారు. అందుకే వారు అడిగిన ధరకు అమ్మాల్సి వస్తోంది. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అయితే ధాన్యం ఎండబెట్టి పూర్తిగా ఆరిన తరువాత ఎగరబోసి ఏవిధమైన తుక్కు లేకుండా చేసి అమ్మితేనే కొంటారు. అందుకే ధర లేక పోయినా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నాం. – కరణం శ్రీను, రైతు, పిఠాపురం ఆ నిబంధనలు మా పాలిట శాపాలు ప్రభుత్వం ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ముందు మేము రైతు సేవా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇవ్వాలి. కూపన్ తీసుకోవాలి. తరువాత సిబ్బంది వారికి వీలు కుదిరినప్పుడు వచ్చి శాంపిల్స్ తీసుకెళతారు. తేమ ఎక్కువగా ఉంది బాగా ఆరబెట్టి తీసుకురండి అంటారు. ఇంతలో ఏ వర్షం అయినా వచ్చిందంటే ఉన్న ధాన్యం కాస్తా తడిసిపోతాయి. దీంతో అంతా నష్టమే మిగులుతుంది. ముఖ్యంగా పచ్చి ధాన్యం ప్రభుత్వం కొనదు. దీనివల్ల ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో వ్యాపారులు వారి ఇష్టానుసారం ధర నిర్ణయించి కొంటున్నారు. మాకు నష్టాలు తప్పడం లేదు. ఆరబెట్టి అమ్ముదామని కళ్లాల్లో ఉంచిన ధాన్యం రెండు రోజుల క్రితం వచ్చిన వానకు తడిసి పోయాయి. దీంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పచ్చి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తే తప్ప ప్రైవేటు వ్యాపారుల హవా తగ్గదు. – గంధం కృష్ణ, రైతు, కొత్తపల్లి -
అన్నవరం దేవస్థానం ఆదాయం తగ్గడానికి కారణమేంటి?
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కన్నా రూ.ఆరు కోట్లు అధికంగా ఖర్చు అయిన వైనంపై సంబంధిత అధికారులపై రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘లక్ష్మీ..రావేం మా కొండకి ?’ వార్తా కథనంపై దేవదాయశాఖా మంత్రి స్పందించారు. గతేడాది అన్నవరం దేవస్థానం ఆదాయం రూ.135 కోట్లు కాగా, వ్యయం రూ.141 కోట్లుగా నమోదైంది. 2023–24 సంవత్సరంలో మిగిలిన రూ.7.5 కోట్లు నిధుల నుంచి రూ. ఆరు కోట్లు మళ్లించి చెల్లింపులు చేశారు. ఒకప్పుడు ఆర్థికంగా రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉన్న అన్నవరం దేవస్థానానికి ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణాలేమిటనే దానిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. తన ఆదేశాలతో బాటు ఆయన ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్ను కూడా జత చేసి పంపించారు. దీంతో బాటు గత మూడేళ్లు ఆదాయ వ్యయాల వివరాలను కూడా పంపించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలను అన్నవరం దేవన్థానం అధికారులకు పంపించిన కమిషనర్ మంగళవారం సాయంత్రంలోగా నివేదిక పంపించాలని ఆదేశించారు. దాంతో దేవస్థానం అధికారులు నివేదిక తయారు చేశారు. 2022–23, 23–24 సంవత్సరాలలో దేవస్థానం వ్యయం కన్నా ఆదాయమే అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రదక్షిణ దర్శనం కొనసాగించి ఉంటే రూ.పది కోట్లు పైగా ఆదాయం 2023 అక్టోబర్లో దేవస్థానంలో రూ.300 టిక్కెట్తో సత్యదేవుని ప్రదక్షిణ దర్శనాన్ని అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ ప్రారంభించారు. ఈ ప్రదక్షిణ దర్శనం కోసం దాత సహకారంతో ఆలయంలో నాలుగు మూలలా బంగారు గంధం గిన్నె, బంగారు హుండీ, బంగారు కామధేనువు, బంగారు కల్పవృక్షం ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని దర్శిస్తూ స్వామి, అమ్మవారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. రూ.300 టిక్కెట్ అయినా ఆ దర్శనానికే భక్తులు మొగ్గు చూపేవారు. దీంతో ఆ ఒక్క నెలలోనే రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ తరువాత ఆ దర్శనం నిలిపివేసి రూ.200 టిక్కెట్ మీద అంతరాలయం దర్శనం మాత్రమే చేసుకునే వీలు కల్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనం ద్వారా రూ.5.49 కోట్ల ఆదాయం వచ్చింది. అదే రూ.300 టిక్కెట్ తో ప్రదక్షిణ దర్శనం ఏర్పాటు చేసి ఉంటే రూ.ఎనిమిది కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ‘సాక్షి’ కథనంపై స్పందించిన దేవదాయశాఖ మంత్రి ఆనం వెంటనే నివేదిక పంపించాలని కమిషనర్కు ఆదేశాలు -
బొమ్మను తుడిచేశారు.. గుండెల్లో గుడిని ఏం చేస్తారు?
పిఠాపురం: కొన్నేళ్లుగా జరగనంత అభివృద్ధి ప్రజల ముంగిటకే పాలన, అధికారులంతా గ్రామాల్లోనే ప్రజల ముందే పని చేయడం ఇలా ఒకటేమిటి అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు తెచ్చిన ఏకై క నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇదే మాట ప్రతీ నోటా వినబడుతోంది. దీన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు జగన్ను తలుచుకుని పథకాలు ఇవ్వలేని తమను ఎక్కడ తరిమి కొడతారో అనే భయమో ఏమో ఆయన బొమ్మ లేకుండా చేద్దామనుకుని శిలాఫలకాలపై మాజీ సీఎం పేరుతో ఉన్న బొమ్మలను చెరిపేస్తున్నారు. కానీ ఆయన కట్టించిన భవనాన్ని, పాలనను మాత్రం కావాలంటున్నారు. అదే కార్యాలయంలో ఆయన నియమించిన సిబ్బందితో పనులు చేయించుకుంటూ అది కట్టించిన వారి ఆనవాళ్లు మాత్రం ఉండకూడదనుకుంటున్నారు. దీన్ని చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బొమ్మను తీయగలరు గాని ఆయన చేసిన మంచిని జనం గుండెల్లోంచి తొలగించలేరుగా అంటున్నారు. -
బీచ్లో భారీ పోలీసు బందోబస్తు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుంచి బీచ్ రోడ్డును మూసివేశారు. దీంతో లైట్హౌస్ మీదుగా బీచ్ రోడ్డులో ఉప్పాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 13వ తేదీ వరకూ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేయడంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు బీచ్కు రాకుండా నిషేధించారు. సుమారు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్యకృష్ణ, తిమ్మాపురం ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ అధికారి సుష్మితలు బీచ్లో 130 మంది సిబ్బందికి విధులు కేటాయించారు. స్తంభించిన ఎన్టీఆర్ వైద్య సేవలు కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) సోమవారం స్తంభించిపోయాయి. ప్రభుత్వ నిర్వాకంతో నెట్వర్క్ ఆస్పత్రులు తలపెట్టిన సమ్మె పేదల ఆరోగ్యంపై గుదిబండగా మారింది. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ ఎన్టీఆర్ వైద్య సేవల కింద కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 80 నుంచి 110 సర్జరీలు ఉచితంగా జరుగుతూంటాయి. అటువంటిది సోమవారం ఒక్క సర్జరీ కూడా నమోదు కాలేదు. జిల్లాకు రావలసిన సుమారు రూ.150 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసేంత వరకూ సమ్మె విరమించేది లేదని ఏపీ స్పెషాలిటీ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, రాష్ట్ర నాయకత్వం హాజరు కానుందని, చర్చల అనంతరం కొనసాగింపుపై మరింత స్పష్టత వస్తుందని వారు తెలిపారు. స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ సిటీ: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 3,318.25 లక్షల విలువైన 798 యూనిట్లు మంజూరు చేశారన్నారు. వీటికి సబ్సిడీ కింద రూ.1310.10 లక్షలు, బ్యాంకు రుణం రూ.1,824.24 లక్షలు, లబ్ధిదారు వాటా రూ.165.91 లక్షలుగా నిర్ణయించారని వివరించారు. దీని ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు రూ.2.50 లక్షల నుంచి రూ.20 లక్షల విలువైన 32 రకాల స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న ఎస్సీ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత వెబ్సైట్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అందుబాటులోకి వస్తుందని, దీని ద్వారా వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పూర్తి వివరాలకు సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో సంప్రదించాలని సత్యవతి సూచించారు. పీజీఆర్ఎస్కు 478 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు 478 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సీపీఓ పి.త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటికి సత్వరమే సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీనూకాంబిక ఆలయ అభివృద్ధికి విరాళం ఆలమూరు: చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి గుమ్మిలేరుకు చెందిన వ్యాపారవేత్త ముత్యాల వీర భాస్కరరావు, కృష్ణవేణి దంపతులు సోమవారం రూ.1,01,116 అందజేశారు. గాలి గోపురం నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చారు. ఈఓ ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఉత్సవ కమిటీ చైర్మన్ గన్ని వెంకట్రావు (అబ్బు)కు నగదు రూపంలో ఆలయ ఆవరణలో అందజేశారు. -
గ్రాసిమ్ నుంచి ముడుపుల కోసమే..
పెదపూడి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి, వారి నుంచి ముడుపులు పొందడమే ధ్యేయంగా అసెంబ్లీ వేదికగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్యాన్సర్ ప్రచారం చేశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అంతే తప్ప బలభద్రపురం, పరిసర ప్రాంత ప్రజల క్షేమం కోరి కాదని అన్నారు. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే నల్లమిల్లి లేవనెత్తిన క్యాన్సర్ అంశం బలభద్రపురానికి శాపంగా మారిందని ధ్వజమెత్తారు. ఇటీవల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడినట్టుగా క్యాన్సర్పై ముందే ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయించి, అప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాగుండేదని అన్నారు. అలా కాకుండా బలభద్రపురంలో 200 మందికి పైగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను పరామర్శించానంటూ ఎమ్మెల్యే చెప్పారని, దీనిలో నిజం ఎంతుందో ఆయనకే తెలుసని అన్నారు. తప్పుడు ప్రచారంతో ఊరికి చేటు అసెంబ్లీలో రామకృష్ణారెడ్డి క్యాన్సర్ అంశాన్ని ప్రస్తావించడం, దానిపై మీడియా అత్యుత్సాహంతో విపరీత ప్రచారం కల్పించడంతో బలభద్రపురం ప్రాంతాన్ని క్యాన్సర్ భూతం కబళించిందేమో అనే స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగిందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఈ ప్రచారంతో ఆ గ్రామంలోని తమ వారి ఇళ్లకు రావటానికి ఇతర ప్రాంతాల్లోని బంధువులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ వచ్చినా కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా భయపడిపోతున్నారన్నారు. అలాగే, ఆ ఊరి వారితో వివాహ సంబంధాలు కలుపుకోవాలన్నా బయటి గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలభద్రపురంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో సర్వే చేస్తూంటే, వారిని కూడా బెదిరించి విషయాన్ని పక్కతోవ పట్టిస్తూ లేనిది ఉన్నట్లుగా చూపించేందుకు ఎమ్మెల్యే విఫలయత్నం చేశారని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ప్రభుత్వ సర్వేలో జాతీయ సగటు కంటే తక్కువగా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారని గుర్తు చేశారు. డైవర్షన్ రాజకీయాలకు అలవాటు పడిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంకా స్వతంత్ర సర్వే అంటూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీ ఏర్పాటు సమయంలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసునని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి చెప్పారు. 2019 ప్రథమార్ధంలోనే నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే కేపీఆర్ సంస్థ నుంచి గ్రాసిమ్ సంస్థకు భూబదలాయింపు చేశారన్నారు. ఆ తర్వాత వెంటనే దొంతమూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారం రోజుల్లో భూబదలాయింపు ఉత్తర్వులు రద్దు చేయిస్తానని చెప్పి, ఆ పని ఎందుకు చేయించలేకపోయారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీ వలన ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే, అధికారంలో ఉన్నందున చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అంతే తప్ప అవగాహన లేకుండా బలభద్రపురానికి, పరిసర ప్రాంతాలకు మాయని మచ్చ తీసుకు రావద్దని హితవు పలికారు. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, అంతా మంచి జరుగుతుందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ ప్రచారం అనపర్తి ఎమ్మెల్యే అత్యుత్సాహం బలభద్రపురానికి శాపం వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ధ్వజం -
లక్ష్మీ.. రావేం మా కొండకి?
వ్యయం కేటగిరీ రూ.కోట్లలో సిబ్బంది జీతభత్యాలు 23.35 పెన్షన్లు 13.71 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ 8.10 ప్రసాదం సరకుల కొనుగోళ్లు 23.17 వ్రతాల విభాగం కొనుగోళ్లు 5.05 పడితరం, పూజలు 00.51 ఉత్సవాల ఏర్పాట్లు 1.63 పురోహితులు, ఇతరుల పారితోషికాలు 16.00 శానిటేషన్ 6.60 ధర్మ ప్రచారం 00.50 ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ 2.11 ట్రాన్స్పోర్టు 1.43 విద్యాసంస్థలు, దత్తత ఆలయాలు 5.09 ఎస్పీఎఫ్, సెక్యూరిటీ గార్డులు 4.36 సీజీఎఫ్, ఇతర చెల్లింపులు 12.49 వివిధ నిర్మాణాలు 12.75 ఎలక్ట్రికల్ వర్క్స్ కొనుగోళ్లు 4.53 ఇతర ఖర్చులు 00.04 మొత్తం (సుమారు) 141.49 ఇతర వ్యయాలు, అడ్వాన్సులు, డిపాజిట్లు రూ.6.05 కోట్లు● రత్నగిరి వాసుడిని కటాక్షించని శ్రీమహాలక్ష్మి ● ఖర్చుకు రూ.6 కోట్ల దూరంలో సత్తెన్న ఆదాయం ● 2024–25లో రాబడి రూ.135 కోట్లు ● వ్యయం రూ.1.41 కోట్లు ● అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఆదాయానికి భారీగా గండి అన్నవరం: అనుకున్నదే జరిగింది.. రత్నగిరి వాసుడు సత్యదేవుడిని లక్ష్మీదేవి పూర్తి స్థాయిలో కరుణించలేదు. ఫలితంగా ఒకప్పుడు మిగులు నిధులతో, సిరిసంపదలతో తులతూగిన అన్నవరం దేవస్థానంలో ఇప్పుడు రాబడి తగ్గి, ఖర్చు పెరిగింది. ఫలితంగా 2024–25లో వ్యయం కన్నా వార్షికాదాయం రూ.6 కోట్లు తక్కువగా నమోదైంది. గత ఏడాది సగం గడిచినప్పటి నుంచే ఈ పరిస్థితి కనిపిస్తున్నా చక్కదిద్దడంలో అధికారులు విఫలమవడం.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో దేవస్థానం ఆర్థిక పరిస్థితి దిగజారింది. 2019–24 మధ్య ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో కరోనా విపత్తు రెండేళ్లు పంజా విసిరి, భక్తుల రాక తగ్గినా.. దేవస్థానం ఆదాయంపై ఆ ప్రభావం పడలేదు. అటువంటిది కూటమి పది నెలల పాలనలో అంతా సజావుగా ఉన్నా ఆదాయం పెరగకపోవడం గమనార్హం. ఖర్చయిపోయిందిలా.. అన్నవరం దేవస్థానానికి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.135,69,42,831 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఖర్చు వ్యయం రూ.141,49,16, 971 అయింది. దీంతో దేవస్థానం ఆదాయం కన్నా వ్యయం సుమారు రూ.6 కోట్లు అధికంగా నమోదైంది. ఇటీవలి కాలంలో ఈవిధంగా ఆదాయం తగ్గి, ఖర్చు పెరగడం ఇదే ప్రథమం. ప్రదక్షిణ దర్శనం రద్దుతో రూ.5 కోట్ల నష్టం సత్యదేవుని ఆలయంలో రూ.300 టికెట్టుతో ప్రదక్షిణ దర్శనాన్ని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ ప్రారంభించారు. ఆలయంలో నాలుగు మూలలా శ్రీగంధం గిన్నె, లక్ష్మీ హుండీ, పారిజాత వృక్షం, కామధేనువు విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ప్రదక్షిణ దర్శనానికి మొగ్గు చూపేవారు. 2023 అక్టోబర్లో ఈ దర్శనం ప్రారంభిస్తే నెల రోజుల్లోనే సుమారు రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. అయితే, ఆజాద్ బదిలీ తరువాత ఈఓగా వచ్చిన కె.రామచంద్ర మోహన్ ఈ దర్శనాన్ని నిలిపివేశారు. ఆయన తరువాత ఈఓగా వచ్చిన వీర్ల సుబ్బారావు కూడా దీనిని పునరుద్ధరించలేదు. ఈ ప్రదక్షిణ దర్శనం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దేవస్థానం ఏటా సుమారు రూ.6 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. గత ఏడాది మిగులుతో వ్యయాల సర్దుబాటు గత ఏడాది రూ.7 కోట్లు మిగలడంతో ఆ మొత్తంలో రూ.6 కోట్లు ఈ ఏడాది వ్యయాలకు సర్దారు. 12 ఏళ్ల క్రితం కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు వ్యయం రూ.కోటి మాత్రమే ఎక్కువైంది. వైఎస్సార్ సీపీ పరిపాలనలో 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ దేవస్థానం వెంటనే రికవరీ అవడంతో లోటు కనిపించలేదు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, చిన్నచిన్న విషయాలను కూడా పెద్ద వివాదాలుగా మార్చడం, దేవస్థానంపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినా సిబ్బంది సలహాల ప్రకారం కాకుండా సొంత అజెండాతో వ్యవహరించడం వంటి చర్యలతో దేవస్థానం ప్రతిష్ట మసకబారుతోంది. ఫలితంగా భక్తుల రాక తగ్గి, ఆదాయం తగ్గుతోంది. ఇటీవల అధికారులు తీసుకున్న నిర్ణయమే దీనికి తాజా ఉదాహరణ. నీటి సమస్య సాకుతో ఏసీ గదులను ఒక రోజు అద్దెకివ్వకపోవడంతో దేవస్థానం సుమారు రూ.లక్ష ఆదాయం కోల్పోయింది. ఆ తరువాత ఏసీ గదులు అద్దెకివ్వడం పునరుద్ధరించినా ఇప్పటికీ వాటిని అద్దెకివ్వడం లేదనే భావనే భక్తుల్లో ఉంది.అన్నవరం దేవస్థానం2024–25 ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాల వివరాలు ఆదాయం రూ.కోట్లలో వ్రతాలు 38.40 ప్రసాదాల విక్రయం 33.07 హుండీల ద్వారా 18.79 షాపుల వేలం, లీజులు 15.77 వసతి గదుల అద్దెలు 12.27 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 5.49 ఇతర ఆర్జిత సేవలు 4.13 ట్రాన్స్పోర్టు 2.03 డిపాజిట్లపై వడ్డీలు 4.80 కేశఖండన టికెట్ల ద్వారా 00.94 మొత్తం (సుమారు) 135.69 అడ్వాన్సులు, డిపాజిట్లు, క్యాపిటల్ డొనేషన్లు 7.20 -
‘సాక్షి’ తోడుగా.. దేవస్థానానికి ఆదా
● రత్నగిరిపై నెలకు రూ.23,990కే ‘చెత్త’ ట్రాక్టర్ కాంట్రాక్ట్ ఖరారు ● గతంలో టెండర్ లేకుండానే రూ.60 వేలకు అప్పగింత ● దీనిపై ‘సాక్షి’ కథనం ● స్పందించి టెండర్ పిలిచిన అధికారులు ● తాజాగా మరింత తక్కువకు కొటేషన్ ● దేవస్థానానికి నెలకు రూ.36,010 మిగులు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ట్రాక్టర్తో చెత్త తరలించేందుకు గాను నెలకు రూ.23,990కు టెండర్ ఖరారైంది. దీనికి సంబంధించిన వివరాలివీ.. రత్నగిరిపై సత్యదేవుని వ్రతాల్లో ఉపయోగించిన పత్రి, పువ్వులు, తమలపాకులతో పాటు ఆలయ ప్రాంగణంలో చెత్తను తరలించే పనిని గతంలో శానిటరీ కాంట్రాక్టర్ నిర్వహించేవారు. గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఈ కాంట్రాక్ట్ నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్థ మార్చి 1 నుంచి వైదొలగింది. దీంతో, దేవస్థానంలో చెత్త తరలింపునకు ఒక ట్రాక్టర్, రెండు ట్రక్కులు, ట్రాక్టర్కు అవసరమయ్యే డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు భరించేలా నెలకు రూ.60 వేలకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. టీడీపీలోని ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి సిఫారసుతో ఆ పార్టీ కార్యకర్తకు ఏకపక్షంగా ఈ పనిని అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో చెత్త ట్రాక్టర్ నిర్వహించిన యడ్ల కృష్ణ అనే వ్యక్తి తాను నెలకు రూ.43 వేలకే చెత్త తరలిస్తానని లిఖితపూర్వకంగా తెలియజేసినా దేవస్థానం అధికారులు స్పందించలేదు. ఈ వ్యవహారంపై ‘రత్నగిరిపై చెత్త వివాదం’ శీర్షికన మార్చి 28న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో విధి లేని పరిస్థితిలో స్పందించిన అధికారులు చెత్త తరలింపునకు టెండర్ పిలిచారు. ఈ టెండర్లను సోమవారం తెరవగా నాలుగు కొటేషన్లు వచ్చాయి. వీటిలో అతి తక్కువగా నెలకు రూ.23,990కే దాఖలైన టెండర్ను ఖరారు చేశారు. ‘సాక్షి’ కథనం కారణంగా దేవస్థానానికి నెలకు రూ.36,010, సంవత్సరానికి రూ.4,32,120 మేర ఆదా అయ్యింది. శానిటేషన్ టెండర్ పిలిస్తే రూ.లక్షల్లో ఆదా చెత్త ట్రాక్టర్ టెండర్లోనే దేవస్థానానికి నెలకు రూ.36,010 ఆదా కాగా, ఇక శానిటేషన్ టెండర్ కూడా పిలిస్తే రూ.లక్షల్లో ఆదా అయ్యే అవకాశం ఉంది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి టెండర్ పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో గుంటూరుకు చెందిన కనకదుర్గ సర్వీసెస్ సంస్థకు 349 మంది పని వారిని సమకూర్చే పనిని అప్పగించారు. వాస్తవానికి దీనిని కూడా టెండర్ ద్వారానే చేయాల్సి ఉంది. ప్రస్తుతం దేవస్థానం అధికారులు శానిటరీ మెటీరియల్ సూపర్బజార్లో కొనుగోలు చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణకు సుమారు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీనికి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా భవిష్యత్తులో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శానిటేషన్ కాంట్రాక్టుకు కూడా టెండర్ పిలిస్తే దేవస్థానానికి నెలకు రూ.10 లక్షల వరకూ మిగిలే అవకాశం ఉంది. దీనిపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. -
జాతీయ కళా డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో కోనసీమ కళాకారులు
కొత్తపేట: దేశవ్యాప్త కళాకారులతో న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరు గరగ నృత్యం కళాకారులు పాల్గొన్నారు. కొత్తపేట మండలం పలివెలకు చెందిన కొమారిపాటి ఏసువెంకటప్రసాద్, మండపేట రూరల్ మండలం తాపేశ్వరానికి చెందిన కొరివి కళ్యాణ్కు ఈ అవకాశం దక్కింది. ఈ ఏడాది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో దేశ వ్యాప్తంగా వివిధ కళారూపాలకు చెందిన 5,196 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. కాగా ఢిల్లీలోని భారత సంగీత, నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆయా కళాబృందాల్లో ఒక్కో బృందం నుంచీ ఇద్దరి చొప్పున మొత్తం 100 మందిని ఎంపిక చేసి ‘జయతి జయమమ్మా భారతం’ పేరుతో డాక్యుమెంటరీ ప్రోగ్రాం చేశారు. ఇందులో కోనసీమ జిల్లాకు చెందిన ఏసువెంకటప్రసాద్, కళ్యాణ్ గరగ నృత్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్యాపుణిచ, సెక్రటరీ రాజుదాస్ తదితర ప్రముఖులు అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. ఏసు వెంకటప్రసాద్ గరగ నృత్యం జానపద కళా విభాగంలో సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. -
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి..
● వైభవంగా రత్నగిరి రాములోరి కల్యాణం ● పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అమ్మవారు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదివారం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు తిలకిస్తుండగా.. రత్నగిరిపై రామాలయం పక్కన వార్షిక కల్యాణ వేదిక మీద.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ ఈ క్రతువును కన్నుల పండువగా దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు పండితులు సీతారాములకు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. వధూవరులైన సీతారాములను ఉదయం 7 గంటలకు వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీపై గ్రామంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం సీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై సీతారాములను వేద మంత్రోచ్చారణల నడుమ పండితులు వేంచేయించారు. పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు. ఉదయం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో సీతారాముల కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. సీతారాములకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు పట్టువస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశేషాలతో కూడిన ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) వివరించారు. అనంతరం పుణ్యాహవాచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, యుగఛిత్రాభిషేకం తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఉదయం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర – బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్టులకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులైన సీతారాములకు పండితులు వేదాశీస్సులు అందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. రాత్రి నవ వధూవరులు సీతారాములకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకులు దేవులపల్లి ప్రసాద్, చిట్టిం వాసు, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కొండలరావు పర్యవేక్షించారు. సీతారాముల కల్యాణానంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. దీనికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే శ్రీరామనవమి నాడు మాత్రం తొలుత సీతారాముల కల్యాణం జరుగుతుంది. -
వచ్చే నెల 7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల నిర్వహణ దిశగా అన్నవరం దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీరామ నవమి పర్వదినమైన ఆదివారం సత్యదేవుని కల్యాణోత్సవాల వాల్ పోస్టర్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఆవిష్కరించారు. మే 7వ తేదీ (వైశాఖ శుద్ధ దశమి) నుంచి మే 13వ తేదీ (వైశాఖ బహుళ పాడ్యమి) వరకూ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మే 8వ తేదీ (వైశాఖ శుద్ధ ఏకాదశి) రాత్రి 9 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దివ్య కల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వేద పండితుడు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, ఏఈఓలు కొండలరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో వినియోగించేందుకు గాను విశాఖ జిల్లా గాజువాకకు చెందిన గుంటపల్లి ప్రసాద్ అరకిలో ముత్యాలను ఈఓ సుబ్బారావుకు అందజేశారు. వక్ఫ్ బిల్లుపై న్యాయ పోరాటం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కాకినాడ ముస్లిం సమాఖ్య, మేవా, ముస్లిం అడ్వొకేట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయించాయి. నగరంలోని మేవా హాలులో కాకినాడ ముస్లిం సమాఖ్య అధ్యక్షుడు ఎస్ ఏజాజుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఆదివారం జరిగిన సమావేశంలో మేవా అధ్యక్షుడు ఎమ్డీ జవహర్ ఆలీ, కార్యదర్శి సయ్యద్ సలార్ వక్ఫ్ బిల్లు–2025లో పొందుపరచిన అంశాలపై చర్చించారు. ఏజాజుద్దీన్ మాట్లాడుతూ, ఈ బిల్లు వలన ముస్లిం సమాజానికి కలిగే అనర్థాలను విస్తృతంగా తీసుకుని వెళ్లాలని, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఉద్యమించాలని అన్నారు. జవహర్ ఆలీ మాట్లాడుతూ, ఈ బిల్లుపై సర్వోన్నత న్యాయస్థానంలో పోరాడాలని, దీనిపై ముస్లింలకు అవగాహన కార్యక్రమలు నిర్వహించాలని సూచించారు. నగరంలోని ముస్లిం యువత, ఉద్యోగులు, మేధావులతో త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేసి, ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ముస్లిమేతర సంఘాలతో చర్చలు జరిపి, అందరి మద్దతూ కూడగట్టాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీలకతీతంగా రామచంద్రపురం, పిఠాపురం ప్రాంతాల నుంచి కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అభిప్రాయాలు తెలియజేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు గౌస్ మొహిద్దీన్ నవాబ్, అబ్దుల్ బషీరుద్దీన్, రహ్మన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఆరోగ్య కష్టం!
ఇవీ డిమాండ్లు ● జిల్లాకు రావలసిన సుమారు రూ.150 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ● క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం చేసి, చెల్లింపులు వేగవంతం చేయాలి. ● కొత్త టారిఫ్లు నిర్ణయించాలి. వివిధ చికిత్సలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న టారిఫ్లను సమీక్షించాలి. ● సమస్యల పరిష్కారంపై తగిన కాలపరిమితితో స్పష్టతనివ్వాలి. ● నిధులు విడుదలైన సందర్భాల్లో కార్యాలయాల స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ఇతర సమస్యల వల్ల కలుగుతున్న జాప్యాన్ని నివారించాలి. ● బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం ● సుమారు రూ.150 కోట్ల మేర బకాయి ● నిర్వహణ కష్టమవుతోందంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు ● నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్! కాకినాడ క్రైం: కూటమి సర్కార్ నిర్వాకంతో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) సేవలు సోమవారం నుంచి పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ పథకం కింద రోగులకు చికిత్సలు, శస్త్రచికిత్సలకు నెట్వర్క్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు వెచ్చించాయి. వాటికి ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. దీనిపై పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినా.. అధికారం చేపట్టిన పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం నయా పైసా కూడా చెల్లించలేదు. మరోవైపు పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా ప్యాకేజీల ధరలు మార్చాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సిబ్బంది జీతాలు సహా ఆసుపత్రుల నిర్వహణ భారమవుతోందని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడనుంది. 26 లేఖలు రాసినా.. ఎన్టీఆర్ వైద్యసేవల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు నివేదిస్తూ సంఘ జిల్లా నాయకత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వానికి 26 లేఖలు రాశారు. వీటిపై ప్రభుత్వం నుంచి ఇసుమంతైనా స్పందన కానరావడం లేదు. చివరిగా గత నెల 7న అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినా, ప్రభుత్వం స్పందించలేదు. ఎన్టీఆర్ వైద్య సేవను ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేయనున్న నేపథ్యంలో ప్యాకేజీల ఖరీదు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది నెట్వర్క్ ఆసుపత్రులకు మరో పెను సవాలు కానుంది. రూ.150 కోట్ల బకాయి జిల్లాలో 41 మల్టీస్పెషాలిటీ, 9 డెంటల్ కలిపి మొత్తం 50 ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటికి గడచిన 11 నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం, విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక సేవల నిలిపివేతకు యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. నల్ల రిబ్బన్లతో ప్రదర్శన, వినతుల వెల్లువ సహా అన్ని మార్గాల్లోనూ తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించడానికి నానా పాట్లూ పడ్డాయి. పట్టించుకోని నేతలు తమ ఓట్లతో గద్దెనెక్కిన కూటమి నేతల అసలు రంగు బయట పడుతోందని వైద్యులు చర్చించుకుంటున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆటంకం కలగకూడదనే సదుద్దేశంతో కూటమి ప్రజాప్రతినిధుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూంటే తమను అలుసుగా చూస్తూ, అవమానించారని వాపోతున్నారు. జిల్లాలోని కూటమి నేతల కార్యాలయాల ముందు వినతిపత్రాలతో పడిగాపులు కాయించారని పలు ఆసుపత్రుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపుపై గత ఏడాది ఆగస్టులో నేతలు కోతలు కోసినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వారు చెబుతున్నారు. పేదలకు ప్రాణసంకటం ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవ అని మారిస్తే సరిపోయిందా? ఆ స్ఫూర్తి కొనసాగించవద్దా! నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్ న్యాయబద్ధమైనదే. ప్రభుత్వం రూ.కోట్లకు కోట్లు బకాయి పెడితే ఆసుపత్రులు నడిచేదెలా? సేవల నిలుపుదల వరకూ రావడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఈ పరిస్థితి పేదలకు ప్రాణసంకటం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి, ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగేలా చూడాలి. – పలివెల వీరబాబు, సీఐటీయూ కాకినాడ నగర కో కన్వీనర్, మాజీ సర్పంచ్, ఇంద్రపాలెం, కాకినాడ -
జగన్మోహనం.. శివకేశవ క్షేత్రం
● భక్తులను ఆకట్టుకునే ద్విముఖ రూపాలు ● కోరిన కోర్కెలు నెరవేర్చే దివ్య స్వరూపం ● ప్రపంచ ప్రసిద్ధి చెందిన ర్యాలి క్షేత్రం ● నేటి నుంచి కళ్యాణ మహోత్సవాలు కొత్తపేట: ముందు పురుషరూపం, వెనక సీ్త్ర రూపంతో ఏకశిలలో జగన్మోహినీ, విష్ణువు సాక్షాత్కరించే అద్భుత క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే క్షేత్రం ర్యాలి. ఈ క్షేత్రంలో ఈ నెల 6 నుంచి 13 వరకూ స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం ఆరో స్థానాన్ని దక్కించుకని ఖ్యాతికెక్కింది. ఈ క్షేత్రంలో ముందు భాగం కేశవుని రూపం, వెనుక జగన్మోహినీగ స్వయంభూగా అవతరించారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఏకశిలా విగ్రహం ఉన్న ఈ ఆలయంలో అణువణువునా ఉన్న అద్భుతాలు భక్తి భావాలను పెంపొందిస్తాయి. ఈ ఆలయంలో భక్తులందకీ గర్భాలయ ప్రవేశం ఉండటం విశేషం. అంతే కాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం ఒక విశేషం. కాగా శివాలయంలో నీరు ఇంకి పోవడం, శ్రీజగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదముల నుంచి నిరంతరం నీరు (గంగ) ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెప్తోంది. ఆలయ విశిష్ట చరిత్ర ఈ ఆలయ ప్రత్యేకతలకు తగినట్లే ఆ దైవం వెలిసిన విధానం కూడ ఒక చరిత్ర సంతరించుకుంది. ఈ ఆలయంలో దైవం, రాక్షస సంహారంలో భాగంగా ఏర్పడిన ఒక అవతారమని చారిత్రక కథనం. ఇటు గౌతమి అటు వశిష్ట నదీ పాయల మధ్య ఆవిర్భవించిన ఈ ఆలయ స్థాపనకు, ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు రావడానికి కూడా ఒక కథ ఉన్నట్టు పండితులు వెల్లడిస్తున్నారు. విక్రమదేవుడు అనే భక్తుడు ఒకప్పుడు అడవిలా ఉన్న ప్రాంతంలో వేట సాగిస్తూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతనికి కలలో కనబడిన మహావిష్ణువు స్వయంభూ శిల రూపంలో నేను ఈప్రాంతంలో ఉన్నానని నీవు కర్రతో రథం చేయించి లాగుకొని వెళ్ళితే ఆ రథం శీల రాలి పోతుందని అక్కడ తవ్వితే విగ్రహం బయట పడుతుందిని చెప్పి అదృశ్యమయ్యాడని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ ప్రకారం విక్రమ దేవుడి ద్వారా ఈ విగ్రహం బయటపడిందని చరిత్ర చెబుతోంది. రథం శీల రాలడం వలన ఈ దైవం వెలసిన ప్రాంతానికి శ్రీర్యాలిశ్రీ అని పేరు వచ్చిందని నానుడి. పాప సంహారం కోసం వెలసిన దైవం అమృతం కోసం తగవులాడుకుంటున్న దేవదానవులను శాంతిపజేసి దానవులకు అమృతం అందకుండా చేసేందుకు మహా విష్ణువు జగన్మోహినీగా ఈ లోకంలో అవతరించిన విషయం తెలిసిందే. ఆ ఘట్టం ముగిసిన తరువాత అత్యంత సుందరంగా ఉన్న జగన్మోహినిని మోహించిన శంకరుడు ఆమెను వెంటాడటంతో సీ్త్ర రూపంలో ఉన్న విష్ణుమూర్తి ర్యాలి గ్రామం వరకూ వచ్చి ఇక్కడ అంతర్థానమైనట్టు ఆలయ చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ మోహించుకోవడాన్ని సర్వజనానికి తెలిసేటట్టు చేయడం కోసం సీ్త్ర పురుష రూపాల్లో ఏక శిలలో లోకనాఽథులు ఇద్దరూ ఇక్కడ స్వయంభూలుగా వెలిశారని భక్తులు విశ్వాసం అడుగడుగునా అద్భుతాలే లోకనాథులు వెలసిన ఈ గ్రామంలో జగన్మోహిహినీ కేశవస్వామి ఆలయంలో అణువణువునా అద్భుతాలే కనిపిస్తాయి. అత్యంత ఎత్తయినా పురాతన నిలువు గోపురం అందరినీ ఆకర్షించే గర్భగుడితో పాటు శ్రీదేవి, భూదేవి విగ్రాహాలు సైతం ఎంతగానో అకర్షిస్తాయి. ఇవి అన్ని ఒక ఎత్తయితే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వింత. ఈ ఆలయ ప్రధాన విగ్రహమే ఐదు అడుగుల ఎత్తున ఉన్న సాలగ్రామ ఏక శిలలో సీ్త్ర పురుష రూపాల్లో శివ కేశవులు సాక్షాత్కరించడం భక్తి పారవశ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ఒక్క శిలలోనే రెండు విధాలైన ఆలయాలు, పొన్న చెట్టు, దక్షిణ భాగంలో గోవర్ధన పర్వతం, మకర తోరణం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సాలగ్రామ ఏక శిలా విగ్రహంలోనే దశావతారాలు కన్పించడం మరో అద్భుత విశేషం. కంఠంలోని హారాలు, కర కంకణాలు, శంకు చక్రాలు జీవం ఉట్టి పడేలా శివకేశవులే మన ముందు ప్రత్యక్ష మయ్యినట్టుగా చూసేవారికి అనుభూతి కలుగుతుంది. సాలాగ్రామ విగ్రహం పాదాల వద్ద గంగా జలం నిత్యం ఉబుకుతూనే ఉండడం ఇక్కడ మరో విశిష్టత. పాదాల వద్ద వున్న గంగాదేవి విగ్రహం నుంచి ఈ జలం ప్రవహిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతుందని భక్తుల విశ్వాసం. విగ్రహం వెనుక వైపు వున్న జగన్మోహినీ రూపం మరింత సమ్మోహనం. సీ్త్ర రూపంలో వున్న మహాశిష్ణువు అత్యంత సౌందర్యంగా కనిపిస్తారు. శిరమున సిగచుట్టూ అప్పుడే సంపెంగ నూనె రాసుకొన్నట్లున్న శిరోజాలు సహజమైన చీర కట్టు, తలలో ముచ్చటగొలిపే చామంతి పువ్వు విశేషంగా కనిపిస్తాయి. అంతేకాక పద్మినీ జాతి సీ్త్రలకు శుభసూచకంగా ఉండేలా పుట్టుమచ్చలు సైతం ఈ విగ్రహంలో సాక్షాత్కరించడం భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వుంటుంది. రావులపాలెం బస్ కాంప్లెక్సు నుంచి రెండు గంటలకు ఒకసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కల్యాణ మహోత్సవాలు ఇలా.. ఆదివారం గరుడ వాహన సేవ, గ్రామోత్సవం, రాత్రి 8–45 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం, 7, 8, 9 తేదీల్లో స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, పదో తేదీన సదస్యం, 12న చక్రస్నానం, 13న శ్రీపుష్పోత్పవంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయని దేవస్థానం ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు. -
రారండోయ్ రాములోరి కల్యాణానికి..
● సత్యదేవుడు అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా వధూవరులైన సీతారాములు ● పసుపు దంచిన ముత్తయిదువలు ● రత్నగిరి క్షేత్ర పాలకుడు సీతారాముని కల్యాణం నేడు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడైన శ్రీరాముని ఆలయంలో నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చైత్ర శుద్ధ అష్టమి శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా రాగా సాయంత్రం నాలుగు గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వధూవరులుగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ముత్తయిదువులతో పాటు ఈఓ సుబ్బారావు కొంతసేపు పసుపు దంచారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. నేడు సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉదయం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటలకు సీతారాములను వెండి హనుమద్వాహనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకీ మీద గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం రత్నగిరి రామాలయం వద్ద వార్షిక కల్యాణవేదికపై ఉదయం పది నుంచి ఒంటి గంట వరకూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో మాంగల్యధారణ జరుగుతుంది. అనంతరం భక్తులకు ప్రసాదం, వడపప్పు పానకం పంపిణీ చేస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు రోజుకొక వేడుకతో శ్రీరామ నవమిని తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి ఏడు గంటలకు రామాలయంలో జరిగే శ్రీసీతారాముల శ్రీపుష్పయోతోత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
ఆఫీసర్స్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విజయ రెడ్డి
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమలాపురం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ వీపీసీ మీటింగ్ హాల్లో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు డాక్టర్ కీర్తి రామకృష్ణ అధ్యక్షతన జరిగాయి. అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్ బాలచంద్ర యోగేశ్వర్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. విజయ రెడ్డిని జిల్లా పశువైద్య అధికారి కె.వెంకట్రావు, ఉప సంచాలకులు కర్నీడీ మూర్తి, వైద్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. పేపరు మిల్లు ఉద్యోగి అదృశ్యం రాజమహేంద్రవరం రూరల్: స్థానిక హుకుంపేటలోని అత్తారింటి నుంచి తన సొంతిల్లు ఉన్న కాతేరులోని కంఠమణివారి వీధికి వెళ్లిన పెనుమాక సునీల్కుమార్ కనిపించడం లేదని అతని భార్య పెనుమాక మాణిక్యం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తున్న పెనుమాక సునీల్కుమార్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో హుకుంపేటలోని జనచైతన్య లే అవుట్లోని అత్తగారింటి నుంచి ఏపీ 39 ఎంపీ 3018 నెంబరు రాయల్ ఎన్ఫీల్డ్పై బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాణిక్యం పేర్కొంది. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్కుమార్ ఆచూకీ తెలిసినా, మోటారు బైక్ ఆచూ కీ తెలిసినా బొమ్మూరు ఇన్స్పెక్టర్ 94407 96533, 94911 22811 ఫోన్ నెంబరులో తనకు తెలియజేయాలని ఎస్సై రమేష్ కోరారు. -
క్రీడాకారులను తయారుచేద్దామా?
● కోచ్ కావాలనుకునేవారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్న క్రీడాప్రాధికార సంస్ధ ● ఈ నెల 14 తుది గడువు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటి): క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. ఆయా స్థాయిల్లో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడాప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని, పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలా మంది శిక్షణను పూర్తి చేసుకుని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్మీడియెట్, ఆపై.. ఇంటర్మీడియెట్, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్లలోపు అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లాస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా, వర్సిటీ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ యూనివర్శిటీ స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం, ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. ఏయే అంశాల్లో .... సైక్లింగ్, క్రికెట్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జుడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, సాఫ్ట్బాల్, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, టేబుల్టెన్నిస్, లాన్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషూ, యోఆ, త్రోబాల్ తదితర క్రీడాంశాలుంటాయి. శిక్షణ కేంద్రాలు క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రాన్ని కేటాయిస్తారు. వారు యూనిఫాంతో పాటు సాధారణ దుస్తులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలలో ఎన్ఎస్ఎన్ఐఎస్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. మే 6 నుంచి జూలై 2 వరకు శిక్షణ... ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్ ఉంటాయి. మే 6 నుంచి జూలై 2 వరకు ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈనెల 14. మంచి అవకాశం క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పిస్తోంది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. వివరాలకు 89196 42248 నెంబురులో సంప్రదించండి. – శ్రీనివాస్ కుమార్, డీఎస్డీఓ -
త్వరలో వినియోగంలోకి..
● రూ.30 లక్షలతో కొత్త నివేదన శాల నిర్మించిన దాత ● ముచ్చటగా 3 నెలలే అందులో నివేదనల తయారీ ● తిరిగి ఉపయోగంలోకి తేవాలని దేవస్థానం నిర్ణయం అన్నవరం: రత్నగిరిపై సుమారు ఏడాదిన్నర కిందట ప్రారంభించి, కొన్నాళ్లు ఉపయోగించి, తరువాత నిరుపయోగంగా వదిలేసిన కొత్త నివేదన శాలను త్వరలో వినియోగంలోకి తీసుకుని రానున్నారు. వివరాలివీ.. సత్యదేవునికి నివేదనలు, పులిహోర, దద్ధోజనం, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు తయారు చేసేందుకు స్వామివారి ఆలయానికి దిగువన కుడివైపున గతంలో నివేదన శాల ఉండేది. దీనిని భక్తులు వేచియుండేందుకు వీలుగా కంపార్ట్మెంట్ తరహాలో క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు గాను మార్చారు. దీని స్థానంలో మరో నివేదన శాల నిర్మించేందుకు అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయించారు. రామాలయానికి ఎదురుగా ఉన్న సర్కులర్ మండపం మీద నూతన నివేదన శాల నిర్మించాలని పండితులు సూచించారు. దీనిపై ఈఓ అభ్యర్థన మేరకు తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) రూ.30 లక్షల వ్యయంతో కొత్త నివేదన శాల నిర్మించారు. దీనిని 2023 ఆగస్టు నెలలో దాత చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తరువాత సత్యదేవుని నివేదనలన్నీ ఇక్కడే తయారు చేసేవారు. ఈఓ ఆజాద్ 2023 నవంబర్లో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం దేవదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్గా ఉన్న కె.రామచంద్ర మోహన్ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తరువాత నివేదన శాల భూస్పర్శతో ఉండాలని కొంత మంది పండితులు సూచించారు. దీంతో పాత నివేదన శాలలోనే మరలా నివేదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పాత నివేదన శాలకు మార్పులు చేసి, 2023 నవంబర్ నుంచి అందులోనే నివేదనలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నివేదన శాల నిరుపయోగంగా మారింది. దీనిపై దాత తాతబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 21న ‘దాతల ఆశయాలకు తూట్లు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించారు. భక్తులకు పంపిణీ చేసే పులిహోర, దద్ధోజనం, చక్కెర పొంగలి వంటివి కొత్త నివేదన శాలలో తయారు చేయాలని ఆదేశించారు. వాటి తయారీకి అవసరమైన పాత్రలు, కుక్ నియామకం వంటి అంశాల్లో కొంత జాప్యం జరిగింది. గత నెల 28న నిర్వహించిన హుండీల ఆదాయం లెక్కింపు సందర్భంగా కొత్త నివేదన శాల వినియోగంపై సంబంధిత అధికారులను చైర్మన్, ఈఓ మరోసారి ఆదేశించారు. అవసరమైన వంట పాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. పాత నివేదన శాలలో పని చేస్తున్న వంట సహాయకురాలితో కొత్త నివేదన శాలలో పులిహోర తదితర ప్రసాదాలు తయారు చేయించాలని నిర్ణయించారు. వారం, పది రోజుల్లో కొత్త నివేదన శాలను వినియోగంలోకి తెస్తామని ఆలయ ఏఈఓ కొండలరావు తెలిపారు. -
8 నుంచి ఇండో – అమెరికా సైనిక విన్యాసాలు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం మరోసారి వేదిక కానున్నది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, పరసర్ప నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంఫ్–2025 పేరిట 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 1న విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 8 నుంచి కాకినాడ తీరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విన్యాసాలు ఈ నెల 13న కాకినాడలో ముగియనున్నాయి. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కాకినాడ సూర్యారావుపేటలోని నేవల్ ఎన్క్లేవ్ వద్ద ఇరు దేశాల ఉమ్మడి విన్యాసాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన నావికా దళాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని తమ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం తూర్పు నౌకాదళ పరిధిలోని విశాఖ, కాకినాడ తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ జలాశ్వ, యూఎస్ఎస్ కామ్స్టాక్ ద్వారా ఇండో, అమెరికా నావికా దళాలు విన్యాసాలు కొనసాగిస్తున్నాయి. -
హెపటైటిస్ హడల్..!
వారం రోజుల్లో పరీక్షలు పూర్తి గ్రామంలో హైపటైటిస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రకాల వైద్య సేవలందిస్తున్నాం. వారం రోజులలో పరీక్షలు పూర్తి చేస్తాం. – దుర్గారావు దొర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వైద్యులకు పూర్తి సహకారం గ్రామంలో కామెర్ల సంబంధిత వ్యాధులు ప్రభలుతుండడంతో గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టాం. తాగునీటి నాణ్యతపై మరింత దృష్టి సారించాం. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా గ్రామస్తులకు అవగాహన కల్పించడంతోపాటు వైద్యులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాం. – మల్లిడి వీర బాబ్జి, సర్పంచ్, పల్లం, కాట్రేనికోన మండలం ● తల్లడిల్లుతున్న పల్లం గ్రామం ● చురుకుగా వైద్య పరీక్షలు ● అంతకంతకూ పెరుగుతున్న కేసులు ● ఆందోళనలో మత్స్యకారులు సాక్షి, అమలాపురం/కాట్రేనికోన: రోజుల తరబడి సాగుతున్న రక్త పరీక్షలు.. పరీక్షలు జరుగుతున్న కొద్దీ బయటపడుతున్న కామెర్ల సంబంధిత వ్యాధులతో మత్స్యకార గ్రామం పల్లం తల్లడిల్లుతోంది. కాట్రేనికోన మండలం శివారు గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ గ్రామంలో హెపటైటిస్ వ్యాధి ప్రబలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కామెర్ల సంబంధిత వ్యాధులు గ్రామంలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గ్రామంలో తొలుత నలుగురు గర్భిణుల్లో కాలేయానికి సంబంధించి వాపు లక్షణాలను గుర్తించారు. వీరు కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలకు వెళ్లిన సమయంలో ఇది బయట పడింది. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో ఇక్కడ కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా మరిన్ని కేసులు వెలుగు చూశాయి. దీంతో గ్రామంలో ఉన్న అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 12 వేల వరకు జనాభా ఉండగా, వీరిలో 7,800 మంది వరకూ నివసిస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో వేటకు, ఉద్యోగ, ఉపాధికి వెళ్లారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్ల వయస్సు దాటిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకార ఇప్పటి వరకూ 2,281 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో హెపటైటిస్–బి సర్ఫేస్ యాంటిజెన్ (హెచ్బీఎస్ఏజీ) 12 మందికి నిర్ధారణ అయ్యింది. హెపటైటిస్–సి వైరస్ (హెచ్సీవీ) తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారించారు. గ్రామంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో హైపటైటిస్– ఎ, బి, సి కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 118 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తొలి దశలో చేపట్టిన ర్యాపిడ్ టెస్టులో ఇంతకు రెండు మూడు రెట్లు పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖతో సంబంధం లేకుండా స్థానికంగా వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు చేసేవారు ఒకే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం, గ్రామంలో మత్స్యకారుల సామూహిక జీవన విధానం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా సంక్రమిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు అప్రమత్తమైనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమిస్తోంది భావిస్తున్నారు. మరిన్ని పరీక్షలు జరిగితే మరికొంత మందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. అలాగే, వ్యాధి లక్షణాలున్న వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తున్నారు. వారం పది రోజులుగా ఇక్కడ కామెర్లు ప్రబలుతూండగా జిల్లా యంత్రాంగం కేవలం పరీక్షలతో సరిపెడుతోందని, వ్యాధికి సంబంధించిన మందులు వ్యాధిగ్రస్తులకు ఇంకా అందలేదని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో పరీక్షలు ముమ్మరం నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా పల్లం గ్రామంలో కొంత మందికి కాలేయ సంబంధ వ్యాధులైన హెపటైటిస్ బి, సి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత నెల 20న ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ మేరకు కలెక్టరు ఇంటింటా రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ కిట్లతో కాలేయ పరీక్షలు చేయాలని ఆదేశించారు. గత నెల 24న రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు చేసేందుకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను పల్లం హెల్త్ సెంటర్కు పంపించారు. గత నెల 25 నుంచి వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఆరు బృందాలుగా ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ వరకు రక్త నమూనాలు సేకరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన మొత్తం 5,436 మందికి రక్త నమూనాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 2,318 మంది రక్త నమూనాలు సేకరించి ర్యాపిడ్ టెస్ట్లు చేయగా హెపటైటిస్–బి 223, హెపటైటిస్–సి 80 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాట్రేనికోన వైద్యాధికారి లిఖిత మాట్లాడుతూ, పాజిటివ్ వచ్చిన వారి రక్త నమూనాలను అదనపు పరీక్షల కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. మరిన్ని పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ కేసులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న యాంటీ వైరల్ మాత్రలు అందచేస్తామన్నారు. -
చీకటి పడితేనే.. సీతారాముల కల్యాణం
పిఠాపురం: ప్రపంచమంతా శ్రీరామ నవమికి శ్రీ సీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తూంటా రు. కానీ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాత్రం చీకటి పడ్డాకే శ్రీరాముడి కల్యాణం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతున్నారు. చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. తన వంశానికి చెందిన దామర సీతాదేవి జ్ఞాపకార్థం పిఠాపురం మహారాజా రావు కుమార మహీపతి గంగాధర రామారావు బహద్దూర్ 1800 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో పిఠాపురం రాజావారి ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో ఇదొకటి. ఇక్కడ ధృవమూర్తి కూడా భద్రాచలం సీతారామచంద్రస్వామిని పోలి ఉండటం విశేషం. ప్రతి గ్రామంలో సీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తారు. కానీ ఈ ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు, సీతారామ కల్యాణం రాత్రి వేళ చేస్తూంటారు. పూర్వం పిఠాపురం మహారాజా వారికి తన ఆస్థానంలో ఉన్న అన్ని రామాలయాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీరాముడి కల్యాణాలు తన చేతుల మీదుగా జరిపించడం ఆనవాయితీగా ఉండేది. దీనిలో భాగంగా రాజావారు తొలుత పిఠాపురంలోని ఆలయాలను, తరువాత గొల్లప్రోలు ఆలయాలను సందర్శిస్తూ చివరిగా చేబ్రోలు చేరుకునే సమయానికి చీకటి పడేది. దీంతో ఆయన వచ్చిన తర్వాతనే రాత్రి సీతారాముల కల్యాణం జరిపించేవారు. దీంతో ఇదే ఈ ఆలయంలో ఆనవాయితీగా మారిపోయింది. రాజుల కాలం పోయినప్పటికీ అప్పటి ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాతే కల్యాణ తంతు ప్రారంభమవుతుంది. కల్యాణోత్సవం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అలా శ్రీరామ నవమి నాడు కల్యాణం ప్రారంభమై, అర్ధరాత్రి 12 గంటలు దాటడంతో మరునాడు పూర్తవుతుంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఈ కల్యాణోత్సవాలు చేస్తూంటారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మొదటి రోజు శేష, రెండో రోజు హనుమంత, మూడో రోజు గజ, నాలుగో రోజు పొన్న వాహనాలపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఐదో రోజు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీపుష్ప యాగంతో ఈ కల్యాణోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకుడు రేజేటి రామానుజాచార్యులు తెలిపారు. ఈ ఏడాది సీతారాముల కల్యాణాన్ని వేలాదిగా తరలి వచ్చిన భక్త జన సందోహం తిలకిస్తూండగా ఆదివారం అర్ధరాత్రి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. -
జగ్జీవన్రామ్కు ఘన నివాళి
కాకినాడ సిటీ: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్ సమీపంలోని లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో జగ్జీవన్రామ్ విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి జగ్జీవన్రామ్ ఎనలేని సేవలు అందించి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. దీపక్ను కఠినంగా శిక్షించాలివైఎస్సార్ సీపీ నేత వర్ధినీడి సుజాత పిఠాపురం: రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కారకుడైన దీపక్ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి, మహిళల పట్ల గౌరవం ఉంటే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే నాగాంజలి చనిపోయేది కాదన్నారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని హోం మంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు కనీసంగా కూడా పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. జరుగుతున్న దారుణాలు సంఘటనలు చూస్తూంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే విషయం అర్థమవుతోందన్నారు. మహిళలు అన్నీ గమనిస్తున్నారని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే మహిళా లోకం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుందని హెచ్చరించారు. మొదటి నుంచీ నేర చరిత్ర ఉన్న దీపక్కు పడే శిక్ష మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారి వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉండాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని సుజాత అన్నారు. -
నాగాంజలి మృతి బాధాకరం
● ఆమె ఆఖరి కోరిక ప్రకారం దీపక్కు కఠిన శిక్ష పడాలి ● ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ● బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి బాధాకరమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. ఆమె మరణవార్త తెలుసుకుని పోస్ట్మార్టం చేస్తున్న ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆయన శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై ఆమె తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దీపక్కు కఠిన శిక్ష పడాలని నాగాంజలి కోరుకుందని, అది నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపక్ లాంటి కీచకులకు తగిన శిక్ష విధించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చన్నారు. నాగాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తానేదో రాజకీయం చేస్తున్నట్లు కొందరు పేర్కొనడం తగదని భరత్రామ్ పేర్కొన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నప్పుడు తాను కూడా వెళ్లానన్నారు. నాగాంజలి స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా.. లేక ఎవరైనా చేశారా అనే అనుమానాస్పద ఘటన నేపథ్యంలో ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకూ అండగా ఉండాలని భావించామని వివరించారు. అప్పుడే విషయం బయటకు వచ్చిందని, లేకుంటే ఆ రోజు సాయంత్రమే చక్కబెట్టేసి ఉండేవారని అన్నారు. విషయం బయటకు వచ్చాకే దీపక్పై కఠిన సెక్షన్లు పెట్టారన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి స్పందించకపోవడం, కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. దీనినిబట్టి కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకు ఇచ్చే గౌరవమేమిటో అర్థమవుతోందని భరత్రామ్ అన్నారు. -
తప్పిపోయిన బాలుడు చైల్డ్ హెల్ప్లైన్కు అప్పగింత
కాకినాడ సిటీ: ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో సికింద్రాబాద్ నుంచి కాకినాడ వచ్చే ట్రైన్ నంబర్ 67446 ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎం2 కోచ్లో 8 ఏళ్ల బాలుడు ఎక్కినట్లు గుర్తించిన టీటీ ఎస్ అచ్యుతరావు ఆ బాలుడిని కాకినాడ ఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి శుక్రవారం అప్పగించారు. ఈ బాలుడి విషయాన్ని సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్. విజయలక్ష్మికి వివరించగా ఆమె బాలుడి వివరాలను తెలుసుకున్నారు. బాలుడి పేరు పి.గణేష్, తండ్రి రాజు, వయస్సు 8 సంవత్సరాలు బలగం పేట, అమీర్పేట, హైదరాబాద్ అని చెప్పాడన్నారు. తల్లిదండ్రులు తనను తిట్టడంతో తన తల్లిదండ్రులకు చెప్పకుండా సికింద్రాబాద్లో రైలు ఎక్కినట్లు చెప్పాడని సీ్త్ర శిశుసంక్షేమశాఖ అధికారులు వివరించారు. ఈ బాలుడిని జీఆర్పీ ఎస్ఐ ఎన్ రవికుమార్ ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బందికి సంరక్షణ నిమిత్తం అప్పగించినట్లు తెలిపారు. -
గడ్డికి గడ్డుకాలం..!
పిఠాపురం: ఎండాకాలం వచ్చిదంటే పచ్చిగడ్డి మచ్చుకై నా కనిపించదు. వేసవిలో పశుపోషణ అంతా ఎండుగడ్డి పైనే ఆధారపడి ఉంటుంది. గతంలో ఎండు వరి గడ్డికి లోటు ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఎండుగడ్డికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. దీంతో మూగజీవాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిని అధిగమించే దిశగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. ఫలితంగా పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్ర కోతలతో.. కొన్నేళ్లుగా కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు యంత్రాలతో వరి కోతలపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పులతో పంటను హడావుడిగా ఒబ్బిడి చేసుకునేందుకు యంత్రాలతో కోతలకే రైతులు సిద్ధపడుతున్నారు. కూలీలతో పోలిస్తే యంత్రాలతో కోతల వలన ఖర్చు, సమయం ఆదా అవుతోంది. అయితే, కూలీలతో కోతలు కోయిస్తే పశువులకు అవసరమైన ఎండుగడ్డి పెద్ద మొత్తంలో లభిస్తుంది. అదే యంత్రాలతో కోతలు కోస్తున్న పొలాల్లో ఎండుగడ్డి రావడం లేదు. యంత్రంతో కోతల వలన వరి దుబ్బులో సగానికి పైగా నేల మీదే ఉండిపోతుంది. మిగిలిన సగం యంత్రంలో నలిగిపోయి పశువులు తినడానికి పనికి రాకుండా పోతోంది. అక్కడక్కడ యంత్రాలతో కోసిన గడ్డిని సేకరిస్తున్నప్పటికీ డీజిల్ వాసన వస్తూండటంతో ఆ గడ్డిని పశువులు తినడం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు చాలా మంది పంట పొలాలను రొయ్యలు, చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. పలుచోట్ల పొలాలు రియల్ ఎస్టేట్ లే అవుట్లుగా మారిపోతున్నాయి. ఈ కారణాల వలన కూడా పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. పశుగ్రాస పథకాలు దూరం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కనిష్టంగా 25 సెంట్లు, గరిష్టంగా 2.5 ఎకరాల సొంత భూమి కలిగి ఉన్న రైతులకు పశుగ్రాసం పెంపకానికి చేయూతనిచ్చేవారు. సైలేజ్ గడ్డి, టీఎంఆర్ దాణా, పశుగ్రాసం పెంచడానికి పచ్చిరొట్ట విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై అందిచేవారు. దీంతో వేసవిలో పశుగ్రాసానికి కొరత లేకుండా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశుగ్రాస పథకాలను పక్కన పెట్టేశారు. దీంతో ఈ ఏడాది రబీ కోతలు మొదలైన తొలి దశలోనే పశుగ్రాసం కొరత రైతులను వెంటాడుతోంది. పెరిగిన ధరలు కేవలం కూలీలతో కోతలు కోసిన వరి గడ్డి మాత్రమే పశువులకు పనికి వస్తూండటం.. అది అతి తక్కువగా మాత్రమే అందుబాటులో ఉండటంతో గడ్డి ధరలు భారీగా పెరిగాయి. ట్రాక్టర్ ఎండుగడ్డి ధర రూ.12 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు నేరుగా పొలాల్లోనే వరిగడ్డిని కొనుగోలు చేసి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో స్థానికంగా గడ్డికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో పశువులకు మేత దొరకడం కష్టంగా మారిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు ఇక పచ్చగడ్డి కరువే యంత్రాలతో వరి కోతలు ఎండు గడ్డి కొరతతో ఇబ్బందులు పశుగ్రాస పథకాలను మరచిన ప్రభుత్వం పశుపోషణ భారంగా మారిందంటున్న పాడి రైతులు జిల్లాలో పశువుల వివరాలు ఆవులు 76,502 గేదెలు 2,82,273 గొర్రెలు 1,01,870 మేకలు 1,41,229 పశువులకు అవసరమయ్యే ఎండుగడ్డి రోజుకు 2 మెట్రిక్ టన్నులుఅప్పుడు అమ్మే వాళ్లం.. ఇప్పుడు కొనాల్సి వస్తోంది యంత్రాలు వచ్చాక పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో కోతలు కోసి, కుప్పలుగా వేసే వాళ్లం. దాంతో పశుగ్రాసానికి ఇబ్బందులుండేవి కావు. చాలా గడ్డి అందుబాటులో ఉండేది. ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడకు వచ్చి ఎండుగడ్డి కొనుక్కునే వారు. కానీ, ఇప్పుడు మా సొంత గేదెలకే గడ్డి లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల నుంచి గడ్డి కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో పశువులను పెంచడం మోయలేని భారంగా మారింది. అందుకే చాలామంది పశువులను అమ్ముకుంటున్నారు. – పెద్దింటి రాజు, రాపర్తి, పిఠాపురం మండలం ఎండుగడ్డి దొరకడం లేదు వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రస్తుతం అన్నిచోట్లా యంత్రాలతో కోతలు జరుగుతున్నాయి. దీంతో ఎండుగడ్డి దొరకడం కష్టంగా మారింది. గంతలో మనుషులతో కోతలు జరిగేవి. అప్పుడు ఎండుగడ్డి పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ వెతికినా ఎండుగడ్డి దొరకడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం ఎండలు ముదరడంతో పచ్చిగడ్డి దొరికే పరిస్థితి లేదు. ఎండుగడ్డి దొరకక పశు పోషణ కష్టంగా మారింది. – చర్మాకుల కృష్ణ, రాపర్తి, పిఠాపురం మండలం -
స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కాకినాడ లీగల్: స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్ జె.జయలక్ష్మి మాట్లాడుతూ, స్లాట్ బుకింగ్ కోసం కక్షిదారులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో లాగిన్ అయి, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు. అందులో వివరాలు పొందుపరచి, స్లాట్ బుకింగ్ ఆప్షన్కు వెళ్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎంచుకోవాలని తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ బుకింగ్ తేదీ, సమయం పచ్చ రంగులో, ముందుగా ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం నమోదు చేసుకున్న తేదీలు, సమయాల వివరాలు ఎరుపు రంగులో కనిపిస్తాయన్నారు. కక్షిదారులు పచ్చరంగులోని తేదీలను ఎంచుకోవాలన్నారు. అనంతరం కక్షిదారు మొబైల్కు వన్ టైం పాస్వర్డ్ వస్తుందన్నారు. దానిని నిర్ధారించాక స్లాట్ బుక్ అవుతుందని చెప్పారు. ఒకసారి బుక్ చేసుకున్న స్లాట్ మార్చుకోవాలంటే అదనంగా రూ.200 చెల్లించాలని తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా తొలుత రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజును సబ్ రిజిస్ట్రార్ ఆర్వీ రామారావు సమక్షంలో జయలక్ష్మి అందజేశారు. తప్పని ఇబ్బందులు స్లాట్ బుకింగ్తో కొంత మంది క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. స్లాట్ బుకింగ్ సమయానికి క్రయవిక్రయదారులు రాకపోవడంతో స్లాట్ బుకింగ్ ముగిసింది. వారికి సాయంత్రం 5.30 తరువాత ఇప్పటి వరకూ ఉన్న ఫ్రేమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ చేశారు. సాయంత్రం 5.30 తరువాత పాత విధానంలో సుమారు 30 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉదయం 10.30 నుంచి 5.30 వరకూ స్లాట్ విధానంలో సుమారు 30 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేశారు. రాత్రి 8 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తూండటంతో సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది, క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానం వలన ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
గండేపల్లి: ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యువీ శివనాగబాబు తెలియజేశారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామానికి చెందిన బాడవుల కేదార్ మణికంఠ (21) రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం రాజమహేంద్రవరం నుంచి తన స్నేహితుడైన విష్ణువర్ధన్తో కలిసి మోటార్ సైకిల్పై ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో బిర్యాని తినేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండలంలోని గండేపల్లి శివారుకు వచ్చేసరికి ఎన్టీ రాజాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వచ్చి వీరి మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో కేదార్ మణికంఠకు తీవ్రంగాను, విష్ణువర్ధన్కు స్వల్పంగాను గాయాలుకాగా వీరిని రాజానగరం జీఎస్ఎల్కు తరలించగా అప్పటికే కేదార్ మణికంఠ మృతి చెందినట్టు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. -
దోషులను కఠినంగా శిక్షించాలి
● నాగాంజలి మృతికి సంతాపం ● బాధితులను ప్రభుత్వ పెద్దలు ఎందుకు పరామర్శించలేదు? ● వైఎస్సార్ సీపీ నేత నాగమణి కాకినాడ రూరల్: ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ను, ఇతర దోషులందరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జోనల్ కార్యదర్శి జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిన నాగాంజలి కుటుంబానికి పార్టీ తరఫున ఆమె సంతాపం, సానుభూతి తెలిపారు. కాకినాడ కొత్త గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం నాగమణి మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, తాను ఇటీవల రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగాంజలిని చూశామన్నారు. ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే తన మనస్సు చలించిపోయిందన్నారు. మహిళా హోం మంత్రి ఉండి కూడా రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున నాగాంజలిని ఆస్పత్రిలో కనీసంగా కూడా పరామర్శించలేదన్నారు. గత వారం సీఎం చంద్రబాబు పోలవరం వచ్చారని, పరామర్శించాలనుకుంటే రాజమహేంద్రవరం అక్కడకు ఎంత దూరమని ప్రశ్నించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనను ఎందుకు ఖండించలేదని నిలదీశారు. సుమారు 30 వేల మంది మహిళలు కనిపించడం లేదని ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేసి జైలుకు పంపడమే పరిపాలనని ప్రభుత్వం భావిస్తోందన్నా రు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండె సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతూంటే దానిపై కూడా మంత్రి లోకేష్ సైటెర్లు వేస్తున్నారని దుయ్యబట్టారు. మా రెడ్బుక్ చూస్తే ఒకరికి గుండె నొప్పి వస్తుందని, మరొకరికి బాత్రూములో చేయి వి రుగుతుందంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి ని కూడా వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. అ హంకారం తగదని, ప్రజలను రక్షించాలనే లక్ష్యంతోనే పరిపాలన సాగించాలని నాగమణి హితవు పలికారు. -
రక్తదానంపై అవగాహనకు సైకిల్ యాత్ర
తుని రూరల్: రక్తదానంపై యువతలో అవగాహన, చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సేవ్ బ్లడ్ పేరుతో తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఆకేటి బుజ్జిబాబు శుక్రవారం సాయంత్రం సైకిల్ యాత్ర చేపట్టాడు. తుని మండలం వి.కొత్తూరు సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి బస చేశాడు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ, నాలుగు నెలల పాటు తన యాత్ర కొనసాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తానన్నారు. గతంలో కూడా తాను అనేక యాత్రలు చేశానన్నారు. -
అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు రాజమహేంద్రవరం రూరల్: కాతేరులో తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో గురువారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సదస్సుకు 18 వేలమంది హాజరయ్యారని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉండేలా సన్నద్ధం చేయాలని, అప్పుడే వారు వృద్దులోకి వస్తారన్నారు. జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ (మెయిన్), జేఈఈ (అడ్వాన్స్డ్) అండ్ నీట్లలో తరచుగా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు పుస్తకాలకన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి ఎక్కువగా అలవాటు పడ్డారని, మొబైల్తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి తల్లిదండ్రులు వివరించాలని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి కేవలం విద్య మాత్రమేనని, తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్)పరీక్షలలో 25మంది పరీక్ష రాస్తే కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందని అదే తిరుమలలో ప్రతి నలుగురిలో ఒకరికి సీటు లభిస్తోందని చెప్పారు. మెడికల్లో దేశవ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షల ప్రకారం 16మంది పరీక్ష రాస్తే కేవలం ఒకరికి సీటు లభిస్తుందని, అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందన్నారు. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులని వారిని చూసే ఎక్కువగా నేర్చుకుంటారని, కాబట్టి పిల్లల నడవడికను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని అన్నారు. విజ్ఞానభారతి నేషనల్ సెక్రటరీ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలను ఎక్కువగా చదవాలని అప్పుడే వారికి జ్ఞాన సముపార్జన లభిస్తుందని అన్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి
ఏలేశ్వరం: గత నెల 20న మండల పరిధిలోని తిరుమాలిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గెద్దనాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బొడ్డేటి నాగలక్ష్మి భర్త గోవిందు(39) గురువారం చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం కిర్లంపూడి మండలం గెద్దనాపల్లికి చెందిన గోవింద్ బెల్లం వ్యాపారం కోసం గత నెల 20న మోటారుబైక్పై ఏలేశ్వరం వస్తుండగా మార్గమధ్యలో తిరుమాలి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ రాయవరం: ఇటీవల రాయవరం ఆలయంలో పట్టపగలు జరిగిన చోరీ ఘటనలో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలను రాయవరం ఎస్సై డి.సురేష్బాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాయవరం అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మెడలో మంగళసూత్రాలు చోరీ చేసిన నిందితుడు తోరాటి సాయివరప్రసాద్ను అరెస్ట్ చేశామన్నారు. రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన సాయివరప్రసాద్ మహేంద్రవాడ్ రోడ్డులో పాత హెచ్పీ గొడౌన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు సాయివరప్రసాద్ను విచారించగా, నేరం అంగీకరించాడన్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు మంగళసూత్రంతో పాటుగా, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ చేసిన వెండి కిరీటం, వెండి చెవులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అనపర్తి జేఎఫ్సీఎం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. నేరం జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్బాబు, పీసీ జీవీ కుమార్ను జిల్లా ఎస్పీ అభినందించారు. కోర్టులో దొంగతనం కాకినాడ లీగల్: కాకినాడ కోర్టులో దొంగతనం జరగడం కలకలం రేపింది. కోర్టుల ప్రాంగణంలో పలు న్యాయస్థానాల్లో మూడు కోర్టులకు అనుసంధానం చేసి ఉన్న ఏసీల కాపర్ వైర్లను ఆగంతకులు బుధవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. కాకినాడ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం, స్పెషల్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్, జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులకు సంబంధించి 14 ఏసీల కాపర్ వైర్లను దొంగలు ఎత్తికెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కోర్టు సంబంఽధించిన న్యాయమూర్తులు కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవికి తెలియపరిచారు. ఇదే తరహాలో 2023లో జనవరి నెలలో కాకినాడ బార్ అసోసియేషన్లో ఏసీ కాపర్ వైర్ల దొంగతనం జరిగింది. అదే నెలలో కాకినాడ నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టుల ఏసీల కాపర్ వైర్లను దొంగిలించారు. -
వెంకన్న కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు కళ్యాణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం ఆలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మహేష్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏడు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రధానంగా 8వ తేదీన జరిగే రథోత్సవం, రాత్రి జరిగే కల్యాణోత్సవం తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత శాఖల అధికారులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ బందోబస్తుకు అవసరమైన సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని సబ్ డివిజన్ అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఆర్డీఓ పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ తమ పరిధిలో తీసుకునే ఏర్పాట్లను, ముందస్తు చర్యలను వివరించారు. తహసీల్దార్ టి.రాజరాజేశ్వరరావు, ఎంపీడీవో బీకేఎస్ఎస్వీ రామన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై ఎస్.రాము, ఆర్ అండ్ బీ శాఖ డీఈఈ రాజేంద్ర, ఏఈ మణికుమార్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ అశోక్, వాడపల్లి ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అనుమతుల్లేని క్వారీలో యంత్రాల సీజ్
రౌతులపూడి: మండలంలోని ములగపూడిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సర్వే నంబరు–1లో ప్రభుత్వ అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న నల్లరాయిని అధికారులు గుర్తించారు. ఈ క్వారీలో పనిచేస్తున్న ఒక కంప్రెసర్, డ్రిల్లింగ్ మెషీన్, 323 పొక్లెయిన్ను సీజ్చేసి స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఆర్ఐ మురళీకృష్ణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న యంత్రాలను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని చెఆప్పరు. ఆర్ఐ పట్నాయక్, వీఆర్ఓ శ్రీను, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
టోల్ ఎగ్గొట్టేందుకు అడ్డదారులు
కిర్లంపూడి: టోల్ ఫీజులు ఎగ్గొట్టేందుకు అడ్డదారుల్లో గ్రామాల మధ్యలోంచి వెళ్లేందుకు భారీ వాహనాల డ్రైవర్లు వెనుకాడడంలేదు. మండల పరిధి కృష్ణవరంలోని టోల్గేట్ వద్ద ఫీజు ఎగ్గొట్టేందుకు బూరుగుపూడి ఊరు శివారున పొలవరం కాలువ గట్టు మీదుగా కృష్ణవరం ఊరు మధ్యలో నుంచి సుమారు 60–65 టన్నుల ఇసుక లోడుతో నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు వెళుతున్నాయి. దీంతో కృష్ణవరంలోని గ్రామస్తులు గురువారం లారీలను అడ్డుకున్నారు. భారీ ఇసుక లారీలు గ్రామం మధ్యలో నుంచి వేగంగా వెళ్లడంతో ఏ సమయాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మార్గంలో ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ఉండడంతో విద్యార్థులకు ఏ ముప్పు వాటిల్లుతుందోనని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సామర్థ్యాన్ని మించి ఇసుక లోడులు వెళ్లడం వల్ల సీసీ రోడ్డు పాడైపోతుందన్నారు. దీంతో పాటు ఇళ్లల్లోకి దుమ్ముధూళీ రావడంతో పాటు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాల్లోంచి లారీల రవాణాను ఆపకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
మీరు ఏదో మంచి చేస్తారని గెలిపించాం
మలికిపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఏదో చేస్తారని.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకుని.. మీరు చేసినా చేయకపోయినా మీ వెనుక ఉండి పార్టీని గ్రామాల్లో అభివృద్ధి పథంలో నడిపే వాళ్లమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా కేశనపల్లి సర్పంచ్, మలికిపురం మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు యెనుముల వీర వెంకట సత్య నాగేంద్రప్రసాద్ (నాగు) అన్నారు. ఈ మేరకు కాపు, బీసీ కార్పొరేషన్ రుణాల సమస్యలను వివరిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను ఉద్దేశిస్తూ గురువారం ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో హాట్ టాపిక్గా మారింది. మలికిపురం మండలంలోని 21 గ్రామాల్లో కాపు కార్పొరేషన్కు రుణాల కోసం 1,060 మంది దరఖాస్తు చేస్తే 44 మందికి మాత్రమే ఇచ్చారని, ఇది చాలా అన్యాయమని ఆ వీడియోలో పేర్కొన్నారు. కేశనపల్లిలో కాపు కార్పొరేషన్ రుణాల కోసం 70 మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ‘కార్పొరేషన్ లోన్ల గురించి మీరు చెబుతున్నారు. మేమే చెప్పు దెబ్బలు తింటున్నాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కార్పొరేషన్ లోన్లు చాలా తక్కువగా ఇచ్చారనే బాధ ఉందని, రెండు కార్పొరేషన్ లోన్లు ఇచ్చిన మీరు 70 మందితో మమ్మల్ని తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేషన్ లోన్ల విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిశీలించాలన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు 484 మంది దరఖాస్తులు పెట్టుకుంటే మండలంలో 65 మందికి ఇస్తామని చెబుతున్నారని, ఈ విషయాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్కు వివరిస్తే.. ఈ సమస్య తన పరిధిలో లేదని చెబుతున్నారన్నారు. 1994 నుంచి టీడీపీలో ఉన్నామని, గ్రామంలో పార్టీ నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ వచ్చామని తెలిపారు. కార్పొరేషన్ రుణాల విషయంపై పునరాలోచన చేసి, సర్పంచ్లు తలెత్తుకుని తిరిగేలా చేయాలని కోరారు. కేశనపల్లిలో రెండు కాపు కార్పొరేషన్ రుణాలు, ఒక బీసీ కార్పొరేషన్ రుణం ఇస్తే మిగిలిన దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని నాగు అన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకున్నాం కేశనపల్లి సర్పంచ్ యెనుముల నాగు కార్పొరేషన్ లోన్లతో గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితి సీఎం, డిప్యూటీ సీఎంకు వీడియో సందేశం -
5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ అమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5,6 తేదీల్లో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం చార్టర్ అధ్యక్షుడు తీగెల రాజా, ఐకాన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మణి వెంకట్ చెప్పారు. గురువారం రాజమహేంద్రవరం క్లబ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాదిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కుస్తీ పోటీలను తమ క్లబ్ తరఫున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కుస్తీ పోటీలను దక్షిణాదిలో కూడా పరిచయం చేయాలనే ఆశయంతో ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామన్నారు. అండర్–15 బాలబాలికలకు, అండర్–20 పురుషులు, మహిళలకు రాష్ట్ర స్థాయిలో రెజ్లింగ్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 300 మంది రెజ్లర్స్ హాజరవుతారని చెప్పారు. ఈ పోటీల విజేతలు ఈ నెల 23న రాజస్థాన్లోని కోటాలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. క్లబ్ స్పోర్ట్స్ చైర్మన్ మద్దూరి శంకర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు దివాన్చెరువు ఎస్వీబీసీ కల్యాణ మండపంలో జరుగుతాయన్నారు. రెజ్లర్లకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి ఉదయగిరి సురేష్, కోశాధికారి కామేశ్వరిదేవి, స్పోర్ట్స్ డైరెక్టర్ పి.హెచ్.ఎస్.కార్తీక్, సంయుక్త కార్యదర్శి వంశీ పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రూ.171.33 కోట్లతో అన్నవరం దేవస్థానం బడ్జెట్
అన్నవరం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రూ.171.33 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తూ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.46.25 కోట్లు, వివిధ కొనుగోళ్లకు రూ.31.20 కోట్లు, సీజీఎఫ్, ఆడిట్ ఫీజు ఇతర చెల్లింపులకు రూ.23 కోట్లు, భక్తుల సదుపాయాలకు రూ.7.64 కోట్లు, స్వామివారి కల్యాణ, ఇతర ఉత్సవాలకు రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించారు. కేటాయింపులు ఇలా.. ● సిబ్బంది జీతాలకు రూ.18 కోట్లు, అర్చకులు, వేద పండితుల జీతాలకు రూ.6 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు రూ.13.50 కోట్లు, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు రూ.9 కోట్లు. ● ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, పంచదార, గోధుమ నూక, వంట గ్యాస్ తదితర కొనుగోళ్లకు రూ.25 కోట్లు, వ్రతాలు, ఇతర ఆర్జిత సేవలకు అవసరమయ్యే సరకుల కొనుగోళ్లకు రూ.5 కోట్లు, ఇతర పూజా సామగ్రి కొనుగోళ్లకు రూ.1.15 కోట్లు. ● వ్రత పురోహితులకు చెల్లించే పారితోషికాలకు రూ.16 కోట్లు, ప్రసాదం ప్యాకర్లకు రూ.2.10 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.1.60 కోట్లు. ● దేవస్థానంలో శానిటేషన్కు రూ.7.50 కోట్లు, షామియానా, పందిళ్లకు రూ.14 లక్షలు. ● ఎలక్ట్రికల్ వర్క్స్, వాటర్ సప్లై తదితర వాటికి రూ.1.55 కోట్లు, సోలార్ ప్లాంట్ నిర్వహణకు రూ.10 లక్షలు. ● దేవస్థానం నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు రూ.3.75 కోట్లు, దత్తత ఆలయాల నిర్వహణకు రూ.90 లక్షలు, ఆగమ పాఠశాలకు రూ.30 లక్షలు, దేవస్థానం ఆసుపత్రి నిర్వహణ, మందుల కొనుగోలుకు రూ.8 లక్షలు. ● స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్కు రూ.2.25 కోట్లు, సెక్యూరిటీ గార్డులకు రూ.2 కోట్లు, హోం గార్డులకు రూ.1.10 కోట్లు. ● సీజీఎఫ్ తదితర చెల్లింపులకు రూ.7.20 కోట్లు, సెక్షన్–65 ఈఏఎఫ్ కింద రూ.10 కోట్లు, ఆడిట్ ఫీజు రూ.1.20 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి రూ.2.4 కోట్లు, ప్రభుత్వ ట్యాక్స్లకు రూ.2.5 కోట్లు. ● ఇంజినీరింగ్ పనులకు రూ.4 కోట్లు, ఎలక్ట్రికల్ సామగ్రి కొనుగోళ్లకు రూ.కోటి, కొత్త వాహనాల కొనుగోలుకు రూ.కోటి. ● సిబ్బందికి వివిధ అడ్వాన్స్లు, రుణాలకు రూ.70 లక్షలు. ● కొత్త డిపాజిట్లు రూ.3 కోట్లు. మెచ్యూర్ అయిన డిపాజిట్లు తిరిగి జమ చేయడానికి రూ.కోటి, ఈఎండీ చెల్లింపులు రూ.కోటి. ● దేవస్థానం ట్రాన్స్పోర్టు నిర్వహణకు రూ.1.16 కోట్లు. ● సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్ట్లో భక్తులకు భోజనాలు పెట్టేందుకుగాను వివిధ దినుసుల కొనుగోలుకు రూ.3.30 కోట్లు, కూరగాయల కొనుగోలుకు రూ.కోటి, పాలకు రూ.60 లక్షలు, గ్యాస్కు రూ.55 లక్షలు, జీతాలకు రూ.కోటి, ఇతర ఖర్చులకు రూ.11.70 లక్షలు. ● గో సంరక్షణ ట్రస్ట్లో ఆవుల మేత, దాణాలకు రూ.20 లక్షలు, వైద్య ఖర్చులకు రూ.లక్ష, సిబ్బంది జీతాలకు రూ.31 లక్షలు. -
శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. రత్నగిరిపై రామాలయం వద్ద గురువారం ఉదయం పండితులు పందిరి రాట వేశారు. తొలుత పందిరి రాటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించి, పూజలు చేశారు. అనంతరం సుస్వర వేద మంత్రోచ్చారణ నడుమ రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు తదితరులు పందిరి రాటకు పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రామాలయ అర్చకుడు దేవులపల్లి వరప్రసాద్, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితుడు చామర్తి కన్నబాబు, పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి శ్రీరామ నవమి వేడుకలు ఈ నెల ఐదో తేదీ నుంచి 13వ తేదీ వరకూ తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులుగా అలంకరించడంతో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఆరో తేదీ ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 7న ప్రత్యేక పూజలు, 8న పండిత సదస్యం, 9, 10 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక పూజలు, 11న సీతారాముల వనవిహారోత్సవం, 12న శ్రీచక్రస్నానం, దండియాడింపు నిర్వహిస్తారు. 13వ తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
పరీక్ష కేంద్రాల్లో ‘నన్నయ’ వీసీ తనిఖీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న డిగ్రీ, బీఈడీ, లా పరీక్ష కేంద్రాలను ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని వీఎస్ లక్ష్మీ మహిళా కళాశాల, ప్రగతి డిగ్రీ కళాశాలను సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 109 కేంద్రాల్లో 22 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. వేసవి నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వీసీ ప్రసన్నశ్రీ సూచించారు. -
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పచ్చని చేలపై కన్నీటి వరద ఈ ఫొటో చూడండి.. కనుచూపు మేరంతా వరద నీటిలో చిక్కుకున్న పొలాలే.. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనిదీ చిత్రం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏలేరు వరద నీరు ఒక్కసారిగా వెల్లువెత్తి, విరుచుకుపడింది. కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగా ఏలేశ్వరం జలాశయం నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని వదిలేయడంతో పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలను వరద ముంచెత్తింది. పెద్ద ఎత్తున బురదతో కూడిన వరద నీరు రావడంతో పొలాల్లో మట్టి మేటలు వేసింది. ఈ విపత్తు జరిగి ఇప్పటికి అక్షరాలా ఆరు నెలలైంది. వేలాది మంది రైతులు భారీగా నష్టపోయారు. అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చామని చెప్పిందే.. తప్ప ఇప్పటికీ తమకు నయాపైసా అందలేదని చాలా మంది బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. -
అన్నదాతలతో పరిహాసం
8లోపరిహారం లేదు.. పట్టించుకునే వారూ లేరు సార్వాలో రెండెకరాల్లో వరి పంట వరదకు కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేశాయి. ఇప్పటి వరకూ పైసా కూడా పరిహారం రాలేదు. ఇసుక మేటలు తొలగించడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. అదీ లేదు. నా పొలానికి ఎదురుగా ఉన్న గొర్రిఖండి కాలువకు గండి కూడా పడింది. దానిని సగం పూడ్చి వదిలేశారు. ఫలితంగా దాళ్వా పంట కూడా సాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది. – పడాల అచ్చారావు (బాబూరావు), రైతు, గొల్లప్రోలు పరిహారం ఊసెత్తడం లేదు ఏలేరు వరదలు, అధిక వర్షాల వల్ల మా పంటలు పోయాయి. అప్పట్లో అధికారులు వచ్చి నష్టం నిర్ధారించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపాం.. పరిహారం వస్తుందని చెప్పారు. నెలలు గడుస్తున్నా పరిహారం మాత్రం రాలేదు. ఎవరూ ఆ ఊసెత్తడం లేదు. ఎవరిని అడగాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి మాది. – ధర్మారపు లక్ష్మీకుమారి, రైతు, యండపల్లి, కొత్తపల్లి మండలం వేశామంటున్నారు.. మాకు రాలేదు మాకు సంబంధించి మూడెకరాల్లో పంట వరదలో కొట్టుకుపోయింది. పంట పూర్తిగా దెబ్బ తిన్నట్లు అధికారులు గుర్తించారు. నష్ట పరిహారం వస్తుందని అప్పట్లో చెప్పారు. తరువాత పరిహారం వేశామని కూ డా అంటున్నారు. కానీ మాకు మాత్రం ఒక్క రూపా యి కూడా పడలేదు. అడుగుతూంటే ఎవరూ సమాఽ దానం చెప్పడం లేదు. అసలు వస్తుందో రాదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో మేమున్నాం. – మొగలి అప్పలరాజు, రైతు, యండపల్లి, కొత్తపల్లి మండలం పరిహారం గురించి పట్టించుకోవడం లేదు పంటలు దెబ్బతిని, తీవ్రంగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నష్టపరిహారం వేశారని అధికారులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరికి వేశారో, ఎంత వేశారో చెప్పడం లేదు. ఎవరిని అడిగినా రాలేదనే అంటున్నారు. మాకు రాలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు. – దువ్వా జయలక్ష్మి, రైతు, యండపల్లి, కొత్తపల్లి మండలం పంట భూమిలో ఇసుక మేటలు ఇది ఏ నదీ తీరానికి సంబంధించిన ఫొటో అని అనుకుంటే పొరపాటు పడినట్లే.. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన వరదల కారణంగా పిఠాపురం మండలం రాపర్తి గ్రామం వద్ద ఏలేరు కాలువకు పడిన గండ్లతో పొలాల్లో ఇసుక, మట్టి ఇలా మేటలు వేసింది. ఇలా పొలాల్లో మేటలు వేసిన ఇసుక, మట్టిని తొలగించుకోవడానికి హెక్టారుకు రూ.17 వేల చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ, ఆవిధంగా ఆర్థిక సాయం అందలేదని చాలా మంది రైతులు వాపోతున్నారు. ● గత సెప్టెంబర్లో వెల్లువెత్తిన ఏలేరు ● వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు ● రైతులకు రూ.కోట్లలో నష్టం ● నెలలు గడుస్తున్నా అందని పరిహారం ● వరద నీట కొట్టుకుపోయిన కూటమి నేతల హామీలుపిఠాపురం: అధిక వర్షాల కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో జిల్లాలోని ఏలేరు, పంపా, సుద్దగెడ్డ, తాండవ నదులకు ఊహకందని రీతిలో వరదలు వచ్చాయి. వరదలు, అధిక వర్షాల కారణంగా జగ్గంపేట, పెద్దాపురం, కిర్లంపూడి, తాళ్లరేవు, సామర్లకోట, పిఠాపురం, తొండంగి, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని తదితర 20 మండలాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద నీట మునిగి సర్వనాశనమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులు సుమారు రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. ముఖ్యంగా వేలాది ఎకరాల్లో పచ్చని పంటలకు ఊపిరి పోసే ఏలేరు.. తన ఆయకట్టు భూములపై ప్రతాపం చూపింది. పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జలాశయంలోకి ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. దీనిని అంచనా వేసుకుంటూ, జలాశయం నుంచి తగిన స్థాయిలో దిగువకు నీటిని వదలాల్సి ఉండగా.. అధికారులు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని విడిచిపెట్టారు. ఆ రోజుల్లో 10 వేల క్యూసెక్కుల లోపే అదనపు జలాలను విడిచిపెడుతున్నట్లు అధికారులు చెప్పగా.. వాస్తవానికి అంతకు పదింతల మొత్తంలో నీటిని రోజుల తరబడి వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా ఒక్కసారిగా ఏలేరు జలాలు ఉరకలెత్తి విరుచుకుపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు, పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు జలమయమయ్యాయి. ఏలేరు నదికి సుమారు 200కు పైగా గండ్లు పడ్డాయి. సుమారు 200 ఎకరాల పంట భూముల్లో ఇసుక, మట్టి మేటలు వేశాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్పట్లో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతులను, వరద బాధితులను పరామర్శించారు. వారిలో మనోధైర్యం నింపి, బాధితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హడావుడిగా మొక్కుబడి పర్యటనలు చేశారు. బాధితులకు తక్షణం పరిహారం ఇస్తామంటూ హామీలిచ్చారు. కానీ, ఆ మాటలు పరిహాసంగానే మిగిలాయి. నెలలు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని వేలాది మంది రైతులు వాపోతున్నారు. పరిహారం ఇచ్చామని చెబుతున్నారు తప్ప ఎంత మందికి ఇచ్చారు, ఎంత ఇచ్చారనే లెక్కలు మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ బహిర్గతం చేయడం లేదు. అటు ప్రభుత్వాధినేతలూ పట్టించుకోవడం మానేశారు. దీంతో పంటలు నష్టపోయి, పరిహారం అందక ఏలేరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఏలేరు వరద నష్టాలు ఇలా.. అధికారుల ప్రాథమిక అంచనా వరద ప్రభావిత మండలాలు 20 ముంపులో చిక్కుకున్న గ్రామాలు 206 నీట మునిగిన పంటల విస్తీర్ణం సుమారు 1,00,000 ఎకరాలు మట్టి మేటలు వేసిన పొలాలు సుమారు 200 ఎకరాలు దెబ్బ తిన్న పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, మినుము నష్టపోయిన రైతులు సుమారు 50,000 పంట నష్టం సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నీట మునిగిన పంటల విస్తీర్ణం 75,000 ఎకరాలు నష్టపోయిన రైతులు 41,796 పంట నష్టం అంచనా రూ.172 కోట్లు ప్రభుత్వం కుదించిందిలా.. పంట నష్టం 34,812 ఎకరాలు నష్టపోయిన రైతులు 24,879 ఎకరానికి రూ.10 వేల ఇన్పుట్ సబ్సిడీ, ఇసుక మేటలు తొలగించుకోవడానికి హెక్టార్కు రూ.17 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. -
భావనారాయణ స్వామి భూములను పరిశీలించిన కలెక్టర్
కాకినాడ రూరల్: సర్పవరం గ్రామంలోని భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన విలువైన భూములను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గురువారం పరిశీలించారు. ఇదే భూములను క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ బుధవారం పరిశీలించగా.. మరుసటి రోజే కలెక్టర్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు, ఎమ్మెల్యే నానాజీతో కలిసి దేవస్థానానికి చెందిన సుమారు 18 ఎకరాల భూములను కలెక్టర్ పరిశీలించారు. భూముల హద్దులను చూసి ఎన్ని ఎకరాలుందో నివేదిక ఇవ్వాలని సర్వే అధికారులను ఆదేశించారు. సర్పవరంలో క్రికెట్ స్టేడియం ప్రతిపాదన రావడంతో విలువైన దేవుడి భూములు 18 ఎకరాలతో పాటు దీనిని ఆనుకుని ఉన్న రైతులకు చెందిన మరో 12 ఎకరాలు కూడా సేకరించేందుకు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. భూములు ఎందుకు పరిశీలించారనే విషయాన్ని కలెక్టర్ వెల్లడించలేదు. ఎమ్మెల్యే నానాజీ మాత్రం క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదన మేరకు భూములు పరిశీలించినట్లు చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా సర్వే అధికారి సుబ్బారావు, తహసీల్దార్ కుమారి, ఆలయ ఈఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్యామలకు కలెక్టర్ అభినందనలు కాకినాడ సిటీ: పెద్దాపురానికి చెందిన గోలి శ్యామల గత జనవరిలో విశాఖపట్నం నుంచి సముద్రంలో ఈదుకుంటూ కాకినాడ ఎన్టీఆర్ బీచ్కు విజయవంతంగా చేరుకున్నారు. ఆమె సాహసాన్ని అభినందిస్తూ వరల్డ్ ఓపెన్ వాటర్ అసోసియేషన్ ప్రశంసాపత్రం అందజేసింది. ఈ నేపథ్యంలో శ్యామల జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను కలెక్టరేట్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదుతూ గమ్యాన్ని చేరుకోవడం గొప్ప విశేషమని ఆమెను కలెక్టర్ అభినందించారు. వక్ఫ్ సవరణ బిల్లు.. రాజ్యాంగంపై దాడికాకినాడ రూరల్: వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా జిల్లా వక్ఫ్బోర్డు మాజీ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ఏ కరీం బాషా అన్నారు. గురువారం తన నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా అని ఆరోపించారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లింల షరియత్కు పూర్తి విరుద్ధమన్నారు. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా చట్టంలో ఎలాంటి మార్పూ చేయలేదని, ఇది కేవలం బడాబాబులకు దోచిపెట్టడానికేనని విమర్శించారు. సీఎం చంద్రబాబు ముస్లింలకు చేస్తున్న అన్యాయాన్ని టీడీపీలోని ముస్లిం నాయకులు, కార్యకర్తలు గ్రహించాలని బాషా కోరారు. సమావేశంలో మైనార్టీ సెల్ రూరల్ అధ్యక్షుడు కేజీఎన్ వలి, నాయకులు షేక్ సంధాని, చాంద్ బాషా, అన్సారీ బేగ్ పాల్గొన్నారు. ఔను.. బర్డ్ఫ్లూతోనే కోళ్ల మరణాలు పిఠాపురం: గత ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకూ పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని మూడు కోళ్లఫామ్లలో పెద్ద సంఖ్యలో కోళ్లు బర్డ్ఫ్లూ వల్లనే మృతి చెందాయని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని గెజిట్లో ప్రచురించి, కోళ్లు చనిపోయిన ఫామ్లపై ఆంక్షలు విధించారు. కోళ్లు చనిపోయిన ఫామ్ల నుంచి కిలోమీటరు పరిధిని ఇన్ఫెక్టెడ్ జోన్గా, 10 కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్ జోన్గా ప్రకటించి, ఆంక్షలు అమలు చేయాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాంతాల నుంచి కోళ్లను అమ్మడం, కొనడం, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీఓ 122 జారీ చేశారు. అప్పట్లో పిఠాపురం, మండలంలోని కుమారపురం, చిత్రాడ, నర్సింగపురం, గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామాల్లోని ఫామ్లలో ఒక్కసారిగా వందలాది కోళ్లు మృతి చెందాయి. సంబంధిత కోళ్ల కంపెనీ సిబ్బంది వచ్చి, చనిపోయిన కోళ్ల శాంపిల్స్ తీసుకెళ్లారు. పశు సంవర్ధక శాఖ అధికారులు హుటాహుటిన ఆయా ఫామ్లను పరిశీలించారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపించారు. అక్కడ వివిధ పరీక్షల అనంతరం ఆ కోళ్లు బర్డ్ఫ్లూ వల్లనే మరణించినట్లు నిర్ధారించారు. -
వ్యర్థాలతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్
సామర్లకోట: స్థానిక ఏడీబీ రోడ్డులోని రిలయన్స్ పవర్ ప్లాంటు సమీపంలో రిలయన్స్ బయో ఎనర్టీ ప్లాంట్ను బుధవారం ఆన్లైన్ (వర్చువల్ విధానంలో)లో ప్రారంభించారు. డ్రోన్ కెమెరా ద్వారా ఫ్యాకర్టీ పరిసరాలను రిలయన్స్ అధినేతలు, మంత్రి లోకేశ్ తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.375 కోట్ల వ్యయంతో నిర్మించే ప్లాంటులో వరి, చెరకు, మొక్కజోన్న, ఆయిల్పామ్, పూలతోటలు, ఆక్వా సముదాయాల నుంచి వచ్చే వ్యర్థాలు, పశువుల పేడతో ‘కంప్రెస్డ్ బయో గ్యాస్’ ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే మూడు యూనిట్ల ద్వారా రోజుకు 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రతినిధులు తెలిపారు. బయో ఎనర్జీ మొదటి యూనిట్ ప్లాంటుకు రూ.114.20 ఖర్చు చేసినట్టు ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన రెండు యూనిట్లు ఆగస్టు నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు.వర్చువల్ విధానంలో ప్రారంభించిన మంత్రి లోకేశ్ -
భావనారాయణునికి శఠగోపమేనా !
కాకినాడ రూరల్: దేవుడి భూములు అన్యాక్రాంతమవ్వకుండా కాపాడవల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉంటుంది. ఆదాయం కోసమో, ఇతర అవసరాల కోసమో దేవుడికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేయాలనుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. ఇప్పటికే విలువైన భూములు చేతులు మారినా పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు ఉన్న భూములను కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆదాయం లేదనే నెపంతో ఏ విధంగా ఇతరులకు అప్పగించాలా అని చూడడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన విష్ణు క్షేత్రమైన సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయం భూములకు రక్షణ లేకుండా పోయింది. గ్రామంలో ఆలయం ఎదురుగా గోశాలను ఆనుకుని మాధవపట్నం రోడ్డును చేర్చి సుమారు 1.79 ఎకరాల భూమి ఖాళీగా ఉండడంతో దానిపై కొందరి కన్ను పడింది. దీనికి వంత పాడేలా 11 సంవత్సరాలు లీజు అనే అంశాన్ని దేవదాయ శాఖ అధికారులు తెరపైకి తీసుకురావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. గోశాలలోని గోవులు ఈ ఖాళీ స్థలంలో పశు గ్రాసం తినేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జనసేన నేతలు చాలా గోవులను ధారాదత్తం చేశారు. ఇప్పుడు ఖాళీ స్థలంపై దృష్టి పడడంతో దానిని వాణిజ్య అవసరాల నిమిత్తం 11 సంవత్సరాల లీజుకు ఇచ్చేందుకు దేవదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విలువైన స్థలం ప్రైవేట్ పరం చేసేలా టెండర్లు పిలవడంతో పాటు వేలం వేసేందుకు సర్పవరం ఆలయ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కసారి ప్రైవేట్ పరమైతే తరువాత న్యాయపరమైన లిటిగేషన్ల ద్వారా అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సర్పవరం గ్రామంలోని భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన సుమారు 18ఎకరాల భూమిని బుధవారం ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎండోమెంట్ డీసీ డీఎల్వీ రమేష్బాబును వెంటబెట్టుకుని పరిశీలించారు. కోట్ల రూపాయల విలువైన ఈ దేవుడిని భూమిని స్టేడియం నిర్మాణం కోసం ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటించకుండా మాములుగా పరిశీలించేందుకు వచ్చినట్టు డీసీ చెప్పడం వెనుక రహస్యం ఏమిటని గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఈఓ ఎం.లక్ష్మినారాయణను వివరణ కోరగా సర్పవరం భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన భూమి ఎకరం 79 సెంట్లు ఖాళీగా ఉండడంతో వేలం పాట ద్వారా ఆదాయం పొందేందుకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. త్వరలో 11 సంవత్సరాల లీజు గడువుతో వేలం నిర్వహిస్తామన్నారు. దేవస్థానానికి చెందిన 18ఎకరాలు భూములు డీసీ, ఎమ్మెల్యే పరిశీలన చేశారని, కారణం తనకు తెలియదన్నారు. దేవుడి భూములపై కొందరి కన్ను ఆదాయం కోసమని 1.79 ఎకరాల వేలానికి రంగం సిద్ధం స్టేడియం కోసమని మరో 18 ఎకరాల ధారాదత్తానికి ఎమ్మెల్యే పరిశీలన -
సామర్లకోట చైర్పర్సన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
సామర్లకోట: పట్టణ మున్సిపల్ కౌన్సిల్లో బలనిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు బుధవారం జిల్లా కలెక్టన్ షన్మోహన్ సగిలి, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతి పత్రాలు అందజేశారు. కొంత కాలంగా చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ తీరుపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అసంపూర్తితో ఉన్నారు. దాంతో 31 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్ సభ్యులలో 22 మంది సంతకాలు చేసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ సగానికి మించి సభ్యులు బల నిరూపణ కోసం వినతి పత్రం అందజేస్తే దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. అయితే బలనిరూపణ సమావేశం ఏర్పాటుకు కలెక్టరు నుంచి ఆదేశాలు రావలసి ఉందన్నారు. వినతి పత్రంలో సంతకాలు చేసిన వారి నుంచి సమాచారం సేకరించి తదపరి నిర్ణయం తీసుకొంటారన్నారు. పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నిక జరగడం వలన ఆమెను దింపే అధికారం మెజార్టీ సభ్యులకు ఉంటుందని కమిషనర్ తెలిపారు. వైస్చైర్మన్ ఉబా జాన్మోజెస్, కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీసత్యనారాయణ, పాగా సురేష్కుమార్, నేతల హరిబాబు, యార్లగడ్డ జగదీష్, వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్నం దొరబాబు పాల్గొన్నారు. బల నిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు -
రైతులకు నష్టం రాకుండా చూడాలి
రబీ వరి పంట కోతలు ప్రారంభించాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల నష్టపోతున్నాము. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది దిగుబడులు కూడా తగ్గడంతో అంతగా ఆదాయం వచ్చే అవకాశం లేనందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి. – గొల్లపల్లి వీరబాబు, రైతు, మల్లేపల్లి, గండేపల్లి మండలం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించారు. ఇంకా పూర్తి స్థాయిలో కోతలు ప్రారంభం అయ్యే లోపు అన్ని మండలాల్లోను కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం గండేపల్లి, ఏలేశ్వరం, కొత్తపల్లి మండలాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో తొలుత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాము. రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. – ఎన్.విజయకుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ -
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
కాకినాడ సిటీ: ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్లో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఏప్రిల్ మొదటి వారంలోనే ఉపాధి హామీ పనులు ప్రారంభించి, వేసవి మూడు నెలలూ పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నత్తనడకన నడుస్తోందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. జిల్లాలో మూడు నెలలుగా ఉపాధి హామీ పనులు నామమాత్రంగా జరిగాయన్నారు. చేసిన పనులకు కూడా డబ్బులు విడుదల కాక, కూలీలు నానా అవస్థలూ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలి కేవలం రూ.7 పెంచి, కనీస వేతనం రూ.307గా నిర్ణయించారని తెలిపారు. ఇక నుంచి కూలీలకు కచ్చితంగా రూ.307 వేతనం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్న సదుపాయాలన్నీ కూలీలకు కల్పించాలన్నారు. మేట్లకు పారితోషికం ఇవ్వాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, జిల్లా నాయకుడు కూరాకుల సింహాచలం, ఉపాధ్యక్షులు దుప్పి అదృష్టదీపుడు, చొల్లంగి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు సోషల్ పరీక్షకు 342 మంది గైర్హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెల 17వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు సోషల్ పరీక్ష నిర్వహించారు. దీనికి 27,407 మంది హాజరు కాగా 342 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, ట్రెజరీ అధికారులకు జిల్లా విద్యా శాఖాధికారి పిల్లి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. మట్టి లారీలను అడ్డుకుని ఆందోళన పి.గన్నవరం: ఊడిమూడిలంక నుంచి వస్తున్న మట్టి లారీల వల్ల తమ వంతెన ధ్వంసం అవుతున్నదంటూ జి.పెదపూడి గ్రామస్తులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. లంక నుంచి వస్తున్న మట్టి లారీలను వంతెన వద్ద అడ్డుకుని ఆందోళన చేపట్టారు. మట్టి లారీల రాకపోకల వల్ల వంతెన బలహీనపడుతోందని జి.పెదపూడి సర్పంచ్ దంగేటి అన్నవరంతో పాటు ఆందోళనకారులు వివరించారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలకు ఈ వంతెన ఆధారమన్నారు. లారీల రాకపోకల వల్ల వంతెన మార్జిన్లో ఉన్న మంచినీటి పైపు లైన్లు ధ్వంసం అవుతున్నాయని వివరించారు. వేరే వంతెన మీదుగా మట్టి లారీలు తరలించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరో వర్గానికి చెందిన కొందరు అక్కడికి రావడంతో వివాదం తలెత్తింది. కొన్నేళ్లుగా ఈ వంతెన మీదుగా మట్టి లారీలు వెళ్తున్నాయని, అప్పుడు ఎందుకు అడ్డగించలేదని వారు ఆందోళన కారులను నిలదీశారు. వీరికి మట్టి ర్యాంపు నిర్వాహకుడి అనుచరులు కూడా తోడవడంతో ఇరువర్గాల మధ్య వివాదం పెరిగింది. విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ అక్కడికి చేరుకుని, ఇరువర్గాలతో చర్చించారు. ఒకానొక దశలో వివాదం ముదరడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. తహసీల్దార్ సమక్షంలో అధికారులతో చర్చించి వంతెన సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్సై సూచించారు. అనంతరం లారీలను పంపించి వేశారు. 4 నుంచి స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్లు అమలాపురం టౌన్: జిల్లాలోని 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 4 నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు జిల్లా రిజిస్ట్రార్ సీహెచ్ నాగలింగేశ్వరరావు తెలిపారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్లాట్ బుకింగ్ విధానం అమలుపై కార్యాలయ సిబ్బందికి నాగ మల్లేశ్వరరావు అవగాహన కల్పించారు. భూముల రిజిస్ట్రేషన్లను కొనుగోలు, అమ్మకందార్లు తమకు నచ్చిన సమయంలో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. -
ఎక్కడ పనులు అక్కడే..
స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేయకపోవడంతో నగరంలో పలు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉండిపోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్పొరేషన్ భవనం సైతం మధ్యలోనే నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా నిధులు లేవని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ సిటీ గడువు పెంచి, నిధులు విడుదల చేయాలి. – నల్లబిల్లి సుజాత, మాజీ కార్పొరేటర్ -
ముమ్మరంగా ఇంజినీరింగ్ పనులు
కాకినాడ సిటీ: వర్షాలు ప్రారంభమయ్యేలోపు రానున్న మూడు నెలల్లో జిల్లాలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల ద్వారా తాను సమర్పించిన అంశాలను కలెక్టర్ షణ్మోహన్ ఆయనకు వివరించారు. అనంతరం వీరపాండ్యన్ మాట్లాడుతూ, రానున్న మూడు నెలల్లో కూలీలకు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 11 గంటలలోపు, మధ్యా హ్నం 4 గంటల తర్వాత పనులు చేయించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై, ముఖ్యంగా నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. నీటి వనరులన్నింటినీ శుభప్రరచి, ఫ్లషింగ్ చేయించాలన్నారు. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో 4 నుంచి 6 పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏఎన్ఎం వద్ద 500, పీహెచ్సీల్లో వెయ్యి, సీహెచ్సీల్లో 5 వేలు, జిల్లా ఆసుపత్రిలో 10 వేలు చొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని అంబులెన్స్ల్లో ఎమర్జెన్సీ రెస్క్యూ మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు. కాలువలు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలకు లోను కాకుండా చూడాలని, తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని వీరపాండ్యన్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, డీఆర్ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, డ్వామా పీడీ ఎ.వెంకటల క్ష్మి, డీఈఓ పి.రమేష్, డీఎంహెచ్ఓ జె.నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ ఆదేశం -
కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు
ధర పెరిగినా రైతుకు ఒరిగిందేమీ లేదు పౌల్ట్రీ వ్యాపారంలో గత మూడు నెలల నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. బర్డ్ ప్లూ వైరస్ వదంతులతో పెంచిన కోళ్లను ఇంకా మేపలేక దశల వారీగా విక్రయించుకుని తీవ్రమైన నష్టాలను చవిచూశాం. ఇటీవల ఉగాది, రంజాన్ సందర్భంగా బాయిలర్ ధరల పెరిగినా రైతులకు ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం బాయిలర్ కోళ్లు రైతుల వద్ద లేకపోవడంతో కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఆ లాభాలు వాళ్లకే వెళ్లిపోతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పెరిగిన ధర నిలకడగా ఉండే అవకాశం కూడా లేదు. – బొబ్బా వెంకన్న, పౌల్ట్రీ రైతు,పెదపళ్ల, ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా సాక్షి, అమలాపురం: బర్డ్ ఫ్లూతో విలవిలలాడిన కోడి కోలుకుంటోంది. సంక్రాంతి తరువాత మొదలైన పౌల్ట్రీ రైతుల కష్టాలు.. ఇంచుమించు తెలుగు సంవత్సరాది వరకు కొనసాగాయి. గత వారం రోజుల నుంచి కోడి ధర క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు కొండెక్కింది. బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్ల పెంపకాన్ని రైతులు తగ్గించి వేయడంతో... డిమాండ్లో సగం కూడా కోళ్లు మార్కెట్కు రాకపోవడంతో వాటి ధర అంచనాలకు మించి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తూర్పు గోదావరి జిల్లాలో 2.50 కోట్ల వరకు గుడ్లు పెట్టే కోళ్లు, నాలుగు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతోంది. ఈ జిల్లాలో ప్రతి రోజూ 80 లక్షల కోడిగుడ్ల ఉత్పత్తి అవుతుండగా 48 లక్షల గుడ్లు ఒడిశా, బిహార్, కోల్కతాలకు ఎగుమతవుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఐదు లక్షల లేయర్ కోళ్లు పెరుగుతున్నాయి. లక్షకు పైగా నాటు కోళ్ల పెంపకం జరుగుతోంది. మరో మూడు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకం సాగుతోందని అంచనా. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో 18 కమర్షియల్ పౌల్ట్రీ ఫామ్లు ఉండగా వీటిలో సుమారు 57 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో 5 లక్షల వరకు బ్రాయిలర్ ఫామ్లు కాగా, మిగిలిన లేయర్ (కోడి గుడ్డు పెట్టే) కోళ్లు. మూడు జిల్లాల్లో రోజుకు 100 టన్నుల వరకు కోడి మాంసం విక్రయాలు చేసేవారు. అదే ఆదివారం, ఇతర పండగల సమయంలో 150 టన్నుల వరకు విక్రయాలు ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరి అగ్రహారంలో లక్షలాది కోళ్లు మృతి చెందడంతో ఆ ప్రభావం మూడు జిల్లాల పౌల్ట్రీలపై పడింది. బర్డ్ ఫ్లూకు ముందు కిలో చికెన్ ధర రూ.240 నుంచి రూ.260 వరకూ ఉండేది. బర్డ్ ఫ్లూ భయంతో నాలుగైదు రోజులలో అది కాస్తా కేజీ రూ.150కి పడిపోయింది. తరువాత కేజీ రూ.120కి చేరింది. ధర తగ్గడం అటుంచి వారం రోజుల పాటు ప్రభుత్వ అధికారులే కోడి మాంసం విక్రయాలను అడ్డుకున్నారు. తరువాత అమ్మకాలకు అనుమతి ఇచ్చినా నెల రోజుల పాటు చికెన్ అమ్మకాలు మూడు జిల్లాలలో దాదాపు నిలిచిపోయాయి. కేవలం మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు మాత్రమే సాగాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లోనూ, రెస్టారెంట్లు ఇలా ప్రతిచోటా చికెన్ తప్ప మిగిలిన మాంసాహారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. సంక్రాంతి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో బర్డ్ ఫ్లూ చావు దెబ్బతీసింది. జిల్లా సరిహద్దును ఆనుకుని తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బ కోనసీమ జిల్లా పౌల్ట్రీని కుదేలు చేసింది. ఈ జిల్లాలో వైరస్ జాడ లేకున్నా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. కోడి మాంసం, కోడి గుడ్డు అమ్మకాలను అధికారులు నిషేధించడంతో ధర పడిపోయి రైతులు.. అమ్మకాలు లేక వ్యాపారులు ఆందోళన చెందారు. బర్డ్ఫ్లూ నుంచి కోలుకుంటున్న కోడి భారీగా పెరిగిన బ్రాయిలర్.. లేయర్ కోడి ధరలు బ్రాయిలర్ రైతు వద్ద కేజీ రూ.152, రిటైల్ రూ.175 లేయర్ లైవ్ రైతు వద్ద కేజీ రూ.125 బ్రాయిలర్ మాంసం కేజీ రూ.300.. లేయర్ మాంసం కేజీ రూ.200 డిమాండ్లో మూడు వంతులు మాత్రమే మార్కెట్కు బర్డ్ ఫ్లూతో ఇంచుమించు నెలన్నర రోజులు అతలాకుతలమైన పౌల్ట్రీ పరిశ్రమ పది రోజులుగా కోలుకుంటోంది. కోడి మాంసం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. బ్రాయిలర్ లైవ్ రైతు వారీ కేజీ ధర రూ.152 వరకు ఉండగా షాపుల వద్ద లైవ్ రిటైల్ ధర కేజీ రూ.175 నుంచి రూ.180 వరకు ఉంది. కేజీ మాంసం ధర రూ.300కు పైబడి ఉంది. ఇక లేయర్ రిటైల్ ధర కేజీ రూ.125 నుంచి రూ.130 వరకు ఉండగా, మాంసం ధర కేజీ రూ.200 వరకు ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి చూస్తే బ్రాయిలర్, లేయర్ మాంసం ధరలు మరింత పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బర్డ్ఫ్లూ ప్రచారం వల్ల బ్రాయిలర్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి మొదటి వారం వరకు కొత్త బ్యాచ్లు (కోళ్లు పెంచడాన్ని) తగ్గించారు. దీనివల్ల మార్కెట్కు డిమాండ్కు తగిన కోళ్లు రావడం లేదు. ఇప్పుడున్న అవసరాలలో మూడవ వంతు కూడా కోళ్ల లభ్యత లేదని అమలాపురానికి చెందిన కోడి మాంసం విక్రయదారుడు యేసు సాక్షికి తెలిపాడు. ఈ కారణంగానే కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. -
పంపాలో మట్టి దొంగలు
రిజర్వాయర్లో తాటి చెట్టు లోతున సాగుతున్న తవ్వకాలు పంపా రిజర్వాయర్ గర్భంలో భారీ యంత్రాలతో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు ● తెలుగు తమ్ముళ్ల బరితెగింపు ● మరమ్మతుల ముసుగు ● స్వలాభం కోసం రబీకి ఎగనామం ● అను‘మతి’ లేకుండా తవ్వకాలు ● 5 వేల ట్రిప్పులకు చీకటి ఒప్పందం! సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కూటమి సర్కార్ గద్దెనెక్కాక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తమ ఆగడాలను ప్రశ్నించే ధైర్యం ఎవరికుందంటూ తెలుగు తమ్ముళ్లు బరి తెగిస్తున్నారు. నిలువు దోపిడీకి నిఖార్సయిన బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. గ్రావెల్, మట్టి, ఇసుక.. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే సహజ వనరులను లూటీ చేస్తున్నారు. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా.. అధికార పార్టీ అండదండలు దండిగా ఉండటంతో అధికారులు నోరు మెదపడం లేదు. జిల్లాలోని మెట్ట ప్రాంతం గ్రావెల్, మెటల్కు పెట్టింది పేరు. జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో గ్రావెల్కు కొదవ లేదు. నాడు చంద్రబాబు సర్కార్లో కొండలను పిండి చేసి కోట్లు కొల్లగొట్టిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతున్నారు. అడిగే నాథుడు లేడనే ధైర్యంతో వారి ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. జిల్లాలో ఏలేరు, పుష్కర, సుబ్బారెడ్డి సాగర్ తదితర జలాశయాల మాదిరిగానే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని పంపా రిజర్వాయర్ కూడా వేలాది మంది రైతులకు జీవనాధారంగా ఉంది. దీని కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయంపై ఆధారపడి సుమారు 20 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇంతటి కీలకమైన ఈ పంపా జలాశయానికి తెలుగు తమ్ముళ్లు గర్భశోకం కలిగిస్తున్నారు. మరమ్మతుల సాకుతో.. పంపా రిజర్వాయర్, గేట్ల మరమ్మతుల సాకుతో కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆయకట్టులో రబీ సాగు లేకుండా చేశారు. తద్వారా వేలాది మంది రైతుల పొట్ట కొట్టారు. అక్రమంగా గ్రావెల్ తవ్వేసి రూ.లక్షలు మింగేయాలనే దురుద్దేశంతోనే ఈవిధంగా చేశారని అన్నదాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా ఐదేళ్లూ రబీ సాగుకు సమృద్ధిగా నీరు అందించిన విషయాన్ని పంపా ఆయకట్టు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ జలాశయంలో ఇప్పుడు మట్టి దొంగలు పడ్డారు. మరమ్మతుల పేరుతో ఉన్న నీటిని బయటకు వదిలేసి.. తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు జలాశయం గర్భంలో తాటి చెట్టు అంత లోతున నిట్టనిలువునా తవ్వేసి, గ్రావెల్ తరలించుకు పోతున్నారు. రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. వాస్తవానికి రిజర్వాయర్ పూడుకుపోయినప్పుడు మాత్రమే దాని గర్భం నుంచి మట్టి లేదా పూడిక తొలగించాల్సి ఉంటుంది. అది కూడా మైనింగ్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరగాలి. ఒకవేళ మట్టి తొలగించాల్సి వస్తే దానిని రిజర్వాయర్ చుట్టూ ఉన్న గట్టును పటిష్టపరిచేందుకు వినియోగించాలి. కానీ, పంపా రిజర్వాయర్లో అటువంటిదేమీ లేకుండానే టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొంటున్నారు. నిద్రలో అధికార యంత్రాంగం ఇంత పబ్లిక్గా కళ్ల ముందే పంపా రిజర్వాయర్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, జలవనరుల శాఖల అధికారులు నిద్రలో జోగుతున్నట్టు కనిపిస్తోంది. జలవనరుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అంటున్నారు. పంపాను పరిరక్షించాల్సిన అక్కడి జలవనరుల శాఖ యంత్రాంగం ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం అందినా ఉదాసీనంగా వ్యవహరిస్తుండబట్టే ఇంత అడ్డగోలుగా గ్రావెల్ తెగనమ్మేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గ్రావెల్ దోపిడీ బాగోతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పుడు పగటి పూట ఆపేస్తూ తిరిగి రాత్రి దందా కొనసాగిస్తూండటం ఇక్కడ రివాజుగా మారింది. దీనిపై జిల్లా యంత్రాంగం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతివ్వలేదు గ్రావెల్ తవ్వకాలకు ఎవ్వరికీ ఎప్పుడూ అనుమతులు ఇవ్వలేదు. జలాశయంలో మట్టి తవ్వాలంటే పంపా ప్రాజెక్టు, డైరెక్టర్లు తీర్మానం చేయాల్సి ఉంటుంది. మా శాఖ నుంచి లేఖ రాస్తే మైనింగ్ అధికారులు వచ్చి, క్యుబిక్ మీటర్కు ఎంత మొత్తం చెల్లించాలో నిర్ణయిస్తారు. అప్పుడు నిబంధనలకు అనుగుణంగా అనుమతిస్తాం. – శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పంపా రిజర్వాయర్ రూ.లక్షల్లో దోపిడీ రిజర్వాయర్లో అక్రమ గ్రావెల్ తరలింపు బాగోతం పక్షం రోజులకు పైబడే సాగుతోంది. భారీ యంత్రాలతో ఎక్కడ పడితే అక్కడ నిట్టనిలువునా మట్టి తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 12 చక్రాల భారత్ బెంజ్ లారీల్లో గ్రావెల్ను తరలించేస్తున్నారు. రాత్రి ఏడు, ఎనిమిది గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజాము వరకూ 50, 60 లారీలతో గ్రావెల్ తరలించేస్తున్నారు. పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ తదితర నియోజకవర్గాల్లోని ప్రైవేటు లే అవుట్లు, ఇటుక బట్టీల యజమానులకు ఈ గ్రావెల్ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోని లే అవుట్ల యజమానులకే 5 వేల ట్రిప్పుల గ్రావెల్ తరలించేందుకు చీకటి ఒప్పందం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. గడచిన రెండు వారాలుగా ఇప్పటికే వెయ్యి ట్రిప్పుల గ్రావెల్ పిఠాపురం తరలించేశారని అంచనా వేస్తున్నారు. ఇందులో రూ.70 లక్షలు చేతులు మారాయి. తుని నియోజకవర్గంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న అక్కడి ముఖ్య నేత బంధుగణం, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు పంపాను గుల్ల చేస్తున్నారని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. అన్నవరం, పిఠాపురం, చిత్రాడ, గొల్లప్రోలు, తుని తదితర ప్రాంతాలకు లారీ గ్రావెల్ను రూ.7 వేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజూ రాత్రి ఒక లారీ తక్కువలో తక్కువ నాలుగు ట్రిప్పులు వేసినా.. మొత్తం అన్ని లారీలూ కలిపి 240 ట్రిప్పుల వరకూ వేసి, మట్టిని తరలిస్తున్నారు. ఇలా పంపా నుంచి ఒక్క రాత్రి పూటే సుమారు రూ.16.80 లక్షల మేర కొల్లగొడుతున్నారు. పగటి వేళ స్థానికులతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఇందులో సగం ట్రిప్పులు వేస్తున్నారు. ఇలా ఏడెనిమిది లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఈవిధంగా పంపాను గుల్ల చేసి ప్రతి రోజూ సుమారు రూ.24 లక్షలు పైగా తెలుగు తమ్ముళ్లు బొక్కేస్తున్నారు. -
బతుకుబాటలో పూలవాన!
శ్రమకు విలువ దక్కుతుంది నాన్న నరసింహమూర్తి గతంలో శ్రీకాకుళంలో కొబ్బరి మొక్కలు వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం నేను విజయవాడలో నర్సరీ నిర్వహిస్తున్నాను. రహదారి పక్కన తాత్కాలిక నివాసంలో సంవత్సరాల తరబడి ఉంటుంటాం. సమస్యలను తట్టుకోగలిగినవారికి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఖర్చులు పోనూ సరాసరిన రోజుకు రూ.రెండువేలు చొప్పున ఆదాయం వస్తుంది. – వింటి సతీష్, నర్సరీ నిర్వాహకుడు పట్టణ ప్రజలు ఆదరిస్తున్నారు నర్సరీలను నుంచి మొక్కలను కొనుగోలు చేసి నగరాలు, పట్టణాల్లో విక్రయిస్తుంటాం. లాభాలు బాగానే ఉంటాయి. పట్టణ ప్రజలు మమ్మల్ని విశేషంగా ఆదరిస్తున్నారు. – వి.ఏసు, హైదరాబాద్ అశోక్ నగర్లో నర్సరీ నిర్వాహకుడు. ● ‘మొక్క’వోని దీక్షతో కోరుమిల్లివాసుల శ్రమ ● నగరాల్లో నర్సరీల నిర్వహణలో 400 కుటుంబాలు ● 40 ఏళ్లుగా ఇదే వ్యాపారం కపిలేశ్వరపురం: ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కోరుమిల్లి గ్రామానికి మొక్కల వ్యాపారం ప్రత్యేకత. 40 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరు బతుకు తెరువు కోసం చేసిన అన్వేషణ అనేక కుటుంబాల వారి జీవితంలో స్థిరత్వానికి బాట వేసింది. ఇంటికిద్దరు చొప్పున పదిమందితో బృందంగా ఏర్పడి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తదితర సుదూర ప్రాంతాల్లో నర్సరీలను నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నగర, పట్టణ ప్రాంతాలకెళ్లినప్పుడు ఏదో ఒకచోట కోరుమిల్లివాసులు ఎదురవుతారంటే అతిశయోక్తికాదు. నర్సరీల నిర్వహణలో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న కోరుమిల్లి వాసుల జీవన విధానంపై కథనం. ఆత్మ విశ్వాసంతో సాగితే అంతా మంచే జరిగింది కోరుమిల్లి వాసులు ఏళ్ల తరబడి గోదావరి లంకల్లో కూరగాయలు, ఉద్యాన పంటలు సాగు చేశారు. గ్రామంతోపాటు, సమీప ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ చేయడంలో కోరుమిల్లి గ్రామస్తులకు ప్రత్యేక పేరుంది. ఎంత కష్టపడినా ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో 1985లో కొంతమంది కొబ్బరి మొక్కలను వాహనాల్లో తరలించి శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో విక్రయించడం ప్రారంభించారు. అప్పట్లో ప్రారంభమైన ఆ ప్రక్రియ కాస్తా నేడు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటికొక నర్సరీ పనికి వెళ్లేలా ప్రేరణ కల్పించింది. ఊరు కాని ఊరులో నర్సరీల నిర్వహణ నల్లేరు మీద నడక కాదు. పట్టణాల్లోని రహదారుల వెంబడి ఖాళీ స్థలాల్లో రేకులు, ఆకులు, టార్పాలిన్లతో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకొంటారు. సంవత్సరాలు తరబడి అవే వారికి ఆవాసం. తెలంగాణలోని హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి పఠాన్ చెరువు వరకూ మూడు కిలోమీటర్లు దూరంలో సుమారు 100 వరకు నర్సరీలున్నాయి. కోరుమిల్లికి చెందిన 500 మంది ఆ నర్సరీల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్రలలో దాదాపు మరో 300 మంది పనిచేస్తున్నారు. మొక్కల తరలింపు, విక్రయాలు ఇలా... 1985లో గ్రామానికి చెందిన పదిమంది కడియం నర్సరీలో మొక్కలను లోడు చేసుకుని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయగరంలలో విక్రయించడంతో గ్రామంలో మొక్కల వ్యాపారం ప్రారంభమైంది. గ్రామానికి చెందిన యువకులు 2005 నుంచి హైదరాబాద్లో నర్సరీల నిర్వహణను కొనసాగిస్తున్నారు. నగరవాసుల నాడి పట్టిన కోరుమిల్లి వాసులు వ్యవసాయ పనులను వీడి క్రమంగా నర్సరీలవైపు మళ్లారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని మాణ్యం, బెంగళూరు, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రలోని నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణం, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో మొక్కలను విక్రయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్రలకు పాలకొల్లు నుంచి తీసుకెళ్లి కొబ్బరి మొక్కలను విక్రయిస్తుంటారు. కడియం, పూణేల నుంచి ఇండోర్, క్రోటన్స్ మొక్కలను, బెంగళూరు నుంచి గులాబి మొక్కలను ఖరీదు చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. విక్రయించే ప్రధాన మొక్కలు ఇవే.. పూల మొక్కలతో పాటు కొబ్బరి, సపోటా, బత్తాయి, నారింజ, మామిడి, నిమ్మ, దానిమ్మలతో పాటు బోన్సాయి, క్రోటన్స్ వంటి మొక్కలను కూడా విక్రయిస్తుంటారు. ఇంటీరియర్ డికరేషన్, నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, సొంత పొలాల్లో పెంచుకునేందుకు కొనుగోలు చేస్తుంటారు. గులాబి, తులసి, చామంతి, మందారం మొక్కలను కుండీల్లో అమర్చి పెంచుకుంటారు. కలవరపర్చిన ఘటనలనేకం... 2016 ఆగస్టు 1 తెల్లవారు జామున మియాపూర్లోని మదీనగూడ వద్ద రోడ్డు పక్కన ఉన్న నర్సరీలో నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకువెళ్లింది. చీకట్ల కృష్ణ అతని కుమారుడు వాసు, మరో యువకుడు బెజవాడ ఆదినారాయణ చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలోని విషాద ఛాయలు చాలాకాలం నర్సరీ వ్యాపారులను తీవ్రంగా కలవరపెట్టాయి. రహదారి వెంబడి తాత్కాలిక నివాసాల్లో ఉంటుండటంతో చలి, ఎండ, వానల బారిన పడి తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. కుటుంబ సభ్యులకు దూరంగా నెల నుంచి రెండు నెలలు వరకూ జీవించాల్సి వస్తుంటుంది. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: అన్నవరం, గొల్లప్రోలు మధ్యలో రైలు నుంచి జారిపడి కోరుబిల్లి అనిల్కుమార్ (34) మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. విశాఖపట్నం మర్రిపాలెంకు చెందిన కోరుబిల్లి అనిల్కుమార్, అతని భార్య, కుమార్తెతో కలిసి ఆదివారం రాత్రి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బయలుదేరారు. ఏపీ ఎక్స్ప్రెస్లో వెళుతున్న అనిల్కుమార్ రాత్రి 9 గంటల సమయంలో భోజనం చేసి చేతులు కడుగుకునేందుకు వాష్ బేషిన్ దగ్గరకు వెళ్లిన సమయంలో రైలు కుదుపులకు జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. వ్యక్తిపై కేసు నమోదు కొవ్వూరు: తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఇంటిలోకి వెళ్లకుండా తన పెద్ద సోదరుడైన పోలుమాటి రవి అడ్డుకుంటున్నారని జంగం రమాదేవి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఏఎస్సై జీజీ ప్రకాష్ తెలిపారు. క్రిస్టియన్పేటకు చెందిన రమాదేవి తల్లిదండ్రులకు ఆమెతో పాటు ఇద్దరు సోదరులున్నారు. వీరికి రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. అన్నదమ్ములకు చేరొక పోర్షన్ రాశారు. చిన్న సోదరుడు పెళ్లి చేసుకోలేదు. చిన్న తమ్ముడి పోర్షన్లోకి తాను వెళ్లకుండా పెద్ద సోదరుడు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి
కాకినాడ సిటీ: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఐ.ప్రసాదరావు అన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూరిబాబు అధ్యక్షతన కాకినాడలో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచే లక్ష్యంతో రూపొందించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రాన్ని ప్రసాదరావు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఉన్న పోస్టులు కాపాడుకోవడానికి, డీఎస్సీ ద్వారా నూతన పోస్టులు భర్తీ చేసుకునేందుకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ చాలా కీలకమని అన్నారు. గ్రామాల్లోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోడల్ స్కూల్ పేరుతో కొన్ని ఊరి బడులను మూయడం తగదని హితవు పలికారు. ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ విద్యారంగానికి అవసరమైనన్ని నిధులను ప్రభుత్వాలు మంజూరు చేయడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, నాణ్యమైన విద్య అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు ప్రైవేటు స్కూళ్లలో చదివే ధనిక వర్గాల వారికి కూడా తల్లికి వందనం వంటి ఆర్థిక సహకారం ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పడిపోతుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ విద్యార్థుల్లో ఆల్రౌండ్ ప్రతిభకు బదులు బట్టీ విధానం ద్వారా ర్యాంకులు, గ్రేడులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత, నమోదు పెంచుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రూ.కోట్లు ఖర్చు చేసి యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు, బ్యాగ్లు, షూస్, మధ్యాహ్న భోజన పథకం వంటివి ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అందరూ దృష్టి సారించాలని ప్రసాదరావు పిలుపునిచ్చారు. పోలిసెట్కు ఉచిత శిక్షణ కాకినాడ సిటీ: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పోలిసెట్కు యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జగ్గంపేటలోని యూటీఎఫ్ హోంలో ఏప్రిల్ 3 నుంచి 29వ తేదీ వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ ఉచిత శిక్షణ ఇస్తామని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఉచిత పోలిసెట్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు సాయిరాం, ప్రధాన కార్యదర్శి నగేష్ ఆవిష్కరించారు. జగ్గంపేట, ఏలేశ్వరం, గండేపల్లి, పెద్దాపురం, కిర్లంపూడి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు నిర్వహించి, ఎక్కువ మంది అర్హత సాధించేలా తర్ఫీదు ఇస్తారని సత్యనారాయణ తెలిపారు. నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ ● ఈ– కేవైసీ తప్పనిసరి ● ఏప్రిల్ 30 వరకూ గడువు పొడిగింపు కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా 420 ఎండీయూ వాహనాల ద్వారా 6,43,161 మంది రేషన్కార్డుదారులకు ఫోర్టిఫైడ్ రైస్, ఇతర నిత్యావసర సరకులను మంగళవారం నుంచి యథావిధిగా పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులపై జిల్లాలో 2023లో 70, 2024లో 85, 2025లో ఇప్పటి వరకూ 32 చొప్పున కేసులు నమోదు చేశామని వివరించారు. అత్యధికంగా మార్చి నెలలో 13 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,43,161 కార్డుల్లోని 18,31,681 మంది సభ్యులకు గాను ఇప్పటి వరకూ 16,52,981 మందికి ఈ–కేవైసీ పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 1,78,700 మందికి ఈ–కేవైసీ చేయాల్సి ఉందన్నారు. కార్డుదారులకు ఈ–కేవైసీ తప్పనిసరని, గడువు ఏప్రిల్ 30వ తేదీ వరకూ పెంచారని తెలిపారు. పౌరసరఫరాలు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో ఈ–కేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు. -
రెండు కుటుంబాల ఘర్షణపై సీఐ విచారణ
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాలలో గత శనివారం రాత్రి జరిగిన రెండు కుటుంబాల ఘర్షణపై ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు సోమవారం విచారణ చేపట్టారు. ఘర్షణ పడిన బాధిత కుటుంబీకులను, ఘటనా స్థలం సమీపంలోని నివసిస్తున్న పలువురిని విచారించారు. ఇరువర్గాల వివాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు, వివాదాలు తలెత్తకుండా పోలీసు పికెటింగ్ను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట రౌతులపూడి రైటర్ డీవీ రమణ ఉన్నారు. -
అల్లుణ్ణి కత్తితో నరికి చంపిన మామ, బావమరిది
నల్లజర్ల: కన్న కూతుర్ని తరుచూ ఇబ్బందులకు గురిచేస్తున్న అల్లుణ్ణి మామ, బావమరిది కత్తితో నరికి చంపారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం నల్లజర్ల ముత్తరాసుపేటలో సోమవారం రాత్రి జరిగింది. ఇన్చార్జి ఎస్ఐ సతీష్ అందించిన వివరాల ప్రకారం నల్లజర్లకు ముత్తరాసుపేటకు చెందిన రేగుల వెంకన్న భారతిల కుమార్తె భానుకు అదే గ్రామానికి చెందిన పేరం శివతో నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. వారికి మూడేళ్లు కుమార్తె ఉండగా భాను ఇపుడు గర్భవతి. పైళ్ళెన నాటి నుంచి తరుచూ భార్యాభర్తలు తగవులు పడుతున్నారు. అదే క్రమంలో మూడు రోజుల కిందట భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. భాను పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం శివ అత్తవారింటికి వెళ్లి భార్యను పంపమని అడిగాడు. అందుకు అత్తమామలు సమ్మతించలేదు. ఎలా పంపరో చూస్తానంటూ హెచ్చరించాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శివ మామ వెంకన్న, అతని బావమరిది శ్రీరామ్ మరో ముగ్గురు బంధువులు శివ ఇంటికి వచ్చి అతని తల్లిదండ్రులతో గొడవ పడ్డారు. తర్వాత ఇంట్లో నుంచి వస్తున్న శివను కత్తితో మెడ మీద నరికారు. శివ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిటకిటలాడిన రత్నగిరి
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి సోమవారం కిటకిటలాడింది. ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, సత్యదేవుని వ్రతాలాచరించి, దర్శనం చేసుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సత్యదేవుని మొత్తం 40 వేల మంది దర్శించుకున్నారు. 1,500 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అమ్మవారు ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. -
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాకినాడ ఈద్గా మైదానంలో ముస్లింలు సోమవారం నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లింలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా స్థానిక ముస్లింలు భుజాలకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం ఆలోచనపరుల వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ చట్టం అప్రజాస్వామికమని, రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ముస్లింలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 13 నుంచి తలుపులమ్మ తల్లి గంధామావాస్య జాతర తుని రూరల్: లోవ కొత్తూరులో తలుపులమ్మ అమ్మవారి గంధామావాస్య జాతర ఏప్రిల్ 13 నుంచి 27 వరకూ నిర్వహించనున్నట్లు లోవ దేవస్థానం ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై లోవ దేవస్థానం కార్యాలయంలో సోమవారం ఆయన లోవ కొత్తూరు గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 13న గరగలు తీయడంతో ఉత్సవాలు ప్రారంభించి, 26న జాగరణ నిర్వహిస్తామని తెలిపారు. 27న అమ్మవారి ఊరేగింపు, తీర్థం జరుపుతామన్నారు. ప్రతి సంవత్సరం లోవ కొత్తూరులో అమ్మవారి పుట్టింటి సంబరాలుగా గంధామావాస్య ఉత్సవాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానంలో ఉత్సవాలు చేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం గంధామావాస్య ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉత్సవాలకు అవసరమైన నిధులను దేవస్థానం నుంచి కేటాయించాలని గ్రామస్తులు కోరారు. ఉత్సవాల నిర్వహణలో గ్రామస్తులు ఐక్యంగా సహకరించాలని ఈఓ విశ్వనాథరాజు కోరారు. సమావేశంలో దేవస్థానం మాజీ చైర్మన్ దూలం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
అన్నవరం దేవస్థానానికి డస్ట్బిన్లు అందజేసిన గెయిల్
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివా రి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ శ్రీగెయిల్ శ్రీ ఇండియా (రాజమహేంద్రవరం) సంస్థ రూ.18 లక్షల విలువ చేసే 85 జతల స్టెయిన్లెస్ స్టీల్ డస్ట్బిన్లను విరాళంగా అందజేసింది. సోమవా రం నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీటిని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ కేవీఎన్ రావు, జనరల్ మేనేజర్ కేబీ నారాయణ అందజేశారు. ఒకో జతలో ఒక తడిచెత్త, ఒక పొడిచెత్త డస్ట్బిన్లు ఉంటాయి. ఈ డస్ట్బిన్లనువివిధ సత్రాలలో, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి దేవస్థానంలో మరింత పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చూడాలని వారు కోరారు. గెయిల్ డీజీఎంలు రాజన్ కరతిస్వరన్, దివి ప్రభాకర్, హెచ్ఆర్ మేనేజర్ వైవీఎస్ మూర్తి, మాజీ మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ, దేవస్థానం ఈఈ వీ రామకృష్ణ, శాని టరీ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం
● కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులకు శ్రీకారం ● తొలివిడతగా 12,500 మెట్రిక్ టన్నుల రవాణా ● జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి నౌక ద్వారా ఎంటీయూ–1010 రకం బియ్యం రవాణాను తెలంగాణ జలవనరులు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్టుకు హెలికాప్టర్లో వచ్చారు. హైదరాబాద్లో ఇటీవల ఇంటర్నేషనల్ ఎక్స్పో జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ ద్వారా జరిగిన ఒప్పందం మేరకు తొలి విడతగా రూ.45 కోట్ల విలువైన 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్ర అవసరాలు తీరగా మిగిలిన బియ్యాన్ని తెలంగాణ వరి రైతులకు మేలు జరిగేలా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. తెలంగాణలో పోర్టు లేని నేపథ్యంలో డ్రై పోర్టులు నిర్మించాలని అప్పటి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చిందన్నారు. ఈ మేరకు ఫిలిప్పీన్స్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కాకినాడ పోర్టు నుంచి నౌక ద్వారా 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుందని, తొలి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని వివరించారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తరఫున ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ (సింగపూర్) పీటీఈ లిమిటెడ్ ఈ రవాణా చేయనుంది. వియత్నాంకు చెందిన ఎంవీ ట్రోన్గ్–ఎన్ షిప్ ద్వారా ఈ ఎగుమతి జరిగింది. తొలిసారిగా జరిగిన ఈ అరుదైన కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ర్యాపిడో వెహికల్ను ఢీకొట్టిన కారు రాజమహేంద్రవరం రూరల్: ర్యాపిడో వెహికల్పై వెళుతున్న ఇద్దరిని కారు అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి కొంతమూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హుకుంపేట వరలక్ష్మీనగర్కు చెందిన ఈర్లు నాగబాబు(43) జీవనాధారం కోసం ర్యాపిడో వెహికల్ నిర్వహిస్తున్నాడు. కొంతమూరు కళ్యాణ్నగర్ చెందిన ఒంటెద్దు వెంకటేష్(28) డిగ్రీ చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేష్ శనివారం సాయంత్రం స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. సోమాలమ్మ జాతర చూసి పక్కనే ఉన్న అప్సర థియేటర్లో సెకండ్షో సినిమా చూశాడు. సినిమా అయిపోయిన తరువాత ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. వెంటనే ఈర్లు నాగబాబు అప్సర థియేటర్ వద్దకు వచ్చి వెంకటేష్ను తీసుకుని కొంతమూరు కళ్యాణ్నగర్కు బయలుదేరాడు. కొంతమూరు మనీషా ఫంక్షన్ హాలు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ర్యాపిడో వెహికల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒంటెద్దు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న ఈర్లు నాగబాబును అంబులెన్స్లో తీసుకువెళుతుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. ఘటనా స్థలాన్ని రాజానగరం పోలీసులు పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. వెంకటేష్ తండ్రి ఒంటెద్దు వీరభద్రరావు ఫిర్యాదు మేరకు రాజానగరం ఎస్సై మనోహర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఈర్లు నాగబాబు, ఒంటెద్దు వెంకటేష్ కుటుంబ సభ్యులను డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ పరామర్శించారు. ఈర్లు నాగబాబు కుటుంబానికి చందన నాగేశ్వర్ రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఉపాధి కోసం ర్యాపిడో ఎంచుకుంటే... ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని రాత్రి సమాయల్లో ర్యాపిడో వెహికల్ను నిర్వహిస్తున్న ఈర్లు నాగబాబును అదే మృత్యుఒడికి చేర్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు మగపిల్లలు ఇతనిపై ఆధారపడిి ఉన్నారు. దీంతో కుటుంబానికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశంతో నాగబాబు ర్యాపిడో ద్వారా పగలు,రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో నాగబాబు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు బేబి, ఆదినారాయణ, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య శ్రీలత, ఇద్దరు పిల్లలకు దిక్కెవరంటూ వారి రోదిస్తున్న తీరు చూపరులను కలిచి వేసింది. ఉగాది పండగకు వచ్చి... బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండగను కుటుంబ సభ్యులతో జరుపుకుని ఆనందంగా గడుపుదామని రెండు రోజుల క్రితం ఒంటెద్దు వెంకటేష్ ఇంటికి వచ్చాడు. అతను ఇలా మృతిచెందడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటేష్ తండ్రి ఒంటెద్దు వీరభద్రరావు పండ్ల వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా, కుమారుడు వెంకటేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పండగకు వచ్చి ఇలా మృత్యువాత పడతావని అనుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
● భర్త పరిస్థితి విషమం ● మోటారు బైక్ను ఢీ కొన్న కారు ● కారు డ్రైవ్ చేసిన మైనర్లు సామర్లకోట: మైనర్లు కారు డ్రైవింగ్ చేయడంతో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిల్పై వెళుతున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడిన ఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వేట్లపాలెం, గాంధీనగర్కు చెందిన గద్దె లక్ష్మణరావు, శిరిష మోటారు సైకిల్పై కాకినాడ ఆస్పత్రికి వెళుతున్నారు. సామర్లకోట నుంచి వేట్లపాలెం అతి వేగంగా వస్తున్న కారు కెనాల్ రోడ్డులో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మోటారు సైకిల్ను ఢీ కొనడంతో ఐదు అడుగుల ఎత్తు ఎగిరి కింద పడింది. డ్రైవింగ్ చేస్తున్న మైనర్ బాలుడు కారును అదుపు చేయలేక పోవడంతో కింద పడిన వారిని 20 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుపోయి రోడ్డు మార్జిన్లో కారు ఆగింది. కారు వేగం తగ్గించే క్రమంలో బ్రేక్ తొక్కబోయి, ఎక్స్లేటర్ తొక్కడం వల్ల కారు వేగం పెరిగినట్టు కారులో ఉన్న మైనర్లు చెప్పారని స్థానికులు తెలిపారు. ఇంటి నుంచి బయలు దేరిన 10 నిమిషాలకు ప్రమాదం జరిగినట్టు తెలియడంతో గ్రామ ప్రజలు ఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రత్యేక అంబులెన్సులో క్షతగాత్రులను కాకినాడ ట్రస్టు ఆస్పత్రికి తరలించారు. కారులో ఐదుగురు మైనర్లు ఉండగా ఒక మైనర్ బాలుడు పారిపోవడంతో మిగిలిన నలుగురిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన్నట్లు స్థానికులు తెలిపారు. బలభద్రపురానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీ నుంచి రమేష్ అనే వ్యక్తి కారును అద్దెకు తీసుకొనగా అతని నుంచి బిక్కవోలుకు చెందిన మైనర్ యువకులు కారు తీసుకున్నట్లు తెలిసింది. క్షతగాత్రుడు గద్దె లక్ష్మణరావు వేట్లపాలెం సమీపంలో ఉన్న హుస్సేపురం వెంకట్రామ ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని వేట్లపాలెం గ్రామస్తులు తెలిపారు. ఘటనలో కారు నుజ్జు నుజ్జు కాగా మోటారు సైకిలు ధ్వంసం అయింది. సీఐ ఎ.కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్కూ వేసవి తాపం!
ఆలమూరు: వేసవి వచ్చేసింది. ఎండలు అంతకంతకూ ముదురుతున్నాయి. ఉష్ణోగ్రతలు 35–40 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనానికి విద్యుత్ ఉపకరణాల వినియోగం మూడింతలవుతోంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా విద్యుత్ వైర్ల సామర్థ్యంపైనే సందేహాలన్నీ. కన్సీల్డ్ వైరింగా.. గోడలపైనే గొట్టాల్లో ఏర్పాటు చేశారా.. సరైన ప్రమాణాలతో తగిన మందం ఉన్న వైర్లు వేశారా అనేది అందరూ గుర్తించాల్సిన అంశం. ఏదైనా లోపాలుంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తెరగాలి. ఈ నెలాఖరు నాటికి ఉష్ట్రోగ్రతలు 40–45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం ఉంది. ఇలా చేయవద్దు ● గృహంలో 15 యాంప్స్ విద్యుత్ ఉపయోగించే చోట 30 యాంప్స్ విద్యుత్ భారం పడే పరికరాలు వినియోగిస్తే తీగలు కాలిపోయే ప్రమాదముంది. ● ఒకే స్వీచ్ బోర్డుకు ఎక్కువ ప్లగ్లు ఉపయోగిస్తే ఒక్కసారిగా లోడ్ పెరిగి స్పార్క్ వచ్చి ప్రమాదాలకు అవకాశముంటుంది. ● ఎండలో విద్యుత్ తీగలు ఉంచితే భవిష్యత్తో తీగలపై ఉన్న రబ్బర్ మెత్తబడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ● ఇంటిలో ఒకేసారి విద్యుత్ ఉపకరణాలన్నీ ఆన్ చేసి ఉంచవద్దు. ● కంప్యూటర్ పరికరాలు, టీవీల వద్ద విద్యుత్ తీగలను చిందర వందరగా ఉంచవద్దు. ● రక్షణ పరికరాలైన ఎంసీబీ (మైక్రో సర్క్యూట్ బ్రేకర్), ఎంసీసీబీ (కరెంట్ కట్రోలర్ బ్రేకర్) ఫ్యూజులను బైపాస్ చేయకూడదు. తీసుకోవలసిన జాగ్రత్తలు ● వేసవికాలం ప్రారంభమయ్యే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇళ్లు, కార్యాలయాలను తప్పనిసరిగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లతో తీగల వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి. ● విద్యుత్ వైరింగ్ చేయించేటప్పుడు పూర్తిగా ఐఎస్ఐ, బీఐఎస్ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి. ● ఇంట్లో విద్యుత్ వినియోగం ఆధారంగా విద్యుత్శాఖ నుంచి లోడ్ను తీసుకోవాలి. ● అందుకు తగినట్లు వైరింగ్ ఏర్పాటు చేసుకున్న తరువాత ఏసీలు, కూలర్లు, వాటర్ హీటర్లు, మైక్రో ఓవెన్ ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించుకోవాలి. ● ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని బట్టి దానికనుగుణంగా నాణ్యత కలిగిన విద్యుత్ తీగలను వినియోగించాలి. ● నాసిరకం విద్యుత్ పరికరాలతో విద్యుత్ వృథా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వైరింగ్ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ● గృహాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా న్యూట్రల్ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్ ఎలక్ట్రోడ్ ఏర్పాటు చేసుకోవాలి. ● ఎండాకాలంలో రక్షణ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే ఎర్తింగ్ సరైన పద్ధతిలో ఉంచేందుకు అవసరమైన ప్రదేశంలో నీరు, దొడ్డు ఉప్పు ఉపయోగించాలి. ● విద్యుత్ వాడేందుకు మూడు పిన్నుల ప్లగ్లు, సాకెట్లు మాత్రమే ఉపయోగించాలి. ● విద్యుత్ స్తంభాల నుంచి మీటర్ వరకు ఉండే సర్వీస్ వైర్లు అతుకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. అధిక లోడుతో అనర్థమే వేసవి కాలంలో విరివిగా విద్యుత్ ఉపకరణాల వినియోగం వల్ల ఒక్కొక్కసారి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయి. గృహాల్లో కాని, కార్యాలయాల్లో కాని వాడుతున్న విద్యుత్ వాడకాన్ని బట్టి లోడ్ను నిర్థారించుకుని ఆ మేరకు విద్యుత్శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో విద్యుత్ సబ్స్టేషన్ నుంచి వినియోగదారునికి అవసరమైన లోడ్ను ఆ ట్రాన్స్ఫార్మర్లో అందుబాటులో ఉంచుతుంది. ఎవరైనా వినియోగదారుడు కేవలం 1 కేవీ లోడుకు మాత్రమే అనుమతి పొంది వేసవి తీవ్రత దృష్ట్యా అధికంగా విద్యుత్ను వినియోగిస్తే ఆ ప్రభావం సమీప ట్రాన్స్ఫార్మర్పై పడి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ సంబంధించి కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. వినియోగదారులందరకూ విద్యుత్శాఖకు సహకరించి వాడుతున్న లోడ్కు అనుగుణంగా అనుమతి పొందితే భవిష్యత్లో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. సింగిల్ ఫేజ్ సర్క్యూట్లో ఫేజ్, న్యూట్రల్, ఎర్త్ వైర్లు సమాన పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. ఏసీలు, ఫ్రిజ్లు, టీవీలు ఇతరత్రా విద్యుత్ ఉపకరణాలు వాడే సమయంలో కచ్చితంగా స్టెబిలైజర్లను వినియోగించాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తుంటే సత్వరమే సంబంధిత విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి, లేకుంటే సమీప ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే ప్రమాదముంది. లోడు ఎక్కువైతే వైర్లు కాలిపోయే అవకాశం షార్ట్ సర్క్యూట్తో గృహోపకరణాలకు ముప్పు వైరింగ్లో ప్రమాణాలతో ప్రమాదాలకు చెక్ సరఫరాలో లోపాలుంటే ఫిర్యాదు చేయాలి అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో విద్యుత్ తీగలు వ్యాకోచం చెందే అవకాశం ఉన్నందున షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగత్తలు తీసుకోవాలి. గృహాల్లో వినియోగించే విద్యుత్ ఉపకరణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వైరింగ్ను చేయించుకోవాలి. విద్యుత్ సరఫరాల్లో లోపాలు ఉంటే సత్వరమే సమీప లైన్మెన్కు తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలి. – కె.రత్నాలరావు, ఏపీఈసీడీఎల్ ఈఈ, రామచంద్రపురం. -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు డిమాండ్
● భారీ ర్యాలీకి తరలివచ్చిన వేలాది మంది ● కదం తొక్కిన క్రైస్తవులు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కాకినాడ జిల్లా పాస్టర్స్ జేఏసీ ప్రతినిధి బిషప్ జ్యోతికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పాస్టర ప్రవీణ్ మృతికి నిరసన తెలియజేస్తూ కాకినాడ క్రైస్తవ పాస్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి జ్యోతికుమార్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారనే నమ్ముతున్నామని, ఒక దైవ జనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. తొలి దినాల్లో అపోస్తలులను చెరలో వేసి సువార్తను అపుదాం అనుకున్నారు, కాని చెరలో సువార్తికులను బంధించారు కానీ, సువార్త ఆగలేదని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును సీఐడీకి అప్పగించాలన్నారు. ఒక్క ప్రవీణ్ పగడాలను చంపితే వందలాది మంది ప్రవీణ్లు పుట్టుకొస్తారన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల రక్షణకు భరోసా ఇవ్వాలన్నారు. సీవైఎఫ్ డైరెక్టర్ మూర్తి రాజు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాలను చంపినంత మాత్రాన సువార్త ఆగదని, సువార్త ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞను ప్రతీ క్రైస్తవుడు పాటిస్తాడన్నారు. ప్రభుత్వం ప్రవీణ్ పగడాల ఎలా చనిపోయారో చెప్పాలని, రోడ్డు ప్రమాదం అయితే ఎలా జరిగింది, దాడి చేస్తే ఎవరు దాడి చేశారు అనేది పోలీస్ వారు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ ప్రతినిధి రిక్కి గూటం మాట్లాడుతూ ప్రభుత్వం చొరవ తీసుకుని పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి పై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఈ ర్యాలీకి తరలి వచ్చి వందలాది క్రైస్తవులు తమ ఐక్యతను చాటారని, ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. అనంతరం ర్యాలీ భానుగుడి సెంటర్ నుంచి ముత్తా బ్రిడ్జి మీదుగా రామారావు పేట, జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. క్రైస్తవ పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ ర్యాలీలో వియ్ వాంట్ జస్టిస్, న్యాయం కావాలని, దోషులను శిక్షించాలంటూ క్రైస్తవ సంఘ నాయకులు, సభ్యులు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో క్రైస్తవ దైవజనులు డి.సామ్యూల్ సాగర్, బిషప్ జ్యోసఫ్ బిన్ని, శీరం ఐజాక్; పి.ఐజాక్, వి.విజయ్ కుమార్; జాషువ గిరి, క్రైస్తవ సంఘాల నాయకులు, సభ్యులు వేలాదిగా పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉగాది అందరికీ శుభాలు ఇవ్వాలి
పరిపూర్ణానంద స్వామికాకినాడ రూరల్: విశ్వావసు నూతన సంవత్సరం ఉగాది అందరికీ శుభాలు ఇవ్వాలని పరిపూర్ణానంద స్వామి ఆకాంక్షించారు. స్థానిక రమణయ్యపేట పీఠంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు నూతన సంవత్సరంలో సుందరేశ్వర సమేత ఐశ్వర్యాంబిక అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ముందుకు సాగాలన్నారు. భమిడి చారిటబుల్ ట్రస్ట్ ప్రచురించిన పంచాంగం ప్రతులను పరిపూర్ణానంద స్వామి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భమిడి ట్రస్ట్ చైర్మన్ శివమూర్తి రమాదేవి, న్యాయవాది కొమ్మూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి డాక్టర్ వేదుల శిరీష పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు. కారు ఢీకొని వ్యక్తి మృతి రాజమహేంద్రవరం రూరల్: కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన దివాన్చెరువు జాతీయరహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు కథనం ప్రకారం దివాన్చెరువు కంకరగట్టు ప్రాంతానికి చెందిన సుంకర బాబూరావు (64) అదే గ్రామంలో శ్రీరామపురం రోడ్డులో కోల్డ్ స్టోరేజ్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో జాతీయరహదారిపై ఉన్న టీటైమ్కు వెళ్లి టీతాగి శ్రీరామపురం రోడ్డులోకి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ లోగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో పైకి ఎగిరి కిందపడడంతో తలకు బలమైన గాయమై బాబూరావు మృతిచెందాడు. బాబూరావు సోదరుడు సుంకర త్రిమూర్తులు ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్స్టేషన్ ఎస్సై సీహెచ్వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దీక్ష ముగిసె.. దువా ఫలించె!
● నేడే ఈద్ ఉల్ ఫిత్ర్ ● చంద్ర దర్శనంతో ముగిసిన ఉపవాసాలు ● సోమవారం ఈద్ నమాజ్ ● ఈద్గాలు, మసీదుల్లో భారీ ఏర్పాట్లు ● ధన, ఆరోగ్యాలకు బీమా జకాత్ ● పేదలూ పండగ చేసుకునేందుకు ఫిత్రా సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర రంజాన్ మాసం నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్కు సిద్ధమయ్యారు. సోమవారం ఈద్ ఉల్ ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు(రోజా), ప్రత్యేక తరావీహ్ నమాజ్, సహర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముస్లింలు గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా నిష్ఠతో దీక్షలు పాటించారు. చివరకు చంద్ర దర్శనం కావడంతో పండగ చేసుకోనున్నారు. ఈద్ నమాజ్కు సిద్ధం ఈదుల్ ఫితర్ నమాజ్ కోసం ఏర్పాట్లు చేశౠరు. ఈద్గాలతో పాటు మసీదుల్లో సౌకర్యాలు కల్పించారు. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈదుల్ ఫితర్ నమాజ్ చేయడం ఆనవాయితీ. నెల రోజుల తమ ప్రార్థనలు ఫలించాలని, సర్వ మానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ అల్లాహ్కు దువా చేస్తారు. – 2.50 శాతం జకాత్ రంజాన్లో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ధనికులే కాదు.. పేదలు సైతం ఆనందంగా పండగ చేసుకోవాలన్నదే ఈ మాసం ముఖ్యోద్దేశం. మనిషి ఆరోగ్యం, తాను సంపాదించిన ధనంపై అల్లా నిర్దేశించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకు మించి విలువైన ధన/ఆస్తులు కలిగితే జకాత్కు అర్హులు. వాటి వెల లెక్కకట్టి 2.5 శాతం పేదలకు జకాత్ రూపేణా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రంజాన్లో ఇస్తే 70 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుందనేది ముస్లింల విశ్వాసం. ఫిత్రా ఇవ్వాల్సిందే.. సాధారణ ముస్లిం రంజాన్ సందర్భంగా 2.6 కిలో గ్రాముల గోధుమలు, వరి(ప్రధాన ఆహార ధాన్యం), సమానమైన డబ్బు పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మత పెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని నిరుపేద ముస్లింలకు ఫిత్రా దానమివ్వాలి. సద్ఖా–ఎ–ఫిత్రాతో ఆరోగ్య బీమాను అల్లాహ్ కల్పిస్తారంటారు. సూత్రప్రాయంగా ఈ ఏడాది మత పెద్దలు రూ.150 ఫిత్రా ఇవ్వాలని సూచించారు. దీనికంటే ఎక్కువ ఇవ్వవచ్చు కానీ తగ్గించరాదు. పండగకు కనీసం ఒకరోజు ముందే ఫిత్రా చెల్లిస్తే పేదలు సైతం పండగ చేసుకునే వీలుంటుంది. అప్పడే పుట్టిన బిడ్డ మొదలు.. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున ఫిత్రా ఇవ్వాలి. అల్లా ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్ ఎతెకాఫ్ అల్లా ఇంటి (మసీదు) ఆతిథ్యం వంటిది. రంజాన్లో దీనికెంతో ప్రాధాన్యం ఉంది. ఊర్లో ఒక్క వ్యక్తి కూడా ఎతెకాఫ్ ఉండకపోతే, ఆ ఊరిపై అల్లా కరుణా కటాక్షాలు ఉండవని పవిత్ర ఖురాన్ బోధిస్తోంది. ఎతెకాఫ్ను రంజాన్ చివరి పది రోజుల్లో పాటించాలి. ప్రాపంచిక జీవితానికి దూరంగా, వీలుపడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో అల్లా ధాన్యంలో గడపడమే ఎతెకాఫ్. అన్నింటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే వానిపై అల్లాహ్ అత్యంత కరుణతో మొర ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు. రంజాన్ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రంజాన్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు ప్రకటించారు. సర్వం సిద్ధం ప్రార్థనలకు ముందు మహా ప్రవక్త మొహమ్మద్(స.అ.వ.) సంప్రదాయ ప్రకారం ఖర్జూరం సేవించి, నూతన వస్త్రాలు ధరించి, అత్తరు రాసుసుని నమాజు కోసం ఈద్గాకు చేరుకుంటారు. అక్కడ ఈద్ నమాజ్ చదివి, అనంతరం పరస్పరం ఈద్ ముబరక్ చెప్పుకొంటారు. అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఇంటి నుంచి ఈద్దాకు వెళ్లి, నమాజ్ పూర్తయ్యాక వేరే మార్గంలో ఇంటికి చేరుతారు. రంజాన్లో సేమియా పాయసం ప్రత్యేకం. బంధు మిత్రులకు ఇరుగు పొరుగువారికి సేమియా పాయసమిచ్చి తమ ఆత్మీయతను పంచుకుంటారు. చిన్న పిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు. సోమవారం రాజమహేంద్రవరంలోని అన్ని మసీదులలో ఈదుల్ ఫిత్ర్ని జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజేంద్రనగర్లోని ఈద్గాలో ఈదుల్ ఫిత్ర్ నమాజును నిర్వహిస్తారు. -
గ్రామాల్లో పర్యటనకు దాడిశెట్టి రాజా శ్రీకారం
తుని రూరల్: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండలంలోని కేఓ మల్లవరంలో పర్యటించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామాల పర్యటనకు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తుని మండలానికి ఈశాన్యం దిక్కున కేఓ మల్లవరం ఉండడంతో ఆ గ్రామంలో పర్యటించారు. అనంతరం డొంక వెంకట బెనర్జీ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీకి పూర్వవైభవం వస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు సాగుదామన్నారు. అంతకుముందు గ్రామదేవత చీడికమ్మతల్లిని దర్శించుకున్నారు. తాండవ సుగర్స్ మాజీ చైర్మన్ నాగం దొరబాబు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి వీర్రాఘవులు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలగా వెంకట కృష్ణాజీ, పార్టీ కోటనందూరు మండల కన్వీనర్ చినబాబు, మాజీ సర్పంచ్ ఏకా కన్నయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి కాకినాడ సిటీ: వలంటీర్ల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ధర్నా నిర్వహించారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం ఇదే ఉగాది రోజున తీపి కబురు చెబుతున్నామని చెప్పి వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.5 వేలు కాదు, రూ. 10 వేలు వేతనం ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చారని ఆందోళనకారులు వివరించారు. కానీ నేడు ఆ హామీని మరిచి వలంటీర్లను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల నుంచి వలంటీర్లను గాల్లో పెట్టి వారికి బకాయి వేతనం చెల్లించకుండా ఇంటికి పంపించేశారన్నారు. తక్షణమే వలంటీర్ల బకాయి వేతనాలు చెల్లించి వారిని విధుల్లోకి తీసుకుని రూ.10 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా నా ఆడపడుచులకు రూ.5 వేలు ఏమి సరిపోతాయని, రూ.10 వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు పది నెలలుగా ఆడపడుచులకు ఇచ్చిన హామీని మరచి పాలన సాగిస్తున్నారన్నారు. వలంటీర్లు యూనియన్ నాయకులు వరుణ్, రమేష్, అజయ్, మధుబాబు, లక్ష్మీ, సుభద్ర, శ్రావణి, పరమేశ్వరి, సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: విశ్వావసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం సత్యదేవుని ఆలయం వేలాదిగా విచ్చేసిన భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పర్వదినం ఆదివారం, రంజాన్ పండగ సందర్బంగా సోమవారం వరుసగా రెండ్రోజులు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు కావడంతో సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. -
అందరికీ మేలు జరగాలి
● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు కన్నబాబు ● కాకినాడ రమణయ్యపేట కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు ● పంచాంగ శ్రవణంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకినాడ రూరల్: విశ్వావసు తెలుగు నూతన సంవత్సరం మనందరికీ మంచి చేయాలని, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాలకు బాగుండాలని మేలు జరగాలని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. రమణయ్యపేట వైద్యనగర్ కార్యాలయంలో ఆదివారం కన్నబాబు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. చీడిగ గ్రామానికి చెందిన సిద్ధాంతి వెంపరాల వరప్రసాద్ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది నక్షత్ర, గోచార ఫలాలు ఎలా ఉంటాయో వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యంతో ఉండాలని, ప్రజలందరూ సంక్షేమాన్ని పొందేలా భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలని వైఎస్సార్ సీపీ తరఫున కోరుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ నామ సంవత్సరాలుగా ఉగాది వేడుకలు జరిగాయన్నారు. వైఎస్సార్ సీపీ పేదల పక్షాన నిలబడుతుందన్నారు. పార్టీ నాయకులు కురసాల సత్యనారాయణ, సినీ దర్శకుడు కురసాల కళ్యాణ్కృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు జమ్మలమడక నాగమణి, ఎంపీటీసీ సభ్యులు సారా రాజేష్, కొల్లా భాస్కరరావు, సర్పంచ్ రామదేవు చిన్నా, గోపుశెట్టి బాబ్జీ, పుల్ల చందు, పల్లంరాజు, కొప్పిశెట్టి గణేష్, తోటకూర శ్రీను పాల్గొన్నారు. పలువురు నాయకులు కన్నబాబును గజమాలతో సన్మానించారు. -
కళారంగానికి సీఆర్సీ సేవలు ఎనలేనివి
రావులపాలెం: భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కళారంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతంరాజు, గుండు సుదర్శన్, జోగినాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని సీఆర్సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 25వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను ఆదివారం వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై సీఆర్సీ కళా సేవను కొనియాడారు. ఈ సందర్భంగా సీఆర్సీ ఉగాది పురస్కారాన్ని రామచంద్రపురానికి చెందిన చింతా గిరిబాలకు, సీఆర్సీ కాటన్ కళా పురస్కారాన్ని మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకరరావుకు అందజేశారు. కార్యవర్గం ప్రమాణ స్వీకారం: ఈ సందర్భంగా సీఆర్సీ, సీఆర్సీ ఓల్డేజ్ హోమ్ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది. సీఆర్సీ అధ్యక్షుడిగా తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శిగా నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, పరిషత్ డైరెక్టర్గా కె.సూర్య, ఉపాధ్యక్షుడిగా చిన్నం తేజారెడ్డి, ట్రెజరర్గా కొవ్వూరి నరేష్కుమార్రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా దండు సూరిబాబురాజు, తొమ్మిది మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఓల్డేజ్ హోమ్ అధ్యక్షుడిగా వేగేశ్న రామరాజు, ఉపాధ్యక్షుడిగా నందం సత్యనారాయణ, కార్యదర్శిగా గొలుగూరి వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీగా సీహెచ్ గోపాలకృష్ణ, కోశాధికారిగా నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి, మరో పది మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలోచింపజేసిన నాటికలు ఉగాది ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా మొదటి రోజు రెండు నాటికలను ప్రదర్శించారు. తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ బృందం విడాకులు కావాలి నాటిక ఆకట్టుకుంది. గంగోత్రి సాయి దర్శకత్వం వహించగా, వల్లూరి శివప్రసాద్ రచన ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అలాగే గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ బృందం చిగురు మేఘం నాటిక వేవూరి హరిబాబు దర్శకత్వం, కావూరి సత్యనారాయణ రచనలో ప్రదర్శించారు. సందేశాత్మకంగా సాగిన నాటిక ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సినీ నటులు తనికెళ్ల తదితరుల ప్రశంస అట్టహాసంగా ఉగాది ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం -
అన్ని రంగాల్లో పురోగమించాలి
● కలెక్టర్ షణ్మోహన్ ● ఘనంగా ఉగాది వేడుకలు కాకినాడ సిటీ: విశ్వావసు నామ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కాకినాడ సూర్యకళా మందిరం ఆడిటోరియంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ షణ్మోహన్, విశిష్ట అతిథులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందుమాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. సన్నాయి విద్యాంసులు ఎన్.సత్తిబాబు, పసుపులేటి లోవ చిట్టిబాబు బృందం నాదస్వర ఆలాపన అనంతరం వేద పండితులు కె.సూర్యశర్మ అవధాని, కె.చంద్రశేఖరశాస్త్రి, బి వరప్రసాద్ శర్మ, కె ఆంజనేయశాస్త్రి, పి శ్రీనివాసశర్మ ఆహుతులకు మహదాశీర్వచనం పలికారు. పంచాంగకర్త సరిపెల్ల వేంకట శ్రీరామచంద్రమూర్తి ఉగాది పంచాంగ పఠనం నిర్వహించి విశ్వావసు సంవత్సరంలో నవ నాయక ఫలాలు, రాశి ఫలాలు, దేశ కాలమాన పరిస్థితులు, వర్షాలు, పాడిపంటల భవిష్య సూచనలు వివరించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో వైష్ణవి ఆరభి కూచిపూడి నృత్యం, మల్లికార్జున బృందం భరత నాట్యం, ఎస్ అజయ్, టి ఆనంద్ బృందం సంగీత విభావరి, ప్లూట్ కళాకారుడు చందు వేణుగా రవళి సభికలను అలరించాయి. ఉగాది కమి సమ్మేళనంలో కోరుప్రోలు గౌరినాయుడు సంధానకర్తగా కవులు గరికపాటి సూర్యనారాయణమూర్తి, పసుమర్తి పద్మజావాణి, వేదుల శ్రీరామశర్మ, మార్ని జానకిరామయ్యచౌదరి, ఎన్వీవీ సత్యనారాయ; మాకినీడి సూర్యభాస్కర్, పొత్తూరి సీతారామరాజు, పి విజయరత్నం, పినపోతు వేంకటేశ్వరరావు, కె చినఅప్పరాజు కవితాగానం చేసి సభికులను రంజింప చేశారు. ఉగాది వేడుకలో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి తరపున పండితులు కవులు, కళాకారులను కలెక్టర్ షణ్మోహన్, అతిథులు సత్కరించారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చక పండితులు చక్రవర్తుల అనంతాచార్యులు, కల్లేపల్లి భీమశంకరప్రసాద్, పూజ్యం నాగేశ్వరరావు, సురవరపు వీరవెంకట నాగ జోగ సూర్యశంకర శ్రీనివాస్ను సత్కరించారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ విశ్వావసు సంవత్సరంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లా శాంతి సౌఖ్యాలతో విలసిల్లాలని ఎస్పీ బిందుమాధవ్ కాంక్షించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు, సమాచార పౌరసంబంధాల శాఖ డీడీ డి.నాగార్జున, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, రాష్ట్ర రెడ్క్రాస్ చైర్మన్ వైడీ రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కె కృష్ణమూర్తి, కరక రాజబాబు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. -
పర్యావరణ రక్షణతో మానవ మనుగడ
పిఠాపురం: మానవుడు తన స్వార్థం కోసం పంచభూతాలను కలుషితం చేసి, వాటిలో సమతుల్యత పాడుచేసి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాడని, పర్యావరణాన్ని రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. పంచభూతాలతో కూడిన ప్రకృతి ద్వారా భూమిపై జీవించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం భవిష్యత్లో జరగబోయే అనేక విషయాలతో పాటుగా విపత్తులను గురించి కూడా సూచిస్తుందని, మేల్కొని రక్షణ చర్యలు చేపడితే పర్యావరణాన్ని కాపాడు కోవచ్చునని తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనం వంటిదే జీవితమని, జీవన గమనంలో కష్ట, సుఖాలను సమభావనతో స్వీకరిస్తేనే జీవిత పరమార్థం అర్థమవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలునాటి సంరక్షించాలని, నాటిన ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్తో సమానమని ఆయన అన్నారు. అనంతరం ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణురాలు కేవీవీఎస్ శారద సభలో పంచాంగ పఠనం చేశారు. ముఖ్య అతిథులు గీతావదాని యర్రంశెట్టి ఉమామహేశ్వర రావు, ఆక్టి ఇన్ఫోటెక్ డైరెక్టర్ కమల్ బెయిడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు కృష్ణ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా -
శ్రీ విశ్వావసులో సత్యదేవుని ఖ్యాతి విశ్వవ్యాప్తం
● రత్నగిరిపై పంచాంగ పఠనం ● ఇద్దరు పండితులకు ఉగాది సత్కారం అన్నవరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సత్యదేవుని ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందని, భక్తుల కోసం దేవస్థానంలో నూతన నిర్మాణాలకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తారని దేవస్థానం వేదపండితుడు బ్రహ్మశ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనాపాఠీ తెలిపారు. రత్నగిరిపై సత్యదేవుని అనివేటి మండపంలో ఆదివారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సత్యదేవుని ఆలయం నుంచి ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి అక్కడ మండపంలో ఉంచారు. అనంతరం నూతన సంవత్సర పంచాంగ ప్రతులను స్వామి, అమ్మవార్ల చెంత ఉంచి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ విశ్వావసు పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులు శ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠీ నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను వివరించారు. శ్రీ సత్యదేవునిది శ్రీ మఖ శ్రీ నక్షత్రం, సింహ రాశి అయినందున ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 11 గా ఉందన్నారు. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ అది ప్రతికూల ఫలితాలుగా భావించరాదన్నారు. ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినా వ్యయంగానే భావించాలని తెలిపారు. ఇద్దరు పండితులకు సత్కారం ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేదపండితులు రాజమహేంద్రవరానికి చెందిన ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరానికి చెందిన గుల్లపల్లి వేంకట నాగ శ్రీరామ అవధాని లకు రూ.5,116 నగదు పారితోషికంతో చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు సత్కరించారు. గోచార ఫలితాలను వివరించిన గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠీని సత్కరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాకారంలో స్వామివారిని వెండి రథంపై ఊరేగించారు. -
గాంధీ వేషంలో ఒడిశాకు..
తప్పిపోయిన సామర్లకోట బాలుడు కాకినాడ క్రైం: తల్లిదండ్రులు లేని 12 ఏళ్ల బాలుడు గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తూ తప్పిపోయి ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోయాడు. సదరు బాలుడిని నుప్పద రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి ఒడిశా బాలల సంక్షేమ శాఖ విభాగానికి అప్పగించారు. అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) బాలుడి నుంచి వివరాలు సేకరించి అతడిది కాకినాడగా గుర్తించారు. శనివారం సాయంత్రం కాకినాడలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగ అధికారులకు వీడియో కాల్లో బాలుడ్ని చూపించి అతడి కుటుంబ సభ్యులు వస్తే నిబంధనల మేరకు బాలుడిని అప్పగిస్తామని ఫొటో పంపారు. తనది కాకినాడ సమీపంలోని సామర్లకోట అని, తన పేరు సాయి అని, తల్లిదండ్రులు సురేష్, దుర్గ చనిపోతే నాయినమ్మ కొండమ్మ పెంచుతోందని అతడు చెప్పినట్టు సమాచారం. అతడి చిరునామా చెప్పలేకపోవడంతో కాకినాడ జిల్లా సీడబ్ల్యూసీ అధికారులు అప్రమత్తమై స్థానిక పోలీసులు, సచివాలయాల సిబ్బంది ద్వారా బాలుడు నివాస ప్రాంతంతో పాటు బాలుడి నాయినమ్మ కొండమ్మ చిరుమానా తెలుసుకునే పనిలో పడ్డారు. 1న టెన్త్ సోషల్ పరీక్ష కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రంజాన్ సెలవు కావడంతో సోమవారం నిర్వహించాల్సిన టెన్త్ సోషల్ పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతుందన్నారు. ఈ మార్పును పరీక్షా సిబ్బంది గమనించాలన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పరీక్ష నిర్వహణ బాధ్యులు ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. -
రుషి మార్గం మేలు
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అంశాలతో కూడినది పంచాంగం. ఖగోళంలో సూర్యచంద్రులు, ఇతర గ్రహాల పరిభ్రమణం వలన ప్రకృతిపరమైన మార్పులు, మన జీవితాల్లో అవి చూపే ప్రభావం అర్థం చేసుకోవడానికికి మన ప్రాచీన రుషులు ఏర్పరచిన విధానం పంచాంగ శ్రవణం. నూతన సంవత్సరాది వేళ మధుపాన సేవనంతో, అసభ్యకరమైన నృత్యాలతో అర్ధరాత్రి చిందులు వేయడం కాదు. రుషులు చూపిన శాసీ్త్రయ మార్గంలో గడపాలి. – డాక్టర్ సీఎస్వీ రమణీ కుమారి, రిటైర్డ్ తెలుగు పండిట్, రాజమహేంద్రవరం తెలుగువారి తొలి పండగ ఉగాది తెలుగు వారి మొదటి పండగ. ఈ రోజు నుంచే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజున పంచాంగ శ్రవణం వల్ల మహా ఫలితం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలకు ప్రతీకగా తీపిచేదుల కలబోత అయిన ఉగాది పచ్చడిని స్వీకరించడం సంప్రదాయంగా వచ్చింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం నింపాలి. – పిడపర్తి రవికుమార్ శర్మ, వేద పండితుడు, పలివెల, కొత్తపేట మండలం -
పిఠాపురంలో పారిశుధ్యం అధ్వానం
కలెక్టర్కు టీడీపీ నేత వర్మ ఫిర్యాదు పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకా పిఠాపురంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన పిఠాపురంలో చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ నేత నాగబాబు.. వర్మనుద్దేశించి చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య పోరు మరింత ముదిరింది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఇరు వర్గాలు వాగ్వాదాలకు, బాహాబాహీలకు దిగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు మౌనంగా ఉన్న వర్మ హఠాత్తుగా తెర పైకి వచ్చారు. ప్రజా సమస్యల పరిశీలన పేరుతో పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువు కాలనీలో ఇటీవల పర్యటించారు. అక్కడ పారిశుధ్యం అధ్వానంగా ఉండటం చూసి, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పారిశుధ్యం అధ్వానంగా ఉందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్కు కాకినాడలో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంలో అదీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకుని కావాలనే వర్మ ఈ ఫిర్యాదు చేశారని జనసేన నేతలు మండిపడుతున్నారు. అయితే, తమ నాయకుడు జూలు విదిల్చారని, ఇక అంతోపంతో తేలుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉగాది వేడుకలు, ఇఫ్తార్ విందు పైనా వివాదం ఇదిలా ఉండగా పిఠాపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించనున్న ఉగాది సంబరాలు, రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమాలకు జనసేన క్యాడర్కు మాత్రమే ఆహ్వానాలు పంపించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్ తుమ్మల బాబు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలకు టీడీపీ నేత వర్మకు గాని, టీడీపీ కేడర్కు గాని ఆహ్వానాలు పంపించలేదు. దీనిపై టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా జనసేన, టీడీపీ నేతలతో ఏవిధంగా వ్యవహరించాలో అర్థం కాక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
విశ్వావసంతానికి నాంది
కాలం పరమాత్మ స్వరూపం ‘కాలాత్మక పరమేశ్వర రామ’ అనే కీర్తన కాలం పరమేశ్వర స్వరూపమని చెబుతోంది. విశ్వావసు అనే శబ్దానికి ‘విశ్వమంతా వ్యాపించే కాంతి కిరణాలు గలది’ అనే అర్థాన్ని గ్రహించవచ్చు. వసు అంటే సంపద అని కూడా అర్థం ఉంది. నూతన తెలుగు సంవత్సరం అందరి జీవితాల్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు నింపుతుందని ఆశిద్దాం. – శలాక రఘునాథశర్మ, మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత ● సంస్కృతి సాంప్రదాయ భక్తి సమ్మేళనమే ఉగాది ● నేటి నుంచి శ్రీవిశ్వావసు సంవత్సరం ప్రారంభం ● మనలోని కోపాన్ని, ద్వేషాన్ని, జయించి, ప్రేమ సహనంతో ముందుకు సాగాలి ● ఉగాది పచ్చడిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు శ్రీవిశ్వావసు అంటే.. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు. విశ్వావసు అంటే అన్నీ సమృద్ధిగా లభించేది అని అర్థం. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం కావడంతో సూర్యునికి నవనాయక ఆధిపత్యం లభించింది. రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి కుజుడు. మన దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతుంది. సేనాధిపతి కుజుడు కావడం వలన సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనపడుతుంది. అకాల వర్షాలు, వర్షాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుపానుల వంటి విపత్తులు కనిపిస్తాయి. తృణధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది. బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ, తెలుగు, ఆంగ్ల పంచాంగకర్త, రాజమహేంద్రవరం ఉగాది పచ్చడిలో ఆరోగ్య రహస్యం ఉగాది రోజున అందరూ స్వీకరించే ఉగాది పచ్చడి మన జీవితంలోని సుఖదుఃఖాలకు సూచిక. ఒక్కో రుచికి ఒక్కో అర్థం. జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా ఉప్పును పరిగణిస్తారు. తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను పులుపు తెలియజేస్తుంది. బాధను దిగమింగాలని లేదా భరించాలని వేప పువ్వులోని చేదు సూచిస్తుంది. సంతోషానికి ప్రతీకగా బెల్లాన్ని భావిస్తారు. సహనం కోల్పోవడాన్ని కారం సూచిస్తుంది. పచ్చి మామిడి ముక్కల్లో తగిలే వగరు రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. – డాక్టర్ పీవీబీ సంజీవరావు, తెలుగు శాఖాధిపతి, ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం -
ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
కాకినాడ సిటీ: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సూర్య కళా మందిరంలో ఆదివారం ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. వీటిని తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం, ఉగాది పచ్చడి, ప్రసాదాల ఏర్పాట్లను దేవదాయ శాఖ నిర్వహించాలన్నారు. వేదిక అలంకరణ బాధ్యతను ఉద్యాన శాఖకు, వేదికపై బ్యాక్డ్రాప్ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను సమాచార, పౌర సంబంధాల శాఖ చేపట్టాలన్నారు. అతిథులకు ఆహ్వానం, ఇతర ప్రొటోకాల్ బాధ్యతలను కాకినాడ ఆర్డీఓ చూడాలన్నారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డీడీ డి.నాగార్జున, మెప్మా పీడీ బి.ప్రియంవద, హార్టికల్చర్ ఏడీ మల్లికార్జున, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషన్ కేటీ సుధాకర్, జిల్లా దేవదాయ శాఖ అధికారి సుబ్బారావు, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. రూ.10 లక్షల విరాళం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో డోనార్ కాటేజీ స్కీముకు ఒక భక్తుడు రూ.10 లక్షల విరాళం సమర్పించారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు చెక్కు అందించారు. ఈ విరాళాన్ని సత్యగిరిపై శివసదన్ సత్రంలోని 313 రూముకు కేటాయించాలని కోరారు. దాతకు లభించే గౌరవమర్యాదలు, సదుపాయాలు వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు. నెలాఖరులోగా రైతు విశిష్ట సంఖ్య నమోదు పూర్తి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతు విశిష్ట నమోదు కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సిబ్బందిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్.విజయ్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన డైరీని శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వ పథకాలు ఇకపై విశిష్ట సంఖ్య ద్వారానే అమలవుతాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి ఎం.నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. చెత్త తరలింపు కాంట్రాక్ట్కు టెండర్ అన్నవరం: రత్నగిరిపై చెత్త తరలింపు కాంట్రాక్ట్కు టెండర్ పిలిచి, తక్కువకు కోట్ చేసినవారికి ఇవ్వాలని అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు అధికారులను ఆదేశించారు. ‘రత్నగిరిపై చెత్త వివాదం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం కథనం ప్రచురించింది. చెత్త తరలింపునకు నెలకు రూ.43 వేలకు దరఖాస్తు చేసిన వారికి కాకుండా.. ఎటువంటి టెండరూ పిలవకుండా నెలకు రూ.60 వేలకు మరొకరికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఈఓ సుబ్బారావు పైవిధంగా ఆదేశించారు. తక్కువ మొత్తానికి కొటేషన్ దాఖలు చేసిన వారికి వారం రోజుల్లోగా టెండర్ ఖరారు చేయాలని పేర్కొన్నారు. పట్టు వస్త్రాల సమర్పణ అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విశాఖపట్నానికి చెందిన లక్కీ షోరూమ్ అధినేతలు శ్రీనివాసరావు, దత్తయ్య శుక్రవారం రూ.లక్ష విలువైన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు వీటిని అలంకరించాలని కోరారు. అలాగే ఏప్రిల్ 6న జరగనున్న శ్రీరామ నవమి వేడుకల్లో సీతారాములకు విశాఖపట్నానికి చెందిన మల్లెల వీర రాఘవరావు, తూర్పు గోదావరి జిల్లా దువ్వ గ్రామానికి చెందిన కాశీ రూ.50 వేల విలువైన పట్టు వస్త్రాలు, రుత్విక్కులకు దీక్షా వస్త్రాలు సమర్పించారు. వీటిని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుకు అందజేశారు. -
టెన్త్ పరీక్షకు 28,280 మంది హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన పదో తరగతి బయలాజికల్ సైన్స్ పరీక్షకు 28,280 మంది హాజరయ్యారు. 338 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ 5, తనిఖీ అధికారులు 40 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, ఓపెన్ స్కూల్ టెన్త్ విద్యార్థులకు సోషల్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. వీటికి 2,024 మంది హాజరవగా 192 మంది గైర్హాజరయ్యారు. సోషల్ పరీక్ష తేదీ మార్పు రంజాన్ పర్వదినం కారణంగా ఈ నెల 31వ తేదీన నిర్వహించాల్సిన సోషల్ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ రమేష్ తెలిపారు. దీనిపై విద్యార్థులకు పాఠశాలల యాజ మాన్యాలు సమాచారం అందించాలని సూచించారు. ఉద్యోగ ప్రకటన రద్దు కాకినాడ క్రైం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గత ఏడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్ నంబర్ 01/2024తో ఇచ్చిన ఉద్యోగ ప్రకటనను రద్దు చేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ నరసింహ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 (3 పోస్టులు), ఎఫ్ఎన్ఓ (20 పోస్టులు), శానిటరీ అటెండర్ కం వాచ్మన్ (38 పోస్టులు) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బ్యాంక్ డీడీలను ఉన్నతాధికారుల ఆదేశాల తిరిగి ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. కాకినాడలోని తమ కార్యాలయంలో ఏప్రిల్ 24వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య డీడీలు వాపసు ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ కాపీ ఇచ్చి, దరఖాస్తు సంఖ్య చెప్పి, డీడీలు వెనక్కి తీసుకోవాలని కోరారు. జీఓ నంబర్ 32 ప్రకారం ప్రతి పీహెచ్సీకి 14 మంది మాత్రమే సిబ్బంది ఉండాలన్న నిబంధన, కొన్ని క్యాడర్ ఉద్యోగాల విలీనం కారణంగా రేషనలైజేషన్లో పోస్టులు అదనంగా గుర్తించడంతో కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ రద్దుకు నిర్ణయం తీసుకున్నామని డీఎంహెచ్ఓ తెలిపారు. అమలేశ్వరికి వెండి ఆభరణాల సమర్పణ అమలాపురం రూరల్: మండలం రోళ్లపాలెంలో కొలువైన అమలేశ్వరీ సమేత అమలేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి భక్తులు వెండి ఆభరణాలను సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సూమారు రెండులక్షలతో తయారు చేసిన కిరీటం, దండ, హారం, ముక్కపుడక, కళ్లు, కనుబొమ్మలు తదితరులు ఆభరణాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాటిని అమ్మవారికి అలకరించారు. హోమం నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమాధనఅధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాళ్లమ్మకు వెండి, పంచ లోహ పాదాల సమర్పణ ఆలయ అభివృద్ధికి రూ.4.4 లక్షల విరాళం కొత్తపేట: స్థానిక కమ్మిరెడ్డిపాలెం గ్రామ దేవత తాళ్లమ్మ తల్లికి భక్తులు వివిద రూపాల్లో వితరణలు చేశారు. కొండేపూడి గోవిందరాజు, వీర వెంకట అనంతలక్ష్మి దంపతుల కుమారుడు వీరమణికంఠ రూ.2.04 లక్షలతో వెండి, పంచలోహ పాదములు, గరగను చేయించి శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు మిద్దే సత్యనారాయణ ద్వారా ఆలయానికి సమర్పించారు. వాటిని ఆలయ ఆసాదు అమ్మవారికి అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఏఎస్ఐ ఏడిద సత్యనారాయణమూర్తి అమ్మవారి అలంకరణకు ఆభరణాలు, ఆలయ అభవృద్ధి నిమిత్తం రూ.1.3 లక్షలు, దెందులూరి వీరభద్రం – భానుతిలకం (మాజీ ఎమ్మెల్యే) దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు, ఎస్బీఐ విశ్రాంత ఏజీఎం దెందులూరి జగదీశ్వరప్రసాద్ రూ.1.1 లక్షలు, మిద్దే సావిత్రమ్మ, బలరామమూర్తి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు మిద్దే సత్యనారాయణ (ఆలయ కమిటీ ప్రెసిడెంట్), ఆదినారాయణ, శ్రీనివాస్, శ్రీహరి సోదరులు కలిసి రూ.1,00,116, పట్టపు పద్మావతి – తాతారావు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రూ.1,00,116, విరాళంగా అందచేశారు. -
విద్యార్థినితో మోకాళ్లు వేయించిన టీచర్
● స్పృహ కోల్పోయిన బాలిక ● చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ సామర్లకోట: పిల్లలు, విద్యార్థులు పొరపాటు చేస్తే వారికి నచ్చ చెప్పాల్సిన ఉపాధ్యాయులు అతి కిరాతకంగా వ్యవహరించిన వైనం ఇది. సామర్లకోట జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బి.మహేశ్వరి చెవిదిద్దు ఊడిపోయి హిందీ ఉపాధ్యాయిని భారతీ లక్ష్మి కాలికి తగిలింది. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయిని.. మహేశ్వరిని సుమారు గంటపాటు ఎండలో మోకాళ్లు వేయించింది. దీంతో బీపీ తగ్గిపోయి, మోకాళ్లు కొట్టుకుపోయి ఆ విద్యార్థిని స్పృహ కోల్పోయింది. సహచర విద్యార్థులు, స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకోవడంతో సమీపంలో ఉన్న మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ఆమెను సీహెచ్సీకి తరలించారు. ఇంతలో సమాచారం అందుకున్న చిన్నారి తల్లిదండ్రులు, వారి బంధువైన కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ అక్కడకు చేరుకుని విద్యార్థినిపై క్రూరంగా వ్యవహరించిన హిందీ టీచర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఉపాధ్యాయుల వల్లే ప్రభుత్వ పాఠశాలలకు చెడ్డ పేరు వస్తోందని అప్పలకొండ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయినిపై చర్య తీసుకోకుంటే జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ఎంఈఓ వై.శివరామకృష్ణయ్యను వివరణ కోరగా విద్యార్థినిని మోకాళ్లు వేయించడంతో ఇంటికి వెళ్లిన తరువాత స్పృహ కోల్పోయిందని, దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారని చెప్పారు. విద్యార్థులను మోకాళ్లు వేయడం సరికాదని, చిన్నారుల పట్ల సున్నితంగా వ్యహరించాలని పదేపదే ఉపాధ్యాయులకు చెప్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వివరించారు. -
సత్యదేవునికి రూ.1.19 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా గత 25 రోజులకు గాను రూ.1,19,10,877 ఆదాయం వచ్చింది. అన్నవరం దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. నగదు రూ.1,11,50,975, చిల్లర నాణేలు రూ.7,59,902 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 25.800 గ్రాములు, వెండి 512 గ్రాములు వచ్చాయన్నారు. రోజుకు సరాసరిన రూ.4,76,435 హుండీ ఆదాయం వచ్చిందని చెప్పారు. హుండీల ద్వారా అమెరికా డాలర్లు 46, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 5, ఆస్ట్రేలియా డాలర్లు 20, యూఏఈ దీరామ్స్ 105, యూరోలు 60, మలేషియా రింగిట్స్ 15 లభించాయి. కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు శ్రీవారి సేవ, శ్రీహరి సేవ తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. -
సత్యగిరిపై కొత్త సత్రం
అందరికీ ఉపయోగపడేలా.. సత్యగిరిపై విష్ణుసదన్లో 36 వివాహ మండపాలున్నాయి. ఇక్కడ వివాహాలు చేసుకునే పెళ్లిబృందాల వారికి అక్కడికి కాస్త దూరంలో ఉన్న హరిహర సదన్ సత్రంలో గదులు కేటాయిస్తున్నారు. విష్ణు సదన్ సత్రం పక్కన, ఆగమ పాఠశాల ముందున్న స్థలంలో 105 గదులతో నూతన సత్రం నిర్మిస్తే వివాహ బృందాల వారికి, భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని, ఆ మేరకు ఇక్కడే నిర్మించాలని నిర్ణయించారని సమాచారం. నూతన సత్రం నిర్మాణానికి గత జనవరిలో టెండర్లు పిలవగా 12 మంది కొటేషన్లు దాఖలు చేశారు. ఈ సత్రం గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాహనాల పార్కింగ్కు వదిలేస్తారు. మొదటి, రెండు, మూడు ఫ్లోర్లలో ఫ్లోర్కు 35 చొప్పున 105 గదులు నిర్మింలని ప్రతిపాదించారు. సీతారామ సత్రం వద్ద ఎంత స్థలంలో నిర్మించాలని ప్రతిపాదించారో అంతే విస్తీర్ణంలో సత్యగిరిపై సత్రం నిర్మించే అవకాశం ఉంది. కమిషనర్ నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చిన తరువాత సీతారామ సత్రం మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సత్యగిరిపై రూ.11.40 కోట్ల వ్యయంతో, 105 గదులతో నూతన సత్రం నిర్మించాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కమిషనర్ కె.రామచంద్ర మోహన్ త్వరలోనే అన్నవరం దేవస్థానానికి ఉత్తర్వులు పంపనున్నారని తెలిసింది. దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న 100 గదుల సీతారామ సత్రం శిథిలావస్థకు చేరడంతో దానిని పడగొట్టి ఆ స్థలంలోని సగ భాగంలో 4 అంతస్తుల్లో నూతన సత్రం నిర్మించాలని గత ఏడాది నిర్ణయించారు. ఆ మేరకు గత జనవరిలో టెండర్లు కూడా పిలిచారు. వీటి గడువు ముగిసి కూడా దాదాపు నెల రోజులైంది. వీటిని త్వరలోనే ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ నెల మొదటి వారంలో దేవస్థానానికి వచ్చిన దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు పి.కొండలరావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, సాంకేతిక కమిటీ సభ్యులు ఈ సత్రాన్ని పడగొట్టి కొత్త సత్రం నిర్మించే బదులు.. పాత భవనానికి మరమ్మతులు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సత్రం బాగానే ఉందని, మరమ్మతులు చేస్తే కనీసం మరో మూడేళ్లు భక్తులకు అద్దెకు ఇవ్వవచ్చునని చెప్పారు. అదే రోజు సత్యగిరిపై నూతన సత్రం నిర్మించేందుకు గాను ఆగమ పాఠశాల ముందు, విష్ణు సదన్ సత్రం పక్కన ఉన్న స్థలాలను వారు పరిశీలించారు. ఇదే విషయాన్ని వారు దేవదాయ శాఖ కమిషనర్కు కూడా తెలియజేశారు. ఈ మేరకు కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ నెల మూడో వారంలో అన్నవరం దేవస్థానం అధికారులతో విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సీతారామ సత్రం స్థలానికి బదులు ఆ నిధులతో సత్యగిరిపై నూతన సత్రం నిర్మించే అవకాశాలపై చర్చించారు. 105 గదులతో నిర్మాణం రూ.11.40 కోట్ల వ్యయం త్వరలోనే టెండర్ల ఖరారు సీతారామ సత్రానికి మరమ్మతులు త్వరలో కమిషనర్ ఉత్తర్వులు -
10 వేల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్లు
● ప్రతి నియోజకవర్గంలో 2 వేల కిలో వాట్ల ఉత్పత్తి లక్ష్యం ● మంత్రి నారాయణ కాకినాడ సిటీ: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలు, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. కాకినాడలో శుక్రవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ వివరించిన అంశాలు, వాటిపై ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఆదేశాల అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. పీఎం సూర్యఘర్ పథకానికి జిల్లాలో ఇప్పటి వరకూ 5,086 దరఖాస్తులు అందగా 3,230 కిలోవాట్ల సామర్థ్యం మేరకు 890 యూనిట్లు నెలకొల్పారని వివరించారు. మిగిలిన లక్ష్య సాధనకు ఎనర్జీ అసిస్టెంట్లతో విస్తృతంగా అవగాహన కల్పించి, దరఖాస్తులను పోర్టల్లో అప్లోడ్ చేయించాలని సూచించారు. ఇళ్లపై సోలార్ ప్యానళ్లు పెట్టేందుకు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఎస్సీ లబ్ధిదారుల యూనిట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను వారికి ఉచితంగా అందించాలని, ఇందుకు అనువైన భూములను గుర్తించాలని ఆదేశించారు. వేసవిలో వడగాడ్పులు, తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ఆవాసాల్లో 463, పట్టణ ఆవాసాల్లో 17 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.12.82 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.72 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో 1,484 వ్యక్తిత మరుగుదొడ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకూ 420 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. 134 కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం పూర్తయ్యి, మరో 49 నిర్మాణంలో ఉన్నాయన్నారు. పట్టణాల్లోని కమ్యూనిటీ మరుగుదొడ్లకు రూ.80 లక్షలతో మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు జిల్లాలో 30 మందికి పైలట్ శిక్షణ ఇచ్చామన్నారు. 3.50 లక్షల పశువులకు అవసరమైన 25 లక్షల టన్నుల పశుగ్రాసం ఉత్పాదనకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
పేదల రేషన్పై కూటమి కత్తి
● ఈ– కేవైసీ సాకుతో కోతకు ఎత్తుగడ! ● రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి పడిగాపులు ● మూడు రోజులే గడువు సాక్షి ప్రతినిధి, కాకినాడ: వ్యవసాయాధారితమైన జిల్లాలో రబీ మాసూళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. పదో తరగతి, డిగ్రీ పరీక్షలతో విద్యార్థులందరూ పుస్తక పఠనలో మునిగి తేలుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం అనాలోచితంగా రేషన్ కార్డులకు ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్–నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని హడావిడి చేస్తోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి పది నెలలవుతున్నా అర్జీలు పెట్టుకున్న వారికి ఇప్పటి వరకూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. పైగా ఉన్న కార్డులకు కత్తెర వేసేందుకు ఎత్తులు వేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని, అది కూడా ఈ నెలాఖరులోపు అంటూ గడువు విధించడంతో కార్డుదారులు గగ్గోలు పెడుతున్నారు. గడువుకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సమయమేదీ..! జిల్లావ్యాప్తంగా 6,43,874 రేషన్ కార్డులున్నాయి. గతంలో ఈ–కేవైసీ పూర్తి చేసుకున్న వారు 16,36,012 మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ 2,01,424 మందికి పెండింగ్లో ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో తాజాగా 5,755 మంది ఈ–కేవైసీ చేయించుకున్నారు. జిల్లాలో 620 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. డీలర్ల వద్ద 1,060 ఈ–పోస్ యంత్రాలున్నాయి. ఈ–కేవైసీ చేయించుకునే అవకాశం ఈ రెండుచోట్ల మాత్రమే ఉంది. డీలర్ల వద్ద సర్వర్లతో సాంకేతిక ప్రతిబంధకాలు ఎదురవుతూండటంతో ఈ–కేవైసీ పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు గాను 10 మంది మాత్రమే పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు ఉన్నారు. ఈ నెల 20న ఈ–కేవైసీ ప్రారంభించి, 31వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం 11 రోజుల్లో ఇంత మంది ఈ–కేవైసీ పూర్తి చేయడం ఏవిధంగా సాధ్యమనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. పిల్లలకూ కష్టాలు ఐదేళ్ల వయస్సు దాటి, వేలిముద్ర అప్డేట్ చేయించుకోని పిల్లలకు ఇప్పుడు ఈ–కేవైసీ పెద్ద సమస్యగా మారింది. వారి వేలిముద్రలు అప్డేట్ చేయించేందుకు తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి పడిగావులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఐదేళ్ల నుంచి 12–13 ఏళ్ల లోపు పిల్లలకు, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఈ–కేవైసీ నమోదు కావడం లేదు. సర్వర్ సమస్య వేధిస్తోందని పదేపదే మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడని ప్రజలు మండిపడుతున్నారు. కార్డుల తొలగింపునకు కుట్రేనా? నిత్యావసర సరకుల పంపిణీలో తేడాలు, అవకతవకలను నివారించేందుకనే సాకుతో రేషన్ కార్డులను తొలగించేందుకే కూటమి సర్కార్ ఈ–కేవైసీ కుట్రకు తెర తీసిందని కార్డుదారులు మండిపడుతున్నారు. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోకపోతే ఏప్రిల్ నెల సరకులు అందవని రెవెన్యూ అధికారులు చెబుతున్న మాటలతో కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది. రేషన్ నిలిపివేస్తారో.. లేక కార్డులను రద్దు చేస్తారోనని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. రేషన్ కార్డులు లేకపోతే సంక్షేమ పథకాల్లో కోత తప్పదంటున్న రెవెన్యూ అధికారుల మాటలతో సర్వత్రా ఆందోళన నెలకొంది. పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం నాటి సమీక్షలో ప్రస్తుతానికి ఈ–కేవైసీ చేయించుకోకున్నా రేషన్ ఆపేది లేదని చెబుతున్నా అది ఎంత వరకూ వర్తిస్తుందో తెలియడం లేదనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. కొత్త కార్డులకు దిక్కే లేదు కూటమి సర్కార్ గద్దెనెక్కిన తొమ్మిది నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా సుమారు 70 వేల మంది కొత్త రేషన్ కార్డులకు, మరో 40 వేల మందికి పైగా కార్డుల్లో తప్పుల సవరణకు దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. కొత్త కార్డులు ఇవ్వకపోగా, ఉన్న కార్డులను ఎలా తొలగించాలనే కుట్రలో భాగంగానే ఈ–కేవైసీ డ్రామా మొదలు పెట్టారని అంటున్నారు. ఈ–కేవైసీ నమోదు కాకుంటే ఆ కార్డులోని సభ్యులను తొలగించి రేషన్కు కోత పెడతారని అనధికారిక సంభాషణల్లో అధికారులు చెబుతున్నారని కార్డుదారులు ఆందోళన చెదుతున్నారు. మచ్చుకై నా కనిపించని కంది పప్పు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా కార్డుదారులందరికీ కందిపప్పు సరఫరా చేశారు. అటువంటిది కూటమి సర్కార్ వచ్చాక రేషన్తో పాటు కందిపప్పు ఇస్తారనే విషయాన్నే కార్డుదారులు మరచిపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా కందిపప్పు సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బియ్యం, పంచదార మండల స్థాయి నిల్వ కేంద్రాలకు, చౌకదుకాణాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాల్లో కందిపప్పు నిల్వలు లేవు. జిల్లాలో 6.43 లక్షల కార్డులకు ప్రతి నెలా 650 టన్నుల కందిపప్పు అవసరం. మార్చి నెలలో కేవలం 200 టన్నులు సరఫరా చేశారు. అది కూడా కార్డుదారుల దరి చేరలేదు. వచ్చే నెల పంపిణీకి ఇప్పటికే సరుకు జిల్లాకు చేరాల్సి ఉన్నా ఆ ప్రక్రియ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ–కేవైసీ పేరుతో మిగిలిన సరకులకు కూడా కోత పెడతారేమోనని కార్డుదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గడువు పెంచాలి ఈ నెల 31లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలనే గడువు పెట్టడం సమజసం కాదు. ఈ గడువు పెంచాల్సిందే. రేషన్ దుకాణదారులు ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ మాత్రమే ఈ–కేవైసీ చేస్తున్నారు. పరీక్షల సమయం ఒకపక్క, వ్యవసాయ పనుల్లో మరోపక్క బిజీగా ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తక్కువ సమయం ఇచ్చి ఈ–కేవైసీ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం సరి కాదు. – కర్రి ఉమామహేశ్వరరావు, సామర్లకోట రేషన్ వ్యవస్థపై విషం కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచీ రేషన్ వ్యవస్థపై విషం చిమ్ముతోంది. ముందుగా ఎండీయూ వాహనాలను తొలగిస్తామని భయపెట్టింది. తొమ్మిది మాసాలుగా ఏ నెలలోనూ కందిపప్పు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏప్రిల్లోను కందిపప్పు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడేమో ఈ–కేవైసీ సాకుతో రేషన్లో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రేషన్ డీలర్ల వద్ద రోజుకు రెండు గంటల పాటు మాత్రమే ఈ–కేవైసీ చేయించుకోవాలంటే ఇన్ని లక్షల మందికి ఎక్కడవుతుంది? కనీసంగా కూడా ఆలోచించకుండా తక్కువగా గడువు ఇవ్వడం అన్యాయం. – పోకనాటి ప్రభాకరమూర్తి, విద్యా కమిటీ మాజీ చైర్మన్, వాకలపూడి, కాకినాడ రూరల్ ఈ–కేవైసీ కోసం పెద్దాపురంలో మండుటెండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు -
క్రియాశీలకంగా శక్తి బృందాలు
కాకినాడ క్రైం: మహిళల భద్రత, రక్షణకు ఏర్పాటు చేసిన శక్తి బృందాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యాన శక్తి బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం సాలిపేట బాలికోన్నత పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ప్రదర్శించారని తెలిపారు. ముగ్గురి నుంచి నలుగురితో శక్తి వారియర్ బృందాలను సిద్ధం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. 30, 31 తేదీల్లోనూ రిజిస్ట్రేషన్ విధులు కాకినాడ లీగల్: ఈ నెల 30 ఉగాది, 31న రంజాన్ పండగల సెలవులైనప్పటికీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో డీఐజీ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జిల్లా అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఈ రెండు రోజులూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి క్రయవిక్రయదారులకు అవకాశం కల్పించింది. కాగా, పండగ రెండు రోజులూ పని చేయాలనే ఆదేశాలపై రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు
సాక్షి, అమలాపురం: ‘గోదావరి డెల్టాలో ఈ ఏడాది రబీ సాగుకు నీటి ఎద్దడి తలెత్తే ప్రశ్నే లేదు. డెల్టాలో రబీ సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 90 టీఎంసీల నీరు అందిస్తే సరిపోతుంది. ఈ ఏడాది గోదావరిలో ఇన్ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో పాటు పోలవరం వద్ద నిల్వ చేసిన నీరు.. సీలేరు పవర్ జనరేషన్ ద్వారా వచ్చే నీరు కలిపి రబీకి సమృద్ధిగా సాగు నీరు అందిస్తాం’ అని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి ఇందుకు విరుద్ధమైన పరిస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. గతంలో సాగు మధ్యలో ఉన్న సమయంలో అంటే ఫిబ్రవరి తరువాత నుంచి నీటి ఎద్దడి మొదలయ్యేది. కానీ ఈసారి సాగు ఆరంభం నుంచే.. అంటే రైతులు నాట్లు వేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ పలు దఫాలుగా వరి చేలు నీటి ఎద్దడి బారిన పడటం.. రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయడం సర్వసాధారణంగా మారింది. అధికంగా నీరు ఇచ్చినా.. గోదావరి డెల్టాలో డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకూ రబీ షెడ్యూలు ఉంటుంది. అయితే, వాస్తవానికి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ వరకూ పంట కాలువలకు నీరు సరఫరా చేస్తూంటారు. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని సుమారు 8.86 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటల సాగుకు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 90 టీఎంసీల నీరు సరిపోతుంది. రబీ షెడ్యూల్ గత ఏడాది డిసెంబర్ 7న ప్రారంభమైంది. మూడు డెల్టాల పరిధిలోని ప్రధాన పంట కాలువలకు ఇప్పటి వరకూ 96.326 టీఎంసీల నీటిని అందించారు. ఇప్పటికీ పంట కాలువలకు అధికంగానే నీరు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం తూర్పు డెల్టాకు 3,200, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులు కలిపి మొత్తం 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ శివార్లలో నీరందడం లేదంటూ రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. డెల్టాలోని పంట పొలాలకు ఇంచుమించు ఏప్రిల్ 20వ తేదీ తేదీ వరకూ సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు మరో 15 నుంచి 20 టీఎంసీల వరకూ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నీరు విడుదల చేసినా కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తూర్పు, మధ్య డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) పరిధిలోని శివారు, మెరక ప్రాంతాల్లో వరి చేలకు నీరందని దుస్థితి ఏర్పడింది. వరి పొలాలు నెర్రెలు విచ్చుతున్నాయి. నీటి యాజమాన్యం విషయంలో జలవనరుల శాఖ అధికారులు వైఫల్యమే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. మోటార్ల నీరు అదనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. దీనిలో సుమారు 4.20 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని అంచనా. పంట కాలువలకు విడుదల చేసిన నీటితో పాటు డెల్టాలో పలుచోట్ల వ్యవసాయ విద్యుత్ మోటార్లతో చేలకు నీరు అందిస్తారు. కోనసీమ జిల్లా పరిధిలో రామచంద్రపురం, మండపేట; తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి; కాకినాడ జిల్లాలో కరప, సామర్లకోట తదితర ప్రాంతాల్లో మోటార్లతో చేలకు నీటిని అందిస్తారు. ఇలా కనీసం ఒక టీఎంసీ నీరు వినియోగిస్తారు. మురుగునీటి కాలువలపై క్రాస్బండ్లు వేయడం ద్వారా కూడా నీటిని చేలకు మళ్లించినట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. శివారు, మెరక ప్రాంతాల్లో రైతులు మురుగు నీటి కాలువల నుంచి మోటార్ల ద్వారా నీటిని పంట పొలాలకు మళ్లిస్తున్నారు. ఈ పద్ధతిలో కనీసం 7 టీఎంసీల నీటిని సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. అంటే ఇప్పటి వరకూ ఇచ్చిన 96.326 టీఎంసీలకు ఇది అదనం. ఏవిధంగా చూసినా ఇప్పటి వరకు 103 టీఎంసీల నీటిని వినియోగించినట్టు అంచనా. అయినప్పటికీ తూర్పు, మధ్య డెల్టాల్లో ఏకంగా 10 శివారు మండలాల్లో నీటి ఎద్దడి ఏర్పడటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రైతులు చెబుతున్నారు. నారుమడి నుంచీ నీటి పాట్లే.. దాళ్వా సాగు మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ పలు సందర్భాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. కీలకమైన సమయంలో నీరు అందకపోవడంతో దిగుబడులు కూడా తగ్గిపోతాయనే భయం వేస్తోంది. – చిక్కం సీతారామ ప్రసాద్, ఉప్పలగుప్తం బోర్లు అక్కరకు వచ్చాయి ఏటా రబీలో నీటి ఎద్దడి తప్పడం లేదు. ఖరీఫ్లో కొంత వరకూ నీరు వస్తోంది. కానీ, రబీలో అస్సలు రావడం లేదు. గతంలో మా పొలం వద్ద వేసిన బోర్ల వల్ల కీలక సమయంలో పంట కాలువల ద్వారా నీరందకున్నా మోటార్ల ద్వారా తడి అందిస్తున్నాం. దీనివల్లే రబీని గట్టెక్కించుకుంటున్నాం. – సూరంపూడి రవి, గొల్లల చెరువు, రామచంద్రపురం మండలం ఎద్దడికి కారణాలివీ..రబీలో గోదావరి డెల్టాలకు ఇప్పటి వరకూ నీటి విడుదల ఇలా (టీఎంసీలలో) తూర్పు డెల్టా 29.719 మధ్య డెల్టా 18.146 పశ్చిమ డెల్టా 48.461 మొత్తం డెల్టా సాగుకు అవసరమైన నీరు : 90 టీఎంసీలు ఇప్పటి వరకూ సరఫరా చేసింది : 96.326 టీఎంసీలు ఇంకా అవసరమైన నీరు : 15 నుంచి 20 టీఎంసీలు ఎప్పటి వరకూ అవసరం : ఏప్రిల్ 20 వరకూ ఫ కాటన్ బ్యారేజీ వద్ద నీటి లభ్యత ఫ అయినా సాగు ఆరంభం నుంచీ కష్టాలే.. ఫ క్రాస్బండ్లు, విద్యుత్ మోటార్ల ద్వారా సేకరణ ఫ అయినప్పటికీ శివారు.. మెరక ప్రాంతాలకు ఎద్దడి ఫ ప్రభుత్వ వైఫల్యంతోనే డెల్టాలో ఈ దుస్థితి ఫ డెల్టాలోని పంట కాలువలు, చానల్స్ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ఆరంభంలో షార్ట్ క్లోజర్ పనులు చేస్తామని చెప్పారు. కానీ పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయలేదు. ఫ దీనికితోడు పంట కాలువల ద్వారా వస్తున్న నీటిని ఆక్వా రైతులు అడ్డదారిలో మోటార్లతో తోడుతున్నారు. దీంతో శివారుకు సాగునీరండం లేదు. ఫ అధికారులు వంతుల వారీ విధానం అమలు చేస్తున్నా రైతులకు సమాచారం అందించడం లేదు. దీనివల్ల కూడా చేలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. పంట ఎండకున్నా దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఫ పైగా మోటార్లతో నీటిని సేకరించాల్సి రావడం వల్ల రైతులకు ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ పెట్టుబడి పెరిగింది. -
రత్నగిరిపై ‘చెత్త’ వివాదం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ‘చెత్త’ వివాదం తలెత్తింది. వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో వ్రతాల్లో ఉపయోగించిన పత్రి, పువ్వులు, తమలపాకులు, ఆలయ ప్రాంగణంలో చెత్తను తరలించే పనిని గతంలో శానిటరీ కాంట్రాక్టర్ నిర్వహించేవారు. గత నెలాఖరు వరకూ ఈ కాంట్రాక్ట్ను కేఎల్టీఎస్ సంస్థ నిర్వహించింది. ఈ నెల 1 నుంచి ఆ సంస్థ ఆ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగింది. దీంతో కొత్తగా శానిటరీ కాంట్రాక్ట్ ఖరారయ్యేంత వరకూ దేవస్థానంలో పారిశుధ్య పనులకు 349 మంది పని వారిని సమకూర్చే పనిని గుంటూరుకు చెందిన కనకదుర్గ సర్వీసెస్కు అప్పగించారు. ఇది కూడా టెండర్ పిలవకుండా అప్పగించడం వివాదాస్పదమైంది. కాగా, ఒక ట్రాక్టర్, రెండు ట్రక్కులు, ట్రాక్టర్కు అవసరమయ్యే డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు భరిస్తూ.. దేవస్థానంలో చెత్త తరలించే పనిని నెలకు రూ.60 వేలతో అప్పగించారు. టీడీపీలోని ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి సిఫారసుతో ఆ పార్టీ కార్యకర్తకు ఏకపక్షంగా ఈ పని అప్పగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గతంలో చెత్త ట్రాక్టర్ను యడ్ల కృష్ణ నిర్వహించేవారు. తాను రూ.43 వేలకే చెత్త తరలిస్తానని దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశానని, అయితే, తన దరఖాస్తు కూడా తీసుకోలేదని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో తన దరఖాస్తును దేవదాయ శాఖ కమిషనర్కు, దేవస్థానం చైర్మన్, ఈఓలకు ఈ నెల 3న రిజిస్టర్డ్ పోస్టులో పంపించానని చెబుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, రూ.43 వేలతో చెత్త తరలిస్తామంటూ తన వద్దకు అసలు ఎటువంటి దరఖాస్తూ రాలేదని ఈఓ వీర్ల సుబ్బారావు ‘సాక్షి’కి చెప్పారు. తపాలా ద్వారా పంపించి ఉంటే తనకు ఎందుకు ఇవ్వలేదో సంబంధిత అధికారులను వివరణ కోరానన్నారు. దరఖాస్తుదారు తనను కలిసి, దరఖాస్తు అందిస్తే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
ఇక్కడా అపహాస్యం
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025ప్రజా స్వామ్యం..సాక్షి ప్రతినిధి, కాకినాడ: స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పదవుల భర్తీకి గురువారం జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రజాప్రతినిధుల దిగజారుడు రాజకీయాలు జుగుప్సాకరంగా మారాయి. అధికారమే పరమావధిగా వారు బరి తెగించేశారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నికై న ప్రజాప్రతినిధులను సంతలో మాదిరి కొనుగోలు చేసేందుకు సైతం వెనుకాడ లేదు. మాట వినకుంటే ప్రలోభాలు, బేరసారాలు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. మరోవైపు ఒక రాజకీయ పార్టీ గుర్తుపై పోటీ చేసి, గెలిచి, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు కూడా నిస్సిగ్గుగా ఫిరాయించడాన్ని ఓటు వేసిన ప్రజలు ఆక్షేపిస్తున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలకు, నిబద్ధతకు స్థానం లేదనే వాస్తవం స్థానిక సంస్థల పదవులకు గురువారం జరిగిన ఎన్నికల్లో తేటతెల్లమైంది. రెండున్నరేళ్ల పదవి కోసం ఇంతగా వెంపర్లాడటం అవసరమా అని కూటమి నేతలను పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కూటమి నేతలు అనుసరిస్తోన్న తీరుకు భిన్నంగా వ్యవహరించి వైఎస్సార్ సీపీ ప్రజల మన్ననలందుకుంది. ఏదైనా ఇతర పార్టీల నుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు తమతో నడవాలనుకుంటే.. ముందుగా ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేయాలనే సంప్రదాయాన్ని వైఎస్సార్ సీపీ అధినేత, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటించారు. ప్రజాస్వామిక విలువలకు పెద్ద పీట వేస్తూ.. ఏ స్థాయి నాయకుడికై నా దీనినే వర్తింపజేస్తూ వచ్చారు. దీనికి భిన్నంగా కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు చీకటి ఒప్పందాలతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా నిస్సిగ్గుగా దొడ్డిదారిన పదవులను కట్టబెట్టడంపై స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. జిల్లాలో దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన తుని మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవిని, కౌన్సిలర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి దొడ్డిదారిన టీడీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీని కోసం టీడీపీ తునిలో అసాంఘిక శక్తులను రంగంలోకి దింపడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మరో తునిలా.. తుని ఉదంతం ఇంకా మరువక ముందే దాదాపు అదే పంథాలో కాకినాడ రూరల్ ఎంపీపీ పీఠాన్ని కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు కుట్రలు, కుతంత్రాలతో చేజిక్కించుకున్నారు. కాకినాడ రూరల్ మండల పరిషత్లో మొత్తం 18 మంది ఎంపీటీసీ స్థానాలకు గానూ గతంలో జరిగిన ఎన్నికల్లో 15 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలను జనసేన గెలుచుకుంది. ఈ ఎంపీపీ పీఠం కోసం పోటీ నెలకొనడంతో తొలుత గోపిశెట్టి పద్మజకు రెండేళ్లు, మిగిలిన రెండేళ్లు పుల్ల కోటేశ్వరరావు భార్య వెంకటలక్ష్మికి ఇచ్చేలా అప్పట్లో జెంటిల్మన్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం గత ఏడాది సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎంపీపీ పదవికి పద్మజ రాజీనామా చేశారు. దీంతో మిగిలిన రెండున్నరేళ్ల కాలానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మండల పరిషత్లో సంఖ్యాపరంగా 15 మంది సభ్యులతో ఉన్న వైఎస్సార్ సీపీ నుంచే వెంకటలక్ష్మి ఎంపీపీ పీఠం అధిష్టించాలి. బెదిరించి.. ప్రలోభపెట్టి.. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కూటమికి దక్కడంతో కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచర గణం వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను అనేక విధాలుగా బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేశారు. వైఎస్సార్ సీపీలో ఉన్న ఏడుగురు ఎంపీటీసీ సభ్యులను బెదిరించి, ప్రలోభాల ఎర వేసి, కుట్రలు చేసి తమవైపు తిప్పుకొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా లంబసింగిలో క్యాంపు ఏర్పాటు చేసి, అక్కడకు తరలించారు. ఎన్నికలు జరిగిన గురువారం నాటికి కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయానికి తీసుకువచ్చి, ఎంపీపీ పీఠాన్ని దొడ్డిదారిన కై వశం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. మండల పరిషత్లో మిగిలి ఉన్న రెండున్నరేళ్ల పదవీ కాలం కోసం కూటమి ప్రజాప్రతినిధులు ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేయడం చూసి, స్థానికులు ఇవేం రోత రాజకీయాలంటూ అసహ్యించుకుంటున్నారు. పార్టీ ఫిరాయించిన కొందరికి రూ.5 లక్షలు, మరికొందరికి సిమెంట్ రోడ్ల పనుల వంటి ప్రలోభాలతో వలలో వేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలుపొంది, ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు నిస్సిగ్గుగా కూటమి నేతలు ప్రతిపాదించిన ఎంపీపీకి జై కొట్టడాన్ని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా స్థానిక జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కనుసన్నల్లోనే జరగడాన్ని ఆక్షేపిస్తున్నారు. కూటమి నేతలు అప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుతూండటం, పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం వంటి పరిణామాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికను బహిష్కరించి, కూటమి తీరును ఎండగట్టారు. ‘స్థానిక’ ఉప పోరులో అరాచకం కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికలో కూటమి కుతంత్రాలు దిగజారుడు రాజకీయాలపై వైఎస్సార్ సీపీ నిరసన ఎన్నిక బహిష్కరణ -
వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించాలి
అన్నవరం: దేవస్థానంలో భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశించారు. అన్నవరం దేవస్థానం అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవస్థానంలో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేయించాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేయించాలని ఆదేశించారు. అలాగే, కాయర్ కార్పెట్లను ఉపయోగించాలన్నారు. దేవస్థానం వైద్యశాల, రత్నగిరిపై నిర్వహిస్తున్న వైద్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే, అన్నిచోట్లా భక్తులకు మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్రావు, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు, వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, ఫార్మసీ సూపర్వైజర్ వి.మాధవి పాల్గొన్నారు. బస్సును ఢీకొన్న ఆటో పలువురికి గాయాలు జగ్గంపేట: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు వెళ్తోంది. జగ్గంపేట మండలం రామవరం శివారుకు వచ్చేసరికి ప్రయాణికుడి కోసం బస్సును డ్రైవర్ అకస్మాత్తుగా రోడ్డుపై ఆపాడు. దీంతో, వెనుకనే వస్తున్న ఆటో అదుపు తప్పి బస్సు వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయమైంది. అతడిని హైవే అంబులెన్స్లో జగ్గంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మైనారిటీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ సిటీ: ఉపాధి కల్పన పథకంలో రుణాలు పొందడానికి ముస్లిం, క్రైస్తవ, జైన, సిక్కు, బౌద్ధ, పారశీకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ఎం.సునీల్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గరిష్టంగా తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల వరకూ రుణం అందిస్తారన్నారు. ప్రాజెక్టు ఏర్పాటు చేసే ప్రాంతం నుంచి లబ్ధిదారుల వర్గీకరణను బట్టి ప్రాజెక్టు విలువలో 15 నుంచి 35 శాతం వరకూ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని వివరించారు. లబ్ధిదారు వాటా 5 శాతంతో ఏదైనా బ్యాంకు నుంచి రుణ సహాయం కల్పిస్తారన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ బోర్డు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా సంబంధిత బ్యాంకులతో సంప్రదించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. రుణం పొందగోరే అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు దాటి ఉండాలన్నారు. గరిష్ట వయో, ఆదాయ పరిమితులు లేవని తెలిపారు. తయారీ రంగంలో రూ.10 లక్షలు పైబడిన ప్రాజెక్టులు, సేవా రంగంలో రూ.5 లక్షలు పైబడిన ప్రాజెక్టుల స్థాపనకు అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు. కొత్త ప్రాజెక్టులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, అవసరమైన చోట ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్, గ్రామీణ ప్రాంత ధ్రువీకరణ, డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, విద్య, సాంకేతిక, ఈడీపీ శిక్షణ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలతో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సునీల్కుమార్ సూచించారు. రూ.30.86 లక్షల హుండీ ఆదాయం నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ హుండీల ద్వారా రూ.28,86,128, అన్నదాన ట్రస్ట్ హుండీల ద్వారా రూ.1,99,937 కలిపి మొత్తం రూ.30,86,065 ఆదాయం లభించిందని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. దీంతో పాటు 19.500 గ్రాముల బంగారం, 260 గ్రాముల వెండి, మూడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయన్నారు. మొత్తం 120 రోజులకు గాను నిర్వహించిన ఈ హుండీల లెక్కింపును దేవదాయ శాఖ తాడేపల్లిగూడెం తనిఖీదారు బీఎల్ నరసింహరావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది నిర్వహించారు. -
కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన
● మెయిన్స్ పరీక్ష తేదీలు ప్రకటించాలని డిమాండ్ ● కలెక్టరేట్ వద్ద ధర్నా కాకినాడ సిటీ/కాకినాడ క్రైం: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే స్పందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, మెయిన్స్ పరీక్షల తేదీలు ప్రకటించాలని, లేకుంటే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న హెచ్చరించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలనే డిమాండ్తో డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన కాకినాడలో గురువారం ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. జనవరిలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 4.52 లక్షల మంది హాజరయ్యారన్నారు. వీరిలో 92 వేల మంది అర్హత సాధించారని, రెండేళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారని చెప్పారు. దీనిపై వెంటనే కోర్టు కేసులు పరిష్కరించి, మెయిన్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ఇప్పటికే పోలీసు శాఖలో 20 వేల వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి సంగతేమిటని ప్రశ్నించారు. మూడేళ్లుగా నిరుద్యోగులు కోచింగ్ ఫీజులు, రూము అద్దెలు చెల్లించలేక, పుస్తకాలు కొనలేక, భార్యను, కుటుంబాన్ని వదిలేసి చదువుకుంటూంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని ఆందోళనకారులు దుయ్యబట్టారు. యువగళంలో లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ గొంతు.. అధికారంలోకి రాగానే మూగబోయిందని విమర్శించారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పీడీ ప్రసాద్, జిల్లా నాయకుడు టి.రాజా మాట్లాడుతూ, నిరుద్యోగ యువతతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. పది నెలల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వందలాదిగా కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
వృత్తులను కాపాడడమే అసలైన సనాతనం
ఉప్పలగుప్తం: చేనేతను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలపై సీపీఎం నిర్వహించే ప్రజా చైతన్య యాత్ర సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని విలసవిల్లి, నంగవరం, భీమనపల్లి గ్రామాల్లో గురువారం సాగింది. ఈ సందర్భంగా చేనేత కార్మికులు, ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలతో సీపీఎం నాయకులు చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వచ్చి ప్రతీ ఇంటికి ఉపాధి కల్పిస్తానని కబుర్లు చెబుతున్నారు తప్ప రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమ అయిన చేనేత పరిశ్రమను మరుగున పడవేశారన్నారు. సనాతన ధర్మం పాటించాలని చెప్పే పాలకులకు సనాతన వృత్తులను కాపాడుకోవడమే అసలైన సనాతన ధర్మం అని గుర్తుచేస్తున్నానన్నారు. ముడి సరకు ధరలను అధికంగా పెంచి పాలకులు నేతన్నల పొట్ట కొడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి భరోసా నేతన్న నేస్తం కింద ఏడాదికి చేనేత కార్మికులకు రూ.24 వేలు ఇచ్చేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నేత కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న కనీస చర్యలు లేవని అన్నారు. ప్రభుత్వం పీ–4 పేరుతో ప్రజలను మోసం చేసి కార్పొరేట్ రంగాలను అభివృద్ధి చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా నేత కార్మికులు తాము పడుతున్న కష్టాలను సీపీఎం బృందానికి వివరించారు. అనంతరం చేనేత కార్మికుల మగ్గాలను వారు నేత నేసే విధానాన్ని తెలుసుకున్నారు. భీమనపల్లి కేఎఫ్డబ్ల్యూ కాలనీలోను, నంగవరం లోను సీపీఎం బృందం పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంది. ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా గుర్తించామని, ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. బి.బలరామ్, ఆండ్ర మల్యాద్రి, జి.దుర్గాప్రసాద్, నూకల బలరామ్, టి.నాగవరలక్ష్మి, కె.కృష్ణవేణి, పీతల రామచంద్రరావు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
టీడీపీ వేధింపులు తాళలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యా యత్నం
మండపేట: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. మండలంలోని పాలతోడు గ్రామానికి చెందిన తాతపూడి రాజేశ్వరి 16 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా అదే గ్రామంలో పని చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన తల్లిపై గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తల బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆమె కుమారుడు నవీన్ తెలిపారు. తన తల్లిపై లేనిపోని అభియోగాలు మోపి, ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నామని చెప్పారన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు ఉన్నవి లేనివి చెప్పి, తన తల్లిని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. గతంలో ఉపాధి హామీ పనులపై ఆడిట్ జరిగితే గ్రామంలోని ఒకే కుటుంబంలో రెండు జాబ్ కార్డులున్నాయంటూ ఆడిట్ అధికారులు తన తల్లిని ప్రశ్నించారని, దీనిపై కలెక్టర్కు, డ్వామా పీడీకి వివరణ ఇచ్చారని చెప్పారు. దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు ఆమె ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పారన్నారు. అయితే గ్రామంలోని టీడీపీ నాయకులు మందపల్లి శ్రీనుబాబు, మందపల్లి రాజబాబు, తాతపూడి లాజర్, పండా వీర్రాజు తన తల్లిపై ఎమ్మెల్యే వేగుళ్లకు నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఈ నేపథ్యంలో ఆమెను ఉద్యోగం తొలగించారని చెప్పారు. సుమారు మూడు నెలలుగా తన తల్లిపై కక్ష సాధిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పేరు చెప్పి తన తల్లి రూ.40 లక్షల వరకూ సంపాదించిందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. పైగా ఆమె ఉద్యోగాన్ని వేరొకరికి ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.3 లక్షల లంచం కూడా తీసుకున్నారని నవీన్ ఆరోపించారు. డబ్బు కోసం తన తల్లిపై లేనిపోని నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు ఉత్తమ అవార్డులు అందుకున్న తన తల్లి టీడీపీ శ్రేణుల వేధింపుల నేపథ్యంలో ఈ నెల 25న పురుగుల తాగి, చచ్చిపోవాలనుకున్నదని విలపించారు. ఆమెకు ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని నవీన్ చెప్పారు. -
నగదు రహిత పాదయాత్రకు స్వాగతం
ఆదిత్య పూర్వ విద్యార్థికి అభినందనలు తెలిపిన యాజమాన్యం గండేపల్లి: ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించి, 27 రాష్ట్రాలను చుట్టి వచ్చిన ఆదిత్య పూర్వ విద్యార్థికి కళాశాలల యాజమాన్యం సాదర స్వాగతం పలికింది. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో 2019 నుంచి 2023 వరకు పెట్రోలియం టెక్నాలజీ ఇంజినీరింగ్ విభాగంలో విద్యనభ్యసించిన తమిళనాడు రాష్ట్రం కుంభకోణంకు చెందిన ఎస్.తిలోత్తమన్ సంపూర్ణ భారతదేశ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించి గురువారం కళాశాలలకు చేరుకుని చాన్సలర్ ఎన్.శేషారెడ్డి, ప్రో చాన్సలర్ ఎన్.సతీష్రెడ్డిని కలిసి తాను చేస్తున్న పాదయాత్ర గురించి వివరించాడు. ఈ సందర్భంగా తిలోత్తమన్ మాట్లాడుతూ నవంబర్ 11, 2024 న కుంభకోణంలో పాదయాత్రను ప్రారంభించానని, ఈ యాత్ర పూర్తి నగదు రహిత పాదయాత్ర అని కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మార్గమధ్యలో ఎవరినైనా లిఫ్ట్ అడిగి ప్రయాణిస్తున్నట్టు తెలియజేశాడు. ఆయా ప్రాంతాలలో ఆలయాలు, వసతి సత్రం, అన్నదాన కేంద్రాల వద్ద ఆహారం తీసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నట్టు పేర్కొన్నాడు. యువత మత్తుకు అలవాటుపడి వారి భవిష్యత్ను నాశనం చేసుకోవడం, కుటుంబాలు చిన్నాభిన్నం అవడం చూశానని, ఈ యాత్ర యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ప్రారంభించినట్టు తెలిపాడు. కుంభకోణంలో ఏప్రిల్ నెలాఖరున సంపూర్ణ భారతదేశ పాదయాత్రను పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి, వైస్ చాన్సలర్ ఎంబీ శ్రీనివాస్, ప్రో వైస్ చాన్సలర్ ఎస్.రమాశ్రీ, డీన్స్ తిలోత్తమన్ను అభినందించారు. వాడపల్లి వెంకన్నకు రూ.1.23 కోట్ల ఆదాయం కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ.1.23 ఆదాయం వచ్చినట్టు దేవాదాయ –ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 31 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో గురువారం హుండీలను తెరిచి నగదు, మొక్కుబడులను లెక్కించారు. ప్రధాన హుండీల నుంచి రూ.96.99,132, అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.23,27,304, బంగారం 10 గ్రాములు, వెండి 1 కేజీ 925 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 20 వచ్చినట్టు వివరించారు. ఆలయ క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ 2,99,236 ఆదాయం లభించిందన్నారు. దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్, గోపాలపురం గ్రూపు దేవాలయాల గ్రేడ్ – 3 ఈఓ బీ కిరణ్, ఆత్రేయపురం గ్రూపు దేవాలయాలు గ్రేడు – 3 ఈఓ బీ నరేంద్రకుమార్, దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు పాల్గొన్నారు. నల్లజర్ల: దూబచర్ల గాంధీ కాలనీ, ముసుళ్ళగుంటలలో అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసి అవమానించిన కేసులో సమగ్ర విచారణ జరిపి నిజమైన దోషులను పోలీస్లు అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ డిమాండ్ చేసింది. గురువారం సాయంత్రం నల్లజర్లలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలివేణు మాట్లాడుతూ ఈ విగ్రహాల విషయంలోఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఒత్తిళ్లకు లొంగి పోలీసులు సమగ్ర విచారణ జరపకుండానే వైఎస్సార్ సీపీ అభిమాని, సామాజిక కార్యకర్త బుడుపుల బాబ్జిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. టీడీపీ వైఎఎస్సార్ సీపీపై బురదజల్లే కార్యక్రమం చేపట్టిందన్నారు. మా ఆరాధ్యధైవం అంబేద్కర్ను ఎందుకు అవమానిస్తామని ప్రశ్నించారు. ఏదో విధంగా కేసు త్వరితగతిన పూర్తి చేయడానికి పోలీసులు ఈవిధంగా వ్యవరించారన్నారు. ఇక్కడ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందా అని ప్రశ్నించారు. 2024 నవంబరు 26న ద్వారకాతిరుమలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు ఇంతవరకు ఏమైందో తెలియలేదన్నారు. ఈ కేసులో నిర్ధోషి, దళిత యువకుడు గోపాలపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకులపాటి శ్రీనివాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అందుగుల వెంకటేశ్వరావు, ముప్పిడి వెంకటరత్నం, తాడిగడప శ్రీనివాసరావు, బోడిగడ్ల రాంబాబు, తోట వెంకట్రావు, గోగులమండ రాజారావు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు -
4న చిత్రకళా వీధి ప్రదర్శన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/రాజానగరం: నగరంలోని లాలాచెరువు రహదారిలో ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన‘కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి (క్రియేటివిటీ అండ్ కల్చరల్) కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు.గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన‘ వాల్పోస్టర్ను కల్చరల్ డైరెక్టర్ ఎం.మల్లికార్జునరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పి.తేజస్వి మాట్లాడుతూ రాష్ట్రంలో కళలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4న ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 500 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా వచ్చే నిధులతో రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఈ వీధి ప్రదర్శన కొనసాగిస్తామని చెప్పారు. ఆమె ఆదికవి నన్నయ యూనివర్సిటీని సందర్శించి వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీని కలుసుకుని వీధి ప్రదర్శనపై చర్చించారు. అనంతరం ఇందుకు సంబంధించిన బ్రోచర్ని విడుదల చేశారు. -
సారా రహిత రాష్ట్రమే ధ్యేయం
ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్ను సారా రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ‘నవోదయం 2.0 కార్యక్రమాన్ని రూపొందించిందని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా ప్రత్తిపాడు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. కార్యాలయంలోని రిజిస్టర్లు, రికార్డులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం నవోదయం 2.0పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని ఎకై ్సజ్ నేరాలు, సారా తయారీ, రవాణా, క్రయవిక్రయాలపై సమీక్షించారు. సారాను పూర్తిగా నిషేదించేందుకు కృషిచేయాలని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక, ఎకై ్సజ్ సూపరిటెండెంట్ కృష్ణకుమారి, అసిస్టెంట్ ఎక్పైజ్ సూపరిటెండెంట్ జయమౌనిక పాల్గొన్నారు. -
బొప్పాయి సాగు.. లాభాల బాగు
పెద్దాపురం: ప్రస్తుత వేసవి సీజన్లో ఆరోగ్యప్రదమైన ఫలాల్లో బొప్పాయి ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు కోస్తాలో అధికంగా పండించే బొప్పాయి మెట్ట ప్రాంతంలోనూ రైతులకు మంచి ఆదాయాలను సమకూరుస్తోంది. ప్రధానంగా మెట్ట కేంద్రమైన పెద్దాపురం మండలంలోని చినబ్రహ్మదేవం, జె.తిమ్మాపురం, కట్టమూరు. ఆర్బీపట్నం, కొత్తూరు, కొండపల్లి, ఆనూరు గ్రామాల్లో సుమారు 150 ఎకరాల్లో బొప్పాయి సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించారు. నారు దశ మొదలు ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, కోత, దిగుబడి వంటి అంశాలపై ఉద్యాన శాఖాధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయడంతో బొప్పాయి సాగు లాభాలు చేకూరుస్తోంది. ఎరువుల యాజమాన్యం చెట్టు వయస్సును బట్టి ఎరువులను వినియోగించాలి. ఏకలింగాశ్రయ దీర్ఘకాలిక రకాల బొప్పాయి ఒక్క మొక్కకు పది కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రామాల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ 800 గ్రామాలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వెయ్యాలి. రెండు నెలలకోసారి ఏడాదిలో ఆరుసార్లు ఎరువులను వెయ్యాలి. సూక్ష్మధాతు లోప నివారణకు ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్, ఒక గ్రాము బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రాములు యూరియా, 19.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాలి. ఏకవార్షిక రకాలకు ఎరువులను ఏడవ నెల వరకు అందించాలి. ఫెర్టిగేషన్ సిఫారసు చేసిన ఎరువులను కరగబెట్టి వడగట్టిన తరువాత ఫెర్టిగేషన్ ట్యాంక్ లేదా ఫుట్ స్పేయర్ ద్వారా గాని డ్రిప్ మెయిన్ పైపులోకి ప్రవేశపెట్టాలి. భాస్వరపు ఎరువుని ఫాస్పేట్ రూపంలో ప్రతీ రెండు నెలలకోసారి 260 గ్రాములు చెట్టుపాదులో కలపాలి. నీటి యాజమాన్యం మొక్క మొదళ్ల దగ్గర నీరు తగలకుండా, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పిల్ల పాదులు (డబుల్రింగ్ పద్ధతి) తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. డ్రిప్ ద్వారా చిన్న మొక్కలైతే రెండు రోజులకోసారి 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతీ 20–25 లీటర్ల నీటిని అందే విధంగా డ్రిప్పర్లు అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు అందించాలి. కోత, దిగుబడి మంచి సైజు వచ్చిన కాయలను చెట్టు మీద మాగనీయకూడదు. వాటిని కోసి పేపర్తో చుట్టి రవాణా చేసుకోవాలి. నాటిన 9వ నెల నుంచి రెండున్నర సంవత్సరాల వరకు పంటనిస్తుంది. ద్విలింగ పుష్పాల నుంచి ఎదిగే కాయలు తక్కువ పొడవుతో గుండ్రంగా ఉంటాయి. అదే ఆడపుష్పాల నుంచి ఎదిగే కాయలు పొడవుగా, కోలగా ఉంటాయి. దిగుబడి ఎకరాకు 35 నుంచి 40 టన్నుల వరకు ఉంటుంది. బొప్పాయి సాగులో మంచి ఆదాయం మెట్ట ప్రాంతంగా కావడంతో ఎక్కువ అపరాలు, పండ్ల తోటలను సాగు చేస్తుంటాం. ప్రధానంగా మామిడి, జీడిమామిడితో పాటు బొప్పాయి సాగులోను మంచి ఆదాయం వస్తుంది. అధికారుల సూచనలతో మరింత జాగ్రత్తగా సాగు చేపట్టడంతో బొప్పాయి మంచి దిగుబడి వచ్చింది. –ఆచంట శివ, రైతు, చిన బ్రహ్మదేవం, పెద్దాపురం మండలం ఆరోగ్యానికి చాలా మంచిది బొప్పాయి పండు ఆరోగ్యనాకి చాలా మంచింది. బొప్పాయిలో విటమిన్ సీ, ఏ యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు కొన్ని వ్యాఽధుల నుంచి రక్షిస్తుంది. –డాక్టర్ భ్రమరాంబ, ఏరియా ఆసుపత్రి వైద్యులు, పెద్దాపురం మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు వేసవిలో లబ్ధి పొందుతున్న మెట్టలో రైతులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం కేసులో నిందితుడి అరెస్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం కేసులో నిందితుడు దువ్వాడ మాధవరావు దీపక్ను స్థానిక ప్రకాశం నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిశోర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడేనికి చెందిన విద్యార్థిని కోరుకొండ మండలం మధురపూడిలోని వికాస్ ఫార్మా కళాశాలలో ఫార్మ్–డి చివరి సంవత్సరం చదువుతోంది. రాజమహేంద్రవరం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తొమ్మిది నెలలుగా ఇంటర్న్షిప్ చేస్తూ, ఫార్మాలజిస్టుగా పని చేస్తోంది. అక్కడకు సమీపంలోనే ఒక రూము అద్దెకు తీసుకుని ఉంటోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే దీపక్ అనే వ్యక్తి ప్రేమ పేరిట ఆమె వెనకాల తిరిగాడు. లైంగికంగా వేధించి, ప్రేమించానని నమ్మించి, మోసగించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని ఈ నెల 23న డ్యూటీ చేస్తూ మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె రూములోని డైరీలో దొరికిన సూసైడ్ నోట్లో దీపక్ వేధింపులు భరించలేకే తాను చనిపోతున్నట్లు రాసి ఉందని పోలీసులకు ఆమె తండ్రి తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. దీపక్ ఆచూకీ కోసం గాలించి, అతడిని విద్యానగర్లోని ఇంటి వద్ద ప్రకాశం నగర్ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ బాజీలాల్, కానిస్టేబుల్ వి.శివప్రసాద్, జె.ఈశ్వరరావులను అభినందించి, రివార్డు ప్రకటించారు. -
లారీ కింద పడి ఇద్దరి దుర్మరణం
మరో మహిళకు తీవ్ర గాయాలు గండేపల్లి/జగ్గంపేట: గోకవరం–జగ్గంపేట ఆర్అండ్బీ రహదారిపై జగ్గంపేట వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రఘునాథరావు వివరాల మేరకు, జగ్గంపేట మండలం గోవిందపురానికి చెందిన ఇళ్ల వరహాలు(48) మోటార్ సైకిల్పై జగ్గంపేట వైపు వస్తున్నాడు. అదే సమయంలో గోకవరం మండలం జగన్నాథపురానికి చెందిన బొందల నాగేశ్వరరావు అనే నాగు (28) తన సోదరి పితాని దుర్గతో కలిసి మోటార్ సైకిల్పై స్వగ్రామం వెళుతున్నారు. బి.కొత్తూరు గ్రామంలో వినాయకుడి ఆలయం వద్దకు వచ్చేసరికి రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అదుపుతప్పి అటుగా వస్తున్న లారీ వెనుక చక్రాల కింద పడడంతో వరహాలు, నాగు తల భాగాలు నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గంగ అపస్మారక స్థితికి చేరుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై రఘునాథరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రురాలు దుర్గను జగ్గంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. మృతుడు వరహాలుకు భార్య గంగ, కొడుకు, కుమార్తె ఉన్నారు. జగన్నాథపురంలో విషాద ఛాయలు గోకవరం మండలం జగన్నాథపురంలో బొందల నాగేశ్వరరావు(నాగు) మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నప్పుడే నాగు తండ్రి మృతి చెందగా, అతడి అన్నయ్య ఎనిమిదేళ్ల క్రితం విద్యుదాఘాతంతో మరణించాడు. దీంతో నాగు హైదరాబాద్లో కూలీ పనులు చేస్తూ, తల్లిని పోషిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో నాగు మృతి చెందాడన్న విషయం తెలుసుకుని అతడి బంధువులు భోరున విలపించారు. -
ఏప్రిల్ 8న సప్త జ్యోతిర్లి్ంగ దర్శన్ ప్రత్యేక రైలు
రాజమహేంద్రవరం సిటీ: ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ఈ యాత్రలో ఉజ్జయినీ(మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్), ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్, పుణే(భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రిష్ణేశ్వర్) సందర్శన ఉంటుందని వివరించారు. ఈ రైలు విజయవాడలో బయలుదేరి ఖమ్మం, కాజీపేట, హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ఏప్రిల్ 8న బయలుదేరే ఈ రైలు 19న తిరిగి విజయవాడ చేరుతుందని చెప్పారు. ఈ రైలులో ఎకానమీ(స్లీపర్), స్టాండర్డ్ (3ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) సౌకర్యాలు ఉంటాయన్నారు. వివరాలకు 92814 95848, 92810 30714 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
క్షణ క్షణం..ఉత్కంఠ
● పాస్టర్ ప్రవీణ్కుమార్ పగడాల అనుమానాస్పద మృతిపై క్రైస్తవుల ఆందోళన ● రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి వద్ద తరలివచ్చిన వేలాది మంది ● ధర్నా, రోడ్డుపై బైఠాయింపు ● సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాస్టర్ ప్రవీణ్కుమార్ పగడాల మృతి సంఘటనపై బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి వద్ద క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది. పాస్టర్ ప్రవీణ్కుమార్ మృతి విషయం తెలిసిన క్రైస్తవులు, దళిత సంఘాల వారు వేలాది మంది రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆయనది రోడ్డు ప్రమాదం కాదని, అది ముమ్మాటికీ హత్యేనని ఆందోళన చేశారు. ఉదయమే ఆస్పత్రికి చేరుకున్న ప్రవీణ్కుమార్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఆస్పత్రి వద్దకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తారనే ముందస్తు సమాచారం ఉన్న జిల్లా ఎస్పీ.. ఆస్పత్రి వద్ద ఉదయం నుంచి భారీగా పోలీసుల బలగాలను మోహరించారు. సంఘటన జరిగి 24 గంటలు దాటినా, ఇంకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని దళితులు ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురు డాక్టర్ల బృందం, వీడియో రికార్డింగ్, ఇద్దరు వ్యక్తులను అనుమతించి, పోస్ట్మార్టం పక్రియ పూర్తి చేశారు. తమకు న్యాయం కావాలని, సాక్ష్యాలను తారుమారు చేస్తే ఊరుకోబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆస్పత్రి వద్దకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాస్టర్లు, క్రైస్తవ నాయకులు, ప్రవీణ్కుమార్ సానుభూతిపరులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రభుత్వాస్పత్రి ప్రాంగణం కిక్కిరిసింది. పోలీసు బలగాలు భారీగా మోహరించి, అల్లర్లు జరగకుండా నియంత్రించాయి. పోస్ట్మార్టం విభాగం సమీపంలో ఎవరినీ లోపలికి ప్రవేశించకుండా రోప్ టీం అడ్డుకుంది. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ ప్రభుత్వాస్పత్రి వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఆ సమయంలో ఆస్పత్రి వద్ద ఆందోళనకారులు.. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ వారికి నచ్చజెప్పి, ఎవరూ అనుమానాలు పడనవరంలేదని, పూర్తి పారదర్శకతతో కేసు విచారణ జరుగుతుందన్నారు. అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ప్రవీణ్కుమార్ పగడాల కేసు పారదర్శకంగా జరుగుతుందని, సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పోస్ట్మార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని ప్రవీణ్కుమార్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంబులెన్స్ ద్వారా ఆయన నివాస ప్రాంతమైన హైదరాబాద్కు వారు తరలించారు. పాస్టర్ మృతిపై న్యాయం కావాలంటూ క్రైస్తవులు ఆస్పత్రి బయట ధర్నా చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎస్పీ ఎమన్నారంటే.. ఈ సంఘటనపై పలు విషయాలను వెల్లడించేందుకు జిల్లా ఎస్పీ స్థానిక దిశా పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వెళ్లి ఆధారాలు సేకరించాయన్నారు. కొన్ని సీసీ ఫుటేజీలు సేకరించామని, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. ఇందుకు డీఎస్పీతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రవీణ్కుమార్ మోటార్ సైకిల్పై కిందకు పడిపోవడం, ఆ సమయంలో దుమ్ము లేవడం, అదే సమయంలో మోటారు సైకిల్ ముందు నుంచి కారు వెళ్లడం గమనించామన్నారు. ఆ కారు వివరాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే మృతదేహంపై ఉన్న దుస్తులను విజయవాడ ల్యాబ్కు పంపామన్నారు. ఇంకా పలు ఆధారాలను సేకరించామన్నారు. ఎవరూ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇది సహజ మరణం కాదు పాస్టర్ ప్రవీణ్కుమార్ది రోడ్డు ప్రమాదంలో జరిగిన మరణం కాదు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేదు. మర్నాడు ఉదయం ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లినా, పూర్తి ఆధారాలు సేకరించారా అసలు. పోలీసులు, ప్రభుత్వం సరిగా స్పందించలేదు. మాకు కావాల్సిన సహకారం అందించ లేదు. ఈ విషయాన్ని మతపరమైన అంశంలా కాకుండా, మానవత్వంతో ముందుకు వెళ్లాలి. ఆయన కాల్ హిస్టరీ బయటకు తేవాలి. సీసీ టీవీల్లో కొంతమేరకే ఆధారాలు ఇచ్చారు. ఆయన ముందుగానే దెబ్బలతో వచ్చి అక్కడ పడిపోయారా? రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల అనుమానాలు తీర్చాలి. – పర్ల డేవిడ్, ఒన్నెస్, సువార్త ప్రసంగీకులు, విజయవాడ -
టి.కొత్తపల్లి సొసైటీలో నిధుల గల్లంతు
సంఘ కార్యదర్శిపై రైతుల ఆరోపణ ఐ.పోలవరం: టి.కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. రైతులకు చెందాల్సిన వడ్డీ రాయితీ సహా, ఇతరత్రా నిధులను సంఘ కార్యదర్సి కె.తిరుమలకుమార్ స్వాహా చేసినట్టు రైతులు ఆరోపించారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ డీసీసీబీ ఉన్నతాధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు లిఖితపూర్వకంగా రైతులు ఫిర్యాదు చేశారు. తమ పేర్లతో కూడా పెద్దఎత్తున రుణాలు తీసుకున్నట్టు వారు అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే, టి.కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘంలో కార్యదర్శి తిరుమలకుమార్ ఎనిమిదేళ్లుగా అక్రమాలకు పాల్పడుతూ, తమకు చెందాల్సిన రాయితీలను దారి మళ్లించినట్టు రైతులు ఆరోపించారు. ఇటీవల సంఘానికి మంజూరైన రూ.24 లక్షలను కాజేశాడని, మూడు శాతం రావాల్సి న వడ్డీ రాయితీని రైతులకు ఎగనామం పెట్టాడని చెప్పారు. ఏడేళ్లుగా భవన కార్యాలయంలో నివాసం ఉంటూ, నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఆర్ఏ కింద ఇప్పటివరకు సుమారు రూ.10 లక్షలు దండుకున్నాడని రైతులు ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు చెందాల్సిన హమాలీ చార్జీలు కూడా కై ంకర్యం చేసినట్టు వివరించారు. కార్యాలయ ఖర్చులు, రైతు రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియలో భారీఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు రైతులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు మొరపెట్టుకున్నారు. దీనిపై మురమళ్ల డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ జీబీ మోహన్ను వివరణ కోరగా, టి.కొత్తపల్లి రైతుల నుంచి ఫిర్యాదు అందిందని, తక్షణమే సూపర్వైజర్ ఎస్వీ శ్రీరామ్కుమార్ను విచారణ చేపట్టాలని ఆదేశించామన్నారు. నివేదిక రాగానే ఉన్నతాధికారులకు నివేదించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తాళ్లరేవు: జి.వేమవరం గ్రామానికి చెందిన వివాహిత గండి ప్రవల్లిక(25) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు, తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామానికి చెందిన గండి రాంబాబు, ఐ.పోలవరం మండలం జి.వేమవరానికి చెందిన సలాది ప్రవల్లిక ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రాంబాబు ట్రావెల్స్ నడుపుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రవల్లిక తండ్రి కుమార్తెను తీసుకువెళ్లేందుకు రాగా, ఎంతకూ తలుపు తీయలేదు. అక్కడే ఎదురుచూసాడు. అంతలో ఇంటికి వచ్చిన రాంబాబు లోనికి వెళ్లి పరిశీలించగా, ప్రవల్లిక బాత్రూంలో కిటికీకి వేలాడుతూ కనిపించింది. ఆమెను కాకినాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రవల్లిక మూడు గర్భిణి అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవల్లిక కుటుంబ సభ్యులు కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై పి.సత్యనారాయణ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ కుమార్తెను కట్నం కోసం అత్తింటివారే చంపి ఉంటారని ప్రవల్లిక తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె ఎత్తు నాలుగు అడుగులకు పైగా ఉంటుందని, కిటికీ ఎత్తు అంత కూడా లేదని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగం పేరిట టోకరా!
గ్రీవెన్స్ను ఆశ్రయించిన భార్యాభర్తలు ప్రత్తిపాడు: తమ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేశారని ప్రత్తిపాడు గ్రామానికి చెందిన దంపతులు బొడ్డు గంగరాజు, వరలక్ష్మి ఆరోపించారు. తమ నివాసంలో బుధవారం వారు విలేకరులకు తమ గోడు వెళ్లగక్కారు. వారి వివరాల మేరకు, వీరి కుమారుడు రమేష్కుమార్ ఇంటర్మీడియెట్ చదివి, ఖాళీగా ఉన్నాడు. రెండేళ్ల క్రితం అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మండలంలోని పెద్దిపాలెం గ్రామానికి చెందిన గొంప రామకృష్ణ, అతడి భార్య దుర్గాప్రవీణ నమ్మించారు. ఏలూరు పట్టణానికి చెందిన పల్లా ఏసు, సంతోష్కుమార్కు ఇవ్వాలంటూ వారి వద్ద రూ.4.30 లక్షలు తీసుకున్నారు. పీఈటీ శిక్షణ తీసుకుంటే ఉద్యోగం వెంటనే వస్తుందని చెప్పడంతో, రమేష్కుమార్ విజయనగరంలో శిక్షణకు కూడా వెళ్లాడు. అప్పటి నుంచి రామకృష్ణ, దుర్గాప్రవీణ మొఖం చాటేశారు. దీనిపై 2023 జూలై 31న ప్రత్తిపాడు పోలీసులకు గంగరాజు, వరలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ప్రయోజనం లేకపోయింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేసినట్టు గంగరాజు, వరలక్ష్మి తెలిపారు. వీరి ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కదం తొక్కిన కోకో రైతులు
కొవ్వూరు: కోకో గింజల కొనుగోలు, గిట్టుబాటు ధరలపై నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. కోకో గింజలను ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కోకో కాయలు, గింజలు పట్టుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట నిలబడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కోకో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, కంపెనీలు సిండికేట్గా మారి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతుల వద్ద ఉన్న కోకో పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడినప్పటికీ కంపెనీలు నిర్లక్ష్య ధోరణి చూపుతున్నాయని అన్నారు. అన్ సీజన్లో కోకో పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నారన్నారు. మరోవైపు కంపెనీలు రోజురోజుకూ ధర తగ్గించేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కిలో కోకో గింజల ధర రూ.650 ఉండగా నేడు రూ.550 నుంచి రూ.500కు పడిపోయిందని చెప్పారు. అన్ సీజన్లో కిలో రూ.200 నుంచి రూ.240కే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కిలో కోకో గింజలకు రూ.900 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలని, విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలని, ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీలు అందించి, రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రాణి సుస్మితకు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉప్పల కాశీ, నాయుడు లక్ష్మణరావు, ఉండవల్లి కృష్ణారావు, జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ కంపెనీలు కొనుగోలు చేయకపోవడంపై నిరసన ఫ తక్షణం ప్రభుత్వం కొనాలని విన్నపం ఫ కిలోకు రూ.900 ఇవ్వాలని డిమాండ్ -
సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: ఫాల్గుణ బహుళ ఏకాదశి సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవునికి అర్చకులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీస్సులు అందజేశారు. ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వేద పండితులు యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 20 వేల మంది దర్శించారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. -
నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి
కాకినాడ సిటీ: బియ్యం, కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయలు అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, వ్యాపారులను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. తన చాంబర్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల రోజుల ముందు, ప్రస్తుతానికి కూరగాయల ధరల్లో ఉన్న వ్యతాసాలను పరిశీలించారు. కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాల ధరలు అందుబాటులో ఉన్నాయో లేవో సంబంధిత హోల్సేలర్లు, రిటైలర్లను అడిగి తెలుసుకున్నారు. వినియోదారుల సంఘం సభ్యులు మాట్లాడుతూ, కాకినాడ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరికొన్ని రైతుబజార్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై తగు నివేదిక ఇవ్వాలని మార్కెటింగ్ శాఖను జేసీ ఆదేశించారు. పాలు, బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాల ప్యాకింగ్పై తప్పనిసరిగా తయారీ తేదీ, వినియోగ తేదీ ముద్రించాలని స్పష్టం చేశారు. అలా లేకుంటే తన దృష్టికి తీసుకురావాలని వినియోగదారుల సంఘ సభ్యులకు జేసీ సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం.దేవుల నాయక్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.సలీం, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాఘవేంద్ర కుమార్, వాణిజ్య పన్నుల శాఖ నుంచి జి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై వింత పాలన
అధికారుల ఆగ్రహం దేవస్థానంలో నీటి సమస్య పేరుతో ఏసీ గదులు అద్దెకివ్వడాన్ని నిలిపివేశారంటూ భక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. విజయవాడలో మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏసీ గదులు అద్దెకివ్వాలని ఆదేశించారు. ఇదే విషయమై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ కూడా ఈఓ సుబ్బారావుకు ఫోన్ చేసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు తెలియజేయకుండా గదులను అద్దెకివ్వడం నిలిపివేయడమేమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా, కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కలెక్టర్ షణ్మోహన్ గురువారం అన్నవరం దేవస్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఏసీ గదులు అద్దెకివ్వకపోవడంతో ఏర్పడిన వివాదంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. పైగా కలెక్టర్ చెప్పినందు వల్లనే గదులు అద్దెకు ఇవ్వడం లేదని అధికారులు చెబుతూండటంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అన్నవరం: బోడిగుండుకు మోకాలుకు ముడి వేయడమనే సామెత వినే ఉంటారు. అదే చందంగా అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలు దేవస్థానం ప్రతిష్టను మరింత మసకబారేలా చేస్తున్నాయి. తాజాగా అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం అటు భక్తులను ఇబ్బందులకు గురి చేయగా.. ఇటు దేవస్థానానికి ఆర్థికంగా నష్టాన్ని తీసుకువచ్చాయి. ఏం జరిగిందంటే.. అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానానికి ప్రధాన నీటి వనరు అయిన పంపా రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిన విషయం తెలిసిందే. రిజర్వాయర్లో ఉన్న నీటిని పోలవరం కాలువ పనులు, బ్యారేజీ గేట్లు మరమ్మతుల పేరుతో దిగువకు వదిలేశారు. దీనివలన దేవస్థానానికి నీటి సమస్య ఉత్పన్నమవుతుందని, ఏప్రిల్లో శ్రీరామ నవమి, మే నెలలో సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు ఇబ్బందులు ఎదురవుతాయని ‘సాక్షి’ ఫిబ్రవరి 10న ‘అడుగంటినది’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అన్నవరం దేవస్థానం అధికారులు నెల రోజులు ఆలస్యంగా స్పందించారు. పంపా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత, ఏలేరు నుంచి నీటిని విడుదల చేయించాలని కోరుతూ కలెక్టర్కు ఈఓ వీర్ల సుబ్బారావు మార్చి 11న లేఖ రాశారు. ఈ మేరకు కలెక్టర్ షణ్మోహన్ ఈ నెల 18న అన్నవరం వచ్చి, పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. ఈ నెల 21న ఇరిగేషన్, పోలవరం, దేవస్థానం అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలవరం అక్విడెక్ట్ పనులకు ఆటంకం లేకుండా ఏలేరు నీరు పంపాకు చేరేలా ప్రత్యేకంగా కాలువ, పైప్లైన్ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన నిధులు తాను విడుదల చేస్తానని తెలిపారు. ఈ మేరకు పోలవరం అధికారులు రూ.22 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. దీనికి కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమోదం తెలిపి, ఏప్రిల్ 15 నుంచి పంపాకు ఏలేరు నీరు విడుదల చేసేందుకు వీలుగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో దేవస్థానంలో నీటిని పొదుపుగా వాడాలని, అత్యవసర నిర్మాణాలు మినహా మిగిలినవి నిలిపివేయాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. చెప్పిందొకటి.. చేసింది మరొకటి ఏలేరు నీరు పంపాకు వచ్చేంత వరకూ దేవస్థానంలో నీటిని పొదుపుగా వాడాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశిస్తే అధికారులు మరొకలా అర్థం చేసుకున్నారు. కలెక్టరేట్లో సమావేశం ముగిసిన అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దేవస్థానానికి చేరుకున్నారు. సత్రాల్లో ఏసీ గదులు అద్దెకివ్వడం నిలిపివేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయంపై దేవస్థానంలో మైకు ద్వారా ప్రచారం చేశారు. ఈ మేరకు మంగళ, బుధ, గురువారాల్లో ఏసీ గదులు అద్దెకివ్వరని ప్రచారం చేశారు. ఈ నిర్ణయంపై దేవస్థానం సిబ్బంది ఆశ్చర్యపోయారు. నీటి పొదుపునకు, సత్రాల్లో ఏసీ గదులు అద్దెకివ్వకపోవడానికి మధ్య ఉన్న సంబంధమేమిటో అర్థం కాక పలువురు తలలు పట్టుకున్నారు. పైగా ప్రస్తుతం వేసవి కావడంతో ఎక్కువ మంది భక్తులు ఏసీ గదులే అడుగుతున్నారు. దీంతో, నాన్ ఏసీ గదులు తీసుకోవాలని వారికి అధికారులు చెప్పాల్సి వచ్చింది. వాస్తవానికి ఏసీ గది అయినా, నాన్ ఏసీ గది అయినా బస చేసేవారు ఒకే విధంగా నీటిని వాడతారు. ఏసీ గదుల్లో చెమట పట్టదు. దీనివలన వాటిల్లో బస చేసే వారికి రోజుకు రెండు మూడుసార్లు స్నానాలు చేసే అవసరం ఉండదు. అందువలన ఏసీ గదుల్లో ఉన్నవారే నీటిని తక్కువగా వాడే అవకాశం ఉంది. కానీ దేవస్థానం అధికారులు ఏవిధంగా ఆలోచించి ఏసీ గదులు అద్దెకివ్వరాదనే నిర్ణయం తీసుకున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదీ నష్టం దేవస్థానం సత్రాల్లో మొత్తం 500 గదులుండగా వీటిలో 300 ఏసీవి. పర్వదినాల్లో మొత్తం గదులన్నీ అద్దెకిచ్చేస్తారు. అన్ సీజన్లో 150 నుంచి 200 గదులు అద్దెకిస్తారు. మిగిలినవి ఖాళీగా ఉంటాయి. శివసదన్ సత్రంలో మొత్తం 135 గదులు ఏసీ. హరిహర సదన్లో 135 గదులకు 84 ఏసీవి. ప్రకాష్ సదన్లో 64 గదులు ఏసీవి. దేవస్థానంలో ఏసీ గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.2 వేల వరకూ ఉంది. ఈఓ ఆదేశాలతో సోమవారం సాయంత్రం నుంచి ఈ సత్రాలన్నింటిలో ఏసీ గదులను అద్దెకివ్వడం నిలిపివేశారు. ఫలితంగా దేవస్థానానికి రూ.లక్ష వరకూ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఏసీ గదుల కోసం వచ్చిన భక్తులు గత్యంతరం లేక కొండ దిగువకు చేరుకున్ని అన్నవరం గ్రామంలోని ప్రైవేటు లాడ్జిలలో ఏసీ గదులు అద్దెకు తీసుకున్నారు. ఇదే అదునుగా వారిని ఆయా లాడ్జీల యజమానులు ఏసీ గదుల అద్దెలను ఒక్కసారిగా రూ.3 వేల నుంచి రూ.5 వేలకు భక్తులను దోచుకున్నారు. అన్నవరం దేవస్థానంఫ నీటి సమస్య సాకుతో ఏసీ అద్దె గదుల నిలిపివేత ఫ దేవస్థానానికి రూ.లక్ష నష్టం ఫ గత్యంతరం లేక కొండ దిగువన లాడ్జిలలో భక్తుల బస ఫ ఇదే అదునుగా రేటు పెంచేసి, దోచుకున్న నిర్వాహకులు ఫ అసౌకర్యంపై భక్తుల ఫిర్యాదు ఫ దేవదాయ శాఖ కమిషనర్, కలెక్టర్ సీరియస్ ఫ దీంతో పునరుద్ధరణ -
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
కాకినాడ క్రైం: బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిఘా కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవనశైలిని గమనించి బెట్టింగుల పట్ల ఆకర్షితులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112, 100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ 94949 33233కు సమాచారం ఇవ్వాలన్నారు. -
మోటారు సైకిల్, ఆటో ఢీ
ప్రభుత్వం టైలర్స్ను పట్టించుకోవడం లేదుబోట్క్లబ్ (కాకినాడ): రాష్ట్ర ప్రభుత్వం టైలర్స్ను పట్టించుకోవడం లేదని ఏపీ టైలర్స్ కో– ఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి బీఎన్ఎస్ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జగన్నాథపురంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.కోటి మూలధనంతో టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గ్రామస్థాయిలో టైలరింగ్ సొసైటీలు ఏర్పాటు చేసి చేనేత జౌళిశాఖకు అప్పగించారన్నారు. అప్పటిలో 300 సొసైటీలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. పాదయాత్ర సమయంలో టైలర్స్ బాధలు స్వయంగా తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతీ ఏడాది ఆర్థిక సహాయం చేసేవారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టైలర్స్ను అసలు పట్టించుకోవడం లేదన్నారు. కులవృత్తులకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రభుత్వం టైలర్స్ని పరిగణలోనికి తీసుకోలేదన్నారు. 145 కులవృత్తులను పరిగణలోనికి తీసుకొని టైలర్స్ను పక్కన పెట్టడం చాలా దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పరోక్షంగా ఈ టైలరింగ్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం మా టైలర్స్ న్యాయం చేయాలని కోరారు. కుల వృత్తుల్లో భాగంగా మాకు కావాల్సిన టైలరింగ్ మెషీన్లు ఇవ్వాలన్నారు. ఐదుగురికి గాయాలు జగ్గంపేట: జగ్గంపేట గ్రామ పరిధిలోని జాతీయ రహదారి 16 బ్రిడ్జిపై సోమవారం మోటారు సైకిల్, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్దారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న మోటారు సైకిలిస్టు బ్రేక్ వేయడంతో అతని వెనుకాల వస్తున్న ఆటో అతన్ని ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఆటో బ్రిడ్జి గోడను ఢీకొని పక్కకు ఒరిగిపోయిది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రమాద స్థలిలో గాయపడ్డ ప్రయాణికులు -
ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై
రూ.20,000 లంచం తీసుకుంటూ చిక్కిన వైనం పిఠాపురం: పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ రూ.20,000 లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం మండలం పి. దొంతమూరుకు చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఒక కేసుకు సంబంధించి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి బాధితులు ఎస్సైకి లంచం ఇవ్వగానే ఏసీబీ అధికారులు వలపన్ని దాడి చేసి లంచం తీసుకుంటున్న ఎస్సైతో పాటు మధ్యవర్తిగా పనిచేస్తున్న ఎస్సై వ్యక్తిగత డ్రైవర్ శివను పట్టుకున్నారు. జరిగిన ఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు. -
గిన్నిస్ రికార్డ్స్లో మెప్మాకు చోటు
కాకినాడ సిటీ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెప్మా సంస్థ చోటు సంపాదించింది. మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను వాప్ జెని ఆన్లైన్ యాప్ ద్వారా లక్ష్యానికి మించి విక్రయించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెప్మా పీడీ బి.ప్రియంవద కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్క రోజులో లక్షకు పైగా ఉత్పత్తులు విక్రయించి, ఈ రికార్డ్ సాధించిన మహిళలను, పీడీ ప్రియంవదను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
క్షయ రహిత జిల్లాకు కృషి
కాకినాడ సిటీ: జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు కలసికట్టుగా కృషి చేద్దామని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్లో ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ జెడ్పీ కార్యాలయం మీదుగా జ్యోతిబా ఫూలే విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, క్షయ అంటువ్యాధి అని అన్నారు. రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు, రాత్రి పూట చెమట పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, మెడ వద్ద వాపు తదితర లక్షణాలుంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ సోకేందుకు ఎక్కువగా అవకాశం ఉన్న 60 ఏళ్లు దాటిన వారిని గుర్తించి, బీసీజీ టీకాలు వేయిస్తామని జేసీ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.నరసింహ నాయక్ మాట్లాడుతూ, వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరు నెలల్లో టీబీని నయం చేయవచ్చని అన్నారు. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు నిక్షయ మిత్రలు కృషి చేయాలని కోరారు. వ్యాధిగ్రస్తులు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.700 ఇవ్వడం ద్వారా నిక్షయ మిత్రలుగా మారవచ్చన్నారు. ఎన్పీఐ కార్యక్రమంలో భాగంగా క్షయ రోగులకు ప్రభుత్వం రూ.1,000 చొప్పున అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జల్సాల కోసం బైకుల చోరీలు
ఫ నిందితుడి అరెస్టు ఫ 31 వాహనాల స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చెడు వ్యసనాలు, జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుడిని ప్రకాష్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్బాబు, సీఐ బాజీలాల్, ఎస్సై శివప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. నల్లజర్ల మండలం మర్లపూడి గ్రామానికి చెందిన తూర్ల సోమయ్య ప్రస్తుతం రాజమహేంద్రవరం మంగళవారపేటలో నివాసం ఉంటున్నాడు. అతడు చెడు వ్యసనాలు, తిరుగుళ్లకు బానిసయ్యాడు. తన జల్సాలకు అవసరమైన డబ్బుల కోసం బైకులు దొంగతనం చేసేవాడు. అలా దొంగిలించిన బైకులను నల్లజర్ల మండలం జగన్నాథపురానికి చెందిన చీర్ల కిషోర్ ద్వారా తక్కువ ధరకే విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. రాజమహేంద్రవరంలో ఇటీవల బైకు దొంగతనాలు ఎక్కువగా జరుగుతూండటంతో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్ల సోమయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా బైకు చోరీల చిట్టా బయట పడింది. దొంగిలించిన బైకులు విక్రయించడానికి సహకారం అందించిన చీర్ల కిషోర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం, కోరుకొండ, ఏలూరు, విజయవాడ ప్రాంతాల్లో నిందితుడు చోరీ చేసిన 31 బైకులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.16 లక్షలుంటుందని సీఐ బాజీలాల్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ బాజీలాల్, ఎస్సై శివప్రసాద్, క్రేన్ కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, ఎస్.వీరబాబు, వి.శివప్రసాద్లను ఎస్పీ అభినందించారు. ద్విచక్ర వాహదారులు తమ బైకుల రక్షణకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ రమేష్బాబు కోరారు. హ్యాండిల్ లాక్తో పాటు, ఫోర్క్ లాక్ ఉపయోగిస్తే బైకు దొంగతనాలను కొంతమేరకు అరికట్టవచ్చన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అధునాతన తాళాలు వచ్చాయని, వాటిని ఉపయోగించడం ద్వారా బైకులకు మరింత రక్షణ లభిస్తుందని తెలిపారు. -
మజ్జిగ పంపిణీకి ముహూర్తమెప్పుడో!
అన్నవరం: ప్రస్తుతం సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తులు నానాటికీ పెరుగుతున్న వేసవి ఎండలకు తాళలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు పైబడి నమోదవుతూండటంతో అల్లాడిపోతున్నారు. పలువురు ఎక్కువ ధరలకు శీతల పానీయాలు, చల్లని మంచినీరు కొనుక్కుని తాగాల్సి వస్తోంది. గతంలో వేసవి ప్రారంభమవుతూండగానే.. రత్నగిరిపై రామాలయం ఎదురుగా సర్క్యులర్ మండపంలోను, పశ్చిమ రాజగోపురం ఎదురుగాను భక్తులకు అల్లం, కరివేపాకు కలిపిన చల్లని మజ్జిగ పంపిణీ చేసేవారు. దీంతో భక్తులు సేద తీరేవారు. ఈ ఏడాది మాదిరిగానే 2023లో కూడా ఎండలు అధికంగా ఉండటంతో మార్చి 18 నుంచే మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా చేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ నిర్ణయం ఎండల తీవ్రతను బట్టి తీసుకోవాలి. అంతే కానీ, గత ఏడాది పంపిణీ చేసిన తేదీ ప్రాతిపదిక కారాదు. కానీ దేవస్థానం అధికారులు మాత్రం గత ఏడాది ముహూర్తానికే ఈసారి కూడా పంపిణీ చేయాలనుకోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మజ్జిగ పంపిణీ ప్రారంభించాలని కోరుతున్నారు. -
రత్నగిరిపై భక్తుల సందడి
ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ఫ 1,600 వ్రతాల నిర్వహణ ఫ రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని ఆదివారం 40 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, టేకు రథంపై వేంచేయించారు. పూజల అనంతరం పండితులు రథ సేవ ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు సేవ అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
30 నుంచి వసంత నవరాత్ర ఉత్సవాలు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వసంత నవరాత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వర పూజ, పంచాంగ శ్రవణం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. నవరాత్ర ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు ఉంటాయన్నారు. భక్తులు రూ.200 చెల్లించి, తమ గోత్రనామాలతో ఈ తొమ్మిది రోజులూ పూజలు చేయించుకోవచ్చని ఈఓ తెలిపారు.లోవకు పోటెత్తిన భక్తులుతుని రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో దేవస్థానం ప్రాంగణమంతా కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,81,050, పూజా టికెట్లకు రూ.1,09,860, కేశఖండన టికెట్లకు రూ.12,280, వాహన పూజలకు రూ.3,020, కాటేజీల ద్వారా రూ.73,012, ఇతర విరాళాలుగా రూ.1,21,830 కలిపి మొత్తం రూ.5,01,052 ఆదాయం వచ్చిందని వివరించారు.నేడు పీజీఆర్ఎస్కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. అలాగే, మండల స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని అన్నారు.డెల్టాలకు 10,700 క్యూసెక్కులుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,200, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.80 అడుగులకు చేరింది. -
విద్యారంగ సమస్యలపై పోరుబాట
రాజమహేంద్రవరం సిటీ: విద్యారంగంలో పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన పోరుబాటలో భాగంగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్లు బకాయిల చెల్లింపులపై సరైన శ్రద్ధ చూపించడం లేదని అన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ ిపీఆర్సీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు డీఏలు, పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరుబాట ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉనికి కోల్పోతున్నాయన్నారు. భవిష్యత్తులో మోడల్ పాఠశాలల పేరుతో గ్రామాల్లోని చాలా పాఠశాలలను ఎత్తివేసే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామాల్లో కామన్ పాఠశాలలు ఉండాలని, విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం నిధులు ఖర్చు చేయాలని ఎన్నో సూచనలు చేసిన కొఠారి కమిషన్ నివేదికను ప్రభుత్వాలు ఆచరించటం లేదన్నారు. ఊరి బడిని బతికించుకోవటానికి ఉపాధ్యాయులంతా నడుం కట్టాలన్నారు. అందుకోసం పిల్లలు, పిల్లల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. నూతన విద్యావిధానం–2020 అమలు చేస్తూ ప్రభుత్వ విద్యా రంగాన్ని తుంగలోకి తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యారంగ ప్రయోజనాలతో కాకుండా పాలకవర్గ ప్రయోజనాలతో ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయని, అందుకే ప్రభుత్వ విద్యారంగం వెనుకబడుతోందని అన్నారు. విద్యారంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వ ఉదాశీన వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్తులో వేలాది ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానానికి పాలకులు పెద్దపీట వేయాలన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే ఉపాధ్యాయుల హక్కుల సాధన జరుగుతుందన్నారు. టీచర్లు మార్కిస్టు, కమ్యూనిస్టు భావాలతో ఉన్నప్పుడు మాత్రమే నూతన మానవుల్ని, నూతన సమాజాన్ని తయారు చేయగలరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ఆర్థిక ప్రలోభాలు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోటకూర చక్రవర్తి, అరుణకుమారి, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఐదు జిల్లాల్లోని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా, రాష్ట్ర బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రజలకు ‘చేరువ’కండి
కాకినాడ క్రైం: సమాజ హితానికి, ఫ్రెండ్లీ పోలీసింగ్ను సుసాధ్యం చేసేలా ప్రజలకు పోలీసులు చేరువ కావాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. ‘చేరువ’ పేరుతో ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన సదస్సులో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల ఉపాధ్యాయులు 200 మంది పాల్గొన్నారు. పోలీసుల పనితీరు, రానున్న రోజుల్లో సమాజంలో మరింత మంచి మార్పు చోటు చేసుకోవడంలో పోలీసుల పాత్ర అనే అంశాలపై చర్చించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువైందని అధ్యాపకులు అన్నారు. దురలవాట్లతో యువత పెడదోవ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు నిర్వీర్యం కాకుండా ఉండేందుకు పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మద్యం, మత్తులో జోగుతున్న వారి వ్యవహార శైలితో మహిళలు, బాలికలు, యువతులు నానా అగచాట్లూ పడుతున్నారన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లేలా, నిబంధనలు ఉల్లంఘించే వారి వివరాలు, ఫిర్యాదులను 94949 33233, 112 నంబర్ల ద్వారా తమకు తెలియజేయాలని కోరారు.ఫ మత్తు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఫ పోలీసులకు ఉపాధ్యాయుల సూచన -
మెగా డీఎస్సీపై మొదటి సంతకం ఏమైంది?
కూటమి హామీలపై ధ్వజమెత్తిన ఏఐవైఎఫ్ అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే తొమ్మిడి నెలలు గడస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు మాటే మరిచిందని ఏఐవైఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి సతీష్కుమార్ ధ్వజమెత్తారు. అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల లోగోను జిల్లా శాఖ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. సతీష్కుమార్, కార్యదర్శి యనమదల ఉమేష్ తదితరులు కూటమి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ఎండగట్టారు. మెగా డీఎస్సీ అంటూ అధికారంలోకి వచ్చిన రోజు మొదటి సంతకంగా చేసినా నేటికీ చర్యలు లేవని ఆరోపించారు. నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఓఎన్జీసీ వనరులను గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిణామాలపై ఏఐవైఎఫ్ జిల్లా శాఖ ప్రతినిధులు దుయ్యబట్టారు. తిరుపతిలో వచ్చే మే 15వ తేదీ నుంచి ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహా సభల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను చర్చించనున్నట్టు వారు తెలిపారు. జతీయ మహాసభల లోగో ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా కోశాధికారి యాండ్ర నాగరాజు, జిల్లా శాఖ సభ్యులు నిమ్మకాయల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
అనర్హులే పట్టు సాధించారు
ఫ అర్హులకు అందని ప్రోత్సాహం ఫ చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారుల మాయాజాలం ఫ ఆందోళన చేపట్టిన రైతులు పిఠాపురం: అనర్హులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా రని మల్బరీ రైతులు ఆందోళనకు దిగారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారులు సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చి అర్హులను విస్మరించారని రైతులు ఆరోపిస్తున్నారు. 53.19 ఎకరాల్లో 26 మంది రైతులను గుర్తించి, ఇందులో 20 ఎకరాలు దాటి మల్బరీ సాగు చేయలేదని రైతులు వాపోయారు. నువ్వులు ఇతర పంటలు సాగు చేసిన వారికి కూడా మల్బరీ నర్సరీ ప్రోత్సాహం ఎకరానికి 22,500 చొప్పు న ఇస్తున్నారని, ఇందులో అర ఎకరం సాగు చేసిన వా రికి కూడా రెండు నుంచి నాలుగు ఎకరాలలో వేసినట్టు నమోదు చేశారని పట్టు రైతులు ఆరోపించారు. అనర్హులకు పరిహారం గత ఏడాది గూళ్లు నష్టపోయిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.11,30,000 సహాయం అందించినప్పటికీ అధికారులకు నచ్చిన రైతులకే పరిహారం అందించారని, మిగిలిన వారిని వదిలేసారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇన్సెంటీవ్లు కూడా సీరియల్ పాటించట్లేదని వారు పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేసి, అర్హులకు మొండిచేయి చూపారని రైతులు ఓరుగంటి చక్రధర్ రావు, సూరిబాబు, ఉలవల సురేష్, చక్రి వెలుగుల మాణిక్యం తదితరులు కోరుతున్నారు. అధికారులు అన్యాయం చేశారు గత ఏడాది నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాను. గూళ్లు సక్రమంగా రాకపోవడంతో పట్టు పరిశ్రమ అధికారుల సూచనతో పంట తొలగించి నువ్వు చేను వేశాను. గుళ్లు కట్టిన రైతులకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. అందులో కూడా తనను గుర్తించలేదు. నర్సరీ వేసిన వెంటనే ఎకరానికి 22,500 చొప్పున ఇవ్వాల్సిన ప్రోత్సాహం కూడా అందించలేదు. అధికారుల నిర్వాకం వల్ల రూ.మూడు లక్షల వరకు నష్టపోయాను. – ఓరుగంటి సూరిబాబు, పట్టు రైతు, చేబ్రోలు అర్హులకే ఇస్తున్నాం మల్బరీ సాగు చేసిన రైతులనే నర్సరీ ప్రోత్సాహకాలు అందించడానికి గుర్తించాం. అలాగే గూళ్లు నష్టం కూడా కొంతమంది రైతులకు అందకపోవటం వాస్తవమే. వారిని రెండో జాబితాలో పెట్టాము. అది ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదని ఇన్సెంటీవ్ పాత సీరియల్ ప్రకారమే అందిస్తాం. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ రైతులు ఎనిమిది ఎకరాలు మల్బరీ సాగు చేసినప్పటికీ ఇప్పుడు నువ్వు చేలు వేసుకున్నారు. – టి.మోసయ్య, పట్టు పరిశ్రమ అధికారి, చేబ్రోలు -
నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు
సిద్ధమైన 45 జతల ఎడ్లు సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు వద్ద ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు సీనియర్ విభాగం నుంచి 8 జతలు, జూనియర్ విభాగం నుంచి 37 జతల ఎడ్లు కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఉండూరుకు చేరుకున్నాయి. శ్రీ కుమారా రామ భీమేశ్వర ఎడ్ల పరుగు పోటీలు వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్ పేరుతో ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొనే రైతులే ఏర్పాటు చేయడం విశేషం. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం పోటీలను ప్రారంభిస్తారని నిర్వాహకులు వల్లూరి దొరబాబు, సీతారామరాజు, బిక్కిన రంగనాయకులు, చేకూరి రామకృష్ణ, మలిరెడ్డి వీరేంద్రలు తెలిపారు. సీనియర్ విభాగంలో మూడు, జూనియర్ విభాగంలో ఐదు బహుమతులను ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సీనియర్ విభాగంలో కిలోమీటరున్నర, జూనియర్ విభాగంలో కిలోమీటరు దూరాన్ని ఎడ్లు పరుగెత్తాల్సి ఉంటుందన్నారు. బాలికలపై అత్యాచారయత్నం పెద్దాపురం: ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్లో వ్యాపారం చేసుకుంటున్న కామేశ్వరరావు రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికల అరుపులతో స్థానికు లు అక్కడికి చేరుకుని దేహశుద్ధి చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సర్వేల భారం తగ్గించాలి
జాబ్ చార్ట్లో పేర్కొన్న పనులకు తోడు కాలానుగుణంగా ప్రభుత్వం అదనంగా అప్పగించే విధులను ఉద్యోగులు నిర్వర్తించాల్సి వస్తోంది. కొన్ని సందర్భానుసారం చేసేవి కాగా, మరికొన్ని నిరంతరం చేయాల్సిన పనులు. వీటితో ఇటు సచివాలయ ఉద్యోగులు, అటు వీఆర్ఓలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పింఛన్ల దగ్గర నుంచి ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్య పరిష్కారంలో తలమునకలవుతున్న వారిపై అదనపు సర్వేల పేరుతో భారం మోపుతున్నారు. దీంతో, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో చాలా మంది వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వీరిపై సర్వేల భారం తగ్గించాలి. – దువ్వా శేషుబాబ్జీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ -
గాంధీకాలనీలో అంబేడ్కర్కు అవమానం
● విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు ● ఆందోళన చేపట్టిన రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి ● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ హోం మంత్రి వనిత డిమాండ్ నల్లజర్ల: మండలం దూబచర్ల శివారు గాంధీకాలనీలో రహదారి పక్కనున్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. శనివారం ఉదయం విగ్రహానికి చెప్పులదండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దూబచర్ల–లక్కవరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన 11 గంటల వరకు జరుగుతూనే ఉంది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని చెప్పుల దండను తొలగించి క్లూస్ టీం, డాగ్స్కాడ్లను రంగంలోకి దింపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తానేటి వనిత సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఈ ఘటన హేయమైన చర్య అని, పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇక్కడి విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహం ఏర్పాటు చేసి పైన రూఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారు ఏర్పాటు చేయకపోతే తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలశాఖ అధ్యక్షులు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, నాయకులు బంక అప్పారావు, ముప్పిడివెంకటరత్నం, సాలి వేణు, తొమ్మండ్రు రమేష్, నక్కా పండు, పంది సత్యనారాయణ, తొమ్మండ్రు రవి, పెండ్యాల హరేరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు సీఐల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. ఏఎస్పీ సుబ్బరాజుకు వినతి పత్రం అందజేస్తున్న మాజీ హోంమంత్రి తానేటి వనిత -
టెక్నిక్తో జీవితం సెట్
● ఏప్రిల్ 30న పాలిసెట్ ● జిల్లాలో 8 పాలిటెక్నిక్ కళాశాలలు ● అందుబాటులో 1820 సీట్లు రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచం సాంకేతికంగా దూసుకుపోతోంది. ఆ వేగాన్ని అందుకోవాలనే లక్ష్యంతో నేటి యువత సైతం తత్సంబంధమైన విషయ పరిజ్ఞానాన్ని అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజినీరింగ్లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై దృష్టిపెడుతున్నారు. సాంకేతిక విద్యకు పునాది సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పలు కోర్సులతో సాంకేతిక విజ్ఞాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఏప్రిల్ 15 తుది గడువు పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్లైన్లో గేట్వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్కు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లభించే కోర్సులు ఇవీ.. పాలిటెక్నిక్లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకునే శిక్షణ సైతం ఇస్తారు. జిల్లాలో 8 కళాశాలలు జిల్లాలో విద్యార్థులకు మొత్తం 8 పాలిటెక్నిక్ కళాశాలల్లో 1820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజానగరం గైట్ పాలిటెక్నిక్, రాజానగరం ఐఎస్టీఎస్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, పిడింగొయ్యిలోని రైట్ పాలిటెక్నిక్, పాలచర్లలోని బీవీసీ పాలిటెక్నిక్, కొండగుంటూరు ఎస్ఎస్ పరిమళ పాలిటెక్నిక్, బూరుగపల్లి బెన్నయ్య పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్లో ఉచిత శిక్షణ తో పాటు స్టడీమెటీరియల్ ఇస్తారు. పాలిటెక్నిక్ పూర్తయిన తరువాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. – వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్, బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, ఏపీ పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ పాలిసెట్కు ఉచిత శిక్షణ బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణతో పాటు ప్రవేశపరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ సైతం ఉచితంగా అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
హైవే వాహనాన్ని ఢీకొన్న లారీ
గండేపల్లి: రోడ్డును శుభ్రం చేసే విధులకు వచ్చి పనుల్లో నిమగ్నమవుతున్న ఓ వ్యక్తి ప్రమాదానికి గురై, అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గండేపల్లికి చెందిన దోనాదుల కృష్ణ (50) హైవే మెయింటెనెన్స్ వ్యాన్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. తాను పని చేస్తున్న వాహనాన్ని శనివారం మురారి శివారులో నిలిపి, రోడ్డుపై కోన్స్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ తరుణంలో రాజమంహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ హైవే మెయింటెనెన్స్ వ్యాన్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ రెండు వాహనాల మధ్య ఇరుక్కుని, అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంపై హైవే అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకుని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో, హైవే మెయింటెనెన్స్ అధికారులు దిగి వచ్చారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ·˘ {OyðlÐ]lÆŠ‡ §ýl$Æý‡ÃÆý‡×æ… ·˘ Ð]l$–™èl$° MýS$r$…»ê°MìS న్యాయం చేయాలంటూ ఆందోళన -
అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ బోర్డులు
తుని రూరల్: భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఈ బోర్డులను శనివారం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవస్థానంలో సౌకర్యాలు, ఇతర అంశాలపై భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. ఈ అభిప్రాయాలు నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కు చేరుతాయన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు కేవీ రమణ, మూర్తి, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీలేరు నుంచి 9,300 క్యూసెక్కులుసీలేరు: గోదావరి డెల్టాలో రబీ సాగుకు సీలేరు కాంప్లెక్స్ నుంచి 9,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. రబీ నీటి ఎద్దడి నేపథ్యంలో గోదావరి డెల్టాకు సీలేరు జలాలను విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు గతంలో కోరారు. ఈ మేరకు డొంకరాయి నుంచి 5 వేలు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నామని జెన్కో అధికారులు వివరించారు. గత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి శనివారం వరకూ గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 31 వరకూ నీటిని విడుదల చేయనున్నారు. శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయం శనివారం వేలాదిగా వచ్చిన భక్తులతో రద్దీగా మారింది. స్వామివారిని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలలతో విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదాన విరాళాల రూపంలో స్వామి వారికి రూ.3,22,160 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 4 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. కిక్కిరిసిన రత్నగిరి అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. పరీక్షలు ముగియడంతో ఇంటర్ విద్యార్థులు, వారికి ఇతర భక్తులు తోడవడంతో సత్యదేవుని సన్నిధిలో రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. అర్చకుల పూజల అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి ప్రాకార సేవ ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
నెలాఖరులోగా పల్లె పండుగ పనులు
కాకినాడ సిటీ: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పనుల పురోగతిపై అమరావతి నుంచి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్, ఆ శాఖల ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, డైరెక్టర్ కృష్ణతేజ తదితరులు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఫార్మ్ పాండ్స్ పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 196 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 138 కిలోమీటర్ల మేర పూర్తి చేశామని చెప్పారు. 804 మినీ గోకులాలు నిర్మించామన్నారు. 2,500 ఫార్మ్పాండ్స్కు గాను 823 గ్రౌండింగ్ పూర్తి చేశామని తెలిపారు. మెప్మా టీముకు రాష్ట్ర స్థాయి అవార్డు సామర్లకోట: స్థానిక మెప్మా టీముకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ హుస్సేన్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను శ్రీవావ్ జెనీశ్రీ యాప్ ద్వారా కోటి విక్రయించాలని రాష్ట్ర మెప్మా అధికారులు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. అయితే సామర్లకోటకు చెందిన మెప్మా టీము రెండు కోట్ల వరకూ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సామర్లకోట మెప్మా బృందానికి రాష్ట్రస్థాయి పురస్కారం అందించారని చెప్పారు. ఈ పురస్కారాన్ని రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్భరత్ కాకినాడ మెప్మా కార్యాలయానికి పంపారని తెలిపారు. ఈ మేరకు కాకినాడలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ బి.ప్రియంవద చేతుల మీదుగా మెప్మా టీము తరఫున అవార్డు అందుకున్నానని హుస్సేన్ తెలిపారు. సామర్లకోట మెప్మా టీము ఇటువంటి అవార్డులు మరిన్ని సాధించాలని హుస్సేన్ ఆకాంక్షించారు. నాణ్యతా ప్రమాణాల గుర్తింపులో ఎన్ఏబీఎల్ది కీలక పాత్ర బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నాణ్యతా ప్రమాణాల గుర్తింపులో నేషనల్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లేబొరేటరీ (ఎన్ఏబీఎల్) కీలక పాత్ర పోషిస్తోందని జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్ వి.రవీంద్రనాథ్ అన్నారు. జేఎన్టీయూకేలో ఫుడ్ టెక్నాలజీ ఆధ్వర్యాన ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్, దాని ప్రయోజనాలు అనే అంశంపై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల ప్రతినిధులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, జేఎన్టీయూకేలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా మెరుగైన నాణ్యతా పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆహార పరిశ్రమలు తమ ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు చేపట్టాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎన్ఏబీఎల్ రీజినల్ హెడ్ శ్రీకాంత్ రామచంద్రయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన పరిశ్రమలు, ప్రయోగశాలలు 9 వేలకు పైగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతమైన పరిశ్రమలకు, ప్రయోగశాలలకు ఎన్ఏబీఎల్ గుర్తింపు ఇస్తామన్నారు. వికసిత్ భారత్–2047లో భాగంగా నిర్మాణంలో ఉన్న భవనాలు, ఆసుపత్రుల నిర్మాణ సామగ్రి పరీక్షిస్తామని తెలిపారు. అలాగే, రైతుల కు బాసటగా నిలిచేందుకు పొలాల్లో మట్టిని పరీక్షించి, తగు సూచనలు చేయనున్నామని చెప్పా రు. స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ డైరెక్టర్ మాలోతు రమేష్ మాట్లాడుతూ, జేఎన్టీయూకే ఫుడ్ టెస్టింగ్ ద్వారా రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, ప్రభు త్వ శాఖలకు చెందిన ఆహారం, నీటి పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఓఎన్జీసీ, కోరమండల్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్, గ్రీన్కో, ఎస్ఐఎఫ్టీ తదితర సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఘనంగా సత్యదేవుని ఆలయ వార్షికోత్సవం
అన్నవరం: సత్యదేవుని నూతన ఆలయానికి 13 సంవత్సరాలు పూర్తయి, 14వ ఏట అడుగు పెట్టిన సంద ర్భంగా రత్నగిరిపై శుక్రవారం ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ పండితులు సత్యదేవునికి లక్ష తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకుడు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, వ్రత పురోహితులు చల్లపిళ్ల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 2012 మార్చి 14న జరిగిన సత్యదేవుని నూతనాలయ శిఖర ప్రతిష్ఠలో పాల్గొన్న విశ్రాంత వేద పండితుడు గొర్తి సుబ్రహ్మణ్య ఘనపాఠి, అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ, శేషగిరి, విశ్రాంత వ్రత పురోహితులు ఆకొండి వ్యాసమూర్తి, ప్రయాగ వేంకట రమణలను ఈఓ వీర్ల సుబ్బారావు ఘనంగా సత్కరించారు. వారికి శాలువా కప్పి, సత్యదేవుని ప్రసాదం, ఫొటో, పారితోషికం అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. -
ఎట్టకేలకు ప్రసాద్ం
ప్రసాద్ నిర్మాణాలివీ.. ● దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం. ● ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్. ● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్న ప్రదేశంలో అటు సత్య గిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ. 61.78 లక్షలతో టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం. ● రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్. ● రూ.91.96 లక్షలతో క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మాణం. ● సత్రాల నుంచి ఆలయానికి, వ్రత మండపాల మధ్య భక్తులను తరలించడానికి రూ.కోటితో రెండు బ్యాటరీ కార్లు. ● అయితే వీటిలో రూ.18.98 కోట్ల వ్యయమయ్యే నిర్మాణాలకు మాత్రమే టెండర్లు పిలిచారు. మిగిలిన పనులకు కూడా తరువాత టెండర్లు పిలవనున్నారు. ● ప్రస్తుత టెండర్లు 16 శాతం తక్కువకు ఖరారవడంతో రూ.3 కోట్లు ఆదా అయ్యాయి. ఈ మొత్తాన్ని కూడా దేవస్థానంలో నిర్మాణాలకు ఉపయోగించేలా అధికారులు ప్రయత్నించాలని పలువురు కోరుతున్నారు. ఫ రూ.18.98 కోట్ల అంచనాతో టెండర్లు ఫ 16 శాతం తక్కువకు దక్కించుకున్న సంస్థ ఫ త్వరలో పనులు ప్రారంభం అన్నవరం: కేంద్ర ప్రభుత్వ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము కింద సత్యదేవుని సన్నిధిలో వివిధ నిర్మాణాలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రూ.18.98 కోట్ల అంచనాతో చేపట్టనున్న వివిధ పనులకు టెండర్లు ఖరారయ్యాయని టూరిజం కార్పొరేషన్ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రసాద్ పనులకు తొలిసారి అక్టోబర్ 9న రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. వీటిని అదే నెల 25న ఖరారు చేయాల్సి ఉండగా, గత డిసెంబర్లో రద్దు చేశారు. తిరిగి జనవరి 9న రెండోసారి టెండర్లు పిలిచారు. ఈసారి రూ.18.98 కోట్లకు ఒకే ప్యాకేజీ కింద టెండర్లు ఆహ్వానించారు. వీటిని జనవరి 24న ఖరారు చేయాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తదితర కారణాలతో సుమారు రెండు నెలల పాటు కాలయాపన జరిగింది. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి సన్నిహిత కాంట్రాక్టర్ కోసమే ఇలా జాప్యం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎడతెగని ఈ జాప్యంపై శ్రీసాక్షిశ్రీ పలు కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఎట్టకేలకు టెండర్లు ఖరారు చేశారు. రెండోసారి నోటిఫికేషన్ విడుదల చేయగా ఆరుగురు కాంట్రాక్టర్లు కొటేషన్లు దాఖలు చేశారు. వీటిలో సాంకేతిక అర్హతలు లేవనే కారణంతో రెండింటిని తిరస్కరించారు. మిగిలిన నాలుగింటిలో శ్రీకాకుళానికి చెందిన అనంతరాములు కంపెనీ 18 శాతం తక్కువకు కొటేషన్ దాఖలు చేసి, టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ అంచనా వ్యయం కన్నా దాదాపు రూ.3 కోట్ల తక్కువకు పనులు చేయనుంది. పదేళ్ల నిరీక్షణకు తెర ప్రసాద్ పథకానికి అన్నవరం దేవస్థానం ఏ ముహూర్తాన ఎంపికై ందో కానీ, ఆది నుంచీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను యాత్రా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో నిర్ణయించారు. దీనికోసం రూపొందించిన ప్రసాద్ స్కీముకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఎంపిక చేయగా, వీటిలో అన్నవరం దేవస్థానం కూడా చోటు దక్కించుకుంది. ఈ పథకం నిధుల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీత ఎన్నోసార్లు నాటి కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డితో, ఆ శాఖ కార్యదర్శులతో సమావేశమై అనుమతి సాధించారు. పదేళ్ల కాలయాపన అనంతరం ఎట్టకేలకు ఈ పథకం పనులకు టెండర్లు ఖరారయ్యాయి. రూ.100 కోట్లతో ప్రతిపాదనలు ప్రసాద్ స్కీము కింద రత్నగిరి పైన, దిగువన వివిధ నిర్మాణాలు చేపట్టేందుక రూ.100 కోట్లతో దేవస్థానం ప్రతిపాదనలు పంపించింది. అంత మొత్తం ఇవ్వలేమని రూ.50 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఆ మేరకు తిరిగి ప్రతిపాదనలు పంపించారు. అక్కడి నుంచి గీచిగీచి బేరాలాడినట్లు చివరకు రూ.23 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ నిధులతో చేపట్టే పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది జరిగిన ఏడాది తరువాత ఈ పనులకు టెండర్లు ఖరారు చేయడం గమనార్హం. వచ్చే నెలలో ప్రారంభం అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీము పనులకు పిలిచిన రీ టెండర్లు ఖరారు చేశారు. వచ్చే నెలలో ఈ నిర్మాణాల పనులు మొదలవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తదితర కారణాలతో టెండర్ల ఖరారు ఆలస్యమైంది. – ఈశ్వరయ్య, సీఈ, టూరిజం శాఖ -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకూ పోరాటం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొత్తపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకూ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మండలంలోని కొమరగిరిలో గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కొంతమంది కబ్జా చేయడంపై శుక్రవారం సీపీఐ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించారు. అనంతరం ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కబ్జా చేస్తే అధికారులు పట్టించుకోకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. రెవన్యూ అధికారులు సైతం కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉద్దేశంతో ఫేజ్–2లో 72ఎకరాల భూమిని రూ.32 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారన్నారు. దానిలో కొంతవరకూ మెరక చేశారని, అయితే సుమారు 42ఎకరాల భూమి మెరక చేయకపోవడంతో కొంతమంది కబ్జాచేసి భూమిని సాగు చేసుకుంటున్నారన్నారు. కొన్ని సంవత్సరాలుగా భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నా అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. కొమరగిరి భూమి విషయంపై త్వరలో ఉపముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖామంత్రిని కలుస్తామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ స్థలం వద్దకు వచ్చి పేదల నుంచి 1,400 ఇళ్ల స్థలాల దరఖాస్తులను స్వీకరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రసాద్ మాట్లాడుతూ అధికారులు భూమిని పేదలకు పంచాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, మహిళ సమాఖ్య జిల్లా కన్వీనర్ భవాని, సమాచార హక్కుల వేదిక నాయకుడు బి.సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ వీరబాబు పాల్గొన్నారు. -
నేత్రాలకు చల్లని నేస్తాలు!
● కూలింగ్ కళ్లద్దాలతో కంటికి రక్షణ ● రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు ● కూలింగ్ గ్లాస్ కళ్లజోడుతో ఎండలో ప్రయాణం శ్రేయస్కరం ● జాగ్రత్తలు సూచిస్తున్న కంటి వైద్య నిపుణులు కొత్తపేట: వేసవిలో శరీరంతో పాటు కళ్లమీద కూడా శ్రద్ధ చూపడం చాలా మంచిది. శరీరానికి వేడి చేయకుండా ఎప్పుడూ చల్లదనంలో ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటాం. గొంతెండిపోతే గుక్కెడు నీరు గానీ, శీతల పానీయాలు గానీ సేవించి సేద తీరుతాం. కానీ కళ్ల గురించి మాత్రం అంతలా పట్టించుకోం. కళ్లు పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం కంటి వ్యాధులకు కారణమవుతాయి. వేసవిలో సరైన కంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అపాయమేనని నేత్ర వైద్యులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ఎండలో తిరిగే ప్రతి ఒక్కరూ కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. చలువ కళ్లజోళ్లు వాడడం వల్ల ఎండ వేడిమి నుంచి కళ్లను కాపాడుకోవచ్చని నేత్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చూపు మందగించే ప్రమాదం కళ్లలోని అతి సున్నితమైన భాగాలకు వేడి తగలడం వల్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. శరీర భాగాల్లో కళ్లు ఎంతో సున్నితమైనవి. ప్రధానమైనవి. మిట్ట మధ్యాహ్నం లేదా ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయడం కంటికి మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం నడిపితే హెల్మెట్ లేదా కళ్లజోడును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దుమ్ము, ధూళి కంటిలో పడడం వల్ల విపరీతమైన కంటి దురదలు ఏర్పడతాయి. నల్లగుడ్డు చుట్టూ పొరలు రావడం. ఎరన్రి చారలు, కంటి వెంట తీగలాంటి స్రావం కారడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి జీవితాంతం చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. నలపకూడదు మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది కళ్లకు రక్షణ కవచాలు లేకుండా తిరిగితే మంట పుట్టడంతో పాటు కళ్లు ఎరబ్రడ తాయి. ఇటువంటి సందర్భాల్లో కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వెంటనే సమీపంలోని ఉన్న నేత్ర వైద్యులను సంప్రదించాలి. కళ్లను నలపడం చేయరాదు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. బైక్, కారు లేదా మరేదైనా వాహనం నడుపుతున్నప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల దుమ్ము కణాలు లేదా వేడి గాలి కళ్లలోకి రాకుండా చేస్తుంది. ద్విచక్ర వాహనదారులు వీలైనంత వరకు క్లోజ్డ్ హెల్మెట్లను వాడటం మంచిది. 100% యూవీ రక్షణను అందించే నాణ్యమైన సన్ గ్లాసెస్ని వాడాలి. యూవీ కిరణాలు కళ్ళను దెబ్బతీస్తాయి. ఇది కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి యూవీఏ, యూవీబీ కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. కంటి చూపు మెరుగు కోసం ఆహారం కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా తీసుకునే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు. ఎ, సి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు అధికమొత్తంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. పాలకూర వంటివి కూడా కంటి ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. అలాగే ఒమెగా–3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు తీసుకోవాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి. జాగ్రత్తలు పాటించాలి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వెలుగును తట్టుకోలేని స్థితి ఈ కాలానికి ఉంది. జీవన ఉపాధి దృష్ట్యా ఎక్కువగా ఎండ బారిన పడిన వారు వారి విధుల మూలంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించినప్పుడు, రోడ్లపై వెళ్లేటప్పుడు వేసవిలో ఎండ ప్రభావంతో వచ్చిన వెలుతురు, వేడికి కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాళ్ల కళ్లలోని రక్షణ పొర కరిగిపోయి, వారి కళ్లు ఫొటో సెన్సిటివిటీకి గురవుతాయి. దాంతో కళ్లు మరింత సున్నితమైపోయి, క్రమేపీ వెలుగును చూడలేని స్థితికి చేరుకుంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బయటకు వెళ్లినప్పుడల్లా చలువ కళ్లద్దాలను, హెల్మెట్ లేదా క్యాప్ ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ కె.శేషగిరిరావు, ప్రముఖ కంటి వైద్యుడు, కొత్తపేట -
ఏపీఎస్పీ సిబ్బందికి ఉగాది పురస్కారాలు
కమాండెంట్ నాగేంద్రరావుకు మహోన్నత సేవా పతకం కాకినాడ రూరల్: కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ ప్రస్తుత కమాండెంట్ ఎం.నాగేంద్రరావుకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది మహోన్నత సేవా పతకం లభించింది. ఏపీ పోలీసు అండ్ ఫైర్ సర్వీసు పతకాలు– సేవా పతకాలను ఉగాది – 25కు శుక్రవారం ప్రకటించింది. నాగేంద్రరావు అక్టోపస్ ఎస్పీ (ఆపరేషన్స్ అండ్ అడ్మిన్)గా పనిచేసి ఇటీవల ఏపీఎస్సీ 3వ బెటాలియన్కు వచ్చారు. అక్టోపస్ ఎస్పీగా అందించిన సేవలకు గాను ఆయనకు ఉగాది పురస్కారం లభించింది. 13 మంది ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందికి పురస్కారాలు కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ సిబ్బంది 13మందికి పతకాలు వరించాయి. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్ బి.శ్రీనివాస బాబ్జీ ఉత్తమ సేవా పతకాలు పొందారు. కఠిన సేవా పతకం హెచ్సీ బీవీ అప్పన్న, సేవా పతకాలను ఆర్ఐలు బి.శ్రీనివాసరావు, కె.రవిశంకరరావు, ఆర్ఎస్సైలు ఎం.,రాజా, డి.నిర్మలకుమార్, బి.రవిశంకరబాబు, ఏఆర్ఎస్సైలు బి.మోహనరావు, జి.ఆదియ్య, టి.సూర్యనారాయణ, డి.రామనాయుడు, ఎన్.జాకబ్రాజు పొందారు. -
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహా య కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలిండియా సపక్ తక్రా పోటీల్లో ప్రతిభఅమలాపురం టౌన్: ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వరుసగా మూడోసారి పతకాలు సాధించిన యాండ్ర గౌతమ్ను ఎస్పీ బి.కృష్ణారావు తన కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ హర్యానా రాష్ట్రం మడగడలో జరిగిన 73వ ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వాలీబాల్ క్లస్టర్ క్రీడా విభాగం విభాగంలో గౌతమ్ కాంస్య పతకాన్ని సాధించారు. జిల్లాకు చెందిన 2108 బ్యాచ్కు చెందిన సివిల్ కానిస్టేబుల్ గౌతమ్ సపక్ తక్రా క్రీడలో నైపుణ్యం సాధించాడు. గౌతమ్ సపక్ తక్రా క్రీడలో రాణిస్తూ ఇప్పటి వరకూ మూడు కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్పీ కృష్ణారావు అన్నారు. 2003లో పంజాబ్ రాష్ట్రం జలంధర్లోజరిగిన, 2024లో మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఆలిండియా పోలీస్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించి ఇప్పుడు మరో కాంస్య పతకాన్ని కై వసం చేసుకోవడం విశేషమని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. 70 రకాల డ్రగ్స్ పట్టివేత కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 70 రకాల నార్కోటిక్ డ్రగ్స్ను పట్టుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షలకు పైగా విలువైన మత్తు మందులను అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. డ్రగ్స్ కంట్రోలర్ ఏడీ డి.నాగమణి, విజిలెన్స్ ఏఎస్పీ ఎం.స్నేహిత ఈ దాడుల్లో పాల్గొని అనధికారంగా విక్రయించిన మత్తుమందులతో పాటు, పలు రకాల ఔఽషధాలను గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ హోల్సేల్ దుకాణల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా నేరుగా రిటైల్ దుకాణాలకు అమ్మడం, వారు తిరిగి వినియోగదారులకు విక్రయించడం ఈ దాడుల్లో కనుగొన్నారు. డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మడం, బిల్లులు లేకుండా అమ్మడం, కొనడం నేరాల కింద ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా పరిధిలో 20 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. -
త్వరలో కొత్త ట్రస్ట్బోర్డు?
● ముగిసిన అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి కాలపరిమితి ● ఈ నెలాఖరులోగా ఏర్పాటయ్యే అవకాశం ● ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఆశావహుల పేర్లు తీసుకున్న ప్రభుత్వం ● కొత్త ట్రస్ట్బోర్డులో చైర్మన్తో కలిసి 18 మంది సభ్యులు? ● ఇద్దరు చొప్పున అవకాశం కల్పించాలంటున్న బీజేపీ, జనసేన ● దాత, శ్రీలలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్ పేరు సిఫారసు అన్నవరం: స్థానిక శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి త్వరలో నూతన ధర్మకర్తల మండలిని నియమించనున్నారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్బోర్డు) కాల పరిమితి ఫిబ్రవరి ఎనిమిదో తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. నూతనంగా ఏర్పాటయ్యే ధర్మకర్తల మండలిలో సభ్యత్వాల కోసం పేర్లు పంపించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం గతంలోనే కోరింది. దీంతో మంత్రులు, ఆయా శాసనసభ్యులు ఆశావహుల జాబితాలను అధిష్టానానికి అందచేశారు. ఈ నెలాఖరులోగా ట్రస్ట్బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 18 మందికి అవకాశం కొత్త ట్రస్ట్బోర్డులో చైర్మన్తో సహా 18 మంది సభ్యులు ఉంటారని సమాచారం. దేవదాయశాఖ చట్టం ప్రకారం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్ ఈ బోర్డుకు చైర్మన్గా నియమితులవ్వనున్నారు. సభ్యులుగా 17 మందిని నియమించనున్నారు. వీరిలో సుమారు 12 మంది పురుషులు, ఐదు లేదా ఆరుగురు మహిళలు ఉంటారని సమాచారం. అన్ని సామాజికవర్గాలతో బాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వర్గాలకు చెందిన వారికి ట్రస్ట్బోర్డులో స్థానం కల్పించనున్నట్టు సమాచారం. గతంలో 16 మందితో.. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలని, 50 శాతం మహిళలు ఉండాలని భావిస్తూ మొత్తం 16 మందితో ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసింది. వీరిలో ఏడుగురు మహిళలు. మొత్తం 15 మందిలో ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీ ప్రకారం నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్బోర్డులో స్థానం కల్పించారు. దేవస్థానం చరిత్రలో ఈ విధంగా సగం మంది మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏర్పాటైన ట్రస్ట్బోర్డుగా నిలిచిపోయింది. కొత్త ట్రస్ట్బోర్డు సభ్యత్వాల కోసం మంత్రులు, ఎంఎల్ఎ లపై వత్తిడులు: అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యత్వాల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పై దిగువ శ్రేణి నాయకులు ఒత్తిడులు తెస్తున్నారు. అయితే ఇప్పటికే వారు ఈ పదవుల కోసం కొన్ని పేర్లు సిఫారసు చేసినట్టు సమాచారం. ● దేవస్థానానికి ఎక్కువ మొత్తంలో విరాళాలు సమర్పించిన దాతగా, స్వామి, అమ్మవార్లకు వజ్రకిరీటాలు చేయించడం, రూ.ఐదు కోట్లు వ్యయంతో ప్రసాదం భవనం నిర్మించిన పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్ పేరు ఆ నియోజకవర్గం నుంచి సిఫారసు చేసినట్లు సమాచారం. ● ట్రస్ట్బోర్డులో బీజేపీ, జనసేన నుంచి ఇద్దరు చొప్పున నియమించాలని ఒత్తిడి వస్తున్నా ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఉండనుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టిగా పట్టుబడితే రెండో వ్యక్తిని ఆ పార్టీ నుంచి నియమించే అవకాశం ఉంది. ● సత్యదేవుని ఆలయం కలిగిన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గతంలో మాదిరిగా ఇద్దరికి ట్రస్ట్బోర్డులో అవకాశం కల్పించనున్నారు. అయితే ఒకరు టీడీపీ, ఇంకొకరు జనసేన లేదా బీజేపీ నుంచి నియమితులవుతారని అంటున్నారు. ● జగ్గంపేట, కాకినాడ టౌన్ లేదా కాకినాడ రూరల్, తుని నియోజకవర్గాల నుంచి టీడీపీ నుంచి ఒక్కొక్కరికి ట్రస్ట్బోర్డులో అవకాశం లభించే అవకాశం ఉంది. ● అనపర్తి నియోజకవర్గం, కోనసీమ నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నారు. ● గతంలో గుంటూరు జిల్లా నుంచి కూడా ఒకరికి ఈ ట్రస్ట్బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. అదే ఆనవాయితీని ఈ సారి కూడా పాటిస్తారంటున్నారు.అన్నవరం దేవస్థానం -
మెడికల్ షాపుల్లో ‘విజలెన్స్’ తనిఖీలు రికార్డులు సక్రమంగా లేని నాలుగు షాపులపై చర్యలు
అమలాపురం టౌన్: స్థానికంగా ఉన్న పలు మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్, వాణిజ్య పన్నులు, లీగల్ మెట్రాలిజీ శాఖల అధికారులు మూకుమ్మడిగా, ఆకస్మికంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఎ టు జెడ్, మోహన్, లీలాశ్రీ, శ్రీదేవి మెడికల్ షాపుల్లో ఆ నాలుగు శాఖలకు చెందిన అధికారుల బృందం దాడులు నిర్వహించాయి. మెడికల్ షాపుల్లో ఎక్కడా ఎలాంటి నిషేధిత మందులు లభ్యం కాలేదని విజిలెన్స్ సీఐ మధుబాబు తెలిపారు. నాలుగు మెడికల్ షాపుల్లో మందుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలకు సిఫారసు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీ తమ శాఖ ఏడీకి లేఖ రాశారు. త్వరలోనే ఈ షాపులకు షోకాజ్ నోటీసులు రానున్నాయని అధికారులు తెలిపారు. తనిఖీలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించారు. తనిఖీల్లో పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. అధికారుల ఆకస్మిక దాడుల భయంతో పట్టణంలోని మిగిలిన మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలకు చెందిన షాపులను ముందు జాగ్రత్తగా మూసివేశారు. ఈ దాడుల్లో డీసీటీవో నవీన్కుమార్, లీగల్ మెట్రాలిజీ ఇన్స్పెక్టర్ మురళీ పాల్గొన్నారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితాకు సహకరించాలి
కాకినాడ సిటీ: జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ముందుగానే ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, మార్పులు, చేర్పులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనల వంటి అంశాలపై చర్యలకు భారత ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించాలని కోరారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ బూత్ స్థాయి అధికారులను (బీఎల్వో) నియమించి, ఏప్రిల్ 15 నాటికి అందరికీ శిక్షణ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల్లో 16,36,916 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతి వెయ్యి నుంచి 12 వందల మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి విభజించనున్నామన్నారు. పోలింగ్ కేంద్రం ఓటర్లకు రెండు కిలోమీటర్లకు మించి దూరంగా ఉండకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో డీఆర్వో వెంకటరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కువైట్లో గుండెపోటుతో యువకుడి మృతి
సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్(34) ఈ నెల 18వ తేదీన గుండె పోటుతో కువైట్లో మృతి చెందారు. 19వ తేదీన ఆ దేశం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సాగర్కు భార్య, ఒక బాబు ఉన్నారు. సేఠ్ వద్ద కారు డ్రైవర్గా మొదటిగా 2022లో గల్ఫ్ వెళ్లారు. రెండేళ్లు అనంతరం స్వగ్రామం వచ్చిన సాగర్, గత జూలైలో తిరిగి రెండో దఫా గల్ఫ్ వెళ్లారు. ఎన్నో ఆశలతో బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి ఎప్పటి మాదిరిగానే మళ్లీ తిరిగి వచ్చి తమను కలుస్తారు అనుకుంటున్న కుటుంబ సభ్యులు జరిగిన ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే తమకు అందనంత దూరాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామని రోదిస్తున్నారు. మృతదేహం శనివారం నాటికి స్వగ్రామానికి రానున్నట్టు స్థానికులు తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు నిడదవోలు రూరల్: మండలంలోని పురుషోత్తపల్లి గ్రామంలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు గురువారం తెలిపారు. పురుషోత్తపల్లికి చెందిన యడ్ల మధుసాగర్ ఈ నెల 15వ తేదీన శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్య షేక్ చాందిని ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
రిలయన్స్ మార్ట్పై కేసు నమోదు
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గల రిలయన్స్ మార్ట్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తయారీ తేదీ, గడువు తేదీని ట్యాంపర్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు సమయంలో ప్యాకేజీ ఎక్స్పెయిరీ డేట్, ఎంఆర్పీ ధరను పరిశీలించాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయించినా, యూజ్ బై డేట్ ముగిసినవి అమ్మినా లీగల్ మెట్రాలజీ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీలో పాల్గొన్న అనంతరావు మాట్లాడుతూ వినియోగదారులు తగిన జాగ్రత్తలతో మెలగాలని, ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇటువంటి వ్యవహారాలపై అధికారులు కేసు నమోదు చేస్తారని తెలిపారు. -
రైలు నుంచి జారి పడి మహిళ మృతి
సామర్లకోట: ఒడిశాకు చెందిన ఒక యువతి బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి గురువారం జారి పడి మృతిచెందిన సంఘటన ఇది. ఏసీ బోగీలో ప్రయాణం చేస్తున్న సుభాష్మిత దాసు (33) జి. మేడపాడు సమీపంలో బోగీ నుంచి పడిపోయింది. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు చైన్ లాగారు. డ్రైవర్, గార్డులు రైలు నుంచి మహిళ పడిపోయిన విషయాన్ని సామర్లకోట స్టేషన్ మేనేజరు ఎం.రమేష్కు సమాచారం ఇచ్చారు. సుభాష్మిత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెనుక వస్తున్న సరార్ ఎక్స్ప్రెస్లో మహిళను ఎక్కించి సామర్లకోట తీసుకురావాలని మేడపాడులోని రైల్వే సిబ్బందికి సూచించారు. ఈ మేరకు స్టేషన్ మేనేజరు 108కు సామర్లకోట రైల్వే స్టేషన్కు వచ్చే విధంగా సమాచారం ఇచ్చారు. సర్కార్ ఎక్స్ప్రెస్లో సామర్లకోట చేరిన మహిళను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె థర్డు ఏసీలో ప్రయాణం చేస్తున్నట్లు స్టేషన్ మేనేజరు తెలిపారు. సుభాష్మిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజయవాడ డీఆర్ఎం కార్యాలయం నుంచి సూచనలు వచ్చినట్లు తెలిసింది. -
సీలింగ్ భూములు ఎస్సీ, ఎస్టీలకు పంచాలి
జైపాల్ సింగ్ ముండాకు ఆదివాసి మహాసభ నివాళులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50 శాతం భూమి ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ప్రెస్క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరఫున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింల్ మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 18,848 ఎకరాలు కోర్టు వివాదాలలో ఉన్నాయన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో సీలింగ్ భూములు వెయ్యి ఎకరాలు పంచారన్నారు. ఇప్పటికై నా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగు భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్న్ జరుగకుండా 22ఎ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. నాయకులు జక్కల పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జన, మల్లేశ్వరి పాల్గొన్నారు.