దుబాయ్‌ రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ల విదిషా మృతి | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ల విదిషా మృతి

Feb 24 2024 12:18 AM | Updated on Feb 24 2024 9:20 AM

- - Sakshi

దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళూరు ఉళ్లాలకు చెందిన యువతి విదిశ (28) దుర్మరణం చెందారు.

యశవంతపుర: దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళూరు ఉళ్లాలకు చెందిన యువతి విదిశ (28) దుర్మరణం చెందారు. మంగళూరు తాలూకా పంచాయతి మాజీ ఉపాధ్యక్షుడు విఠల కులాల్‌ ఏకైక కుమార్తె ఈమె.

మంగళూరులో చదువును పూర్తి చేసిన విదిశ బెంగళూరులో ప్రైవేట్‌ సంస్థలో ఏడాది పాటు పని చేశారు. తరువాత 2019లో దుబాయ్‌కి వెళ్లి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో అధికారిగా ఉద్యోగం చేస్తున్నారు. రోజూ సంస్థ క్యాబ్‌లో వెళ్లేవారు, ఆ వాహనం మిస్‌ కావడంతో గురువారం కారులో తానే డ్రైవ్‌ చేస్తూ వెళ్లింది. అయితే మార్గమధ్యలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాన్ని మంగళూరుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement