కామారెడ్డి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని అనధికారిక లేఅవుట్ ప్లాట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని బల్దియా కమిషనర్ రాజేందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020లో రూ. 10 వేలు, వేయి రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఈనెల 31వ తేదీలోపు 25 శాతం తగ్గింపు రుసుముతో క్రమబద్దీకరణకు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. అనధికారిక లేఅవుట్ ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment