‘రైతులకు పరిహారం అందుతుంది’
నిజాంసాగర్: ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు 51.66 కిలోమీటర్ల ఎన్హెచ్ 765 డి రహదారి విస్తరణ పనులకోసం 30.59 హెక్టార్ల భూములను సేకరించామని ఎన్హెచ్ ఏఈఈ శ్రీధర్ కుమార్ తెలిపారు. ఆ భూములకు సంబంధించి రైతులకు నష్ట పరిహారం అందుతుందన్నారు. శనివారం మహమ్మద్నగర్ మండలం నర్వ శివారులో జాతీయ ర హదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లారెడ్డి– రుద్రూర్ మధ్యలో రహదారి విస్తరణ కోసం 10.41 కిలోమీట ర్ల భూమికి అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. రూ. 313 కోట్ల పనులకుగాను ఇప్పటి వ రకు రూ. 82 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని, వాటికి బిల్లులు చెల్లించామని తెలిపారు. కామారె డ్డి– ఎల్లారెడ్డి– పిట్లం నాలుగు లేన్ల రహదారి విస్తర ణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment