వరుసగా నాలుగు కార్లు ఢీ | - | Sakshi
Sakshi News home page

వరుసగా నాలుగు కార్లు ఢీ

Published Sun, Oct 15 2023 12:54 AM | Last Updated on Sun, Oct 15 2023 8:04 AM

ప్రమాదంలో బాగా ధ్వంసమైన కారు  - Sakshi

మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం దగ్గర బెంగళూరు – మైసూరు జాతీయ రహదారిలో వరుసగా కార్లు ఢీకొన్నాయి, ఈ ప్రమాదంలో ఒక కారు మంటల్లో కాలిపోయింది. శనివారం టీఎం హోసూరు గేట్‌ వద్ద.. బెంగళూరు నుంచి మైసూరుకు వెళుతున్న నాలుగు కార్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఒక కారు నుజ్జునుజ్జు కాగా, మరో కారు మంటల్లో చిక్కుకుంది.

ఇంతలో స్థానికులు, పోలీసులు ఆ కారులోని వారిని బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం తప్పింది. శ్రీరంగ పట్టణంలో జరుగుతున్న దసరా ఏర్పాట్ల తనిఖీకి వెళుతున్న మండ్య జిల్లా ఎస్పీ యతీష్‌ ఇన్నోవా కారు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంది. ఆ కారుకు నొక్కులు పడ్డాయి. ఆయన మరో కారులో వెళ్లిపోయారు. ఈ సంఘటనతో హైవేలో కొంతసేపు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
దెబ్బతిన్న జిల్లా ఎస్పీ కారు 1
1/2

దెబ్బతిన్న జిల్లా ఎస్పీ కారు

కాలిపోతున్న మరో కారు 2
2/2

కాలిపోతున్న మరో కారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement