పది పరీక్షల్లో నూతన విధానం
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి, పూర్వ పద్ధతిలో మార్కుల విధానాన్ని అమలులోకి తెచ్చింది. అడిషనల్ అవసరం లేకుండా 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు సరిపడా బుక్లెట్లు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
వచ్చేనెల 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,011 ఉండగా 12,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఓఎంఆర్ షీట్, జవాబులు రాసేందుకు 4 పేజీలు ఇవ్వడం, అందులో జవాబులు రాయడం పూర్తయ్యాక అడిషనల్ షీట్లు ఇవ్వడం చేసేవారు. కానీ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం లేకుండా ఈసారి 24 పేజీలతో బుక్లెట్ను తీసుకువస్తున్నారు. అన్ని జవాబులు బుక్లెట్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
నాలుగు చోట్ల..
జిల్లాకు 24 పేజీలతో కూడిన బుక్లెట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని భద్రపరిచేందుకు జిల్లాలో నాలుగు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాలతో పాటు పిట్లం మండల కేంద్రంలో ఇవి ఉన్నాయి. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ సెంటర్ల నుంచి పరీక్షా కేంద్రాలకు బుక్లెట్లను తీసుకువెళ్లనున్నారు.
అడిషనల్ పేపర్లకు బదులు
24 పేజీల బుక్లెట్
జిల్లాలో నాలుగు స్టేషనరీ
రిసీవింగ్ సెంటర్ల ఏర్పాటు
విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు
పదోతరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను స న్నద్ధం చేస్తున్నాం. ఈసారి విద్యార్థులు జవాబులు రా సేందుకు బుక్లెట్లను ఇవ్వనున్నాం. దీని ద్వారా తర చూ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం ఉండదు. – ఎస్.రాజు, డీఈవో, కామారెడ్డి
పది పరీక్షల్లో నూతన విధానం
Comments
Please login to add a commentAdd a comment